అమెరికా రసాయన దుష్ట చరిత్ర, క్లుప్తంగా….


(ఇది రామ్మోహన్ గారి వ్యాఖ్య. కొంచెమే అయినా విలువైన సమాచారం!)

అమెరికా జీవ రసాయన ఆ యుదాలను 1940 నుండి వాడుతోంది. అమెరికా, కెనడా, బ్రిటన్ సంయుక్తంగా కరేబియన్ సముద్రంలొబాక్టీరియా స్ప్రే చేశాయి. లక్షలాది జలచరాశులు మరణించాయి. కొరియా మీదా వెదజల్లింది. దీనివల్ల లక్షలాది మంది ప్లేగు, ఆంత్రాక్స్, మెదడు వాపు వ్యాధి వగైరా రోగాలు ప్రబలి జనం మరణించారు. 1967-69లో ఏజెంట్ ఆరెంజ్ ను 23,607 ఎకరాల కొరియా పంట పొలాల మీద స్ప్రే చేసింది అమెరికా.

1960లో  వియాత్నాంలో లక్షలాది పంట పొలాలను నాశనం చేసే రసాయనాలు వెదజల్లింది. దానివల్ల 20 లక్షల మంది ప్రజలు రోగాల పాలయ్యారు. సుమారు 5 లక్షలమంది జన్యు లోపాలతొ జన్మించారు. తరాల తరబడి (ఇప్పటికీ) వారు బాధపడుతున్నారు.

అమెరికన్ సైనికాధికారులు జీవ రసాయన వాడకంలొ అనేక విదేశీ నిపుణులకు శిక్షిణనిచ్చారు. ఈజిప్ట్, ఇజ్రాయల్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సౌదీ అరేబియా, యుగొస్లొవియా దక్షిణ వియత్నాం, మొదలైన 36 దేశాలకు చెందిన 550 మంది అలబామాలొని ఆర్మీ స్కూల్ లో శిక్షణ పొందారు. ఈజిప్ట్ సైనికులు 1967లొ యెమెన్ లో ప్రయొగించారు. ఆ ప్రయోగంలో సుమారు 150 మంది మరణించారు.

అమెరికన్ పాలకులు తమ సొంత దేశంలో కూడా ప్రయోగించి చుశారు. ఫ్లోరిడాలొ 1955లొ కోరింతదగ్గు ఎలా సౄష్టించాలో బాక్టీరియాతొ ప్రయోగించి చూశారు. సుమారు 1000కి పైగా పౌరులు దగ్గుతొ బాధపడ్డారు.

ఇలాంటి ఉదాహరణలు వేలకు వేలు ఇవ్వవచ్చు. అమెరికా విదేశాంగ శాఖలొ పనిచేసిన విలియం బ్లం అమెరికా అనేక దేశాలలొ తనమాట వినే తొత్తులను ఎలా లొంగతీసి నియమించిందొ తన స్వప్రయోజనాలకు వాడుకుంటుందొ చెప్పాడు.

Depleted Uranium use in Iraq 00

One thought on “అమెరికా రసాయన దుష్ట చరిత్ర, క్లుప్తంగా….

వ్యాఖ్యానించండి