యుపి: మత మార్పిడి కుట్ర కేవలం ఊహాజనితం -హై కోర్టు
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడి కుట్ర జరిగింది అనటానికి ఎలాంటి ఆధారాలు లేవని అలహాబాద్ కోర్టు స్పష్టం చేసింది. స్వచ్ఛందంగా హిందూ మతంను త్యజించి ముస్లిం మతం స్వీకరించిన ఇద్దరు అక్కా చెల్లెళ్ల ను పోలీసుల సాయంతో ఇంటిలో నిర్బంధించిన వారి తండ్రిని, పోలీసులను, చివరికి రాష్ట్ర ప్రభుత్వ చర్యలను కూడా హై కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన అక్కా చెల్లెళ్ల వయసు 35 సం, 20 సం.లు. వారిని…



















