ముంబై దాడుల నిందితుడు ‘అజ్మల్ కసబ్’ ఉరి శిక్షపై స్టే విధించిన సుప్రీం కోర్టు

26/11 ముంబై దాడుల నిందితులలో సజీవంగా ఉన్న ఏకైక టెర్రరిస్టు ‘అజ్మల్ కసబ్’ కు విధించిన ఉరిశిక్ష పై సుప్రీం కోర్టు సోమవారం స్టే విధించింది. చట్టం ఎటువంటి అరమరికలు లేకుండా తన ప్రక్రియను తాను అనుసరించడానికి వీలుగా అజ్మల్ కసబ్ అప్పీలును తాము పూర్తి స్దాయిలో విచారించదలుచుకున్నామని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా తెలిపింది. అనేక సంస్ధలు, వ్యక్తులు ప్రాణాలు తీసే ఉరిశిక్షను రద్దు చేయాలనీ, ఉరి శిక్ష వలన నేరస్ధుడు తనను తాను సంస్కరించుకునే…

రోమింగ్ ఛార్జీలు లేని ‘నూతన టెలికం విధానం,’ అందరికీ బ్రాడ్‌బాండ్(అట)

కేంద్ర ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజి మంత్రి కపిల్ సిబాల్ ‘నూతన్ టెలికం విధానం’ (ఎన్.టి.పి) ప్రకటించాడు. రోమింగ్ ఛార్జిలు లేని ఈ విధానంలో ఐదు ప్రధాన అంశాలున్నట్లు ప్రకటించాడు. పెద్ద ఎత్తున మార్పులు చేసినట్లు పైకి కనిపిస్తున్న ఈ విధానం పూర్తి వివరాలు అందితే తప్ప మంచి, చెడులను నిర్ధారించలేము. కపిల్ ప్రకటించిన ఐదు ప్రధాన లక్ష్యాలు ఇలా ఉన్నాయి. డిమాండ్ చేయడంతోనే బ్రాడ్‌బాండ్ (బ్రాడ్‌బాండ్ ఆన్ డిమాండ్) ఒక దేశం-ఒక లైసెన్సు విధానం. దీని ప్రకారం రోమింగ్…

సెప్టెంబరులోనూ కొద్ది ఉద్యోగాలే, ఇంకా క్షీణించిన అమెరికా నిరుద్యోగం

అమెరికా నిరుద్యోగ పర్వం కొనసాతోంది. ఉద్యోగలను సృష్టించడంలో ఏ మాత్రం మెరుగుదల చూపలేకపోతోంది. ఫలితంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తిరిగి కోలుకోవడంపై అనుమానాలు కొనసాగుతున్నాయి. బలహీన ఉపాధి లెక్కలు మరొక మాంద్యంలోకి జారిపోతుందన్న భయాలు సజీవంగా ఉంచుతున్నాయి. సెప్టెంబరు నెలకు గాను అమెరికాలో నికరంగా 103,000 ఉద్యోగాల సృష్టి జరిగినట్లుగా అమెరికా ఉపాధి నివేదిక వెల్లడించింది. ప్రవేటు రంగం 137,000 ఉద్యోగాలను సృష్టించగా, ప్రభుత్వరంగం 34,000 ఉద్యోగాలను కోల్పోయింది. అమెరికా జనాభా వృద్ధి రేటుకు తగినట్లుగా ఉద్యోగాల…

గ్రీసు కష్టాలు తీరాలంటే తన సార్వభౌమాధికారాన్ని వదులుకోవాలి -జర్మనీ మంత్రి

యూరోపియన్ యూనియన్, ఐ.ఎం.ఎఫ్ లు గ్రీసు కోసం ప్రకటిస్తూ వచ్చిన బెయిలౌట్ల అసలు ఉద్దేశం ఎట్టకేలకు బహిర్గతమయ్యింది. గ్రీసు, రుణ సంక్షోభంలో కూరుకుపోవడంతో అవి రెండు బెయిలౌట్ల పేరుతో కఠిన రుణాలను మంజూరు చేస్తున్న సంగతి విదితమే. అత్యంత దారుణమైన షరతులతో ఇచ్చిన ఈ రుణాల ఫలితంగా గ్రీసు ఆర్ధిక మాంద్యంలోకి వెళ్ళిపోయింది. గ్రీసు జిడిపి దారుణంగా పడిపోయింది. రుణ షరతుల ఫలితంగా ప్రభుత్వ ఖర్చులలో తీవ్రంగా కోత పెట్టడంతో సంభవించిన ఫలితమిది. వారి షరతులను పూర్తిగా…

భవంతిగుండా వెళ్ళే ఎక్స్‌ప్రెస్ హైవే, జపాన్ అద్భుతం -ఫొటోలు

సాంకేతిక అద్భుతాలకు జపాన్ పెట్టింది పేరు. సముద్ర గర్భంలో రోడ్డు రైలు మార్గాలు, హైస్పీడ్ రైళ్ళు, రోబోట్ లు మొదలైన వాటి తయారీలో జపాన్ సాదించిన పేరు ప్రతిష్టల గురించి చెప్పనవసరం లేదు. స్ధల యజమానికీ, హై వే నిర్మాణ సంస్ధకూ  తలెత్తిన వివాదం అద్భుతమైన సాంకేతిక నైపుణ్యంతో పరిష్కరించుకోవడం నిస్సందేహంగా గొప్ప విషయమే. ఈ భవంతిని గేట్ టవర్ బిల్డింగ్ గా పిలుస్తున్నారు. 16 అంతస్ధుల ఈ భవంతిలో లిఫ్టు 5, 6, 7 అంతస్ధుల…

తెలంగాణ అంశాన్ని కేంద్ర త్వరలోనే తేల్చేస్తుంది -సి.ఎం కిరణ్ కుమార్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ఢిల్లీలో విలేఖరులకు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో కేంద్ర తెలంగాణ సమస్యను పరిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నాడు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వచ్చిన సి.ఎం కిరణ కుమార్ రెడ్డి, డెప్యుటి సి.ఎం దామాదర రాజ నరసింహరాజు లు సీనియర్ మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఎ.కె.ఆంటోని, పి.చిదంబరం, గులాం నబీ ఆజాద్ లతో…

ఇటలీ, స్పెయిన్ ల రేటింగ్ తగ్గించిన ‘ఫిచ్ రేటింగ్స్’

ఫిచ్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ ఇటలీ, స్పెయిన్ దేశాల క్రెడిట్ రేటింగ్ తగ్గించింది. ఇటలీ, స్పెయిన్ దేశాలు యూరో జోన్ లో వరుసగా మూడవ, నాల్గవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాలు కావడం గమనార్హం. ఇటలీ రేటింగ్ ఎ+ నుండి ఎఎ- కు ఒక మెట్టు తగ్గించగా, స్పెయిన్ రేటింగ్ ను ఎఎ+ నుండి ఎఎ- కు (‘ఎఎ+’ నుండి ‘ఎఎ’ ను వదిలి ‘ఎఎ-‘ కు తగ్గించడం) రెండు మెట్లు తగ్గించింది. రెండింటి ఔట్‌లుక్…

జార్జియాను బెదిరించడం మానుకోవాలి, రష్యాకు ఫ్రాన్స్ హెచ్చరిక

మూడు రోజుల కాకసస్ పర్యటనలో ఉన్న ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజి చివరిగా జార్జియా పర్యటిస్తూ ఆ దేశానికి సంతోషం కలిగించే ప్రకటన చేశాడు. జార్జియ రాజధాని టిబ్‌లిసిలో వేలమంది జార్జియన్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ నికొలస్ సర్కొజీ రష్యా తన పొరుగుదేశం జార్జియాను బెదిరించడం సమర్ధనీయం కాదని పేర్కొన్నాడు. రష్యా తమ మిత్రదేశమేనని భావిస్తున్నామని కాని జార్జియాను బెదిరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నాడు. 2008లో జార్జియా, రష్యాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని…

అమెరికా దరిద్రం అమెరికన్ల రాతల్లోనే చూద్దాం

ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దెబ్బకు అమెరికా ఆర్ధికంగా కునారిల్లుతోంది. అమెరికా దరిద్రం ఒడిలో కునుకు తీస్తోందని అమెరికా ప్రభుత్వ సర్వే తెలుపుతున్నా అమెరికాను ఆరాధించే మూఢ భక్తులకు కళ్ళు తెరుచుకోవడం లేదు. అమెరికా గడ్డపై పుట్టి పెరిగిన తెల్ల, నల్ల, రంగు అమెరికన్లు అంతా ఇపుడు తమ భవిష్యత్తును తామే రూపొందించుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారు. వాల్‌స్ట్రీట్ కంపెనీలు తమ జీవితాల్ని ఎలా బలితీసుకుంటున్నదీ తెలుసుకుని వీధుల్లోకి వస్తున్నారు. సెప్టెంబరు 17న ప్రారంభమైన “ఆకుపై వాల్‌స్ట్రీట్” ఉద్యమంలో ఇప్పుదు…

లాడెన్ ఆచూకి తెలిపిన పాక్ డాక్టర్ పై దేశ ద్రోహం కేసు నమోదు

ఒసామా బిన్ లాడెన్ హత్యకు దారి తీసేలా సి.ఐ.ఏ కి సమాచారం అందించిన పాకిస్ధాన్ డాక్టర్ పైన పాక్ ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేయడానికి నిర్ణయించింది. ఒసామా బిన్ లాడెన్ హత్యపై దర్యాప్తు జరుపుతున్న పాకిస్ధాన్ పానెల్ డాక్టర్ పై విద్రోహం కేసు నమోదు చెయాల్సిందిగా సలహా ఇచ్చింది. బూటకపు టీకా కార్యక్రమాన్ని రూపొందించి లాడెన్ ఆశ్రయం తీసుకుంటున్నాడని చెబుతున్న ఇంటిలో నివసిస్తున్నవారినుండి లాడెన్ కుటుంబ డి.ఎన్.ఎ సంపాదించాడని డాక్టర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. డాక్టర్ షకీల్…

హక్కానీ గ్రూపు నాయకుడు పట్టివేత, అమెరికా అబద్ధాల సీరియల్‌లో మరొక పేజీ

ఆఫ్ఘన్ టెర్రరిస్టు సంస్ధల్లో హక్కానీ గ్రూపుకు అమెరికా అధికంగా భయపడుతున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్ధాన్‌ను సోవియట్ రష్యా ఆక్రమించుకున్న కాలంలో ఈ గ్రూపును అమెరికా పాకిస్ధాన్ దేశాలు అత్యంత ఇష్టంగా సాకాయి. జలాలుద్దీన్ హక్కానీ నాయకత్వంలొని హక్కానీ గ్రూపుతో పాటు ఆల్-ఖైదాను కూడా అమెరికా పెంచి పోషించింది. రోజులు మారాయి. సోవియట్ రష్యా మొదట ఆర్ధికంగా అనంతరం రాజకీయంగా కూడా కుప్పకూలడంతో అది తన ప్రభావిత ప్రాంతాలనుండి సైన్యాలను ఉపసంహరించుకుంది. రష్యా సైన్యాలు వెళ్ళాక ఆఫ్ఘనిస్ధాన్‌పై నియంత్రణ…

సంక్షోభ పరిస్ధితుల్లో దిక్కు తోచని సంపన్నులు

యూరప్ రుణ సంక్షోభం, అమెరికా ఆర్ధిక వృద్ధి స్తంభనలు ప్రపంచ సంపన్నులను గుక్క తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. తమ సంపదలను ఎక్కడ మదుపు చేస్తే క్షేమంగా ఉంటుందో అంచనా వేయలేక సతమతమవుతున్నారు. ఎల్లప్పుడూ తమ సంపదలను వృద్ధి చేసుకోవడానికి ఎత్తులు పైఎత్తులలో మునిగి తేలుతూ ఉండే వాళ్ళు ఇప్పుడు వృద్ధి సంగతి అటుంచి అవి తరిగిపోకుండా ఉండడానికి గల మార్గాలను వెతుక్కుంటున్నారు. కొందరు అప్పుడే వినాశకకర పరిస్ధితులో పెట్టుబడులను ఎక్కడికి తరలిస్తారో గమనించి అటువంటి చోట్లను వెతుకులాడుతున్నారు. డబ్బు…

‘యాపిల్’ సారధి ‘స్టీవ్ జాబ్స్’ అస్తమయం

యాపిల్ కంపెనీకే సాధ్యమైన ప్రత్యేక ఉత్పత్తులతో ప్రపంచ టెక్నాలజీ అభిమానులను ఉత్తేజపరిచిన స్టీవ్ జాబ్స్ 56 ఏళ్ళ వయసులో తనువు చాలించాడు. చాలా కాలంగా ‘పాంక్రియటిక్ కేన్సర్’ తో బాధపడుతున్న గత ఆగస్టు నెలలోనే యాపిల్ కంపెనీ సి.ఇ.ఓ పదవినుండి తప్పుకుని ఛైర్మన్ గా మిగిలాడు. యాపిల్ కంపెనీ ‘ఐ ఫోన్ 4ఎస్’ ని విడుదల చేసిన తర్వాత రోజే స్టీవ్ చనిపోవడం యాదృచ్ఛికమే కావచ్చు. కాలిఫోర్నియా రాష్ట్రంలో పాలో ఆల్టో పట్టణంలో స్టీవ్ జాబ్స్ చనిపోయినపుడు…