భాష, సోషలిజం, ప్రజాస్వామ్యం – పరస్పర సంబంధాలు -1

సోషలిజం, ప్రజాస్వామ్యంల మధ్య సంబంధాల గురించి నేను గతంలో రాసిన కొన్ని అంశాలపై కొంతమంది బ్లాగర్లు వ్యంగ్య వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పటికే పలుమార్లు, పలుచోట్ల వారి సంస్కార రాహిత్యాన్ని బైట పెట్టుకున్నారు గనక వారి వ్యంగ్యాన్ని పక్కనబెడుతున్నా. వారి విమర్శనాంశాన్ని మాత్రమే ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటూ దానికి మరికొంత వివరణ ఇవ్వడానికి ఈ టపాని ఉద్దేశించాను. ఈ అంశంపైన ఎక్కువమంది అయోమయానికి గురయ్యే అవకాశం ఉన్నందున ఈ ప్రయత్నం చేస్తున్నాను. కమ్యూనిస్టు పదజాలం ఏ యిజానికీ సొంతం…

గ్రీసు రుణ సంక్షోభం -కార్టూన్

గ్రీస్ ప్రధాని జార్జి పపాండ్రూ: ఈ ఒక్కటే కత్తిరిస్తే అంతా అయిపోయినట్లే  కార్టూనిస్టు: అమోరిమ్, బ్రెజిల్ —————                   —————–                          ————–                       —————— గ్రీసు రుణ సంక్షోభం గత సంవత్సరం ప్రారంభంలో తలెత్తడంతో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు దానికి 110 బిలియన్ యూరోల బెయిలౌట్ మంజూరు చేసాయి. బెయిలౌట్ ఇస్తూ విషమ షరతులు విధించాయి. షరతుల ఫలితంగా గ్రీసు ప్రధాని గత సంవత్సర కాలంగా అనేక విడతలుగా పొదుపు చర్యలు అమలు చేశాడు. కార్మికులు, ఉద్యోగుల వేతనాలు, ఫెన్షన్లు,…

మీపై దాడులకు మేమెలా బాధ్యులం? అమెరికాకి పాక్ సూటి ప్రశ్న

అమెరికా హెచ్చరికను పాకిస్ధాన్ తిప్పికొట్టింది. హెచ్చరికను స్వీకరించడానికి పాక్ సైనికాధికారులు నిరాకరించారు. మంగళవారం నుండి బుధవారం వరకూ కాబుల్ పట్టణ నడిబొడ్డున అమెరికా ఎంబసీపై తాలిబాన్ మిలిటెంట్లు చేసిన రాకెట్ దాడితో అమెరికా నేతృత్వంలోని నాటో అధికారులు తత్తరపాటుకి గురయ్యారు. ఆఫ్ఘన్ దురాక్రమణ తర్వాత ఇంతవరకూ మిలిటెంట్లు ఎన్నడూ కాబూల్ పై అంతసేపు దాడి చేయలేదని రాయిటర్స్ సంస్ధ పేర్కొంది. పాకిస్ధాన్ భూభాగంలో స్ధావరాలు ఏర్పరుచుకున్న హక్కాని మిలిటెంట్ల గ్రూపు ఈ దాడికి కారణమని అనుమానిస్తున్న అమెరికా…

మా రక్షణ కోసం మేం ఏమైనా చేస్తాం, పాక్‌కు అమెరికా హెచ్చరిక

పాకిస్ధాన్‌కి అమెరికా తాజాగా హెచ్చరిక జారీ చేసింది. తాలిబాన్ మిలిటెంట్లు ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ నడిబొడ్డున ఉన్న అమెరికా ఎంబసీ, నాటో కార్యాలయం ఉన్న ప్రాంతంపైన రాకెట్లు, మెషిన్ గన్‌లతో దాడి చేసింది. మంగళవారం మధ్యాహ్నం నుండి బుధవారం ఉదయం వరకు ఇరవై గంటలపాటు సాగిన ఈ దాడిలో పెద్దగా నష్టం ఏమీ జరగనప్పటికీ, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే ‘హై సెక్యూరిటీ జోన్’ లోకి రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్, మెషిన్ గన్లతో సహా మిలిటెంట్లు…

తమరు అంతగా సంతోషించడానికేమీ లేదు -మోడితో సంజయ్ భట్

సుప్రీం కోర్టు తీర్పులో నరేంద్రమోడీ సంతోషించడానికేమీ లేదని ఓ బహిరంగ లేఖలో పోలీసు అధికారి సంజీవ్ భట్ తేల్చి చెప్పాడు. పైగా ఆ తీర్పుతోనే మోడిపై విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయని సంజీవ్ భట్ తన లేఖలో పేర్కొన్నాడు. గోద్రా ఘటనపై ముస్లింలపై మారణ కాండ ప్రారంభమైనప్పుడు ‘దాడులు చేస్తున్న హిందువులను అడ్డుకోవద్దని’ చెప్పడానికి మోడి ఏర్పాటు చేసిన సమావేశానికి తాను కూడా హాజరయ్యానని కొద్ది వారాల క్రితం ప్రకటించి సంజీవ్ భట్ సంచలనం సృష్టించాడు. ఆ…

మానసిక యుద్ధంలో భాగమే అమెరికా ఎంబసీపై తాలిబాన్ దాడి

20 గంటల పోరాటం అనంతరం తాలిబాన్ దాడి ముగిసింది. దాడిలో పాల్గొన్న తాలిబాన్ మిలిటెంట్లు అందరూ చనిపోవడంతో ఆపరేషన్ ముగిసింది. మంగళవారం ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో ‘అత్యున్నత భద్రతా జోన్’ లో తాలిబాన్ మిలిటెంట్లు దాడికి పూనుకున్న సంగతి విదితమే. అమెరికా ఎంబసీకి సమీపంలోనే ఉన్న ఒక నిర్మాణంలో ఉన్న భవంతిని అదుపులోకి తీసుకున్న తాలిబాన్ మిలిటెంట్లు బుధవారం వరకూ ఇరవై గంటలపాటు ఆఫ్ఘన్, అమెరికన్ సైనికుల ప్రతిఘటనను ఎదుర్కొని నిలబడ్డారు. దాడిలో భారీ ఆయుధాలు ఏవీ…

వ్యాపారానికి ఏదీ అనర్హం కాదు, 9/11 దాడులతో సహా -ఫొటోలు

పెట్టుబడిదారుడి దృష్టిలో ప్రతిదీ సరుకే. అది కూడా లాభాలు సంపాదించి పెట్టే సరుకులుగానే వస్తువుల్ని అతను చూస్తాడు. సేవల పేరుతో ఇప్పుడు వస్తువులతో పాటు భావాలనీ, బాధలనీ, కష్టాలనీ, కన్నీళ్ళనీ, సంతోషాన్ని, బంధాలనీ, అను బంధాలనీ కూడా మారకపు సరుకులుగా పెట్టుబడిదారుడు మార్చ గలిగిగాడు. ఏ అంశాన్నైనా పెద్ద ఎత్తున పతాక శీర్షికలకి నెట్టడం ద్వారా దానికి కొంత మారకపు విలువను జోడించగలుగుతున్నాడు. ఆ తర్వాత అమ్మకానికి పెడుతున్నాడు. బాబో, పాపో పుడితే సంతోషం. ఆ సంతోషాన్ని…

నూతన ఎత్తులను తాకుతున్న అమెరికా దరిద్రం -సెన్సస్ బ్యూరో

అమెరికా సెన్సస్ బ్యూరో తన వార్షిక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం ఇప్పుడు అమెరికాలో ప్రతి ఆరుగురిలోనూ ఒకరు దరిద్రుడు. బ్యూరో విడుదల చేసిన 2010 గణాంకాల ప్రకారం అమెరికాలో 46.2 మిలియన్ల మంది (4.62 కోట్లు) దారిద్ర్య రేఖకు దిగువన బతుకుతున్నారు. అంటే మొత్తం జనాభాలో 15.1 శాతం మంది దరిద్రులుగా బతుకులీడుస్తున్నారు. ఇది 2009 సంవత్సరంలో 14.3 శాతంగా ఉంది. ఒక సంవత్సరంలో 0.8 శాతం (2.5 మిలియన్లు లేదా 25 లక్షలు)…

శాకాహారులారా ఉరితీసుకొండి! పులిగారు శాఖాహారం బోధిస్తున్నారు

“ఒక ప్రఖ్యాత సామెత ఉంది. ‘ద్వేషం ఎన్నటికీ ద్వేషాన్ని జయంచలేదు’ అని. మన దేశానికి నిజమైన బలం తన ఐకమత్యం, సామరస్యంలలోనే ఉంది. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అన్నది భారత దేశ నిర్వచనం. మన సామాజిక జీవనంలో ఐకమత్యాన్ని బలవత్తరం కావించడం మనపై ఉన్న బాధ్యత. సానుకూల దృక్పధంతో పురోగమించే అద్భుత అవకాశం మనకు చేజిక్కింది. కనుక, మనం ఒక్కటిగా కలిసి గుజరాత్ పరువును ఉద్దీపింపజేద్దాం. ఈ సామాజిక సామరస్యతను, సోదరభావాన్ని బలీయం చేసే బృహత్తర బాధ్యతలో భాగంగా…

అమెరికా ఎంబసీపై తాలిబాన్ దాడి, బిల్డింగ్ అదుపులోకి తీసుకున్న తాలిబాన్

కాబూల్ నడిబొడ్డున తాలిబాన్ మరొకసారి ప్రత్యక్షమైంది. నిరంతరం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శతృ దుర్భేధ్యంగా ఉండే ఆఫ్ఘనిస్ధాన్ రాజధానిలో తాలిబాన్ ప్రతిఘటనా దళాలు మరొక దాడికి శ్రీకారం చుట్టాయి. పెద్ద ఎత్తున పేలుళ్ళు, తుపాకి కాల్పులు వినిపిస్తున్నాయని కాబూల్ పోలీసులు ధృవీకరించారు. కాబూల్ నడిబొడ్డున గల వివిధ భవనాల నుండి ఈ కాల్పులు వినిపిస్తున్నాయని పోలీసుల ప్రతినిధి ఒకరు తెలిపారు. “వరుస పేలుళ్ళు వినబడ్డాయి. ఆ తర్వాత తుపాకి కాల్పులు జరుగుతున్నట్లుగా శబ్దాలు వస్తున్నాయి.…

చైనాను అప్పడిగిన ఇటలీ

మరే ఇతర దేశం కన్నా అమెరికాకి అత్యధిక అప్పు ఇచ్చిన చైనాను ఇటలీ కూడా అప్పు అడిగింది. తన సావరిన్ అప్పు బాండ్లను కొనుగోలు చేయవలసిందిగా ఇటలీ చైనాను కోరింది. ఇటలీ బాండ్లను పెద్ద ఎత్తున చైనాచేత కొనుగోలు చేయించడం ద్వాగా గాడి తప్పుతున్న తన ఆర్ధిక వ్యవస్ధను దారిలో పెట్టాల్ని ఇటలీ భావిస్తున్నది. పెట్టుబడిదారీ ప్రభుత్వాలు, నిర్ధిష్ట కాల పరిమితితో ‘సావరిన్ డెట్ బాండ్లు’ జారీ చేయడం ద్వారా అప్పు సేకరిస్తాయన్న సంగతి తెలిసిందే. అప్పు…

ఫ్రాన్సు అణు వ్యర్ధాల కర్మాగారంలో పేలుడు, ఒకరు దుర్మరణం

మరొక అభివృద్ధి చెందిన దేశంలో అణు కర్మాగారం పేలిపోయింది. భారత దేశానికి అణు రియాక్టర్లు అమ్మడానికి ఉరకలు వేస్తున్న దేశాలలో ఒకటైన ఫ్రాన్సులో అణు వ్యర్ధాలను ప్రాసెసింగ్ చేసే కర్మాగారంలో అణు వ్యర్ధాలను మండించడానికి వినియోగించే బట్టి పేలిపోయిందని ఫ్రెంచి పత్రికలను ఉటంకిస్తూ గార్డియన్ తెలిపింది. పేలుడులో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారనీ, గాయపడ్డ వారిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉందనీ తెలుస్తోంది. ఫ్రాన్సు ప్రపంచంలోనే అత్యధికంగా అణు ఇంధనం ఉపయోగిస్తుంది. తన విద్యుత్ ఉత్పత్తిలో అత్యధిక…

బ్రిటన్ పొదుపు విధానాలతో కుచించుకుపోయిన కుటుంబ బడ్జెట్లు

కొన్ని వందల బిలియన్ల పౌండ్లు అప్పు తెచ్చి బెయిలౌట్ల రూపంలో ప్రవేటు ద్రవ్య సంస్దలను మేపిన బ్రిటన్ ప్రభుత్వం తీరా ఆ అప్పులను తీర్చడానికి ప్రజల పైన భారం వేస్తూ పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మితవాద కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పెట్టుబడిదారీ అనుకూల పొదుపు విధానాల అమలు ప్రభావం బ్రిటిష్ పౌరుల కుటుంబ బడ్జెట్‌లను బాగా కుచించివేసిందని ‘ఇనిస్టిట్యూట్ ఫర్ ఫిస్కల్ స్టడీస్’ చేసిన అధ్యయనంలో…

జి7, యూరోజోన్‌ల వైఫల్యంతో ప్రపంచ స్ధాయిలో షేర్ల పతనం

శుక్రవారం జరిగిన జి7 గ్రూపు దేశాల సమావేశం యూరోజోన్ సంక్షోభం పరిష్కారానికి ఏ విధంగానూ ప్రయత్నించకపోవడంతో దాని ప్రభావం స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. యూరోజోన్ దేశాల్లో, ముఖ్యంగా జర్మనీకీ ఇతర దేశాలకీ మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తడం కూడా షేర్ మార్కెట్లపై ప్రపంచ స్ధాయి ప్రభావం పడుతోంది. జపాన్ షేర్ మార్కెట్ నిక్కీ గత రెండున్నర సంవత్సరాలలోనే అత్యల్ప స్ధాయికి పడిపోయింది. భారత షేర్ మార్కెట్లలో సెన్సెక్స్ సూచి మళ్ళీ పదాహారు వేల పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా,…

ఘోరంగా పడిపోయిన పారిశ్రామిక వృద్ధి, షాక్‌లో మార్కెట్లు

అసలే అమెరికా, యూరప్ ల రుణ సంక్షోభాలతో, అమెరికా ఆర్ధిక వృద్ధి నత్త నడకతోనూ నష్టాలతో ప్రారంభమైన ఇండియా స్టాక్ మర్కెట్లకు పారిశ్రామిక వృద్ధి సూచిక గణాంకాలు షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చాయి. పారిశ్రామిక వృద్ధి సూచిక (ఐఐపి – ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్) మార్కెట్ అంచనాలను మించి క్షీణించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు పెద్ద ఎత్తున నష్టాలను రికార్డు చేశాయి. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి సెన్సెక్స్ రెండు శాతం పైగా 390 పాయింట్లు కోల్పోయి 16485…