ఏంజెలా ఫోన్ ట్యాపింగ్: సాక్ష్యానికి స్నోడెన్ రెడీ

జర్మనీ ఛాన్సలర్ సెల్ ఫోన్ సంభాషణలపై అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ గూఢచర్యం నిర్వహించిందన్న ఆరోపణలపై అమెరికా – జర్మనీల మధ్య వాదోపావాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సాక్ష్యం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎన్.ఎస్.ఏ మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్, జర్మనీ ప్రభుత్వానికి తెలిపాడు. అమెరికా వ్యతిరేక కార్యకలాపాలకు స్వస్తి పలకాలన్న షరతు మీద స్నోడెన్ కి రాజకీయ ఆశ్రయం ఇచ్చినప్పటికీ అమెరికా – జర్మనీల మధ్య మరింత దూరం పెంచే అవకాశాన్ని…

ఇంటర్నెట్ గూఢచర్యం: నిజమే, అతిగా చేశాం -అమెరికా

అన్ని వైపుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో అమెరికా తన తప్పును పరిమితంగానే అయినా అంగీకరించింది. కొన్ని కేసుల్లో అతిగా గూఢచర్యం నిర్వహించామని, వాటిని సవరించుకుంటామని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కేర్రీ ఒప్పుకున్నాడు. కానీ తాము అమాయకులను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని ఆయన చెప్పుకొచ్చాడు. జర్మనీ ఛాన్సలర్, భారత ప్రధాన మంత్రిలతో సహా 35 దేశాల అధిపతుల ఫోన్ సంభాషణలను రికార్డు చేసినందుకు అన్నివైపుల నుండి దాడి, ఒత్తిడి తీవ్రం ఐన నేపధ్యంలో ఈ…

అబద్ధాలాడొద్దు! -అమెరికాతో జర్మనీ

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా సెల్ ఫోన్ సంభాషణలను తాము వినడం లేదన్న అమెరికా వాదనను జర్మనీ కొట్టిపారేసింది. ‘అబద్ధాలాడొద్దు’ అని కసిరినంత పని చేసింది. తమ ఛాన్సలర్ ఫోన్ సంభాషణలను అమెరికన్లు వింటున్నారని చెప్పడానికి తమ వద్ద ‘నూతన సాక్ష్యాలు’ ఉన్నాయని తేల్చి చెప్పింది. జర్మనీ చట్టాలను ఉల్లంఘించడం లేదని చెబుతున్న ఎన్.ఎస్.ఏ వాస్తవం చెప్పడం లేదని జర్మనీ ఛాన్సలర్ వ్యవహారాల మంత్రి రొనాల్డ్ పొఫల్లా తెలిపారు. అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ అనేక దేశాల అధినేతల…

ఎన్.ఎస్.ఎ గూఢచర్యం: 10 దిగ్భ్రాంతికర మార్గాలు -వీడియో

అమెరికా గూఢచార సంస్ధ ‘నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ’ ని అమెరికా, ఐరోపాల్లో ‘నో సచ్ ఏజన్సీ’ అని కూడా అంటారు. దానర్ధం అంత లో ప్రొఫైల్ లో ఉంటుందా సంస్ధ అని. ప్రపంచ వ్యాపితంగా అది సాగిస్తున్న విస్తారమైన గూఢచర్యం (స్నోడెన్ పుణ్యమాని) లోకానికి తెలిసాక ఎన్.ఎస్.ఎ అంత లో ప్రొఫైల్ లో ఎందుకు ఉంటుందో జనానికి తెలిసి వచ్చింది. ఎన్.ఎస్.ఎ గూఢచర్యంలోని దిగ్భ్రాంతికరమైన 10 పద్ధతులను ఈ వీడియో వివరిస్తోంది. ఈ వీడియో ప్రధానంగా గూగుల్…

ఏంజెలా ఫోన్ ట్యాపింగ్, అమెరికా రాయబారికి సమన్లు

అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సెల్ ఫోన్ ను ట్యాప్ చేసి సంభాషణలను వింటోందని జర్మనీ ఆరోపించింది. ఎన్.ఎస్.ఏ చర్యలకు వివరణ ఇవ్వాలని కోరుతూ జర్మనీ ప్రభుత్వం తమ దేశంలోని అమెరికా రాయబారికి సమన్లు పంపామని తెలిపింది. గురువారం (అక్టోబర్ 24) సాయంత్రం కలిసి వివరణ ఇవ్వాల్సిందిగా అమెరికా రాయబారి జాన్ బి.ఎమర్శన్ ను కోరామణి జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జర్మనీ ప్రకటనపై వ్యాఖ్యానించడానికి అమెరికా ఎంబసీ నిరాకరించిందని…

ఇండియా చైనాల మధ్య 9 ఒప్పందాలు

చైనా పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ చైనాతో ఏకంగా 9 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాణిజ్య పరమైన ఒప్పందాలు మాత్రం ఏదీ కుదిరినట్లుగా పత్రికల్లో సమాచారం లేదు. అయితే తన చైనా పర్యటన గొప్పగా విజయవంతం అయినట్లు ప్రధాని ప్రకటించిచారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించారని, ఆయనను సంతోష పెట్టడానికి చైనా పెద్దలు వివిధ రకాలుగా ప్రయత్నించారని పత్రికలు రాశాయి. సరిహద్దు తగాదాల విషయంలో ఇరు దేశాలలో ఏదీ అవతలివారిపై మిలట్రీ…

డ్రోన్ హత్యలు చట్టబద్ధమే -అమెరికా

డ్రోన్ హత్యలను అమెరికా సమర్ధించుకుంది. చట్టాలకు అనుగుణంగానే తాను డ్రోన్ హత్యలకు పాల్పడుతున్నానని స్పష్టం చేసింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జే కేర్ని ఈ మేరకు విలేఖరుల సమావేశం పెట్టి మరీ తమ హంతక చర్యలను సమర్ధించుకున్నాడు. అమలు చేయదగిన అన్ని చట్టాలకు అనుగుణంగానే తమ డ్రోన్ హత్యలు సాగుతున్నాయని ఆయన అన్నాడు. కానీ ఆ చట్టాలేమిటో ఆయన చెప్పలేదు. అమెరికా డ్రోన్ దాడులు అంతర్జాతీయ చట్టాలను, అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్…

అమెరికా డ్రోన్ హత్యలు యుద్ధ నేరాలే -ఆమ్నెస్టీ

పాకిస్ధాన్ లో అమెరికా సాగిస్తున్న డ్రోన్ దాడులు యుద్ధ నేరాల కిందికి వస్తాయని బ్రిటన్ కి చెందిన అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ నిర్ధారించింది. డ్రోన్ దాడులు చట్ట విరుద్ధమని వాటిలో కొన్ని యుద్ధ నేరాలు కూడానని సదరు సంస్ధ తెలిపింది. అమెరికా డ్రోన్ దాడులకు పాకిస్ధాన్ లోని కొందరు అధికారులతో పాటు ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్ ప్రభుత్వాలు కూడా సహకారం ఇస్తున్నాయని చెప్పడం ద్వారా ఆమ్నెస్టీ చిన్నపాటి సంచలనానికి తెర తీసింది. అమెరికా…

అమెరికా డ్రోన్ దాడుల్లో వందల పౌరులు బలి -ఐరాస

టెర్రరిస్టుల పేరు చెప్పి అమెరికా సాగిస్తున్న చట్ట విరుద్ధ డ్రోన్ దాడుల్లో వేలాది మంది పౌరులు మరణిస్తున్నారని ఐరాస ప్రత్యేక నివేదిక పేర్కొంది. అమెరికా పైకి చెబుతున్న సంఖ్య కంటే 10 రెట్లు అమాయక పౌరులు డ్రోన్ దాడుల్లో మరణిస్తున్నారని ఐరాస ప్రత్యేక ప్రతినిధి విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. ఐరాస నిర్వహిస్తున్న దర్యాప్తుకు కూడా అమెరికా సహకరించడం లేదని ఐరాస ప్రత్యేక ప్రతినిధి (special rapporteur) బెన్ ఎమర్శన్ విడుదల చేసిన 24 పేజీల…

దివాలా అంచున అగ్రరాజ్యం -ఈనాడు ఆర్టికల్

‘దివాలా అంచున అగ్రరాజ్యం’ శీర్షికన ఈ రోజు ఈనాడులో నా ఆర్టికల్ ప్రచురించబడింది. బ్లాగ్ పాఠకుల కోసం ఇక్కడ ఇస్తున్నాను. కింద బొమ్మ రూపంలో ఆర్టికల్ ఉంది. దానిపై క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చూడాలంటే ఈ లింకు పైన క్లిక్ చేసి చూడవచ్చు. ఈ లింకు ఈ రోజు వరకు మాత్రమే పని చేస్తుందని గమనించగలరు. – ఈ గ్రాఫ్ పాఠకులకు ఉపయోగంగా ఉండొచ్చు.

లిబియాలో అమెరికాకు మరో ఎదురు దెబ్బ?

లిబియాలో సెక్యులర్ నేత గడ్డాఫీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసి ఆ దేశాన్ని ఆల్-ఖైదా టెర్రరిస్టులకు ఆవాసంగా మార్చినందుకు అమెరికా తగిన ప్రతిఫలం అనుభవిస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్ 11 తేదీన తాము మద్దతు ఇచ్చి అధికారంలోకి తెచ్చిన ముస్లిం ఉగ్రవాద తిరుగుబాటు సంస్ధల చేతుల్లోనే తమ రాయబారి క్రిస్టఫర్ స్టీవెన్ దారుణ హత్యకు గురి కావడాన్ని చూడవలసి వచ్చిన అమెరికా తాజాగా తమ నమ్మిన బంటు అయిన లిబియా ప్రధాన మంత్రి ఆలీ జీదన్ అరెస్టు కావడంతో…

ఉగ్రవాదం కాదు స్వార్ధం కోసమే అమెరికా గూఢచర్యం -బ్రెజిల్

ప్రపంచంలో ఉగ్రవాద ప్రమాదాన్ని అరికట్టడానికే తాను ప్రపంచ ప్రజలందరిపైనా గూఢచర్యం సాగిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పుకున్నాడు. వాస్తవంలో అమెరికా బహుళజాతి కంపెనీల వాణిజ్య, ఆర్ధిక ప్రయోజనాల కోసమే అమెరికన్ ఎన్.ఎస్.ఏ గూఢచర్యం జరుగుతోందని తాజా స్నోడెన్ పత్రాలు స్పష్టం చేశాయి. అమెరికాతో పాటు కెనడా కూడా ఈ గూఢచర్యంలో భాగం పంచుకుందని, ముఖ్యంగా బ్రెజిల్ లోని మైనింగ్ పరిశ్రమలో తమ కంపెనీల ప్రయోజనాల కోసం ఎన్.ఎస్.ఏ గూఢచర్యాన్ని కెనడా వినియోగించుకుందని బ్రిటిష్ పత్రిక ది గార్డియన్…

కీన్యా మారణకాండ: సైన్యమే మాల్ ని కూల్చేసిందా?

కీన్యా రాజధాని నైరోబిలో జరిగిన మారణకాండలో వాస్తవాలేమిటో చెప్పడానికి కీన్యా ప్రభుత్వం ఇంతవరకు ముందుకు రాలేదు. సోమాలియా నుండి వచ్చిన ఆల్-షబాబ్ టెర్రరిస్టులు ఈ దురాగతానికి పాల్పడ్డారని, పిరికిపందలను తరిమికొట్టామని ఆర్భాటంగా ప్రకటనలు ఇవ్వడం తప్ప దాడి ఎలా జరిగింది, అసలు మాల్ ఎందుకు, ఎలా కూలిపోయిందీ చెప్పడం లేదు. పేలుళ్ళ వేడికి భవనం బలహీనపడి కూలిపోయిందని కీన్యా ప్రభుత్వం చెబుతుండగా ఆల్-షబాబ్ ఇందుకు విరుద్ధంగా ప్రకటించింది. తమ సభ్యుల నుండి మాల్ ను విముక్తి చేయలేక…

హృదయం ద్రవించుకుపోయే కీన్యా మాల్ రక్తపాతం -ఫోటోలు

కీన్యా రాజధాని నైరోబిలోని ‘వెస్ట్ గేట్ మాల్’ పైన నాలుగు రోజుల పాటు జరిగిన రక్తపాతం నాగరిక ప్రపంచాన్ని నిశ్చేష్టుల్ని చేసింది. ఆల్-ఖైదా అనుబంధ సంస్ధ అయిన ఆల్-షబాబ్, ఈ దాడికి తానే బాధ్యురాలినని ప్రకటించింది. దాడిలో 61 మంది సాధారణ పౌరులు చనిపోగా ఇంకా 63 మంది జాడ తెలియలేదు. చనిపోయినవారిలో కిన్యా అధ్యక్షుడు కీన్యెట్టా రక్త సంబంధీకులు కూడా ఉన్నారు. ఆల్-షబాబ్ టెర్రరిస్టులు విసిరిన గ్రెనేడ్ల ధాటికి నాలుగు అంతస్ధుల మాల్ లోని మూడు…

స్నోడేన్ పత్రాలు: హార్డ్ డిస్క్ సహా అమెరికా గుప్పిట్లో ఇండియా జాతకం 2

మొదటి భాగం తరువాత……… కొమింట్ పత్రంలోని వివరాలు భయంకరమైన నిజాలని మనముందు ఉంచాయని ది హిందూ పత్రిక వ్యాఖ్యానించింది. మన్ హట్టన్ (న్యూయార్క్) లోని ఐరాస భారత శాశ్వత కార్యాలయం ఎన్.ఎస్.ఏ టాప్ టార్గెట్లలో ఒకటి. ఇక్కడ ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, ఉప శాశ్వత ప్రతినిధి, ఒక మంత్రి, ఒక రాజకీయ సమన్వయకర్త, ఆరుగురు కౌన్సిలర్లు, ఒక కల్నల్ ర్యాంకులోని మిలట్రీ సలహాదారు, ఇంకా ప్రపంచ దేశాలతో ఇండియాకు ఉండే వివిధ సంబంధాలకు సంబంధించిన అనేకమంది…