యుపి: మత మార్పిడి కుట్ర కేవలం ఊహాజనితం -హై కోర్టు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడి కుట్ర జరిగింది అనటానికి ఎలాంటి ఆధారాలు లేవని అలహాబాద్ కోర్టు స్పష్టం చేసింది. స్వచ్ఛందంగా హిందూ మతంను త్యజించి ముస్లిం మతం స్వీకరించిన ఇద్దరు అక్కా చెల్లెళ్ల ను పోలీసుల సాయంతో ఇంటిలో నిర్బంధించిన వారి తండ్రిని, పోలీసులను, చివరికి రాష్ట్ర ప్రభుత్వ చర్యలను కూడా హై కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన అక్కా చెల్లెళ్ల వయసు 35 సం, 20 సం.లు. వారిని…

Gen Z విజయంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ వలపోత!

– —–మనోజ్ఞ, 28-07-2026 జనరేషన్ Z (జెన్ జి) ఆందోళన విజయవంతం కావడం పట్ల ఆర్ఎస్ఎస్, బిజెపి, ఇతర హిందూత్వ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు కడవల కొద్దీ కన్నీళ్లు కార్చుతున్నారు. వారి కన్నీటి ప్రవాహానికి “నేనూ సమిధ నొక్కటి ఆహొతిస్తాను” అంటూ ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ కూడా జత కలిశారు. విద్యార్ధులు, యువకులు నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావటానికి నిరసనగా, పనిలో పనిగా బిజెపి ప్రభుత్వం విద్యార్ధులు, యువకుల పట్ల అనుసరిస్తున్న…

యువత వేదనా భరిత నిట్టూర్పే బొద్దింకల ఆందోళన!

– —-సుమన, 25-07-2026 సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దేశంలోని నిరుద్యోగులు, విద్యార్ధులు, యువత పట్ల పరోక్షంగా మరోసారి ఏవగింపు ప్రకటించి తప్పుడు కారణాలతో వార్తలకెక్కారు. న్యాయం కోరుతూ రోడ్డెక్కిన విద్యార్థులపై అత్యంత క్రూరంగా లాఠీ చార్జ్ చేసిన వీడియోలు ఉన్నాయని చెప్పిన పిటిషనర్లతో “వీడియోలు చూసేందుకు మాకు సమయం లేదు” అంటూ తమ పిటిషన్ ను అర్జెంటుగా చేపట్టాలన్న విజ్ఞప్తిని మొరటుగా తిరస్కరించారు. బుధవారం నాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, జస్టిస్…

చర్చల నాటకంతో ఆందోళనను బలహీన పరిచేందుకు ప్రభుత్వం కుట్ర -అభిజిత్

– ప్రతిపక్ష పార్టీలు గెలిచిన చోటల్లా ఆ పార్టీల ఎం.ఎల్.ఏ లు, ఎం.పి లను బెదిరించి లేదా ప్రలోభ పెట్టి వారిలో చీలికలు తెచ్చి ప్రభుత్వాలను పడగొట్టి, వారి అవినీతిని వాషింగ్ మిషన్ లో వేసి కడిగి శుభ్రం చేసి సొంతగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం గత కొన్నేళ్లుగా బిజెపి పార్టీ చేస్తున్న ఘనకార్యం! ఇదే తరహా మోసపూరిత ఎత్తుగడలను తన పాలనలో ఉన్న విద్యార్ధులు, యువకుల పైన కూడా బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం…

మోడి ఇంటి ముందు ధర్నా, రాహుల్ అరెస్ట్! -ఫోటోలు

లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహోల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎం.పి లు అనూహ్య రీతిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఇంటి ముందు రెండు గంటలకు పైగా ధర్నా నిర్వహించారు. ప్రధాని ఇంటి ముందు ధర్నా నిర్వహించబోతున్న సంగతిని కాంగ్రెస్ పార్టీ చివరి వరకు రహస్యంగా ఉంచింది. చివరికి పోలీసులు హుటా హుటిన వచ్చి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ తదితర నాయకులను అరెస్ట్ చేయటంతో ధర్నా ముగిసినట్లు తెలుస్తున్నది. సోమవారం…

బొద్దింకలతో ప్రభుత్వం చర్చలు: నిరసనకు ప్రభుత్వం తల ఒగ్గనున్నదా?

– పార్లెమెంటు వద్దకు నిరసనకారులు, కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో వేల సంఖ్యలో పార్లమెంటు వద్దకు తరలి వచ్చిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం పార్టీ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ప్రభుత్వ ప్రతినిధిగా కేంద్ర మంత్రి జె పి నడ్డా, సిజెపి పార్టీ ప్రతినిధులైన సౌరవ్ దాస్, అశుతోష్ రంకా లతో చర్చలు జరిపారు. చర్చలలో సిజెపి ప్రతినిధులు మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. కాగా సిజిపి డిమాండ్ల గురించి ప్రభుత్వంతో చర్చించేందుకు తమకు…

ఇరాన్ ముందు అమెరికా లొంగుబాటు ఎలా సాధ్యపడింది?

– – – – రచన: సుమన, 17/06/2026 – ఫిబ్రవరి 28 తేదీ నుండి అమెరికా, ఇజ్రాయెల్ దేశాల వలన ప్రపంచానికి పట్టిన చమురు దరిద్రం తాత్కాలికంగా ఐనా సరే వదిలింది. వరుసగా ప్రపంచ మరియు, (పశ్చిమాసియా) ప్రాంతీయ పెత్తందారు, యూదు జాత్యహంకారి అయిన అమెరికా, ఇజ్రాయెల్ లు ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చివేసి, కీలు బొమ్మ ప్రభుత్వాన్ని స్థాపించి ఆ దేశ చమురు, గ్యాస్ వనరులను స్వాధీనం చేసుకునే ప్రకటిత లక్ష్యంతో ఇరాన్ పైన దురాక్రమణ…

ఇరాన్-అమెరికా ఒప్పందానికి వ్యతిరేకంగా ఇరాన్ ప్రజల ఆందోళనలు!

– ఇన్నాళ్లూ అమెరికా, యూరోపియన్ యూనియన్ రాజ్యాలు గానీ ప్రపంచానికి ఏమి చెప్పాయి? ఇరాన్ ప్రభుత్వం మతతత్వ ప్రభుత్వం అనీ, తన ప్రజలను తీవ్రంగా అణచివేస్తున్నదనీ, అమెరికా ప్రవచించే ప్రజాస్వామ్యం కోసం వారు అర్రులు చాస్తూ అందుకు ఆటంకంగా ఉన్న ఇస్లామిక్ రివల్యూషనరీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అందుకే యేటా అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తూ ఖమెనీ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారని చెప్పాయి. తాము ఇరాన్ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు మద్దతు ఇస్తున్నామని, వారి ఆకాంక్షలు…

ఇరాన్ యుద్ధం మళ్ళీ మొదలైందా? -నోట్స్ & అప్డేట్స్ 13

– 08/06/2026 యుద్ధం సరికొత్త దశలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోంది. లెబనాన్, ఇజ్రాయిల్ ల మధ్య ఏప్రిల్ 8 తేదీన కుదిరిన సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మరుసటి రోజు నుండి ఉల్లంఘిస్తూనే ఉంది. ఉల్లంఘన కొనసాగిస్తే తాము ఇజ్రాయెల్ పైన దాడి చేయక తప్పదని ఇరాన్ కూడా హెచ్చరిస్తూనే ఉంది. కానీ అప్పటి నుండి ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. లెబనాన్ రాజధాని బీరూట్ లో హిజ్బోల్లా కి పట్టు ఉన్న దక్షిణ ప్రాంతాలపై కూడా ఇజ్రాయెల్ పౌర…

ఇరాన్ పై మరో తీవ్ర దాడికి అమెరికా ఆయుధాల మోహరింపు!

– ఇరాన్ దేశంతో చర్చలు జరుపుతున్నట్లు, చర్చలు విజయవంతం అయ్యే దిశలో పరిణామాలు జరుగుతున్నాయని అమెరికా ఒక వైపు చెబుతుండగానే, మరో వైపు ఇరాన్ పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పూటకో మాట రోజుకో పాట పాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, దిక్కు దరీ లేని ప్రకటనలతో స్టాక్ మార్కెట్ ను కుదిపేయటం ద్వారా అక్రమంగా మార్కెట్ లాభాలు ఆర్జించే కుట్రలను అమలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. యుద్ధం ముగించేందుకు అమెరికా – ఇరాన్ దేశాల…

పశ్చిమాసియా (ఇరాన్) యుద్ధం -నోట్స్ అండ్ అప్ డేట్స్ 12

– 02-05-2026 ఇరాన్, చైనా దేశాల మధ్య పెరుగుతున్న మైత్రి ప్రపంచ రంగంలో ఇరాన్ స్టాండింగ్ మెరుగు పడేందుకు దోహదం అవుతున్నది. చైనా ట్యాంకర్ల పై ట్రంప్ యుద్ధం ప్రకటించటం ప్రమాదకర పరిణామం కానుంది. చైనా నుండి అమెరికాకు ఎగుమతులు తగ్గించుకునేందుకు, చైనాలో అంతర్గత వినియోగం పెంచుకునేందుకు తద్వారా అమెరికా – చైనా ల మధ్య వాణిజ్య సమతూకం (అమెరికా ఎగుమతుల కంటే చైనా ఎగుమతులు చాలా ఎక్కువ) తెచ్చేందుకు ట్రంప్ బల ప్రయోగంతో ప్రయత్నాలు చేయటంగా…

తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కు లైన్ క్లియర్!

– ఎట్టకేలకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టివికె నాయకుడు విజయ్ జోసఫ్ కు మార్గం సుగమం అయింది. రెండు వామ పక్ష పార్టీలతో పాటు తాము కూడా టివికె కు మద్దతు ఇస్తామని విసికె పార్టీ శుక్రవారం ప్రకటించినప్పటికీ ఆ తర్వాత తన మద్దతుకు కొన్ని షరతులు విధించటంతో ప్రభుత్వం ఏర్పాటు మళ్ళీ సందిగ్ధంలో పడింది. విజయ్ రెండు స్థానాల్లో గెలిచాడు. కాబట్టి ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అలా రాజీనామా చేసే…

ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్ కు చైనా సహాయం నిజమే!

– పహల్గాం ఉగ్రవాద దాడుల దరిమిలా ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్తాన్ పైన నాలుగు రోజుల పాటు ఇండియా మిసైల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో పాకిస్తాన్ లోపలికి చొచ్చుకు వెళ్ళిన భారత ఫైటర్ జెట్ లు పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసినట్లు ప్రకటించింది. అనంతరం పాకిస్తాన్ సైన్యాధికారులు కోరటంతో కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత సైన్యం ప్రకటించింది. ‘ఆపరేషన్ సింధూర్’ సందర్భంగా పాకిస్తాన్ సైన్యానికి చైనా సైన్యం ప్రత్యక్ష సాంకేతిక…

ప్రభుత్వ ఏర్పాటు దిశగా టివికె?

– తమిళ సినిమా నటుడు విజయ్ జోసఫ్ నాయకత్వం లోని టివికె పార్టీ తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో ఆ రాష్ట్రంలో పరిణామాలు జరుగుతున్నాయి. తలా రెండు సీట్లు గెలుచుకున్న సిపిఐ, సిపిఐ (ఎం), విసికె పార్టీలు టివికె పార్టీకి మద్దతు ఇవ్వటానికి నిర్ణయించటంతో తమిళనాడు గవర్నర్ కు టి.వి.కె పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించక తప్పకపోవచ్చు. దశాబ్దాల పాటు ఉప్పు నిప్పు గా మసలిన డిఎంకె, ఏఐఏడిఎంకె పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు…

గల్ఫ్ (ఇరాన్) యుద్ధం -నోట్స్ అండ్ అప్ డేట్స్ 11

– 30-04-2026 చమురు అంతర్జాతీయ ధర అధికారికంగా బ్యారెల్ 115 డాలర్లు గా కనిపిస్తున్నప్పటికీ వాస్తవ ధర బ్యారెల్ 200 డాలర్లు పలుకుతున్నట్లు వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. శ్రీలంక ఐతే బ్యారెల్ 248 డాలర్లు ధరకు కొనుగోలు చేసిందని ఆ దేశ అధికారులు ప్రైవేటుగా చెబుతున్నారు. షేర్ మార్కెట్లు పతనం కాకుండా ఉండేందుకు చమురు ధరలు తక్కువ కనబడేట్లు మ్యానిపులేట్ చేస్తున్నారు. తద్వారా ఇరాన్ యుద్ధ ప్రభావం ఏమీ లేదని అమెరికా ప్రజలకు సూచించే ప్రయత్నం జరుగుతోంది.…