యు.పి, ఉత్తర ఖండ్, మణిపూర్, పంజాబ్, గోవాల ఎన్నికల తేదీల ప్రకటన

కేంద్ర ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికల తేదీలు ప్రకటించింది. తద్వారా మినీ సాధారణ ఎన్నికలకు తెరతీసింది. రాజకీయ పార్టీలను అప్రమత్తం చేసింది. వ్యాహాలు, ప్రతి వ్యూహాలకు బదులుగా రాజకీయ పార్టీలు కులం, మతం, ప్రాంతం, డబ్బు, మద్యం, స్నేహాలు, బంధుత్వాలు, శతృత్వాలు… ఇలా అందుబాటులో ఉన్నవాటన్నింటినీ ఉపయోగించుకునేందుకు ఇక సిద్ధం కానున్నాయి. రాష్ట్రం సీట్లు ఎన్ని విడతలు ఎప్పుడు? కౌంటింగ్   ఉత్తర ప్రదేశ్        403       7…

సామాజిక గెంటివేత -వీధి శిల్పకళ(?) ఫొటోలు

స్వీడన్ లోని గోతెన్ బర్గ్ పట్టణంలో తీసిన ఫొటోలివి. మేగ్నస్ వాల్ స్ట్రామ్ అనే ఫొటోగ్రాఫర్ పంపిన ఫోటోలుగా ‘స్ట్రీట్ ఆర్ట్ యుటోపియా” తెలిపింది.   – –

సునామీలో కొట్టుకుపోయి, ఏడేళ్ళ తర్వాత తల్లిదండ్రులను వెతుక్కుంటూ వచ్చిన బాలిక

ఏడేళ్ళ క్రితం బంగాళాఖాతం, హిందూ మహా సముద్రాలలో సంభవించిన సునామి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఎక్కడో ఇండోనేషియా ద్వీపకల్పానికి దగ్గరగా సముద్రం లోపల 9.1 రీడింగ్ తో సంభవించిన శక్తివంతమైన భూకంపంతో ఈ రెండు సముద్రాలలో సునామి ఏర్పడి మొత్తం ఏడు దేశాలలో విలయం సృష్టించించిన సంగతి విదితమే. మొత్తం రెండు లక్షల ముప్ఫై వేలకు పైగా ప్రజలు చనిపోయిన ఈ సునామి ప్రభావం ప్రజలపై ఇంకా చూపుతుండడమే విషాధం. ఏడేళ్ళక్రితం, ఎనిమిదేళ్ళ వయసులో…

అమోఘం, అద్భుతం, అసంభవం -వీధి చిత్రం ఫొటో

మై గుడ్ నెస్! ఈ వీధి చిత్ర కళాకారుల ప్రతిభకు అంతం లేనట్లుంది. వీధి చిత్రంగా భావించడానికి కూడా అసాధ్యంగా ఉన్న ఈ చిత్రాన్ని గీసింది మాయా క్లిల్, ఇమూమ్ కోలి అని తెలుస్తోంది. వారీ ఊరు తెలియలేదు. ఫేస్ బుక్ పేజీ ఉన్నా అందులో వివరాలు లేవు. – –

అమెరికాతో ఘర్షణ నేపధ్యంలో పాకిస్ధాన్ కి పూర్తి మద్దతు హామీ ఇచ్చిన చైనా

దక్షిణాసియాలో అమెరికాకు చిరకాల మిత్ర దేశంగా ఉన్న పాకిస్ధాన్ కి అమెరికాతో సంబంధాలు క్షీణిస్తున్న నేపధ్యంలో ఆ దేశానికి చైనా నుండి పూర్తి మద్దతు లభించింది. ఆర్ధిక, రక్షణ తదితర రంగాలన్నింటిలోనూ చైనా పాకిస్ధాన్ కి పూర్తి మద్దతుగా నిలుస్తుందని పాకిస్ధాన్ పర్యటిస్తున్న చైనా అత్యున్నత విదేశాంగ శాఖ అధికారి హామి ఇచ్చినట్లుగా ‘ఫస్ట్ పోస్ట్’ తెలిపింది. చైనా ప్రభుత్వ కౌన్సిలర్ దాయి బింగ్-గువో, తన పాక్ పర్యటన పాక్, చైనా సంబంధాలను మరింత ఉన్నత స్ధాయికి…

హమీద్ కర్జాయ్ వల్ల వెనక్కి వెళ్ళిన అమెరికా-తాలిబాన్ ఒప్పందం

అమెరికా, తాలిబాన్ ల మధ్య ఒప్పందం కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిందని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. చివరి నిమిషంలో ఒప్పందంలోని అంశాలకు హమీద కర్జాయ్ తీవ్ర అభ్యంతరం చెప్పడంతో ఒప్పందం సాధ్యం కాలేదని ఆ పత్రిక తెలిపింది. ఈ ఒప్పందం ఫలితంగా గ్వాంటనామో బే జైలు లో  నిర్బంధంలో ఉన్న ఐదుగురు తాలిబాన్ నాయకులను అమెరికా విడుదల చేయవలసి ఉంటుంది. అందుకు బదులుగా తాలిబాన్ బహిరంగంగా టెర్రరిజాన్ని వదులుకోవడానికి సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. హమీద్ కర్జాయ్ అభ్యంతర…

ఫేస్ బుక్, గూగుల్ తదితర ఐ.టి సంస్ధలపై ఫిర్యాదులు స్వీకరించిన భారత కోర్టులు

అభ్యంతరకర సమాచారాన్ని తమ వెబ్ సైట్లనుండి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన భారత కోర్టులు అమెరికాకి చెందిన ఐ.టి సంస్ధలకు నోటీసులు జారీ చేసింది. ఫేస్ బుక్, యాహూ, గూగుల్ లాంటి పందొమ్మిది ఐ.టి సంస్ధలు కోర్టునుండి నోటీసులు అందుకున్న సంస్ధల జాబితాలో ఉన్నాయి. ఢిల్లీకి చెందిన రెండు కోర్టులు మతపరంగా ప్రజలను గాయపరిచేవిగా ఉన్న సమాచారాన్ని వెంటనే తమ వెబ్ సైట్లనుండి తొలగించాలని కోర్టులు ఆదేశాలు జారీ చేశాయి. ఢిల్లీలోని ఒక కోర్టు,…

‘హిందూ సంస్కృతిని ఆచరించండి లేదా హిందూ జాతికి బానిసలు కండి” -ఆర్.ఎస్.ఎస్ గురువు గోల్వాల్కర్

(రష్యాలో భగవద్గీతపై నిషేధానికి సంబధించి నేను రాసిన పోస్టు కింద ఓ మిత్రుడు చేసిన వ్యాఖ్యకు ఈ పోస్టు సమాధానం గా గ్రహించగలరు) గోల్వార్కర్ ఆర్.ఎస్.ఎస్ కి రెండవ గురువు అన్న సంగతి విదితమే. హెడ్గేవార్ ఆర్.ఎస్.ఎస్ స్ధాపించినప్పటికీ గోల్వార్కర్ నేతృత్వంలో ఆర్.ఎస్.ఎస్ భావాజాలం అభివృద్ధి చెందిందని అందరూ అంగీకరిస్తారు. భారత దేశంలో ముస్లింల భవిష్యత్ పై ఆర్.ఎస్.ఎస్ అభిప్రాయాలు ఎలా ఉన్నదీ గురు గోల్వార్కర్ మాటల్లోనే తెలుసుకోవడం ఉచితంగా ఉంటుంది. “వుయ్ ఆర్ అవర్ నేషన్‌హుడ్…

‘టీం అన్నా’ ఆందోళనను ను తూర్పారబట్టిన బోంబే హై కోర్టు

టీం అన్నా శుక్రవారం అనూహ్య రీతిలో బోంబే హై కోర్టు నుండి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంది. తమ ఆందోళన ప్రజా ప్రయోజనాల కోసమే అని గట్టిగా నమ్ముతున్న టీం అన్నా బృందానికి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. “మీ ఆందోళన ప్రజా ప్రయోజనాల కోసమేనని కోర్టు నిర్ణయించలేదు. మీరు జరుపుతున్న ఆందోళన మీకు ‘సత్యగ్రహం’ కావచ్చు. ఇతరులకు అది ‘న్యూసెన్సు’ కావచ్చు” అని కోర్టు అన్నా బృందం వాదనలను తిరస్కరించింది. బోంబే హైకోర్టు వ్యాఖ్యలు అన్నా బృందానికి…

పాక్ చెక్‌పోస్టు దాడిపై అమెరికా నివేదికను తిరస్కరించిన పాక్ సైన్యం

నవంబరు చివరి వారంలో ఆఫ్-పాక్ సరిహద్దులో గల పాకిస్ధాన్ చెక్ పోస్టులపై అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు జరిపిన దాడిలో ఇరవై నాలుగు మంది పాక్ సైనికులు చనిపోయిన సంగతి విదితమే. ఈ ఘటనపై ఉన్నత స్ధాయిలో దర్యాప్తు జరుపుతామని అమెరికా, నాటోలు హామీ ఇచ్చాయి. సదరు దర్యాప్తు నివేదికను అమెరికా పూర్తి చేసింది. ఈ నివేదికను పాకిస్ధాన్ సైన్యం తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించింది. పాక్, అమెరికాలు ఇరువైపులా జరిగిన తప్పుల వలన పాక్ సైనికుల పెద్ద సంఖ్యలో…

‘మతం ప్రజల పాలిట మత్తు మందు’ అని మాత్రమే “కారల్ మార్క్స్” అన్నాడా?

“మతం ప్రజల పాలిట మత్తు మందు” అని కారల్ మార్క్స్ అన్నాడని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ ఒక్కటి మాత్రమే మార్క్సు అని ఊరుకున్నాడా? లేదు. ఆయన మతానికి మత పెద్దలు కూడా ఇవ్వలేని విస్తృతమైన నిర్వచనాన్ని ఇచ్చాడు. ప్రజల దృక్పధంలోనుండి మతాన్ని కారల్ మార్క్స్ నిర్వచించాడు. ప్రజల దృక్పధంలోనుండి మతాన్ని ఎలా నిర్వచించవచ్చో, నిజానికి, మత సూత్రాలలో ఉద్దండ పండితులెవ్వరికైనా తెలిసి ఉంటుందని భావించలేము. వారంతా మతాన్ని దేవుడి దృక్పధంలో నుండి, మత పండితుల…

పాకిస్ధాన్ ప్రభుత్వ కూల్చివేతకు కుట్ర -ప్రధాని గిలాని

దేశంలో ఏ సంస్ధ కూడా రాజ్యంలో మరొక రాజ్యంగా ఉండజాలదని పాకిస్ధాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ బుధవారం హెచ్చరించాడు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు ఎన్నుకున్న పాకిస్ధాన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి కుట్రలు జరుగుతున్నాయని గిలానీ ఆందోళన వ్యక్తం చేసాడు. పాక్ ప్రధాని గిలాని వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు కొద్ది వారాల క్రితం అధ్యక్షుడు జర్దారీ, అమెరికా ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మైక్ ముల్లెన్ కి రాశాడని భావిస్తున్న మెమో లోని అంశాలను ధృవ పరచడం గమనార్హం. అమెరికా…

ఇరాక్ విధ్వంసంతో అమెరికా సంతృప్తి, అందుకే సైన్యం ఉపసంహరణ -కార్టూన్

దాదాపు ఎనిమిదేళ్ళకు పైగా ఇరాక్ లో అమెరికా సైన్యం తిష్ట వేసింది. ఒక దేశాన్ని, ఒక ప్రజా సమూహాన్ని ఎన్నిరకాలుగా విధ్వంసం చేయవచ్చో అన్ని రకాలుగానూ ఇరాక్ ను అది విధ్వంసం కావించింది. ప్రజల నిత్యజీవనానికి అవసరమైన మౌలిక నిర్మాణాలన్నింటినీ -రోడ్లు, కమ్యూనికేషన్లు, విద్యుత్ సౌకర్యం, రైలు మార్గాలు, ఆయిల్ పైప్ లైన్లు, ఆయిల్ సరఫరా మార్గాలు మొ॥వి౦- సర్వనాశనం చేసింది. తాను స్ధాపిస్తానన్న ప్రజాస్వామ్యం ఊసుని పూర్తిగా విస్మరించింది. ప్రశాంతంగా బతుకుతున్న ఇరాకీయుల మధ్య, జాతి,…

‘నితిన్ గార్గ్’ హంతకుడికి 13 సం.ల శిక్ష వేసిన ఆస్ట్రేలియా కోర్టు

గత సంవత్సరం ఆస్ట్రేలియాలో హత్యకు గురయిన భారతీయుడు ‘నితిన్ గార్గ్’ హంతకుడికి ఆస్ట్రేలియా పదమూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఈ హత్యలో జాతి వివక్ష ఏమీ లేదని కోర్టు నిర్ధారించింది. కేవలం మొబైల్ ఫోన్ కోసమే ఈ హత్య జరిగినట్లుగా కోర్టు తేల్చివేసింది. హత్య చేసే ఉద్దేశ్యం హంతకుడికి లేదనీ, అసలు తాను కత్తితో నితిన్ గార్గ్ ను పొడిచిందీ లేనిదీ కూడా హంతకుడికి తెలియదనీ, అంతా ఒక నిమిష లోపలే జరిగిపోయిందనీ కోర్టు నిర్ధారించింది. నితిన్…