పోస్కో వ్యతిరేక ఆందోళన తీవ్రతరం, పిల్లలు మహిళలతో మూడంచెల ప్రతిఘటన వ్యూహం

ఒడిషాలొని జగత్‌సింగ్ పూర్ జిల్లాలో పోస్కో ఉక్కు ఫ్యాక్టరీ కోసం బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటం కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 24 ప్లాటూన్ల పోలీసు బలగాలను దించి ధింకియా, గోవింద్ పూర్ గ్రామాలను బహుళజాతి ఉక్కు కంపెనీ కోసం వశం చేసుకోవడానికి ప్రయత్నాలను తీవ్ర్రం చేసింది. దాదాపు 3000 ఎకరాల్లోని అటవీ భూముల్ని పోస్కోకి కట్టబెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చేశాయి. ఈ భూముల్లోని అడవులపైనే అక్కడ ఉన్న…

షేర్ మార్కెట్లకు ఈ వారం కూడా నష్టాలే!

ఈ వారం షేర్ మార్కెట్లూ నష్టాల్లోనే… భారత పారిశ్రామిక ఉత్పత్తి ఏప్రిల్ నెలలో 6.3 మాత్రమే (ఏప్రిల్ 2010 లో ఇది 13.1 శాతం) పెరుగుదలను నమోదు చేయడంతో శుక్రవారం షేర్ మార్కెట్లు నష్టాల్ని చవి చూశాయి. వారం మొత్తం చూసినా షేర్లు నస్టాల్లోనే ముగిశాయి. శుక్రవారం సెన్సెక్స్ 116.36 పాయింట్లు (0.63 శాతం) 18,268.54 వద్ద క్లోజ్ కాగా నిఫ్టీ 35.25 పాయింట్లు (0.64 శాతం) 5,485.8 వద్ద క్లోజ్ అయ్యింది. ఈ వారంలో సెన్సెక్స్…

$2 బిలియన్లు నష్టమైనా ఎగుమతుదారులపై పన్నుల రద్దుకు నిర్ణయించిన ప్రభుత్వం

ప్రభుత్వానికి నష్టాలు వస్తున్నప్పటికీ ఎగుమతిదారులకు ఇస్తున్న టాక్స్ బ్రేక్ కొనసాగించడానికే భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి నష్టాలు వస్తున్నందున ఎగుమతిదారులపై విధించిన పన్ను రద్దు స్కీంను కొనగాగించకూడదని నిర్ణయించింది. ఐతే ఎగుమతిదారులైన భారత బిలియనీర్లు తీవ్రంగా అభ్యంతర పెట్టడంతో వారి ఒత్తిడికి తల ఒగ్గిన ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఆర్ధిక మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని తిరగదోడి ఎగుమతిదారులను సంతృప్తి పరిచింది. ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించడానికి “డ్యూటీ ఎన్‌టైటిల్‌మెంట్ పాస్ బుక్” (డి.ఇ.పి.బి)…

అమెరికా సైనికుల బూట్లు పాక్ నేలను తాకడానికి వీల్లేదు -సి.ఐ.ఏ తో పాక్ ఆర్మీ

సి.ఐ.ఏ గూఢచారులను 2/3 వంతు మందిని పాకిస్ధాన్ నుండి పంపించడంతో, ఆ విషయం చర్చించడానికి సి.ఐ.ఏ అధిపతి లియోన్ పెనెట్టా చెప్పా పెట్టకుండా పాకిస్ధాన్‌కి విచ్చేశాడు. పాక్ మిలట్రీ అధికారులు అందించిన సమాచారం ప్రకారం పాకిస్ధాన్ లో మొత్తం 135 మంది సి.ఐ.ఏ గూఢచారులు ఉండగా వారిలో 90 మందిని అమెరికాకు తిప్పి పంపారు. పాకిస్ధాన్ భూభాగంలో రక్షణ పొందుతున్న ఆల్-ఖైదా, తాలిబాన్ స్ధావరాలపై డ్రోన్ దాడులు జరపడానికి పాకిస్ధాన్ లో నియమించబడిన సి.ఐ.ఏ గూఢచారులు అందించే…

భూములు దక్కించుకోడానికి పోలీసులతో అమీ తుమీకి సిద్ధమైన పోస్కో బాధితులు

దక్షిణ కొరియాకి చెందిన పోస్కో కంపెనీకి ఒడిషాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడానికి పర్యావరణ సమస్యలన్నింటినీ పక్కకు నెట్టి కేంద్ర ప్రభుత్వం వారం రోజుల క్రితం అనుమతి మంజూరు చేసింది. వాస్తవానికి పోస్కో ప్రాజెక్టు వలన పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని స్వయంగా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖే గతంలో అనుమతిని నిరాకరించింది. ఐదు సంవత్సరాలనుండి ఈ కంపెనీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అనుమతిని సంపాదించింది. పర్యావరణ మంత్రి జైరాం రమేష్, ప్రధాని మన్మోహన్ ఒత్తిడి…

టీనేజి కుర్రాడిని నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపిన పాక్ ఆర్మీ -రాయిటర్స్ వీడియో లింక్

సర్ఫరాజ్ షా అనే పేరుగల యువకుడిని పాకిస్ధాన్ పారామిలట్రీ రేంజర్స్ కి చెందిన పోలీసులు, అతను ఓ వైపు దీనంగా బతిమాలుతున్నప్పటికీ క్రూరంగా కాల్చి చంపిన దృశ్యం ఈ వీడియోలో చూడవచ్చు. పోలీసులకి, సైనికులకి అధికారం అప్పగిస్తే ప్రజలు ఏం అనుభవించాల్సి వస్తుందో ఈ వీడియో తెలియజెప్పుతోంది. పాక్ ప్రధాని యధావిధిగా, విచారించి దోషులను కఠినంగా శిక్షిస్తామని వాగ్దానం ఇచ్చేశాడు. ఆయన వాగ్దానాన్ని నమ్మినవారెవరూ లేరని పత్రికలు ఘోషిస్తున్నాయి. http://in.reuters.com/video/2011/06/10/outrage-over-point-blank-teen-killing-in?videoId=212787889&videoChannel=101

తగ్గిపోయిన భారత పారిశ్రామిక ఉత్పత్తి, ఆర్ధికవృద్ధి కూడా తగ్గే అవకాశం

ఏప్రిల్ నెలలో పారిశ్రామిక వృద్ధి బాగా తగ్గిపోయింది. దానితో భారత దేశ ఆర్ధిక వృద్ధిపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ద్రవ్యోల్బణం ఎంతకీ తగ్గక పోవడం, ద్రవ్యోల్బణం కట్టడికోసం బ్యాంకు వడ్డీరేట్లు పెంచడంతో వాణిజ్య బ్యాంకుల నుండి అప్పు ఖరీదు పెరగడం వల్లనే పారిశ్రామిక వృద్ధి తగ్గిపోయిందని భావిస్తున్నారు. పారిశ్రామిక వృద్ధిలో తగ్గుదలవలన రిజర్వు బ్యాంకు ఇక ముందు వడ్డీ రేట్లను పెంచడానికి అంతగా సుముఖంగా ఉండక పోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫ్యాక్టరీలు, గనులు, ఇతర పారిశ్రామిక పారిశ్రామిక…

“సిరియా అణు కార్యక్రమం” అంశాన్ని భద్రతా సమితికి నివేదించిన ఐ.ఎ.ఇ.ఎ

అమెరికా, ఐరోపాల జేబు సంస్ధ అయిన “అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ” (ఐ.ఎ.ఇ.ఎ) సిరియా అణు విధానంపై ఏకాభిప్రాయానికి రాలేక పోయింది. భద్రతా సమితిలో వీటో అధికారం కలిగి ఉన్న చైనా, రష్యా లు సిరియా అంశాన్ని భద్రతా సమితికి నివేదించడానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. 35 దేశాల ఐ.ఎ.ఇ.ఎ బోర్డు 17 – 6 ఓట్ల తేడాతో తీర్మానాన్ని ఆమోదించింది. 12 దేశాలు ఓటింగ్ నుండి విరమించుకున్నాయి. ఇరాన్ విషయాన్ని ఐదు సంవత్సరాల క్రితం భద్రతా…

ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా మీడియా దుష్ప్రచారం – 2

సేమౌర్ హెర్స్ ఇంకా ఇలా రాశాడు. “అయితే అమెరికాకి చెందిన అత్యంత ఉన్నత స్ధాయి రహస్య గూఢచార నిర్ధారణలతో సహా పెద్ద పెద్ద సాక్షాలు (large body of evidence) అమెరికా సద్దామ్ హుస్సేన్, ఇరాక్ ల విషయంలో ఎనిమిది సంవత్సరాల క్రితం చేసిన తప్పులాంటి తప్పునే మళ్ళీ ఇరాన్ విషయంలోనూ చేసే ప్రమాదంలో ఉందని సూచిస్తున్నాయి. ఒక నిర్భంధ పాలకుడి విధానాలపై ఉన్న ఆత్రుతకొద్దీ ఆ ప్రభుత్వ మిలట్రీ సామర్ధ్యాలూ, ఉద్దేశాలపైన మన అంచనాలు తప్పు…

ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా మీడియా దుష్ప్రచారం -1

ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, యూరప్ దేశాలు దుష్ప్రచారం చేస్తూ ఆ దేశంపై నాలుగు దఫాలుగా అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా సిరియా అణు బాంబు నిర్మిస్తున్నదంటూ మరో అబద్ధపు ప్రచారం లంకించుకున్న పశ్చిమ దేశాల కార్పొరేట్ పత్రికలు అమెరికా, ఐరోపా దేశాల ప్రపంచ ఆధిపత్య రాజకీయాలో కోసమే అటువంటి అబద్ధపు ప్రచారానికి దిగుతాయన్నది జగమెరిగిన సత్యం. ప్రపంచ అణు ఇంధన సంస్ధ ఐన ఐ.ఎ.ఇ.ఏ, తాజాగా ఇరాన్ విషయంపై చర్చించడానికి సమావేశం…

ప్రవాసంలోనే మరణించిన “పికాసో ఆఫ్ ఇండియా” ఎమ్.ఎఫ్.హుస్సేన్

“పికాసో ఆఫ్ ఇండియా” గా ప్రసిద్ధికెక్కిన ప్రఖ్యాత భారత పెయింటింగ్ కళాకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ ప్రవాసంలో ఉండగానే మరణించాడు. 2006 సంవత్సరంలో లండన్‌కి ప్రవాసం వెళ్ళిన ఎం.ఎఫ్.హుస్సేన్ కొన్ని నెలలుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చనిపోయేనాటికి ఖతార్ పౌరుడుగా ఉన్న ఎం.ఎఫ్.హుస్సేన్ భారత దేశంలో అనేక సార్లు దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది. భారతదేశ సంస్కృతి పరిరక్షకులుగా తమను తాము నియమించుకున్న హిందూ మత సంస్ధల కార్యకర్తలు అనేక సార్లు ఎం.ఎఫ్.హుస్సేన్ పెయింటింగ్ ప్రదర్శనలపై దాడులు చేసి…

విష వ్యర్ధాల డంపింగ్ ద్వారా 20 బిలియన్ యూరోలు సంపాదిస్తున్న ఇటలీ మాఫియా

డ్రగ్స్ రవాణా అమ్మకాలకీ, బలవంతపు వసూళ్ళకూ పేరుపొందిన ఇటలీ మాఫియా ఫ్యాక్టరీల ద్వారా వెలువడే విష వ్యర్ధాలను డంపింగ్ చేయడంలో ఆ ఫ్యాక్టరీ యజమానులకు సాయపడ్డం ద్వారా సంవత్సరానికి 20 బిలియన్ యూరోలు (దాదాపు రు. 1,30,000 కోట్లకు సమానం) సంపాదిస్తోందని లండన్ నుండి వెలువడే ‘ది ఇండిపెండెంట్’ పత్రిక బుధవారం వెల్లడించింది. ఇటలీ దక్షిణ ప్రాంతాన్ని విష వ్యర్ధాలు పారబోయడానికి డంపింగ్ యార్డుగా మాఫియా గ్రూపులు మార్చివేశాయని పర్యావరణ సంస్ధ నివేదికను ఉటంకిస్తూ ఆ పత్రిక…

అమెరికా ప్రత్యేక దళాలను దేశంనుండి పంపించిన పాక్ ప్రభుత్వం

మొత్తం మీద పాకిస్ధాన్ ప్రభుత్వం అనుకున్నది సాధించింది. పాక్ సైనికులకు శిక్షణ ఇచ్చే పేరుతో పాకిస్ధాన్ లో తిష్ట వేసిన అమెరికా ప్రత్యేక బలగాలను లేదా సి.ఐ.ఏ గూఢచారులను బాగా తగ్గించాలని పాక్ ప్రభుత్వం గత కొన్ని వారాలనుండి అమెరికాను కోరుతూ వచ్చింది. ఈ విషయమై ఇరు దేశాల మిలట్రీ ప్రతినిధుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఎట్టకేలకు పాకిస్ధాన్ లో ఉన్న సి.ఐ.ఏ గూఢచారుల్లో 90 మందిని అమెరికాకి తిప్పి పంపినట్లుగా పాక్ ప్రభుత్వం…