ఐ.ఎస్.ఐ అధికారులు, హేడ్లీ లపై ఛార్జి షీటు నమోదుకు ప్రభుత్వం అనుమతి

నవంబరు 26, 2008 తేదీనుండి మూడు రోజుల పాటు ముంబైలోని పలు ప్రదేశాల్లో టెర్రరిస్టులు దాడి చేసి పలువురిని చంపిన నేరానికి, ఇద్దరు ఐ.ఎస్.ఐ అధికారులు, హేడ్లీ, రాణాలపైన ఛార్జీ షీటు నమోదు చేయడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పాకిస్ధానీ అమెరికన్ టెర్రరిస్టు డేవిడ్ హేడ్లీ, పాకిస్ధానీ కెనడియన్ టెర్రరిస్టు తహవ్వూర్ రాణాలతో పాటు లష్కర్-ఎ-తొయిబా వ్యవస్ధాపకుడు హఫీజ్ సయీద్ లు ఇండియాలో టెర్రరిస్టు దాడులకు పధకం పన్నినందుకు ఛార్జి షీటు నమోదు చేయడానికి జాతీయ…

‘కిమ్ జోంగ్-ఇల్’ మరణంతో రాజకీయ కార్టూనిస్టులూ విలపిస్తున్నారు -కార్టూన్

ఉత్తర కొరియా అధిపతి ‘కిమ్ జోంగ్-ఇల్’ మరణంతో రాజకీయ కార్టూనిస్టులూ విలపిస్తున్నారని ఈ కార్టూనిస్టు చెబుతున్నాడు. కిమ్ జోంగ్-ఇల్ బతికి ఉన్నంత కాలం అంతర్జాతీయ రాజకీయాలలో చురుకుదనం పుట్టించాడనీ, తద్వారా రాజకీయ కార్టూనిస్టులకు కావలసినంత మేత దొరికిందనీ ఈ కార్టూనిస్టు అభిప్రాయం. అమెరికా, యూరప్ ల ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ లొంగి ఉంటే ప్రపంచంలో పట్టించుకునేవారెవరూ పెద్దగా ఉండరు. అమెరికా మాట తు.చ తప్పకుండా వినే దేశాల పేర్లు కూడా చాలా మందికి తెలియదు. అదే అమెరికా పక్కలో…

ఇండియాలో కాల్ సెంటర్లకు వ్యతిరేకంగా అమెరికా కాంగ్రెస్ లో చట్టం

ఇండియూతో సహా అనేక మూడో ప్రపంచ దేశాలకు స్వేచ్ఛా మార్కెట్ సిద్ధాంతాలను ప్రభోధించే అమెరికా, ఆ సిద్ధాంతాలు తమకు నష్టకరంగా పరిణమిస్తే తానే వాటిని అనుసరించనని చాటి చెప్పింది. అభివృద్ధి చెందుతున్న దేశాల వనరులను దోచుకోవడానికీ, అక్కడి మార్కెట్లను కొల్లగొట్టడానికి సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ సిద్ధాంతాలను బలవంతంగా రుద్దిన అమెరికా తన ప్రయోజనాల విషయానికి వస్తే అవే విధానాలను తాను నిస్సందేహంగా తిరస్కరిస్తానని మరోసారి నిరూపించుకుంది. ఎండు చేపలు తినకూడనిది ఊరివాళ్ళే గానీ తాను కాదని తన…

‘భగవద్గీత’ పై నిషేధం, ఇస్కాన్ కార్యక్రమాల పరిమితికై రష్యన్ చర్చి ప్రయత్నాలు

రష్యాలోని సైబీరియా లో గల టామ్‌స్క్ నగరంలో ‘భగవద్గీత’ పై నిషేధం విధించడానికి కోర్టులో కేసు దాఖలు చేయడం వెనుక రష్యన్ ఆర్ధడాక్స్ చర్చి హస్తం ఉందని తెలుస్తోంది. ‘హరే కృష్ణ’ ఉద్యమం కార్యకలాపాలపైన పరిమితి విధించాలని రష్యన్ చర్చి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నదనీ, అందులో భాగంగానే ‘భగవద్గీత’ పుస్తకాన్ని నిషేధించాలంటూ కోర్టులో కేసు దాఖలయిందనీ ‘ది హిందూ’ పత్రిక వెల్లడించింది. ‘హరే కృష్ణ’ ఉద్యమం నియంతృత్వ స్వభావం గల సెక్ట్ గా చర్చి అభివర్ణించిందని ఆ…

అవినీతి ‘రాజా’ కొంప ముంచిన పర్సనల్ సెక్రటరీ ‘ఆచారి’

మాజీ టెలికం మంత్రి ఎ.రాజా కు పర్సనల్ సెక్రటరీ గా పని చేసిన ‘ఆచారి’, తన మాజీ బాస్ కి వ్యతిరేకంగా కీలకమైన సాక్ష్యం చెప్పినట్లుగా ఎన్.డి.టి.వి వార్తా సంస్ధ తెలిపింది. ఎ.ఆచారి గతంలొ ఎ. రాజాకు అసిస్టెంట్ పర్సనల్ సెక్రటరీగా పనిచేశాడు. ఆయన కోర్టులో సోమవారం మాజీ మంత్రికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తూ ఎ.రాజాకు, ఆయన కుట్ర పన్నాడని ఆరొపిస్తున్న కంపెనీల అధిపతులతో అనేక సంవత్సరాలుగా దగ్గరి సంబంధాలు ఉన్నాయని తెలిపాడు. తద్వారా ఎ.రాజా టెలికం…

కొత్త సంవత్సరంలో యూరప్ సంక్షోభం ప్రపంచం అంతా వ్యాపిస్తుంది -యూరప్ సెంట్రల్ బ్యాంక్

యూరప్ రుణ సంక్షోభం కొత్త సంవత్సరంలో తన విశ్వరూప చూపిస్తుందనీ, అది ప్రపంచం అంతా వ్యాపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) సీనియర్ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచం అంతటికీ వ్యాపించడమే కాక సంక్షోభం మరింత తీవ్రం కానున్నదని వారు తెలిపారు. యూరప్ లో సంక్షోభంలో ఉన్న దేశాలకు సహాయ పడే నిమిత్తం ఐ.ఎం.ఎఫ్ కు నిధులు ఇవ్వడానికి బ్రిటన్ నిరాకరించడంతో ఈ పరిస్ధితి తలెత్తుతుందని అధికారులు తెలిపారు. ఐ.ఎం.ఎఫ్ కు బ్రిటన్ ఇరవై…

‘క్షిపణి’ లో(తో)నే ‘కిమ్ జోంగ్-ఇల్’ సమాధి!!! కార్టూన్

కిమ్ జోంగ్-ఇల్ నేతృత్వంలో ఉత్తర కొరియా అణు పరిజ్ఞానం సంపాదించి అణ్వస్త్రాల నిర్మాణానికి తీవ్రంగా ప్రయత్నాలు సాగించింది. ఉత్తర కొరియా వద్ద నిజానికి అణ్వస్త్రాలు ఉన్నదీ లేనిదీ అంతర్జాతీయ సమాజానికి ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే ఉత్తర కొరియా అనేకసార్లు అణ్వస్త్ర పరీక్ష జరపడంతో ఆ దేశం వద్ద అణు బాంబులు ఉండవచ్చని పశ్చిమ దేశాలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా మాట్లాడుతుంటాయి. ఇరాన్ లాగానే ఉత్తర కొరియాపైన కూడా అణ్వస్త్రాలను సాకుగా చూపుతూ అమెరికా, యూరప్ లు…

హోం మంత్రి చిదంబరం కు ‘సభా హక్కుల ఉల్లంఘన’ నోటీసు ఇవ్వనున్న బి.జె.పి

కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. లాయరు వృత్తిలో ఉన్నపుడు తన క్లయింటు పై దాఖలైన ఒక హోటల్ యజమానిపైన ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులను ఎత్తివేయాలని చిదంబరం సిఫారసు చేసాడని వెల్లడి కావడంతో చిదంబరం పై విచారణ జరపాలని బి.జె.పి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు లోక్ సభ, రాజ్య సభల్లో ప్రతిపక్షాలు ఒక పక్క ఆందోళన చేస్తుండగా చిదంబరం ఆ…

‘కిమ్ జోంగ్-ఇల్’ చనిపోయిన రోజే ‘క్షిపణి’ని పరీక్షించిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా అత్యున్నత రాజకీయ, మిలట్రీ నాయకుడు ‘కిమ్ జోంగ్-ఇల్’ చనిపోయిన రోజే ఆ దేశం స్వల్ప దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించే శక్తి గల క్షిపణి పరీక్షించి సంచలన సృష్టించింది. అయితే మిసైల్ పరీక్ష కూ, కిమ్ మరణానికీ సంబంధం ఉన్నదని తాము భావించడం లేదని దక్షిణ కొరియా అధికారులు చెప్పినట్లుగా రాయిటర్స్ సంస్ధ తెలిపింది. మిసైల్ పరీక్షించిన విషయాన్ని కూడా దక్షిణ కొరియా మీడియా నే వెల్లడించాయి. పేరు చెప్పడానికి ఇష్టపడని దక్షిణ కొరియా…

‘కిమ్ జోంగ్-ఇల్’ మరణంతో శోక సంద్రంలో ఉ.కొరియా ప్రజలు -ఫొటోలు

ఉత్తర కొరియాను పోలీసు రాజ్యంగా పశ్చిమ దేశాలు, అక్కడి పత్రికలు అభివర్ణిస్తుంటాయి. ఉత్తర కొరియాను ‘కిమ్ జోంగ్-ఇల్’ ఉక్కు గోడల మధ్య పాలిస్తున్నాడనీ, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశాడనీ ఆరోపిస్తాయి. ప్రజలను కఠినంగా అణిచివేస్తాడని ఆడిపోసుకుంటాయి. కాని కిమ్ మరణంతో ఉత్తర కొరియా ప్రజానికం మూకుమ్మడిగా విలపిస్తున్న దృశ్యాలు ఆ ఆరోపణలు కేవలం ఆరోపణలు మాత్రమేనని చెబుతున్నాయి. – –

చైనాకి భయాన్ని మిగిల్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడి మరణం?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఇల్ మరణం చైనాకు ఒకింత భయాన్ని మిగిల్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కిమ్ జోంగ్-ఇల్ మరణంతో తాము ‘ఆందోళనకూ, అసౌకర్యానికీ’ గురయినట్లుగా చైనా ప్రభుత్వం తెలిపింది. దీనిని నిజానికి ‘షాక్ కి గురయ్యామని’ చైనా చెప్పినట్లుగా భావించవచ్చని రాయిటర్స్ భాష్యం చెప్పింది. కొరియా ప్రాంతంలో చైనా ప్రభావానికి ఉత్తర కొరియా వాహకంగా ఉంటూ వచ్చింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఇల్ ఎంతగా చైనాను విసిగించినప్పటికీ, చైనా ఎంత విసిగినప్పటికీ ఆసియాలో, ఆ…

ఉత్తర కొరియా అధ్యక్షుడు ‘కిమ్ జోంగ్-ఇల్’ మరణం, అప్రమత్తతలో పశ్చిమ దేశాలు

ఉత్తర కొరియా అధ్యక్షుడు, ఆ దేశ అత్యున్నత నాయకుడు కిమ్ జోంగ్-ఇల్ గుండెపోటుతో మరణించినట్లుగా ప్రభుత్వం సోమవారం ప్రకటించినట్లుగా ‘ది హిందూ’ తెలిపింది. అరవై తొమ్మిదేళ్ళ కిమ్ జోంగ్-ఇల్ శనివారమే మరణించినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. ‘ఫీల్డ్ గైడెన్స్’ ఇస్తుండగా అదనపు శారీరక, మానసిక శ్రమ వలన అలసటకు గురవడంతో కిమ్ మరణించాడని ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తర కొరియా అత్యున్నత నాయకుడు మరణించడంతో పశ్చిమ దేశాలు అప్రమత్తమయ్యాయి. అణ్వస్త్ర పరిజ్ఞానం ఉన్న ఉత్తర…

శివసేన గూండాయిజంపై మహారాష్ట్ర ఉపాధ్యాయుల ఐక్య పోరాటం

మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో అక్కడ ‘సేన’ అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. తమకు తామే సంస్కృతీ పరిరక్షకులుగా ప్రకటించుకుంటూ ఇరు ‘సేన’ లు, శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎం.ఎన్.ఎస్), స్కూళ్ళలో అక్రమాలను అరికడతాంటూ బయలుదేరి టీచర్లపై భౌతిక దాడులు చేస్తుండడంతో అవి పాఠశాలల ఉపాధ్యాయులకు పెద్ద సమస్యగా మారాయి. నేరాలు వారే నిర్ధారిస్తూ, శిక్షలు కూడా వారే వేస్తుండడంతో ఉపాధ్యాయులకు పరిస్ధితి దిన దిన గండంగా మారింది. దానితో సేన ల అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అగత్యం…