“రాజ్ ఘాట్” వద్ద ఒక రోజు నిరాహార దీక్షలో అన్నా హజారే

చెప్పినట్లుగానే అన్నా హజారే ఒక రోజు నిరాహార దీక్ష ప్రారంభమయ్యింది. వేలమంది అనుచరులు, ఆసక్తిపరులు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మద్దతుదారులతోహజారే తన ఒక రోజు నిరసన దీక్షను ప్రారంభించారు. అవినీతికి వ్యతిరేకంగాశాంతియుత దీక్షకు దిగిన బాబా రాందేవ్ శిబిరంపై అర్ధరాత్రి పోలీసుల చేత దాడిచేయించి, లాఠీ చార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగం జరిపించడానికి వ్యతిరేకంగాహజారే బుధవారం దీక్షను తలపెట్టారు. మొదట తన దీక్ష జంతర్ మంతర్ వద్దజరుగుతుందని అన్నా చెప్పినప్పటికీ ప్రభుత్వం అందుకు అనుమతి నిరాకరించడంతోతన శిబిరాన్ని…

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల తదుపరి టార్గెట్ సిరియా

రెండు నెలల నుండి లిబియాపై బాంబుల వర్షం కురిపిస్తూ అక్కడి మౌలిక సౌకర్యాల నన్నింటినీ సర్వ నాశనం చేస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు సిరియాను తమ తదుపరి లక్ష్యంగా ఎన్నుకున్నాయి. సిరియా అధ్యక్షుడు అబ్దుల్ బషర్ ను గద్దె దించేందుకు ఐక్యరాజ్యసమితిలో పావులో కదుపుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు సిరియాపై సమితి చేత తీర్మానం చేయించడానికి ఒత్తిడి పెంచుతున్నాయి. లిబియా విషయంలో కూడా బ్రిటన్, ఫ్రాన్సు లు అక్కడి ప్రభుత్వం తమ ప్రజలపై నిర్బంధం ప్రయోగిస్తున్నదని మొదట…

సుష్మ స్వరాజ్ కంటే మా నాన్నగారే బాగా డాన్స్ చేస్తారు -కాశ్మీరు ముఖ్యమంత్రి

ఆమరణ నిరాహార దీక్ష చేయబోయిన బాబా రాందేవ్ శిబిరంపై అర్ధరాత్రి అరెస్టు చేసి ఆయన మద్దతుదారులపై లాఠీ ఛార్జీ చేసినందుకు నిరసనగా బి.జె.పి సోమవారం మహాత్మా గాంధీ సమాధి “రాజ్ ఘాట్” వద్ద ఒక రోజు నిరసన తెలిపిన సంగతి విదితమే. తెల్లవారు ఝామున బి.జె.పి పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ తమ కార్యకర్తల ముందు నాట్యం చేసి పత్రికల పతాక శీర్షికలకెక్కారు. జాతిపిత మహాత్మగాంధి సమాధి వద్ద ప్రతిపక్షాల నాయకురాలు నాట్యం చేయడం కాంగ్రెస్…

చిలీలో పుయేహూ అగ్ని పర్వతం బద్దలై లావా బూడిదను ఎగజిమ్ముతున్న దృశ్యం -ఫోటో

జూన్ 5, 2011 తేదీన చిలీ దేశంలోని “పుయేహూ” అగ్ని పర్వతం బద్దలయ్యింది. దాంతో అగ్ని పర్వతం చుట్టూ 70 కి.మీ పరిధిలో నివసిస్తున్న వారు ఇళ్ళు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవలసి వచ్చింది. దక్షిణ చిలీలోని ఓసోర్నో పట్టణానికి సమీపంలో ఈ అగ్ని పర్వతం ఉంది. చిలీ రాజధాని శాంటియాగోకు దక్షిణంగా 870 కి.మీ దూరంలో ఉన్న ఈ పర్వతం గత యాభై సంవత్సరాల్లో బద్దలవడం ఇదే మొదటిసారి. పేలుడు ధాటికి బూడిద పక్కనే…

ఇజ్రాయెల్ దాష్టీకంపై నిరసనలో పాలస్తీనా బాలుడు! -ఎ.ఎఫ్.పి ఫోటో

పాలస్తీనా భూభాగం నుండి, వారి ఇండ్లనుండి పాలస్తీనా కుటుంబాలను తరిమివేసి 63 సంవత్సరాలు పూర్తయ్యాయి. అమెరికా, ఇంగ్లండుల ప్రత్యక్ష చర్యతో, ఇతర యూరప్ దేశాల పరోక్ష మద్దతుతో తమ తమ దేశాల్లో పదుల వందల ఏళ్ళ క్రితం తరలివచ్చి స్ధిరపడిన యూదు జాతి వారిని వదిలించుకోవడానికి పన్నిన చారిత్రక కుట్రే పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ సృష్టి. ఆనాటి జాతి హననంలో లక్షల పాలస్తీనీయులను ఇజ్రాయెల్ సైన్యం వెంటాడి వేటాడింది. తమ ఇళ్ళను వదిలి పక్క దేశాలకు పారిపోయేదాక…

ఫుకుషిమా ప్రమాదంలో రేడియేషన్ అంచనాకు రెట్టింపుకంటె ఎక్కువే విడుదలైంది

ఫుకుషిమా అణు ప్రమాదం వలన వాతావరణంలో విడుదలైన రేడియేషన్ ఇప్పటివరకూ అంచనా వేసినదానికంటే రెట్టింపుకంటె ఎక్కువేనని ప్రమాదంపై దర్యాప్తు జరపనున్న స్వతంత్ర నిపుణులతో కూడిన దర్యాప్తు సంస్ధ దర్యాప్తు ప్రారంభించడానికి ముందు జపాన్ అణు ఏజన్సీ వెల్లడించింది. అంతే కాకుండా మూడు రియాక్టర్లలో ఇంధన కడ్డీలు ఇప్పటిదాకా అనుకుంటున్న సమయానికంటే చాలా ముందుగానే కరిగి రియాక్టర్ల క్రింది బాగానికి చేరిందని ఏజెన్సీ చెబుతున్నది. వచ్చే జనవరిలోగా ఫుకుషిమా అణు కర్మాగారాన్ని మూసివేయోచ్చని అణు కర్మాగారం ఆపరేటర్ టోక్యో…

ఇరాన్ తర్వాత సిరియాపై అణు దౌర్జన్యం చేస్తున్న అమెరికా, పశ్చిమ దేశాలు -గ్రాఫిక్స్

ఇరాన్ అణు బాంబులు తయారు చేయడానికే యురేనియం శుద్ధి చేస్తున్నదంటూ ఇరాన్ అణు కార్యక్రమాన్ని అనేక సంవత్సరాలనుండి రాజకీయ, వాణిజ్య ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా తదితర పశ్చిమ దేశాలు తాజాగా సిరియాపై కూడా అదే తరహా ఎత్తుగడను అమలు చేస్తున్నాయి. ఇరాన్‌పై చేసినట్లే సిరియాపై కూడా అణు దౌర్జన్యం చేయడానికి సిద్ధపడుతున్నాయి. తమకు లొంగని దేశాలపై ఏదో ఒక పేరుతో అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలు విధించి ఆ దేశాల ప్రజల ఉసురు తీసే నరహంతక పశ్చిమ…

నష్ట పోతావ్! గూగుల్‌కి చైనా అధికార పత్రిక హెచ్చరిక

చైనా ప్రభుత్వంపై పరోక్షంగా హేకింగ్ ఆరోపణలు సంధించిన గూగుల్ సంస్ధకు చైనా ప్రభుత్వం తన అధికారిక పత్రిక ద్వారా స్పందించింది. అమెరికా, చైనాల మధ్య ఉన్న రాజకీయ విభేధాలను స్వప్రయోజనాలకు వినియోగించుకోవలని చూస్తే “నష్టపోతావ్!” అని పీపుల్స్ డైలీ పత్రిక హెచ్చరించింది. విదేశాల్లో పంపిణీకి వెలువడే పీపుల్సు డైలీ పత్రిక మొదటి పేజీలో రాసిన సంపాదకీయంలో ఈ హెచ్చరిక చేసింది. తన ఆరోపణల ద్వారా గూగుల్ తన వ్యాపారావకాశాలకు ప్రమాదం తెచ్చుకుంటోందని పత్రిక హెచ్చరించింది. గూగుల్ ఈ…

పౌరసమాజ నాయకులను ఐక్యం చేసిన రామ్‌దేవ్ అరెస్టు, లాఠీ ఛార్జీ

ఆదివారం వేకువ ఝామున బాబా రాందేవ్ ఆమరణ నిరాహార దీక్షా శిబిరంపై పోలీసులు దాడి చేయడమే కాకుండా, టియర్ గ్యాసు ప్రయోగించి, లాఠీ ఛార్జీ కూడా చేయడంతో అప్పటివరకు వివిధ కారణాలతో ఎడమొగం పెడమొగం గా ఉన్న పౌర సమాజ నాయకులుగా మన్ననలు అందుకుంటున్నవారిని ఏకం చేసింది. రాం దేవ్ దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి ముప్ఫై మందిక పైగా కార్యకర్తలను గాయపరచడాన్ని అన్నా హజారే, అరుణా రాయ్, కేజ్రివాల్ తదితరులు తీవ్రంగా ఖండించారు. కనీసం నిరసన…

దయానిధి మారన్ హీరోగా మరో కొత్త టెలికమ్ కుంభకోణం

కరుణానిధి బంధువు, కేంద్ర మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్ ప్రధాన పాత్రధారుడుగా మరో సరికొత్త టెలికం కుంభకోణం వెల్లడయ్యింది. తెహెల్కా పత్రిక ద్వారా వెల్లడయిన ఈ కుంభకోణం విలువ 700 కోట్ల రూపాయలు. తాను కేంద్రంలో టెలికం శాఖ మంత్రిగా ఉండగా తమిళనాడులోని ఎయిర్ సెల్ అనే కంపెనీకి టెలికం లైసెన్సులు రాకుండా సంవత్సరాల తరబడి దయానిధి మారన్ అడ్డుకున్నాడని తెహెల్కా పత్రిక బైట పెట్టింది. తన మిత్రుడికి చెందిన మలేషియా కంపెనీ మాక్సిస్‌కి ఎయిర్…

లోక్‌పాల్ బిల్లుపై కేంద్రం సీరియస్‌గా లేదు, మరోసారి నిరాహార దీక్ష చేస్తా! -అన్నా హజారే

కేంద్ర ప్రభుత్వ హామీని నమ్మి తన నాలుగు రోజుల నిరాహార దీక్షను విరమించిన అన్నా హజారేకు కేంద్ర ప్రభుత్వం అసలు స్వరూపం మెల్ల మెల్లగా అర్ధం అవుతోంది. అవినీతి ప్రభుత్వాలు ఇచ్చే హామీలు ఒట్టి గాలి మూటలేనని తెలిసి వస్తోంది. ఎన్నికల మేనిఫేస్టో పేరిట లిఖిత హామిలు ఇచ్చి పచ్చిగా ఉల్లంఘించే భారత దేశ రాజకీయ పార్టీలు ఒక సత్యాగ్రహవాదికి ఇచ్చిన హామీలను ఉల్లంఘించడం, ఉఫ్… అని ఊదిపారేయడం చిటికేలో పని అని గతం కంటే ఇంకా…

బాబా రామ్ దేవ్ ని అరెస్టు చేశారు, హరిద్వార్ కి తోలారు, దీక్ష ముగిసింది

భారత దేశ రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ అధికారుల అంతులేని అవినీతి పైన యుద్ధం ప్రకటించిన బాబా రామ్ దేవ్ ని అరెస్టు చేశారు. విదేశాల్లో దాచుకున్న అవినీతి డబ్బుని దేశానికి రప్పించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు. 2014 లో ఓ రాజకీయ పార్టీ పెడతానని చెబుతున్న ఈయన కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని అసాధ్యమైన డిమాండ్లు కూడా ఉంచాడు. తాము అనుమతిని 5,000 మందికి యోగా శిక్షణ ఇస్తానంటే ఇచ్చామనీ, 50,000 మందిని తెచ్చి గొడవ చేయడానికి…

అమెరికా నిరుద్యోగం – బలహీన ఆర్ధిక వ్యవస్ధ – కొన్ని ముఖ్యాంశాలు

అమెరికా నిరుద్యోగం అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు గుదిబండగా మారింది. నిరుద్యోగం తగ్గడానికి నేరుగా చర్యలు తీసుకునే బదులు పెట్టుబడిదారులకు ప్రోత్సహాకాలు ఇవ్వడం ద్వారా నిరుద్యోగం తగ్గించాలని అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుకున్న ప్రవేటు బహుళజాతి సంస్ధలు వాటిని ఉత్పత్తి కార్యకలాపాలకు వినియోగించే బదులు ద్రవ్య మార్కెట్లలో స్పెక్యులేటివ్ పెట్టుబడులు పెట్టి లాభాలు పొందాలని చూస్తున్నారు. దానితో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాక ప్రజల కోనుగోలు శక్తి పెరగక ఉత్పత్తులు కొనేవాళ్ళు లేక ఆర్ధిక వ్యవస్ధ…

బలహీనంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ, రానున్న వారాల్లో షేర్లు మరింత పతనం

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ బలహీన పడుతున్న నేపధ్యంలో ప్రపంచ వ్యాపితంగా షేర్ మార్కెట్లు మరికొన్ని వారాల పాటు నష్టాలను నమోదు చేయవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం రెండో అర్ధ భాగం నుండే అమెరికా ఆర్ధిక వృద్ధి నెమ్మదించడంతో, మార్కెట్లకు ఊపు ఇవ్వడానికి ఉద్దీపనా ప్యాకెజీ ఇవ్వడానికి నిశ్చయించి, ఆగష్టు నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వు 600 బిలియన్ డాలర్ల క్వాంటిటేటివ్ ఈజింగ్ -2 (క్యు.ఇ – 2) ప్రకటించింది. అమెరికా ట్రెజరీ బాండ్లను…

డ్రోన్ దాడిలో సీనియర్ ఆల్-ఖైదా నేత ఇలియాస్ కాశ్మీరీ మరణం?

పాకిస్ధాన్ ప్రభుత్వ కోవర్టు మద్దతుతో అమెరికా మానవ రహిత విమానం డ్రోన్ దాడిలో సీనియర్ ఆల్-ఖైదా నాయకుడు ఇలియాస్ కాశ్మీరీ మరణించాడు. ఒసామా హత్యానంతరం అమెరికా సాధించిన ప్రధాన టార్గెట్ గా ఇలియాస్ మరణాన్ని చెప్పుకోవచ్చు. పశ్చిమ దేశాలు “ఇలియాస్ కాశ్మీరీ” ని చాలా ప్రమాదకరమైన టెర్రరిస్టుగా అభివర్ణిస్తాయి. తద్వారా అమెరికా తదితర నాటో సైన్యాలకు నష్టాలు కలిగించడంలో కాశ్మీరీ పాత్ర స్పష్టం అవుతోంది. పాకిస్ధాన్ లోని ఓ గూఢచర్య అధికారిని, స్ధానిక టివి రిపోర్టులను ఉటంకిస్తూ…