నేరుగా ఆవు పొదుగు నుండే పాలు తాగుతున్న బాలుడు, అయినా క్షేమం

ఇది 18 నెలల కాంబోడియా పసి బాలుడి కధ. ఈ బాలుడు నెల రోజులకు పైగా నేరుగా ఆవు పొదుగుని నోట్లో పెట్టుకుని పాలు తాగుతున్నాడు. అయినా బాలుడు క్షేమంగానే ఉన్నాడని బాలుడి తాత చెబుతున్నాడు. బాలుడి పేరు ధా సోఫత్. బాలుడు గత జులై నుండీ నేరుగా ఆవు పొదుగునుండి పాలు తాగుతున్నాడని వెల్లడించాక ఆ వార్త అంతర్జాతీయంగా పతాక శీర్షికలను ఆక్రమించింది. ఇటీవల సంభవించిన తుఫాను దెబ్బకి బాలుడి తల్లిదండ్రుల ఇల్లు పాడైపోయింది. జీవనానికి…

ఇండియా టెర్రరిస్టులే ఢిల్లీ పేలుళ్ళ బాధ్యులు కావచ్చు -హోం మంత్రి

ఇండియాలో ఉన్న టెర్రరిస్టులే ఢిల్లీ హైకోర్టులో జరిగిన పేలుళ్లకు బాధ్యులు కావచ్చని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం అన్నాడు. ” భారతదేశంలో జరిగే టెర్రరిస్టు దాడులకు ఇప్పుడు కేవలం సరిహద్దుల అవతలినుండే జరుగుతున్నాయని ఆరోపించలేము” అని ఆయన అన్నాడు. వార్తా ఛానెళ్ళకు అందిన ఈ మెయిళ్ళ సమాచారాన్ని నిపుణులు ఇంకా విశ్లేషిస్తున్నారని ఆయన తెలిపాడు. ఢిల్లీ హైకోర్టు పేలుళ్ళలో చనిపోయినవారి సంఖ్య 13కి చేరుకుందని కూడా ఆయన తెలిపాడు. పాకిస్ధాన్ నుండి నడిచే హర్కత్ ఉల్ జిహాదీ…

కొత్త ఆయుధంతో అమెరికాకు దడ పుట్టిస్తున్న తాలిబాన్

ఇటీవలి కాలంలో తాలిబాన్ బలగాలు నాటోకి చెందిన హెలికాప్టర్లను కూల్చివేస్తున్న వార్తలు వరుసగా వెలువడ్డాయి. దానికి కారణం తాలిబాన్ కొత్త ఆయుధాన్ని సమకూర్చుకోవడమేనని తాలిబాన్ వర్గాలను ఉటంకిస్తూ ఏసియా టైమ్స్ పత్రిక తెలిపింది. భూమి మీది నుండి గాలిలోకి ప్రయోగించే మిసైల్ ద్వారా తాము గణనీయమైన సంఖ్యలో హెలికాప్టర్లను కూల్చివేశామని తాలిబాన్ ప్రతినిధి చెప్పాడు. అయితే నాటో, అమెరికా వర్గాలు మాత్రం తమ హెలికాప్టర్లు కూలినప్పుడల్లా సాంకేతిక లోపం వలన కూలిందని చెబుతున్నాయి. తాలిబాన్ ఇంతవరకూ ఒకటీ…

శవాల కుప్పలపై ‘నాటో’ ప్రజాస్వామ్య స్ధాపన -కార్టూన్

నాటో – ‘నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్’, అన్నది మిలట్రీ ఒప్పందం. మిలట్రీ పరంగా ఒకదానికొకటి ముడి వేసుకున్న ఈ కూటమి ప్రజాస్వామ్య స్ధాపన చేస్తానంటూ బయలుదేరడమే ఒక వింత. తన ప్రజాస్వామ్యాన్ని అంగీకరించకపోతే అది జరిపే హత్యాకాండ, ఇతరులకు ఒక గుణపాఠంగా నిలుస్తుంది. – కార్టూనిస్టులు: క్రిటికల్ పాయింట్ (కార్టూనిస్టుల గ్రూపు)

“సెప్టెంబరు 11” కి పదేళ్ళు -కార్టూన్

న్యూయార్క్, అమెరికా, నగరంలోని ప్రపంచ వాణిజ్య సంస్ధకు చెందిన జంట టవర్లపై టెర్రరిస్టు దాడులు జరిగి నేటితో (సెప్టెంబరు 10) పదేళ్ళు నిండాయి. దాడుల్లో మూడువేలకు పైగా చనిపోయారని అమెరికా తెలిపింది. టెర్రరిస్టు దాడుల్లో చనిపోయిన అమెరికన్లకు పూర్తిగా సానుభూతి, సహకారం అందించే లోపే, అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్, అదే దుర్ఘటనను అడ్డు పెట్టుకుని దురాక్రమణ యుద్ధాలకి తెర లేపాడు. రుజువుకాని నేరాన్ని మోపి, రుజువు కానవసరం లేదన్నట్లుగా, ఘటనతో సంబంధం లేని రెండు దేశాలు,…

అమెరికా, యూరప్ సంక్షోభాలకు పరిష్కారం చూపని జి7 సమావేశాలు

శుక్రవారం జరిగిన జి7 సమావేశాలు చప్పగా ముగిశాయి. ప్రపంచ ఆర్ధికవ్యవస్ధ మరొక మాంద్యం ముంగిట నిలబడి ఉన్నప్పటికీ ఇతమిద్ధమైన పరిష్కారారాన్నేదీ చూపలేకపోయింది. అందరం కలిసి ఉమ్మడి సహకారంతో సంక్షోభానికి స్పందించాలన్న మొక్కుబడి ప్రకటన తప్ప సమావేశాలు ఏమీ సాధించలేకపోయాయి. పైగా యూరప్ రుణ సంక్షోభంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి నిరాశపరిచాయి. యూరప్ రుణ సంక్షోభం పరిష్కారానికి యూరోప్ కి చెందిన శక్తివంతమైన దేశాలు యూరోజోన్ లోని బలహీన దేశాలకు ద్రవ్య మద్దతు ఇవ్వాలని అమెరికా నొక్కి చెప్పగా,…

ఇజ్రాయెల్ ఎంబసీపై ఈజిప్షియన్ల దాడి, దేశం విడిచిపోయిన రాయబారి

ఈజిప్టు ప్రజలు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను తామే, తాత్కాలికంగానే అయినా, తెంచేశారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై పెద్ద సంఖ్యలో దాడి చేసిన ఈజిప్టు ప్రజలు ఇజ్రాయెల్ జెండాను కూలగొట్టి, రాయబార కార్యాలయంలోపలికి జొరబడ్డారు. లోపల ఉన్న ఫర్నిచర్, రికార్డులు అన్నింటినీ ధ్వంసం చేశారు. దానితో ఇజ్రాయెల్ రాయబారి ఈజిప్టు విడిచి కుటుంబంతో సహా స్వదేశం వెళ్ళిపోయాడు. గత నెలలో ఈజిప్టు సరిహద్దు భద్రతా దళాల పోలీసులను ఇజ్రాయెల్ సైనికులు చంపినందుకు ప్రతీకారంగా, ఇజ్రాయెల్‌నుండి తమ రాయబారిని ఉపసంహరించుకుంటానని…

పాలస్తీనా దేశ ప్రకటనను వీటో చేస్తాం -అమెరికా దుర్మార్గం

అమెరికా తన దుర్నీతిని బహిరంగంగా ప్రకటించుకుంది. తాను నిత్యం వల్లించే మానవ హక్కుల సిద్ధాంతాలూ, ప్రజాస్వామికి సూత్రాలు తాను పాటించేది లేదని మరొకసారి బైటపెట్టుకుంది. అక్రమంగా ఇజ్రాయెల్ దేశాన్ని తెచ్చి అమెరికా, యూరప్ లు పాలస్తీనా ప్రజల నెత్తిన పెట్టిన దగ్గర్నుండీ, తాము కోల్పోయిన తమ స్వంత దేశం కోసం, స్వంత నేల కోసం తపన పడుతున్న పాలస్తీనా ప్రజలను దారుణంగా మోసం చేసింది. చర్చలతో పాలస్తీనా రాజ్యాన్ని స్ధాపించగలమని ఇచ్చిన హామీని దశాబ్దాల తరబడి సాగతీస్తూ…

హమ్మయ్య! సోనియా తిరిగొచ్చింది!

కాంగ్రెస్ నాయకులు సోనియా ఉన్నప్పటి కంటే, ఆమె లేనప్పుడే ఎక్కువగా ఆమె నామ జపం చేస్తారని భారత ప్రజలకు తెలిసొచ్చింది. ఇంకా వెల్లడికాని జబ్బు నయం కావడానికి, శస్త్ర చికిత్స కోసం సోనియా గాంధీ నెల రోజూల క్రితం అమెరికా వెళ్ళింది. సోనియా గానీ, ఆమె కుటుంబం గానీ చెప్పకుండానే తనకు గర్భాశయ కాన్సర్ సోకిందని పత్రికలు నిర్ధారించాయి. ప్రతి పత్రికా ‘సోనియాకు కాన్సర్’ అని మీడియా చెబుతున్నదని రాయడమే గానీ నిర్ధారించినవారెవరూ లేరు. ఎవరికీ చెప్పాపెట్టకుండా…

లిబియా జోక్యం చట్టవిరుద్ధం -అమెరికా కాంగ్రెస్ సభ్యుడు

లిబియా జోక్యం చట్ట విరుద్ధమని అమెరికా కాంగ్రెస్ సభ్యుడొకరు, న్యూయార్క్ టైమ్స్ పత్రికకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. లిబియా మరో ఇరాక్ కానున్నదని జోస్యం చెప్పాడు. అమెరికా తదితర పశ్చిమ దేశాలతో సహకరిస్తే మిగిలేది నాశనమేనని అవి తమ వినాశకర జోక్యం ద్వారా నిరూపిస్తున్నాయని నిరసించాడు. ఓహియో నుండి ప్రతినిధుల సభకు డెమొక్రటిక్ పార్టీ నుండి ఎన్నికయిన డెన్నిస్ జె. క్యుసినిచ్, మంగళవారం పత్రికకు రాసిన లేఖ న్యూయార్క్ టైమ్స్ పత్రిక బుధవారం ప్రచురించింది. ఆగష్టు 29…

ఐక్యరాజ్య సమితి: సామ్రాజ్యవాది బొచ్చుకుక్క -కార్టూన్

ఐక్యరాజ్య సమితి. ప్రపంచ దేశాలను అమెరికా మాట వినేలా ఒత్తిడి తెచ్చే నమ్మకమైన రాజకీయ సంస్ధ. అమెరికా సామ్రాజ్యవాద విస్తరణకు అహరహం శ్రమించే గొప్ప సంస్ధ. పేద, బడుగు దేశాలపైన తప్ప మొరగని బొచ్చుకుక్క. కార్టూనిస్టు: విక్టర్ నీటో, వెనిజులా. —

అబద్ధపు వార్తలపై కొత్త కౌబాయ్ సవారీ -కార్టూన్

అంకుల్ శామ్ కౌబాయ్ రూపంలో సవారి చేయడానికి ఇప్పుడు గుర్రాలు అవసరం లేదు. గుర్రాల శక్తికి పరిమితి ఉంది. వాటికి తిండి పెట్టాలి. రెస్ట్ కావాలి. కౌబాయ్ కూడా శ్రమ పడాలి. కాని ఆధునిక గుర్రంపై సవారీకి అవేమీ అవసరం లేదు. అది వారానికి ఏడురోజులూ, రోజుకి ఇరవై నాలుగ్గంటలూ అలుపు సొలుపూ లేకుండా పని చేస్తుంది. కౌబాయ్ విశ్రాంతి తీసుకునే టైంలో కూడా పని చేస్తుంది. ప్రపంచంలోని ప్రతి మూలకీ ఏక కాలంలో ప్రయాణం చేస్తుంది.…

కాంట్రాక్టు నిబంధనలను రిలయన్స్ ఉల్లంఘించింది -కాగ్ అక్షింతలు

భారత దేశ రాజ్యాంగసంస్ధ, ప్రభుత్వ ఉన్నత ఆడిటింగ్ సంస్ధ అయిన ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ రిలయన్స్ ఇండస్ట్రీస్ కాంట్రాక్టు ఉల్లంఘనలపై తన పూర్తి నివేదికను గురువారం సమర్పించింది. ఈ నివేదికలో కేంద్ర ప్రభుత్వం, రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండింటినీ కాగ్ విమర్శించింది. కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు కంపెనీకీ, రిలయన్స్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించేలా సహకరించినందుకు ప్రభుత్వానికీ అక్షింతలు వేసింది. దేశానికి చెందిన కీలకమైన ఆయిల్ వనరు కృష్ణ-గోదావరి (కె.జి) బేసిన్ అభివృద్ధి చేసే కాంట్రాక్టు రిలయన్స్ ఇండస్ట్రీస్…

పునరద్భవిస్తున్న కార్మికవర్గం, చైనా విప్లవం భవిష్యత్తు -1

(పాఠకులకు గమనిక: అమెరికానుండి వెలువడే ‘మంత్లీ రివ్యూ’ పత్రికలో మింషి లీ రాసిన ఆంగ్ల రచనకు ఇది యధాతధ అనువాదం. రచయిత 1990-92 కాలంలో చైనాలో రాజకీయ ఖైదీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన యూనివర్సిటీ ఆఫ్ ఉతా, (సాల్ట్ లేక్ సిటి) లో ఎకనమిక్స్ బోధిస్తున్నాడు. మావో కాలంనాటి చైనాలోని సోషలిస్టు వ్యవస్ధ, ఇప్పటి పెట్టుబడిఉదారీ వ్యవస్ధలను తులనాత్మకంగా ఈ వ్యాసం పరిశీలిస్తుంది. సైద్ధాంతిక వ్యాసం అయినందున కొంత కఠినంగా ఉండవచ్చు.) జులై 2009లో జిలిన్‌లోని తొంఘువా…

ఢిల్లీ పేలుళ్ల ఈమెయిల్‌కు కాశ్మీరుతో లింకు, ఇండియన్ ముజాహిదీన్ నుంచి మరో ఈమెయిల్

ఢిల్లీ హైకోర్టు వద్ద బుధవారం సంభవించిన బాంబు పేలుడుకు తమదే బాధ్యత అంటూ ‘హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీ’ సంస్ధ పంపిన ఈ మెయిల్ కాశ్మీరు నుండి వచ్చినదిగా పోలిసులు తేల్చారు. కాశ్మీరులోని కీష్త్వర్ పట్టణంలోని ఒక సైబర్ కేఫ్ నుండి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. సైబర్ కేఫ్ యజమానులైన సోదరులిద్దరిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలిపారు. వారు వర్ణించినదాని ప్రకారం కొన్ని కీలకమైన క్లూలను సంపాదించినట్లు కూడా పొలీసులు గురువారం తెలిపారు. జమ్ము నుండి 230 కి.మీ…