ఇండియాను మళ్లీ బెదిరిస్తున్న అమెరికా

ఎడమ నుండి వరుసగా: విదేశీ మంత్రి మార్కో రుబియో, ట్రంప్, వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్, రక్షణ మంత్రి పీట్ హెగ్ సెత్ అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధాన మంత్రి పరస్పరం ఒకరి పట్ల మరొకరు గౌరవం, స్నేహ భావన వ్యక్తం చేసుకుని కొద్ది రోజులు కూడా కాలేదు. ఇంతలోనే అమెరికా, ఇండియాను బెదిరించటం మొదలు పెట్టింది. అమెరికా వస్తు సేవల పైన ఇండియా విధిస్తున్న టారిఫ్ లను మళ్లీ ప్రస్తావిస్తూ, అమెరికా నుండి మొక్క జొన్న…

సీజ్ ఫైర్ ప్రతిపాదన అమెరికాదే, ఇండియా ఒప్పుకోలేదు -పాకిస్తాన్

Pakistan Foreign Minister Ishaq Dar పహల్గామ్ టెర్రరిస్టు దాడి అనంతరం, ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన 4 రోజుల యుద్ధం విరమించే ప్రతిపాదన మొదట అమెరికా నుండే వచ్చిందని పాకిస్తాన్ వెల్లడి చేసింది. అయితే ఈ ప్రతిపాదనకు ఇండియా అంగీకరించలేదని పాకిస్తాన్ విదేశీ మంత్రి ఇషాక్ దార్ మంగళ వారం (సెప్టెంబర్ 16) వెల్లడి చేశాడు. (పహల్గామ్ లో టూరిస్టులపై హంతక దాడి చేసిన వారిని భారత పత్రికలు, ప్రభుత్వం టెర్రరిస్టులు అని చెబుతుండగా,…

జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల్లో మెరిట్ వాదన గల్లంతు!

NRI Quota Vs. Caste Quota సేవ్ మెరిట్, సేవ్ ఇండియా అంటూ అగ్ర కులాల విద్యార్ధులు 1980, 1990 దశాబ్దాల్లో ఉద్యమాలు నిర్వహించారు. రిజర్వేషన్ల వల్ల దేశం వెనుకబడి పోతున్నదంటూ ఆక్రోశించారు. అగ్ర కులాల విద్యార్ధులకు ఇంజనీరింగ్, మెడిసిన్ మొ.న కాలేజీలలో సీట్లు రాకపోయినా, లేక ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంపిక కాకపోయినా అందుకు ప్రధమ, ఏకైక కారణం రిజర్వేషన్లే కారణం అని వారు వాదించారు. వీళ్ళు కేవలం తమకు విద్య, ఉద్యోగాలలో సీట్లు రాకపోవడం ఒక్కటే…

ఉపాధి పొందే హక్కు ప్రతి ముస్లిం సొంతం -ఆర్ఎస్ఎస్ చీఫ్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ అయిన మోహన్ భగవత్ ముస్లింల పట్ల దయ తలిచారు. హిందువులు, ముస్లింలు అన్న తేడా కూడదనీ, వాళ్ళిద్దరూ ఇప్పటికే ఒక్కటయ్యారని తేల్చి చెప్పారు. భారత దేశంలో ఉపాధి పొందే హక్కు ప్రతి ఒక్క ముస్లిం వ్యక్తికీ ఉన్నదని కూడా చాటారు. ఆర్ఎస్ఎస్ సంస్థ రెండవ గురువు, సిద్ధాంత కర్తగా పేర్కొనే గురు గోల్వాల్కర్ గారు ముస్లిం లకు అలాంటి స్వేచ్ఛ ఉందన్న సంగతి నిరాకరించారు. ముస్లిం మతావలంబకులు…

నిరంతర పరిశోధనల ఫలితమే ఆలోపతి వైద్యం!

– ——–డా. కాలేషా భాషా, జులై 15, 20253840 (ఇది వాట్సప్ ద్వారా నాకు అందిన మెసేజ్. సైంటిఫిక్ టెంపర్ ని పౌరుల్లో ప్రోత్సహించి పెంపొందించాలని మన రాజ్యాంగం ప్రభోదిస్తుంది. ఈ మెసేజ్ అందులో భాగమే అని భావిస్తూ… -విశేఖర్) “అల్లోపతి వైద్యంలో ప్రివెస్షన్ (వ్యాధినివారణ) లేదు..అంతా ఇన్వెస్టిగేషన్లూ, ట్రీట్మెంట్లే… యోగా అంటేనే శారీరక శ్రమ, అది కీళ్లజబ్బులూ, శ్వాస జబ్బులూ, బీపీ, షుగరూ, మానసిక జబ్బులూ, వెన్నుపూస జబ్బులూ …ఇంకా చాలా జబ్బులను నివారిస్తుంది…అల్లోపతికి చాలా…

టారిఫ్ వేడితో రష్యా చమురు దిగుమతి తగ్గిస్తున్న ఇండియా!

వాణిజ్య ప్రయోజనాల కోసం భారత దేశ స్వావలంభన, సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టే సమస్యే లేదని విదేశీ మంత్రి జై శంకర్ గత కొద్ది వారాలుగా పదే పదే చెబుతున్నారు. రష్యాలో ఉన్నా, చైనాలో ఉన్నా, లేక ఐరోపా, అమెరికాలలో ఉన్నా రష్యా చమురు దిగుమతి గురించి పశ్చిమ దేశాల విలేఖరులు ప్రశ్నించినప్పుడల్లా జై శంకర్ గారు ఈ సంగతే నొక్కి మరీ వక్కాణిస్తూ వస్తున్నారు. అయితే జై శంకర్ మాటలకు భిన్నంగా వాస్తవ పరిణామాలు జరుగుతున్నట్లు న్యూయార్క్…

చైనా ఇప్పుడు మనకు ఆత్మ బంధువా?

నిన్న మొన్నటి వరకు చైనా, ఇండియా సంబంధాలు ఎలా ఉండేవి? ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నుండి భజరంగ్ దళ్ చివరాఖరి కార్యకర్త వరకు చైనా అంటే మండి పడేవాళ్లు. చైనా మనకు ఆజన్మ శత్రువు అని ఒకటే ఊదర గొట్టేవాళ్లు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలని చైనా దేశ భక్తులు అని పడ దిట్టేవాళ్లు. మరి ఇప్పుడో! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమాని చైనా మన శతృదేశం అన్న సంగతి మర్చిపోయాం. చైనా మనకిప్పుడు ఆపన్న…

అమెరికాకు పోస్టల్ సేవలు రద్దు చేసిన 25 దేశాలు -యుఎన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, గ్లోబల్ స్థాయిలో తలపెట్టిన Trade Disruption తాలూకు మంటలు కొనసాగుతూ పోతున్నాయి. ఇండియాతో పాటు 25 దేశాలు అమెరికాకు తమ దేశాల నుండి జరిగే పోస్టల్ సేవలను సస్పెండ్ చేసుకున్నాయని తాజాగా ఐక్యరాజ్య సమితి లోని పోస్టల్ సేవల సంస్థ తెలియజేసింది. రెండో విడత అధ్యక్ష పదవి చేపట్టడం తోనే, ప్రపంచ దేశాలపై టారిఫ్ యుద్ధం ప్రారంభించిన డొనాల్డ్ ట్రంప్, అమెరికా కస్టమ్స్ నియమాల లో ఒకటైన గ్లోబల్ డి మినిమిస్…

50% అమెరికా సుంకాల తగ్గింపుకి బ్రోకర్లని నియమించిన ఇండియా!

Mercury Public Affairs ఇండియాలో వివిధ వ్యాపారాల్లో అనేక రకాల బ్రోకర్లు ఉంటారు. పల్లెల్లో గేదెలు, దున్నలు లాంటివి అమ్మి పెట్టటానికి కొనుగోలుదారుల్ని వెతికి పెట్టడానికి ఉండే బ్రోకర్లను ‘కాయిదా’ మనుషులు అంటారు. స్థలాలు, ఇళ్లు అమ్మి పెట్టడం – కొనుగోలుదార్లను వెతికి పెట్టేవాళ్లను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంటారు. సినిమా యాక్టర్లకు సినిమాలు సంపాదించి పెట్టే ట్యాలెంట్ బ్రోకర్లు మరి కొందరు. షేర్ మార్కెట్ లో షేర్లు అమ్మటం కొనటం చేసే వాళ్ళను స్టాక్ బ్రోకర్లు…

సరిహద్దు వాణిజ్యం పునరుద్ధరణకు ఇండియా, చైనా అంగీకారం!

Nathu-La pass ఇండియా, చైనాలు సరిహద్దు వాణిజ్యాన్ని పునరుద్ధరించటానికి ఒక అంగీకారానికి వచ్చాయి. ఇరు దేశాల వాణిజ్యం అనేక శతాబ్దాలుగా, ప్రధానంగా లెజెండరీ స్థాయి సంపాదించిన సిల్క్ రోడ్ ద్వారా కొనసాగుతూ వస్తున్నది. మోడి ప్రభుత్వం హయాంలో వరుస పెట్టి ఇరు దేశాల సైనికుల మధ్య సరిహద్దు వద్ద అనేక హింసాత్మక ఘర్షణలు చెలరేగిన దరిమిలా సరిహద్దు వాణిజ్యం నిలిపివేయబడింది. ఇప్పుడు ఆ వాణిజ్యాన్ని పునరుద్ధరిస్తున్నారు. కోవిడ్ 19 వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఆగిందని…

ఇండియాలో అమెరికా పోస్టల్ సేవల సస్పెన్షన్

ఇండియా నుండి దిగుమతి అయ్యే సరుకులపై అమెరికా, ఆగస్టు 27 తేదీ నుండి 50% పైగా కస్టమ్స్ సుంకాలు అమెరికా ప్రకటించిన నేపధ్యంలో అమెరికాకు వెళ్ళే పోస్టల్ సేవలను భారత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ తాత్కాలికం అని ప్రభుత్వం తెలిపింది. ఈ సస్పెన్షన్ ఆగస్టు 25 తేదీ నుండి అనగా రేపు సోమవారం నుండి అమలు లోకి రానున్నట్లు ప్రభుత్వ ప్రకటన తెలియజేసింది. ఇప్పటి వరకు భారత సరుకులను అమెరికా తన కస్టమ్ సుంకాల నుండి…

బిజెపి గెలవటానికి ఇతర రాష్ట్రాల నుండి వోటర్లను తరలించాం -బిజెపి

బిజెపి గత పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా గెలిచిందో ఆ పార్టీ నాయకుడే స్వయంగా వెల్లడి చేశాడు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి కి చెందిన సురేశ్ గోపి (సినీ నటుడు) త్రిస్సూర్ నియోజక వర్గం నుండి లోక్ సభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. సురేశ్ గోపి ని గెలిపించటానికి తాము ఇతర రాష్ట్రాల నుండి ఓటర్లను త్రిస్సూరు పార్లమెంటు నియోజక వర్గానికి తరలించామని కేరళ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి గోపాల కృష్ణన్ వెల్లడి చేశాడు. తాము…

మర్రి చెట్టు నీడ నుండి రావి చెట్టు నీడ లోకి ఇండియా!

India NSA Ajit Doval with Russian President Vladimir Putin ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్! అన్న సామెత అందరికీ తెలిసిందే. 1947 నుండి భారత సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, ఆయుధ సరఫరా, ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన మరియు అభివృద్ధి, మిసైళ్ల సరఫరా మరియు అభివృద్ధి, ఆధునిక నౌకల సరఫరా మరియు అభివృద్ధి మొదలైన రంగాలలో మునుపటి సోవియట్ రష్యా, ఇప్పటి రష్యన్ ఫెడరేషన్ భారత దేశానికి…

చద్దన్నం తినటం వొంటికి ఆరోగ్యమేనా?

మన తండ్రులు తాతలు ఉదయాన్నే లేచి చద్దన్నం తినేవాళ్ళు. మన చేత కూడా తినిపించే వాళ్ళు. పట్టణాల్లో కాదు గానీ పల్లెల్లో వ్యవసాయ కూలీల కుటుంబాల్లో, పేద-మధ్య తరగతి రైతు కుటుంబాల్లో ఇది ఎక్కువగా జరిగేది. బహుశా పట్టణాల్లో ఫ్యాక్టరీల కార్మికుల కుటుంబాల్లో కూడా ఇది జరిగి ఉండవచ్చు. మా అమ్మ నాన్న ఇద్దరూ టీచర్స్. అయినా రాత్రి వండిన అన్నం మిగిలి పోతే ఉదయాన్నే మా చేత చద్దన్నం తినిపించే వాళ్ళు. ముఖ్యంగా వేసవి కాలం…

బీహార్ ఎస్.ఐ.ఆర్: అసలేం జరుగుతోంది?

బీహార్ లో ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ గురించి పూర్వ రంగం గురించి కాస్త తెలుసుకుంటే ఉపయోగం. మూలం ఏమిటో తెలియకుండా బీహార్ ఎస్.ఐ.ఆర్ అంటూ ఎన్ని పోస్టులు రాసినా వృధాయే కదా! బీహార్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం జనవరి 2025 లో బీహార్ వోటర్ల జాబితాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ‘సమ్మరీ రివిజన్’ పేరుతో సవరించింది. సవరించి వోటర్ల జాబితా తుది నిర్ధారిత జాబితాను…