‘భగవద్గీత’ నిషేధానికి రష్యా కోర్టు నిరాకరణ

భారత ప్రభుత్వం రాయబార పరంగా తెచ్చిన ఒత్తిడి ఫలించిందో ఏమో గానీ ‘భగవద్గీత’ అనువాద గ్రంధం నిషేధానికి రష్యాలోని సైబీరియా కోర్టు నిరాకరించిందని పి.టి.ఐ వార్తా సంస్ధను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది. సైబీరియాలోని టామ్స్క్ జిల్లా కోర్టులో గత జూన్ నెలలో ఈ మేరకు దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టివేసిందని పి.టి.ఐ నివేదించింది. గత కొన్ని వారాలుగా ఈ అంశంపై రష్యా, భారత్ ల మధ్య రాయబార పరమైన ఒత్తిడి కొనసాగుతూ వచ్చింది. పార్లమెంటులో సైతం…

కాంగ్రెస్ ఎం.పిల గైర్హాజరుతో లోక్‌పాల్ రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమి

కాంగ్రెస్ పార్టీ ఎం.పి లు గణనీయ సంఖ్యలో పార్లమెంటుకు హాజరు కాకపోవడంతో లోక్ పాల్ బిల్లుకి రాజ్యాంగ హోదా కల్పించే ‘రాజ్యాంగ సవరణ బిల్లు’ ఓటమికి గురయింది. గైర్హాజరైన కాంగ్రెస్ సభ్యుల జాబితా ఇవ్వాలని సోనియా గాంధి కోరడంతో గైర్హాజరైన సభ్యులపై కాంగ్రెస్ హైకమాండ్ చర్య తీసుకుంటుందని భావిస్తున్నారు. మూజు వాణీ ఓటుతో లోక్ సభలో ఆమోదం పొందిన లోక్ పాల్ బిల్లు బుధవారం రాజ్య సభలో ఓటింగ్ కి రానున్న నేపధ్యంలో రాజ్యసభలో మెజారిటీ సంపాదించడానికి…

ముంబై తో పాటు ఢిల్లీ కూడా విస్మరించిన ‘అన్నా పిలుపు’

‘పటిష్టమైన లోక్ పాల్ బిల్లు’ తేవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్నా ఇచ్చిన ఆందోళన పిలుపును ఈసారి ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. గతంతో పోలిస్తే ప్రజలు ఆన్నా ఆందోళనకు అంత తీవ్రంగా పట్టించుకోనట్లు కనిపిస్తోంది. లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందాక తమ ఆందోళన ఎన్నికల సంస్కరణలపై కేంద్రీకరిస్తుందని ప్రకటించిన అన్నా బృందం, అప్పటికి ఎంతమంది ప్రజలను ఆకర్షించగలుగుతారన్నదీ ఇపుడు ప్రశ్నగా మారింది. ప్రభుత్వం తలపెట్టిన ‘బలహీన’ లోక్ పాల్ బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళన జరపాలని…

‘పాంచజన్యం’ (బంచ్ ఆఫ్ ధాట్స్) పుస్తకానికి ‘పరిచయం’ ఇది

భారత దేశంలో ముస్లింల విషయంలో ఆర్.ఎస్.ఎస్ సంస్ధ భావాల గురించి చెబుతూ నేను గురు గోల్వాల్కర్ రచించిన పుస్తకం ‘వుయ్ ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్’ నుండి నేను కొన్ని అంశాలను ఉటంకించాను. అయితే, ఆ పుస్తకం ప్రతి ఇప్పుడు ఆర్.ఎస్.ఎస్ వెబ్ సైట్ లో కూడా లేదనీ, సామాన్య పాఠకులెవరికీ అందుబాటులో లేదనీ అవన్నీ ఇప్పుడు అవసరమా అని మిత్రులు కొందరు ప్రశ్నిస్తున్నారు. గురు గోల్వాల్కర్ కి సంబంధించిన ఆ భావాలు ఇప్పుడు ఆర్.ఎస్.ఎస్ స్వీకరించడం…

‘అనుజ్ బిద్వే’ హత్య కేసులో 17 ఏళ్ళ బ్రిటిష్ టీనేజర్ అరెస్టు

బ్రిటన్ లో సోమవారం తెల్లవారు ఝామున ఇరవై మూడేళ్ళ అనుజ్ బిద్వే హత్యకు గురైన కేసులో పదిహేడేళ్ళ బ్రిటిష్ టీనేజర్ ను అరెస్టు చేసినట్లుగా వార్తా పత్రికలు తెలిపాయి. ఏ కారణం గానీ, ఎటువంటి ముందస్తు కారణం గానీ లేకుండా జరిగినదిగా పోలీసులు చెబుతున్న ఈ హత్య ఇంగ్లండులోని భారతీయులలో ఆగ్రహావేశాలను కలిగించింది. ఫేస్ బుక్ లో ఇంగ్లండులోని భారతీయులతో పాటు ఇండియాలోని భారతీయులు కూడా ఈ హత్య పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సందేశాలను ప్రచురించారని…

గ్లోబల్ వార్మింగ్ వల్ల భూగ్రహంపై అనేక మార్పులు జరుగుతున్నాయి -ఫొటోలు

‘గ్రీన్ హౌస్ వాయువుల’ విడుదలతో వాయు, జల, భూతల కాలుష్యం పెచ్చరిల్లి భూగ్రహం పైన అనేక విపరీత పరిణామలు సంభవిస్తున్నాయి. ఎన్నడు ఎరుగని రీతిలో వరదలు పట్టణాలనూ, ఊళ్ళనూ ముంచెత్తుతున్నాయి. కొన్ని చోట్ల వర్షాలు విపరీత స్ధాయిలో కురుస్తుండడం వల్ల ఊళ్ళకి ఊళ్ళే జలాశయాలుగా మారుతుండగా మరి కొన్ని చోట్ల సంవత్సరాల తరబడి వర్షాలు కురవక కరువు పరిస్ధితులు ప్రజలను అల్లాడిస్తున్నాయి. – –

ఇరాన్ మహిళకు మరణ శిక్ష అమలు చేసే అవకాశం, రాళ్ళతో కొట్టి గానీ లేదా ఉరితీయడం ద్వారా గానీ

వ్యభిచారం నేరం కింద అరెస్టు చేయబడి జైలులో శిక్ష అనుభవిస్తున్న నడి వయసు ఇరానియన్ మహిళకు మరణ శిక్ష అమలు చేసే అవకాశం ఇంకా మిగిలే ఉందని ఇరాన్ అధికారుల ద్వారా తెలుస్తోంది. వేరోక పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకున్న నేరానికి “సకినే మొహమ్మది అష్తియాని” అనే మహిళకు గత సంవత్సరం ఇరాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ శిక్షను రాళ్ళతో కొట్టి చంపడం ద్వారా అమలు చేయాలని ఇరాన్ కోర్టు తీర్పు ఇవ్వడంతో దానికి…

ఇంగ్లండులో భారతీయ విద్యార్ధి హత్య, రేసిజమే కారణం?

విహార యాత్రకి వెళ్ళిన భారతీయ విద్యార్ధి ఇంగ్లండులో హత్యకు గురయ్యాడు. లాంకాస్టర్ యూనివర్సిటీ లో ఎలక్ట్రానిక్స్ లో పి.జి చదువుతున్న ఇరవై మూడేళ్ళ విద్యార్ధి సాల్ ఫోర్డ్ (గ్రేటర్ మాంఛెస్టర్) సందర్శనకు వెళ్ళగా అక్కడ ఓ బ్రిటిష్ వ్యక్తి దగ్గరినుండి కాల్చి చంపాడు. సంఘటన సోమవారం తెల్లవారు ఝాముల జరిగింది. పోలీసులు ఈ ఘటన రెచ్చగొట్టబడిన కారణాలు ఏవీ లేకుండానే జరిగిందని చెప్పారు. అయితే జాతి విద్వేషంతో ఈ హత్య జరిగిందా, లేదా అని చెప్పడానికి వారు…

కుంటుతూ, మూలుగుతూ…. ఇరాక్ ఎగ్జిట్ -కార్టూన్

కొత్త సంవత్సరంలో, అమెరికా సైనికులపై మానవ హక్కుల ఫిర్యాదులను విచారిస్తానన్న ఇరాక్ ప్రభుత్వ హెచ్చరికతో, ఇప్పటికే 4,500 అమెరికన్ సైనికుల శవాలను ఇంటికి పంపిన తర్వాత, ఇరాక్ నుండి సైన్యాలను ఉపసంహరించడానికి అమెరికా నిర్ణయించుకుంది. – –

మరణ శయ్యపై ఉన్నా, అమెరికా కోలుకుంటోంది -కార్టూన్

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ పరిస్ధితి ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ అది చక్కగా కోలుకుంటోందని అక్కడి పాలకులు చెబుతున్నారు. అలా అని నిరూపించడానికి అష్ట కష్టాలూ పడుతున్నారు. నిరుద్యోగం, దారిద్ర్యం, ఖరీదైన విద్య, పరిశ్రమల మూసివేత, పడిపోతున్న కొనుగోలు శక్తి మొదలైన సమస్యలు పట్టి పీడిస్తున్నప్పటికీ పై పై మెరుగులు అద్ది అమెరికా కోలుకుంటోందని చెప్పడానికి ఆపసోపాలు పడుతున్నారు. – –  

బూతు బొమ్మలు, మత సంస్ధలు

(గమనిక: గురు గోల్వాల్కర్ వ్యక్తం చేసిన భావాలపైన నేను రాసిన పోస్టుకి ఇది మిత్రుడు ప్రవీణ్ రాసిన వ్యాఖ్య. ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావించబడినందున పోస్టుగా మలిచాను. చర్చలో పాల్గొనవలసిందిగా ఇతర మిత్రులను ఆహ్వానిస్తున్నాను. ఎం.ఎఫ్.హుస్సేన్ బొమ్మలని కేవలం బూతు బొమ్మలుగానూ, ఆడవాళ్ళని చెత్తగా చూపించడంగానూ ప్రవీణ్ పేర్కొన్నాడు. కళాకారులు చాలామంది అలా భావించరు. అలాగే మత విశ్వాసాలు గాయపడ్డాయని భావించబడినప్పుడు వివిధ మతస్ధులలో వచ్చిన ప్రతిస్పందనలలో తేడాలను ప్రవీణ్ ప్రస్తావించాడు. ఈ తేడాల ద్వారా…

ఇంగ్లండును అధిగమించిన బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్ధ

ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఉన్న ఇంగ్లండును బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్ధ అధిగమించింది. ఇప్పటివరకు ఏడవ స్ధానంలో ఉన్న బ్రెజిల్ బ్రిటన్ ని ఆరవ స్ధానం నుండి కిందికి నెట్టి ఆ స్ధానానికి చేరుకుందని ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ బిజెనెస్ రీసర్చ్’ (సి.ఇ.బి.ఆర్) తెలిపింది. ఈ సంస్ధ తాజాగా వెలువరించిన ‘వరల్డ్ ఎకనమిక్ లీగ్ టేబుల్’ లో ఆసియా దేశాలు పై స్ధానాలకు చేరుతుండగా, యూరప్ దేశాలు కింది స్ధానాలకు చేరుతున్నాయన కూడా తెలిపింది.…

రూపాయి పతనం ఆపడానికి ఇండియా, జపాన్ ల మధ్య ‘డాలర్ల మార్పిడి’ ఒప్పందం

అదుపు లేకుండా కొనసాగుతున్న రూపాయి విలువ పతనం అరికట్టడానికి భారత్, జపాన్ లు త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఇరు దేశాల కరెన్సీలు పతనం కాకుండా ఉండడానికి ఈ ఒప్పందం చేసుకోవడానికి ఇరు పక్షాలు గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఫలప్రదమై వచ్చే బుధవారం ఇరు దేశాలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయవచ్చునని రాయిటర్స్, హిందూస్ధాన్ టైమ్స్ పత్రికలు తెలిపాయి. షేర్ మార్కెట్లలో ఊహాత్మక వ్యాపారం తీవ్రమైనపుడు దేశం నుండి పెట్టుబడులు తరలిపోయి కరెన్సీ…

నివసించడానికి గూడు లేని అమెరికా -ఫొటోలు

అమెరికాలో నివసించడానికి ఇల్లు లేని పిల్లలు పెరుగుతున్నారని రాయిటర్స్ తెలిపింది. దాదాపు పదహారు లక్షల మంది పిల్లలు ఇలా ఇల్లు లేక హోం లెస్ షెల్టర్లలో, హోటళ్ళలో, కార్లలో, వీధి పక్కనా, సబ్ వేలలో నివసిస్తున్నారని ఓ సంస్ధ చేసిన సర్వేని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. ఇల్లులేని పిల్లల సంఖ్య 2007తో పోలిస్తే దాదాపు 40 శాతం పెరిగిందని సర్వే తెలిపింది. మూడేళ్ల క్రితం అమెరికాను చుట్టుముట్టిన మాంద్యం నుండి ప్రభుత్వ బెయిలౌట్లు మేసిన కంపెనీలు బైటపడ్డాయి…