జపాన్ లో అణువిద్యుత్ ప్లాంటులను చల్లబరిచే యత్నాలు ముమ్మరం

జపాన్ ప్రభుత్వం ఫుకుషిమా లోని దైచి అణు విద్యుత్ ప్లాంటులో పేలిపోయిన రియాక్టర్లను చల్లబరిచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా మిలట్రీ హెలికాప్టర్ల ద్వారా సముద్రపు నీటిని ప్లాంటుపై జారవిడుస్తున్నది. ఈ ప్రక్రియను బుధవారం మొదలు పెట్టినప్పటికీ రేడియేషన్ స్ధాయి ఎక్కువగా ఉండటంతో విరమించుకున్నారు. హెలికాప్టర్లతో పాటు ప్లాంటు వద్ద వాటర్ కెనాన్ లను ఉపయోగించి నీళ్ళు వెదజల్లుతున్నారు. మొదట పోలిసులు ప్రయత్నించినా వారు రేడియేషన్ కి గురయ్యే ప్రమాదం ఉండడంతో వారిని వెనక్కి రప్పించారు. మిలట్రీ…

అణువిద్యుత్ ప్లాంటుల నిర్మాణంపై పునరాలోచనలో చైనా

జపాన్ లోని ఫుకుషిమా ‘దాయిచి’ అణువిద్యుత్ ప్లాంటు లో అణు రియాక్టర్లు పేలిపోయి పెద్ద ఎత్తున రేడియేషన్ విడుదల కావడం, రేడియేషన్ నియంత్రణకు జపాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమౌతుండడం, జపాన్ నుండి రేడియేషన్ ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తుండడం కారణాలతో పెద్ద ఎత్తున అణు విద్యుత్ ప్లాంటుల నిర్మాణం తలపెట్టిన చైనా పునరాలోచనలో పడింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్ని అణు విద్యుత్ ప్లాంటుల నిర్మాణాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అక్కడ భద్రతా వ్యవస్ధలను సమీక్షిస్తున్నట్లు…

పైచేయి సాధించిన గడ్డాఫీ, ‘నో-ఫ్లై జోన్’ అమలుకు భద్రతా సమితి ఓటింగ్

లిబియా తిరుగుబాటుదారుల పై గడ్డాఫీ పైచేయి కొనసాగుతోంది. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న తూర్పు లిబియాకు ముఖద్వారంగా చెప్పుకోదగిన ‘అజ్దాబియా’ పట్టణం కోసం ఇరుపక్షాల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. పట్టణాన్ని గడ్డాఫీ బలగాలు మూడువైపుల నుండి చుట్టుముట్టాయి. తూర్పు లిబియాలో అతి పెద్ద పట్టణం, లిబియాలో ట్రిపోలి తర్వాత అతి పెద్ద పట్టణం అయిన బెంఘాజీకి అజ్దాబియా 160 కి.మీ దూరంలో ఉంది. రెడ్ క్రాస్ సంస్ధ సిబ్బంది భద్రతా కారణాలను చూపుతూ బుధవారం బెంఘాజీ నుండి…

అమెరికా మేలు కోసం కేబినెట్ మంత్రుల్ని మార్చిన భారత ప్రధాని -వికీలీక్స్

“భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అమెరికా ఇష్టాయిష్టాలకు అనుగుణంగా కేబినెట్ మంత్రులను నియమించడం, మార్చడం చేస్తున్నాడు” ఇది ఏ వామపక్షాలో, విప్లవకారులో చేసిన ఆరోపణ కాదు. ఇండియాలో అమెరికా రాయబారిగా నియమితుడైన డేవిడ్ మల్ఫోర్డ్ అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటుకు పంపిన ఓ కేబుల్ (టెలిగ్రాం ఉత్తరం) సారాంశం. భారతదేశ విప్లవ పార్టీలు భారత పాలకులు భారత ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా తమకు ఎంగిలి మెతుకులు విసిరే విదేశీ పాలకుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని…

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ‘ఓటుకు నోటు’ సర్వసాధారణం -వికీలీక్స్

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో నోట్లతో ఓట్లు కొనడం సర్వసాధారణమని అమెరికా డెప్యుటీ రాయబారి అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ కి పంపిన కేబుల్ లో పేర్కొన్నాడు. 2009 లోక్ సభ ఎన్నికల్లో రాజకీయ నాయకులు వారి అనుచరులు డబ్బులు పంచామని రాయబారి దగ్గర అంగీకరించినట్లుగా వికీలీక్స్ బైట పెట్టిన కేబుల్ ద్వారా తెలిసింది. నోట్లే కాకుండా వినియోగ సరుకులు, సేవలు కూడా ఓట్ల సంపాదనకి వినియోగించారు. చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఏక్టింగ్ ప్రిన్సిపల్ ఆఫీసర్ గా పనిచేసిన…

‘ది హిందూ’ చేతిలో ఇండియాకి సంబంధించిన ‘వికీ లీక్స్’ డాక్యుమెంట్లు

అమెరికా తరపున ప్రపంచవ్యాపితంగా నియమించబడిన రాయబారులు తాము నియమించబడిన దేశాల్లో గూఢచర్యం నెరుపుతూ సంపాందించిన వివరాలను కేబుల్ ద్వారా అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటుకు పంపిస్తారు. 1960 నుండి 2010 ఫిబ్రవరి వరకూ అలా పంపిన కేబుల్స్ ‘వికీ లీక్స్’ సంస్ధకు అందిన విషయం తెలిసిందే. వికీ లీక్స్ సంస్ధ తనకు అందిన ‘డిప్లొమాటిక్ కేబుల్స్’ ను 2010 నవంబరు నెలాఖరు నుండి తన వెబ్ సైట్ లో ప్రచురిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఇండియాకు…

అణు ధార్మికత ఎంత దాటితే ప్రమాదకరం?

అణు ధార్మికతను ‘మిల్లీ సీవర్టు’లలో కొలుస్తారు. ‘సీవర్టు’ అసలు యూనిట్ అయినప్పటికీ అత్యంత ప్రమాదకర స్ధాయి సైతం మిల్లీ సీవర్టులలో ఉంటుంది కనుక ‘మిల్లీ సీవర్టు’ సాధారణ కొలతగా మారింది. జపాన్ ఛీఫ్ కేబినెట్ మంత్రి యుకియో ఎదనో చెప్పినదాని ప్రకారం ఫుకుషిమా దాయిచి అణు విద్యుత్ కేంద్రం వద్ద అణు ధార్మికత గంటకు 400 మిల్లీ సీవర్టులుగా నమోదయ్యింది. ఇది మంగళవారం ఉదయం నెం.2 రియాక్టర్ పేలడానికి ముందు నమోదైనదాని కంటే కొన్ని వేల రెట్లు…

మూడో రియాక్టర్ పేలుడు, జపాన్ లో అత్యంత ప్రమాదకర స్ధాయికి చేరుకున్న అణు ధార్మికత

జపాన్ భూకంపం, సునామీల కారణంగా సోమవారం వరకు రియాక్టర్ నెం. 1, 3 లలో పేలుళ్ళు జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం నెం. 2 రియాక్టరు కూడా పేలిపోయింది. దానితో పాటు భూకంపం రావడానికి చాలా రోజుల ముందే నిర్వహణ నిమిత్తం మూసివేసిన నెం.4 రియాక్టరులో కొద్ది సేపు మంటలు ఎగసిపడ్డాయి. నాల్గవ రియాక్టరు పనిలో లేనప్పటికీ వాడిన ఇంధన రాడ్లను అక్కడే ఉంచడం వలన అక్కడ కూడా అణు ధార్మికత వెలువడే ప్రమాదం తలెత్తింది. రెండో…

లిబియా తిరుగుబాటు ప్రతినిధితో హిల్లరీ సమావేశం, నో-ఫ్లై జోన్ ఆమోదం?

నాటో కూటమి లిబియా గగనతలాన్ని “నిషిద్ధ గగనతలం” గా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పారిస్ లో జి-8 గ్రూపు దేశాల మంత్రుల సమావేశం జరిగింది. లిబియా భూభాగంపై ఉన్న గగనతలాన్ని “నిషిద్ధ గగనతలం” గా ప్రకటించే విషయాన్ని చర్చించడం కోసం జి-8 దేశాల మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా లిబియా తిరుగుబాటు ప్రభుత్వ ప్రతినిధి “మహమ్మద్ జెబ్రిల్” హిల్లరీ క్లింటన్ ను కలిశాడు. 45 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశం వివరాలు ఏవీ తెలియలేదు. జి-8…

భారతీయ నటి నటించిన “మిరాల్” ప్రీవ్యూని రద్దు చేయాలి -ఇజ్రాయెల్ డిమాండ్

“స్లమ్ డాగ్ మిలియన్” చిత్రంలో నటించిన భారతీయ నటి “ఫ్రీదా పింటో” నటించిన మరో హాలీవుడ్ సినిమా “మిరాల్” ప్రీవ్యూను ఐక్యరాజ్యసమితి లోని జనరల్ అసెంబ్లీ హాలులో ప్రదర్శించడానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది. “మిరాల్”  పాలస్తీనా, ఇజ్రాయెల్ వైరానికి సంబంధించిన చిత్రం. ఐక్యరాజ్యసమితి కేంద్ర భవనం న్యూయార్క్ లోఉంది. జనరల్ అసెంబ్లీ హాలును సినిమాల ప్రివ్యూలకు అనుమతించడం ఎప్పటినుండో జరుగుతూ వస్తున్నది. “మిరాల్” సినిమాను అనుమతించడం ఐక్యరాజ్య సమితి తీసుకున్న “రాజకీయ…

బహ్రెయిన్ కి తమ సైనికులను పంపిన గల్ఫ్ దేశాలు

బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇస్సా అల్-ఖలీఫా వినతి మేరకు గల్ఫ్ దేశాలు తమ సైనికులను బహ్రెయిన్ కు పంపాయి. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జి.సి.సి) సభ్య దేశాల ఒప్పందం మేరకు ఈ సైనికుల తరలింపు జరిగింది. బహ్రెయిన్ రాజు నేతృత్వంలోని ప్రభుత్వం దిగిపోవాలంటూ నెలన్నర పైగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. షియా గ్రూపుకి చెందిన ప్రతిపక్షాలు వారికి నాయకత్వం వహిస్తున్నాయి. రాజు చర్చలకు ఆహ్వానించినప్పటికీ వారు నిరాకరించారు. ఆదివారం, మార్చి 13 తేదీన నిరసనకారులపై పోలీసులు…

తూర్పు ఆయిల్ పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న తిరుగుబాటుదారులు

ఆదివారం, మార్చి 13న గడ్డాఫీ బలగాల చేతిలోకి వెళ్ళిన ఆయిల్ పట్టణం ‘బ్రెగా’ ను తిరుగుబాటుదారులు తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తిరుగుబాటుదారులు పత్రికలకు తెలిపినప్పటికీ అధికారికంగా ఇంకా ధృవపడ లేదు. ‘బ్రెగా’ ను కోల్పోయిన కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి స్వాధీనం చేసుకున్నామని తిరుగుబాటుదారులు తెలిపారు. ఆహారం, నిత్యవసరాల సరఫరాలు దెబ్బ తినకుండా ఉండటానికి ఆయిల్ పట్టణాలను అదుపులో ఉంచుకోవడంతొ పాటు అంతర్జాతీయ గుర్తింపును సాధించడం కూడా అవసరం. తిరుగుబాటుదారుల ఏలుబడిలో ఉన్న…

రెండో అణు రియాక్టర్ పేలుడు, అణు ప్రమాదం అంచున జపాన్

8.9 పాయింట్ల భూకంపం, ఆ తర్వాత ఏళ్ళూ, ఊళ్ళూ ఏకం చేస్తూ ఉవ్వెత్తున ఎగసిపడిన సునామీ, అటు పిమ్మట ఫుకుషిమా దాయీచి నెం.1 అణు రియాక్టర్ పేలుడు, ఇప్పుడు దాయీచి నెం.3 అణు రియాక్టర్ పేలుడు… ఒకదాని వెంట మరొకటి వచ్చిపడుతున్న కష్టాలతో జపాన్ ప్రభుత్వం, ప్రజలు తీవ్రమైన సంక్షోభంలో మునిగి ఉన్నారు. ఒకదాని నుండి తేరుకునే లోగానే మరొక కష్టం విరుచుకు పడుతోంది. నెం.1, నెం.3 అణు రియాక్టర్లు ఇప్పటికే పేలిపోగా నెం.2 రియాక్టర్లో నీటి…

వెస్ట్ బ్యాంక్ లో కొత్త సెటిల్మెంట్ నిర్మాణానికి ఇజ్రాయెల్ ఆమోదం

1967 యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగం “వెస్ట్ బ్యాంక్” లో మరో కొత్త సెటిల్మెంటు నిర్మాణానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంత్రుల కమిటీ శనివారం ఈ నిర్మాణానికి ఆమోదముద్ర వేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. భవిష్యత్ లో జరిగే ఎటువంటి శాంతి ఒప్పందంలో నైనా తన ఆధీనంలో ఉండాలని ఇజ్రాయెల్ భావిస్తున్న భూభాగం పైనే కొత్త సెటిల్మెంట్ నిర్మానం జరుగుతుందని ఆ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ నిర్ణయాన్ని పాలస్తీనా అధికారులు ఖండించారు. “ఈ నిర్ణయం…

గడ్డాఫీ స్వాధీనంలో రెండో ఆయిల్ పట్టణం ‘బ్రెగా’

గడ్డాఫీ బలగాలు రెండో ఆయిల్ పట్టణం ‘బ్రెగా’ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం మొదటి ఆయిల్ పట్టణం ‘రాస్ లానుఫ్’ను వశం చేసుకున్న గడ్డాఫీ బలగాలు సాయంత్రానికి ‘బ్రెగా’ను కూడా స్వాధీనం చేసుకున్నారు. తిరుగుబాటు బలగాలు తమ కేంద్ర పట్టణమయిన ‘బెంఘాజీ’ కి ముఖద్వారమైన ‘అజ్దాబియా’ పట్టణానికి తిరుగుటపా కట్టారు. అజ్దాబియా కూడా గడ్డాఫీ స్వాధీనం చేసుకున్నట్లయితే తిరుగుబాటుదారుల వశంలో ఉన్న తూర్పు ప్రాంతంపై కూడా గడ్డాఫీ బలగాలు దాడి చేయవచ్చు. సాయుధ గ్యాంగులను…