లిబియా పౌరుల రక్షణకై చేసే దాడుల్లో పౌరులే చనిపోతున్నారు -అరబ్ లీగ్
అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్ అమీర్ మౌసా లిబియాపై పశ్చిమ దేశాల దాడులు తీవ్ర స్ధాయిలో ఉండడాన్ని ఆదివారం విమర్శించాడు. లిబియా పౌరులను గడ్డాఫీ విమానాల దాడులనుండి రక్షించడకోసం భద్రతా సమితి అనుమతి ఇచ్చింది తప్ప వారిని చంపడానికి కాదన్నాడు. లిబియాలో జరుగుతున్నది లిబియాపై ‘నో-ఫ్లై జోన్’ అమలు చేయాలన్న లక్ష్యానికి భిన్నంగా ఉన్నదని విమర్శించాడు. పౌరుల రక్షణనే మేం కోరాం తప్ప మరింతమంది పౌరులపై దాడులు చేయడం కాదన్నాడు. ఆదివారం పశ్చిమ దేశాలను విమర్శించిన అమిర్…