ముంబై దాడుల నిందితుడు ‘అజ్మల్ కసబ్’ ఉరి శిక్షపై స్టే విధించిన సుప్రీం కోర్టు
26/11 ముంబై దాడుల నిందితులలో సజీవంగా ఉన్న ఏకైక టెర్రరిస్టు ‘అజ్మల్ కసబ్’ కు విధించిన ఉరిశిక్ష పై సుప్రీం కోర్టు సోమవారం స్టే విధించింది. చట్టం ఎటువంటి అరమరికలు లేకుండా తన ప్రక్రియను తాను అనుసరించడానికి వీలుగా అజ్మల్ కసబ్ అప్పీలును తాము పూర్తి స్దాయిలో విచారించదలుచుకున్నామని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా తెలిపింది. అనేక సంస్ధలు, వ్యక్తులు ప్రాణాలు తీసే ఉరిశిక్షను రద్దు చేయాలనీ, ఉరి శిక్ష వలన నేరస్ధుడు తనను తాను సంస్కరించుకునే…