పుస్తకాలతో టెర్రరిజం సాధ్యం కాదు -జెకెఎల్ హైకోర్టు
పుస్తకాలు టెర్రరిస్టు నేరస్థులను తయారు చేయవని జమ్మూ, కాశ్మీర్ & లడఖ్ హై కోర్టు ఒక నిందితునికి బెయిల్ మంజూరు చేస్తూ స్పష్టం చేసింది. కాశ్మీర్ కు చెందిన స్మాలర్ షాఫత్ మక్బూల్ వాని వద్ద అభ్యంతరకర పుస్తకాలు ఉన్నాయని, సదరు పుస్తకాలు టెర్రరిజాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ప్రజా భద్రతా చట్టం (పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ -పిఎస్ఏ) కింద గత సంవత్సరం నిర్బంధం లోకి తీసుకుంది. ఆయన అరెస్ట్ చట్ట విరుద్ధం…



















