అమెరికా రసాయన దుష్ట చరిత్ర -2

(ఇది కూడా రామ్మోహన్ గారు రాసినదే.) విలియం బ్లం చెప్పింది నేను పాక్షికంగానే రాశాను. ఇరాక్ లో 1985 నుండి 1989 దాకా వివిధ రకాల విషపదార్ధాలను ఆయుదాల తయారీకి కోసం ఇరాక్ కు ఎగుమతి చేశారు. బాసిలస్ ఆంత్రాక్స్ – ఆంత్రాక్స్ కోసం క్లొస్ట్రిడియం బొటులినం -ఒక విషపదార్ధం. హిస్ట్రొప్లస్మా కాప్స్లేటం- శ్వాశకొశం, మెదడు, వెన్నెముక, హృద్రోగాలు కలిగించే విషం ఇది. బ్రుసెలా మెలిటిన్సి-అంగవికలురను చేసేపదార్ధం. క్లొస్ట్రియం పెర్విజెన్స్- దీర్ఘకాలిక జబ్బులను కలిగించటానికి. క్లొస్ట్రిడియం టిటాని-…

అమెరికాను చుట్టుముట్టిన యుద్ధ వ్యతిరేకత

సిరియాపై దాడికి సిద్ధపడుతున్న ఒబామా ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా అమెరికా ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నారు. దేశాన్ని తీవ్ర ఆర్ధిక సంక్షోభం లోకి నెట్టిన ఆఫ్ఘన్, ఇరాక్ యుద్ధాలనుండి పాఠాలు నేర్వని పాలకులపై అమెరికా ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజాభీష్టాన్ని గమనించిన అనేకమంది కాంగ్రెస్ సభ్యులు ఒబామా దాడి నిర్ణయానికి మద్దతు ఇవ్వాలా లేదా అన్న విషయంలో ఊగిసలాటలో పడిపోయారు. కాంగ్రెస్ సభ్యుల ఊగిసలాట వైఖరిని గుర్తించిన ఒబామా ప్రభుత్వం సిరియాలో రసాయన దాడి జరిగిందనడానికి రుజువు చేసే వీడియోలను…

అమెరికా రసాయన దుష్ట చరిత్ర, క్లుప్తంగా….

(ఇది రామ్మోహన్ గారి వ్యాఖ్య. కొంచెమే అయినా విలువైన సమాచారం!) అమెరికా జీవ రసాయన ఆ యుదాలను 1940 నుండి వాడుతోంది. అమెరికా, కెనడా, బ్రిటన్ సంయుక్తంగా కరేబియన్ సముద్రంలొబాక్టీరియా స్ప్రే చేశాయి. లక్షలాది జలచరాశులు మరణించాయి. కొరియా మీదా వెదజల్లింది. దీనివల్ల లక్షలాది మంది ప్లేగు, ఆంత్రాక్స్, మెదడు వాపు వ్యాధి వగైరా రోగాలు ప్రబలి జనం మరణించారు. 1967-69లో ఏజెంట్ ఆరెంజ్ ను 23,607 ఎకరాల కొరియా పంట పొలాల మీద స్ప్రే చేసింది…

అమెరికా దాడి చేస్తే సిరియాకు సాయం చేస్తాం -పుతిన్

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ రంగంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో సాహసోపేతమైన అడుగు వేసినట్లే కనిపిస్తోంది. అంతర్ధానం అవుతున్న అమెరికా ప్రాభవం స్ధానంలో రష్యాను ప్రవేశపెట్టడానికి లేదా రష్యాకు వీలయినంత చోటు దక్కించడానికి పుతిన్ ఏ అవకాశాన్ని వదులుకోదలచలేదని ఆయన మాటలు చెబుతున్నాయి. పెద్దగా పటాటోపం లేకుండా, వాగాడంబరం జోలికి పోకుండా నిశ్శబ్దంగానే అయినా స్ధిరంగా ఆయన వేస్తున్న అడుగులు, చేస్తున్న ప్రకటనలు పశ్చిమ సామ్రాజ్యవాదులకు బహుశా చెమటలు పట్టిస్తుండవచ్చు. సిరియాపై అమెరికా ఏకపక్షంగా దాడి…

సిరియా: 2 రోజులు కాదు, ఉధృత దాడికే సెనేట్ కమిటీ ఆమోదం

శాంతి కపోతం ఇప్పుడు ఇనప రెక్కల్ని తొడిగిన డేగగా మారిపోయింది. నోబెల్ శాంతి బహుమతిని బారక్ ఒబామాకు ఇచ్చినందుకు నోబెల్ కమిటీ సిగ్గుపడుతున్నదో లేదో గానీ సర్ ఆల్ఫ్రెడ్ నోబెల్ మాత్రం ఖచ్చితంగా మరోసారి చనిపోయి ఉంటాడు. మొదట రెండు రోజుల పరిమిత దాడి అని చెప్పిన ఒబామా ఆ తర్వాత సెనేట్ కమిటీలో చర్చకు పెట్టకుముందే

సిరియాపై క్షిపణి దాడి వార్తలు; రూపాయి, షేర్లు పతనం

సిరియాపై అమెరికా క్షిపణి దాడి చేసిందన్న వార్తలు గుప్పుమన్నాయి. అమెరికా, సిరియాపై రెండు క్షిపణులతో దాడి చేసిందనీ, ఈ దాడి ఫలితంగా సిరియా రాజధాని డమాస్కస్ లో 50 మంది వరకూ చనిపోయారనీ వార్తలు షికారు చేస్తున్నాయి. తెలుగు టి.వి ఛానెళ్లు ఈ వార్తను ఎక్కడినుండి సంపాదించాయో గానీ ఈ రోజు మధ్యాహ్నం నుండి స్క్రోలింగ్ లో చూపాయి. అయితే ఇందులో నిజం లేదని

రసాయన దాడి మా పనే -సిరియా తిరుగుబాటుదారులు

నిజానికి ఇది సంచలనవార్త! ఆగస్టు 21 తేదీన సిరియాలో రసాయన ఆయుధాలతో జరిగిన దాడికి సిరియా ప్రభుత్వమే బాధ్యత వహించాలనీ, అధ్యక్షుడు బషర్ అస్సాద్ ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, విదేశీ మంత్రి జాన్ కెర్రీ ఒక పక్క చెవి కోసిన మేకల్లా అరుస్తూనే ఉన్నారు. మరో పక్క సదరు రసాయన దాడికి తామే బాధ్యులమని సిరియా తిరుగుబాటుదారులు అంగీకరించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ విలేఖరి ఒకరు తిరుగుబాటులతో చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా…

ఒంటరైనా వెలివేసినా సిరియా దాడికి కాలుదువ్వుతున్న అమెరికా

సిరియాపై పరిమిత దాడి చేసి రసాయన ఆయుధాలు ప్రయోగించినందుకు అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ను శిక్షిస్తానని ప్రకటించిన అమెరికా ఒంటరిగా మిగిలింది. సిరియా దాడిలో భాగస్వామ్యం వహించడానికి వీలు లేదని బ్రిటన్ పార్లమెంటు తేల్చి చెప్పింది. ‘దాడికి సై’ అన్న ఫ్రాన్సు వెనక్కి తగ్గి ‘ఐరాస అనుమతితో చేద్దాము, చర్చలు కూడా చేద్దాము’ అంటూ యుద్ధ పిపాసను తగ్గించుకుంది. దాడికి సహకరించేది లేదని జర్మనీ స్పష్టం చేసింది. ఐరాస పరిశీలకుల నివేదిక అందకుండా దాడి వద్దే వద్దు…

బారక్ ఒబామా సర్కస్ ఫీట్లు -కార్టూన్

దాడి పరిమితంగా ఉండేందుకే ఇదంతా… – అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నప్పటికీ సిరియాపై దాడి చేయడానికే అమెరికా కట్టుబడి ఉన్నదని ఆ దేశ రక్షణ కార్యదర్శి చక్ హేగెల్ మరోసారి ప్రకటించాడు. ప్రపంచ పోలీసు పెత్తనం చెలాయించడంలో అమెరికా లాఠీని మోసే అనుంగు మిత్రుడు బ్రిటన్ లో సిరియా పై దాడి చేసే ప్రయత్నాలను పార్లమెంటు తిరస్కరించినా వెనకడుగు వేసేది లేదని చక్ ప్రకటించాడు. అమెరికా జాతీయ భద్రతకు కట్టుబడి ఉండడానికే ఒబామాను ప్రజలు ఎన్నుకున్నారని కాబట్టి…

పశ్చిమ యుద్ధోన్మాదులకు లొంగేది లేదు -సిరియా

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు యుద్ధ నగారాలు మోగిస్తుండగా సిరియా ప్రభుత్వం మాత్రం బెదిరేది లేదని స్పష్టం చేస్తోంది. కిరాయి తిరుగుబాటుదారులకు రసాయన ఆయుధాలు సరఫరా చేసి వాటిని ఎలా వినియోగించాలో శిక్షణ ఇచ్చింది ఈ మూడు దేశాలేననీ సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ స్పష్టం చేశాడు. సిరియా ప్రజలపై రసాయన ఆయుధాలు ప్రయోగించడానికి శిక్షణ ఇచ్చిన దేశాలే తిరిగి తమపై ఆరోపణలు చేయడం పిచ్చివాడి ప్రేలాపనలను పోలి ఉన్నాయని ఆయన పేర్కొన్నాడు. సాక్ష్యాలు ఉంటే ఎందుకు…

రూపాయి ఇంకా కిందికి…, సామాన్యుడి చావుకి!

బుధవారం రూపాయి మళ్ళీ కొత్త రికార్డుకు పతనం అయింది. మంగళవారం డాలర్ ఒక్కింటికి 66 రూపాయల మార్కు దాటి రికార్డు సృష్టించిన రూపాయి విలువ బుధవారం 68 రూపాయల మార్కు దాటిపోయింది. ఒక దశలో డాలర్ ఒక్కింటికి రు. 68.75 పై కు పడిపోయింది. కడపటి వార్తల ప్రకారం (మధ్యాహ్నం 1:45) 1 డాలర్ = రు. 68.025 వద్ద రూపాయి విలువ కొట్టుకులాడుతోంది. (బ్లూమ్ బర్గ్ వార్తా సంస్ధ) మంగళవారం ట్రేడింగ్ ముగిసేనాటికి 66.24 వద్ద…

అమెరికా ఒత్తిడికి లొంగి స్నోడెన్ కు అనుమతివ్వని క్యూబా

అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవడంలో ముందుంటానని చెప్పుకునే క్యూబా ఎడ్వర్డ్ స్నోడెన్ తమ దేశంలో అడుగు పెట్టడానికి నిరాకరించిన సంగతి వెల్లడి అయింది. రష్యన్ విమానం నుండి ఎడ్వర్డ్ స్నోడెన్ క్యూబాలో దిగడానికి అనుమతీస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా బెదిరింపులకు దిగడంతో క్యూబా భయపడిపోయింది. ఎడ్వర్డ్ స్నోడెన్ ను తీసుకొచ్చినట్లయితే రష్యా విమానాన్ని తమ దేశంలో దిగడానికి అనుమతి ఇవ్వబోమని వెంటనే అమెరికాకు సమాచారం పంపింది. ఫలితంగా హాంగ్ కాంగ్ నుండి మాస్కో మీదుగా వెనిజులా…

సిరియాపై దుస్సాహసానికి అమెరికా ఏర్పాట్లు?

ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియాల వరుసలో సిరియాను చేర్చడానికి అమెరికా ఏర్పాట్లు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా రక్షణ కార్యదర్శి చక్ హెగెల్ (మన మంత్రితో సమానం) చెబుతున్న మాటలు నిజమే అయితే సిరియాపై దాడి చేయడానికి అమెరికా తన యుద్ధ నౌకలను సిద్ధం చేస్తోంది. మధ్యధరా సముద్రంలో అమెరికా మోహరించిన నాలుగు యుద్ధ నౌకలు సిరియా జలాలకు సమీపంలోకి తరలిస్తున్నట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా రెండు రోజుల క్రితం చెప్పిన మాటలను…

చైనాకు పోటీగా కాశ్మీరులో భారత్ బలప్రదర్శన

చైనా సైనికులు మరొకసారి దౌలత్ బేగ్ ఓల్డి సెక్టార్ (డి.బి.ఓ సెక్టార్) లో చొచ్చుకు వచ్చారన్న వార్తల నేపధ్యంలో భారత ప్రభుత్వం చైనాకు గట్టి సంకేతాలు ఇవ్వాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. పాక్ యుద్ధంలో వాడి వదిలేసిన విమాన కేంద్రాన్ని తిరిగి వినియోగంలోకి తేవడమే కాకుండా మంగళవారం సైనికులను పెద్ద మొత్తంలో చేరవేసే సైనిక వాహక విమానాన్ని అక్కడ దించింది (touch down). వాస్తవాధీన రేఖ (Line of Actual Control)కు సమీపంలో చైనా సైనికులు చొరబడ్డారని చెబుతున్న…

వేగంగా పెరుగుతున్న నగరం షాంఘై నాడు, నేడు -యానిమేషన్

ఇండియాకు ముంబై ఎలాగో చైనాకు షాంఘై నగరం అలాగ! ఇండియాకి ముంబై వాణిజ్య నగరంగా పేరొందితే, షాంఘై చైనాకి వాణిజ్య నగరంగా ప్రసిద్ధికెక్కింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరం ఇదేనట! అలాగని ది అట్లాంటిక్ పత్రిక చెబుతోంది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరం కూడా ఇదేనని సదరు పత్రిక తెలిపింది. రాయిటర్స్ ఫోటోగ్రాఫర్ కార్లోస్ బర్రియా ఇటీవల షాంఘై నగరాన్ని సందర్శించి కొన్ని ఫోటోలు తీశాడు. 1987 నాటి ఫోటో ఒకటి…