రూపాయి ఇంకా కిందికి…, సామాన్యుడి చావుకి!

బుధవారం రూపాయి మళ్ళీ కొత్త రికార్డుకు పతనం అయింది. మంగళవారం డాలర్ ఒక్కింటికి 66 రూపాయల మార్కు దాటి రికార్డు సృష్టించిన రూపాయి విలువ బుధవారం 68 రూపాయల మార్కు దాటిపోయింది. ఒక దశలో డాలర్ ఒక్కింటికి రు. 68.75 పై కు పడిపోయింది. కడపటి వార్తల ప్రకారం (మధ్యాహ్నం 1:45) 1 డాలర్ = రు. 68.025 వద్ద రూపాయి విలువ కొట్టుకులాడుతోంది. (బ్లూమ్ బర్గ్ వార్తా సంస్ధ) మంగళవారం ట్రేడింగ్ ముగిసేనాటికి 66.24 వద్ద…

అమెరికా ఒత్తిడికి లొంగి స్నోడెన్ కు అనుమతివ్వని క్యూబా

అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవడంలో ముందుంటానని చెప్పుకునే క్యూబా ఎడ్వర్డ్ స్నోడెన్ తమ దేశంలో అడుగు పెట్టడానికి నిరాకరించిన సంగతి వెల్లడి అయింది. రష్యన్ విమానం నుండి ఎడ్వర్డ్ స్నోడెన్ క్యూబాలో దిగడానికి అనుమతీస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా బెదిరింపులకు దిగడంతో క్యూబా భయపడిపోయింది. ఎడ్వర్డ్ స్నోడెన్ ను తీసుకొచ్చినట్లయితే రష్యా విమానాన్ని తమ దేశంలో దిగడానికి అనుమతి ఇవ్వబోమని వెంటనే అమెరికాకు సమాచారం పంపింది. ఫలితంగా హాంగ్ కాంగ్ నుండి మాస్కో మీదుగా వెనిజులా…

సిరియాపై దుస్సాహసానికి అమెరికా ఏర్పాట్లు?

ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియాల వరుసలో సిరియాను చేర్చడానికి అమెరికా ఏర్పాట్లు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా రక్షణ కార్యదర్శి చక్ హెగెల్ (మన మంత్రితో సమానం) చెబుతున్న మాటలు నిజమే అయితే సిరియాపై దాడి చేయడానికి అమెరికా తన యుద్ధ నౌకలను సిద్ధం చేస్తోంది. మధ్యధరా సముద్రంలో అమెరికా మోహరించిన నాలుగు యుద్ధ నౌకలు సిరియా జలాలకు సమీపంలోకి తరలిస్తున్నట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా రెండు రోజుల క్రితం చెప్పిన మాటలను…

చైనాకు పోటీగా కాశ్మీరులో భారత్ బలప్రదర్శన

చైనా సైనికులు మరొకసారి దౌలత్ బేగ్ ఓల్డి సెక్టార్ (డి.బి.ఓ సెక్టార్) లో చొచ్చుకు వచ్చారన్న వార్తల నేపధ్యంలో భారత ప్రభుత్వం చైనాకు గట్టి సంకేతాలు ఇవ్వాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. పాక్ యుద్ధంలో వాడి వదిలేసిన విమాన కేంద్రాన్ని తిరిగి వినియోగంలోకి తేవడమే కాకుండా మంగళవారం సైనికులను పెద్ద మొత్తంలో చేరవేసే సైనిక వాహక విమానాన్ని అక్కడ దించింది (touch down). వాస్తవాధీన రేఖ (Line of Actual Control)కు సమీపంలో చైనా సైనికులు చొరబడ్డారని చెబుతున్న…

వేగంగా పెరుగుతున్న నగరం షాంఘై నాడు, నేడు -యానిమేషన్

ఇండియాకు ముంబై ఎలాగో చైనాకు షాంఘై నగరం అలాగ! ఇండియాకి ముంబై వాణిజ్య నగరంగా పేరొందితే, షాంఘై చైనాకి వాణిజ్య నగరంగా ప్రసిద్ధికెక్కింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరం ఇదేనట! అలాగని ది అట్లాంటిక్ పత్రిక చెబుతోంది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరం కూడా ఇదేనని సదరు పత్రిక తెలిపింది. రాయిటర్స్ ఫోటోగ్రాఫర్ కార్లోస్ బర్రియా ఇటీవల షాంఘై నగరాన్ని సందర్శించి కొన్ని ఫోటోలు తీశాడు. 1987 నాటి ఫోటో ఒకటి…

ఈజిప్టు: మరో రక్తం ఓడుతున్న గాయమా? -ఫోటోలు

ఆఫ్ఘనిస్ధాన్ ని ‘రక్తం ఓడుతున్న గాయం’ గా అభివర్ణించాడు చివరి సోవియట్ రష్యా నేత మిఖాయిల్ గోర్బచెవ్. ఈ భూమండలం పైన రక్తం ఓడుతున్న గాయాలు ఇంకా చాలానే ఉన్నాయి. కాశ్మీరు, పాలస్తీనా, సిరియా, సోమాలియా…. ఇప్పుడు ఈజిప్టు. రెండేళ్ల క్రితం ముబారక్ ను పదవీచ్యుతుడ్ని చేసినప్పటి నుండి ఈజిప్టు వీధులు రక్తంతో తడవని రోజంటూ లేదు. ముబారక్ ఏలిన 30 సంవత్సరాలు ఈజిప్టులో నిరవధిక ఎమర్జెన్సీ అమలు చేశారు. కమ్యూనిస్టులను, ముస్లిం బ్రదర్ హుడ్ కార్యకర్తలను……

అమెరికాకు తలొగ్గిన అలీన నెహ్రూ -కత్తిరింపు

భారత పత్రికల్లో చాలా అరుదుగా కనిపించే వార్త ఇది. తెలుగు పత్రికల్లో ఇలాంటి వార్త రావడం ఆశ్చర్యమే. నిజానికి దీనిని వార్త అనడం కంటే చరిత్ర అనడం సముచితం. ఇంకా చెప్పాలంటే వాస్తవ చరిత్ర అనడం ఇంకా సముచితం. అలీన దేశాల కూటమి ఏర్పాటు చేయడంలో మన ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన కృషి మామూలుది కాదు. అలాంటి నెహ్రూ చైనా దాడితో ఎటూ పాలుపోక అమెరికా శరణు జొచ్చాడని ఈ ‘వాస్తవ చరిత్ర’…

జలాంతర్గామి పేలుడు: గుర్తుపట్టలేని స్ధితిలో శవాలు

ముంబై డాక్ యార్డ్ లో అనూహ్య కారణాలతో పేలిపోయి మునిగిపోయిన ‘ఐ.ఎన్.ఎస్ సింధూరక్షక్’ జలాంతర్గామి నుండి నాలుగు శవాలను వెలికి తీశారు. ఈ శవాలు గుర్తు పట్టలేని స్ధితిలో ఉన్నాయని తెలుస్తోంది. మంటల్లో పూర్తిగా కాలిపోవడంతో డి.ఎన్.ఏ శాంపిల్ సహాయంతో గుర్తుపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జలాంతర్గామిలో సజీవులుగా ఎవరైనా మిగిలి ఉండే అవకాశాలు పూర్తిగా అడుగుంటాయని అధికారులు చెబుతున్నారు. నేవీ చీఫ్ అడ్మిరల్ డి.కె.జోషి మాత్రం అద్భుతం జరిగే అవకాశం లేకపోలేదని జలాంతర్గామి లోపల గాలి గదుల్లో…

ఈజిప్టులో మళ్ళీ ఎమర్జెన్సీ, రక్తం పారిస్తున్న మిలట్రీ

ఈజిప్టు మళ్ళీ రక్తం ఓడుతోంది. వదిలిందనుకున్న మిలట్రీ పిశాచం మళ్ళీ ఆ దేశాన్ని పట్టి పీడిస్తోంది. రెండేళ్ల క్రితం 2011లో సంభవించిన ప్రజా తిరుగుబాటులో హోస్ని ముబారక్ పదవీచ్యుతుడయిన సంగతి తెలిసిందే. దరిమిలా అధికార పగ్గాలను తాత్కాలికంగా కోల్పోయిన ఈజిప్టు మిలట్రీ, ప్రజాస్వామిక ఎన్నికల్లో అధ్యక్ష పదవి చేపట్టిన ముస్లిం బ్రదర్ హుడ్ నేత మహమ్మద్ మోర్శి ని గత జులై మొదటివారంలో కుట్ర చేసి కూల్చివేసింది. మోర్శికి మళ్ళీ అధికారం అప్పజెప్పాలని దేశవ్యాపితంగా బైఠాయింపులు, ప్రదర్శనలతో…

ముంబై: జలాంతర్గామి పేలుడు, మునక -18 మంది మరణం?

భారత నౌకాదళం బుధవారం తెల్లవారు ఝాము భారీ మూల్యం చెల్లించింది. సంప్రదాయక సబ్ మెరైన్ లో పేలుడు సంభవించి ముంబై డాక్ యార్డ్ లో మునిగిపోవడంతో 18 మంది నావికాదళ సభ్యులు చనిపోయినట్లు భావిస్తున్నారు. చనిపోయినవారిలో ముగ్గురు ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ‘సింధూరక్షక్’ అనే పేరుగల ఈ జలాంతర్గామును రష్యా సరఫరా చేసింది. కిలో క్లాస్ యుద్ధనౌకగా భావించే ఈ జలాంతర్గామి భారత నౌకాదళంలో ఒక ముఖ్య భాగం అని తెలుస్తోంది. ఇప్పటికే వివిధ కారణాల వలన…

పైపైకి దూసుకు పోతున్న దాడులు, చొరబాట్లు -కార్టూన్

“అబ్బో!” “అబ్బే, అక్కడ సంతోషించడానికేమీ లేదులెండి. మన సరిహద్దులో పెరుగుతున్న దాడులు, చొరబాట్లను చూపించే గ్రాఫ్ అది!” – ఇటీవలి కాలంలో కాశ్మీరులో భద్రతా బలగాలపై దాడులు పెరిగాయి. చొరబాట్లు కూడా పెరిగాయని పత్రికలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికుల ఉపసంహరణ గడువు (డిసెంబర్ 2014) దగ్గర పడేకొద్దీ కాశ్మీరు లోనూ, సరిహద్దు లోనూ దాడులు పెరగడం గమనార్హం. గడువు సమీపిస్తున్న దృష్ట్యా తాలిబాన్ తో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకోడానికి అమెరికా నానా తంటాలు…

ఆఫ్ఘన్ యుద్ధం మిగిల్చిన బాల్యం -ఫోటోలు

ఎడతెగని ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో ప్రధానంగా బలవుతోంది అక్కడి స్త్రీలు, పిల్లలు. ఈ యుద్ధం అనివార్యం ఏమీ కాదు. అమెరికా స్వయంగా పెంచి పోషించిన ‘ఒసామా బిన్ లాడెన్’ ను పట్టుకోవడం కోసం అంటూ ఆఫ్ఘనిస్ధాన్ పైన అమెరికా బలవంతంగా రుద్దిన దురాక్రమణ యుద్ధం ఇది. పన్నెండేళ్ళ సుదీర్ఘ యుద్ధంలో అమెరికా బావుకున్నది 2007-08 నాటి మహా ఆర్ధిక మాంద్యం మాత్రమే. అమెరికా, ఐరోపాలు రుద్దిన దురాక్రమణ యుద్ధం పుణ్యాన ఆఫ్ఘనిస్ధాన్ లో మరో యుద్ధ తరం…

రష్యా ఆశ్రయం మంజూరు, స్నోడెన్ కు బంధ విముక్తి

ఎట్టకేలకు ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా తాత్కాలిక రాజకీయ ఆశ్రయం (temporary asylum) మంజూరు చేసింది. దానితో స్నోడెన్ బంధ విముక్తుడయ్యాడు. గత ఐదు వారాలుగా మాస్కోలోని షెర్మెట్యెవో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన స్నోడెన్ గురువారం తట్టా బుట్టా సర్దుకుని విమానాశ్రయం నుండి బైటకి వచ్చేశాడు. తద్వారా రష్యా భూభాగం పైకి అడుగు పెట్టాడు. స్నోడెన్ వీసా రద్దు చేయడం ద్వారా అతన్ని ఎలాగైనా రప్పించుకోవాలని పధకం వేసిన అమెరికాకు ఇది చావుదెబ్బ! అంతర్జాతీయ వేదికపై అమెరికా రాజకీయ…

ఎడ్వర్డ్ స్నోడెన్: ఆంక్షల బెదిరింపులకు దిగిన అమెరికా

అమెరికాకు తెలిసిన భాష ఒక్కటే. బెదిరించడం, భయపెట్టడం, మందీ మార్బలంతో దాడి చేయడం, ఆనక  సంక్షోభంలో చిక్కుకోవడం. ఆ సంక్షోభ భారాన్ని మళ్ళీ ప్రపంచం నెత్తిన రుద్దడం. సి.ఐ.ఏ, ఎన్.ఎస్.ఏ ల మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్ ను తిరిగి రప్పించడానికి ఇప్పటి వరకు జరిపిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడమే కాక, తనకే బెడిసి కొట్టడంతో అమెరికా బెదిరింపుల తీవ్రతను మరింత పెంచింది. ఎడ్వర్డ్ స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇచ్చే దేశాలపై ఆంక్షలు విధిస్తానంటూ…

అమెరికాలో అసలు ప్రజాస్వామ్యం లేదు -మాజీ అధ్యక్షుడు

అమెరికాలో ప్రజాస్వామ్యం పని చేయడం లేదని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ స్పష్టం చేసేశారు. అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న గూఢచార విధానాలు పచ్చి అప్రజాస్వామికమని ఆయన కుండ బద్దలు కొట్టారు. ఎన్.ఎస్.ఏ మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్, అమెరికా అప్రజాస్వామిక గూఢచర్యం గురించి వెల్లడి చేయడం అమెరికాకు దీర్ఘకాలంలో లాభకరమని ఆయన వ్యాఖ్యానించారు.  జిమ్మీ కార్టర్ అమెరికాకు 1977 నుండి 1981 వరకు అధ్యక్షుడుగా పని చేశారు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్ధిగా అధ్యక్ష పదవిని…