పశ్చిమాసియాలో అనూహ్య పరిణామం, చర్చలకు సౌదీ చేరిన ఇరాన్ అధ్యక్షుడు

ఆయిల్ నిల్వలతో సుసంపన్నమైన పశ్చిమాసియా (మధ్య ప్రాచ్యం) ప్రాంతంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉన్నత స్ధాయి బృందంతో సహా ఇరాన్ అధ్యక్షుడు మహ్మౌద్ అహ్మది నెజాద్ చర్చల నిమిత్తం సౌదీ అరేబియా చేరుకున్నాడు. సౌదీ రాజు ‘అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్’ వ్యక్తిగతంగా అహ్మదీ నెజాద్ ను ఆహ్వానించడం మరో ముఖ్య పరిణామం. అహ్మది నెజాద్ తో సమావేశానికి సౌదీ అరేబియా ఎంతటి ప్రాముఖ్యత ఇస్తున్నదీ ఈ అంశం తెలియజేస్తోంది. సౌదీ అరేబియా, కతార్, టర్కీ ల…

సుప్రీం కోర్టు రాజ్యాంగవిరుద్ధ తీర్పు ప్రతిఘటిస్తాం -పాక్ మాజీ ప్రధాని

పాకిస్ధాన్ లో పాలకవర్గాల ఘర్షణ ముదురుతోంది. రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్లయితే దానిని ప్రతిఘటిస్తామని మాజీ ప్రధాని గిలానీ ప్రకటించాడు. కోర్టు తీర్పును తిరస్కరించి సమస్యను ప్రజల ముందుకు తీసుకెళ్తామని కోర్టుకు నేరుగా హెచ్చరిక జారీ చేశాడు. కొత్త ప్రధాని అష్రాఫ్ ను ప్రధానిగా తొలగించినట్లయితే ప్రజలు ఆందోళన చేస్తారని హెచ్చరించాడు. ఆగస్టు 27 న తనముందు హాజరు కావాలని సుప్రీం కోర్టు కొత్త ప్రధాని ‘రాజా పర్వేజ్ అష్రాఫ్’ ను కొద్ది రోజుల…

రాహుల్ పట్టాభిషేకం సమస్య ఎవరిది? -కార్టూన్

భారత దేశంలో రాజకీయ పార్టీలు తమ సమస్యలను ప్రజల సమస్యలుగా చేయడం పరిపాటి. సోనియా గాంధీ చరిష్మా కాంగ్రెస్ పార్టీకి చేరకుండా ఉండడానికి ఆమె ఇటలీ పౌరసత్వం ఒక సమస్యగా ప్రజలపై రుద్దడానికి ప్రయత్నం జరిగింది. సోనియా పౌరసత్వాన్ని మించిన సమస్యలు చాలానే ఉండడంతో ప్రజలు ఆ సంగతే పట్టించుకోలేదు. ‘హిందూ మత పరిరక్షణ’ అనే సమస్య కూడా కాంగ్రెస్ నుండి అధికారం లాక్కోవడానికి కృత్రిమంగా ప్రజలపై రుద్దబడినదే. సోనియా చరిష్మా ఇక ముంగింపుకు వచ్చిందని భావిస్తున్నారేమో,…

అక్కడ హిందువులు, ఇక్కడ ముస్లింలు: మైనారిటీలకు ఎక్కడా రక్షణ లేదు

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకునే ఇండియాలో అయినా, మిలట్రీ కనుసన్నల్లో ఎదుగుతున్నపాకిస్ధాన్ నామమాత్ర ప్రజాస్వామ్యంలో అయినా మైనారిటీలకు  ఎక్కడా రక్షణ లేదు. మైనారిటీ మతస్ధుల ఆస్తులు లాక్కోవడానికి మతం అడ్డు పెట్టుకునే దుర్మార్గాలు రెండు చోట్లా కొనసాగుతున్నాయని పత్రికల ద్వారా తెలుస్తున్నది. ‘రింకిల్ కుమారి’ కేసు ద్వారా పాక్ సుప్రీం కోర్టు కూడా మత ఛాందస శక్తుల ముసుగులో దాక్కున్న భూస్వామ్య పాలకవర్గాల చేతిలో బందీ అని స్పష్టం అయింది. ఫలితంగా తమ ఆస్తులను భక్షించడానికి జరుగుతున్న…

ప్రజల సొమ్ము దోచుకోండి, కానీ బందిపోట్లలా కాదు -యు.పి మంత్రి

మాయావతి అవినీతి పై ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అధికారులకు ప్రజల సొమ్ము దొంగిలించడానికి అనుమతి ఇచ్చేసింది. కాకపోతే మరీ బందిపోటు దొంగల్లా దోచుకోకుండా, దొంగిలించవచ్చని సున్నితంగా బోధించింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కి బాబాయి అయిన శివ్ పాల్ సింగ్ యాదవ్ ఈ ఆణి ముత్యాలను తన శాఖ అధికారులకు బోధించాడు. తద్వారా సర్వ వ్యాపితం అయిన అవినీతి ని నాలుగు గోడల మధ్య చట్టబద్ధం చేశాడు.…

2జి కుంభకోణం: లక్ష 76 వేల కోట్ల కాగ్ అంచనా కూడా తక్కువేనా?

సహజ వనరు అయిన 2జి స్పెక్ట్రమ్ ను వేలం వేయకుండా స్వదేశీ, విదేశీ ప్రవేటు కంపెనీలకు ఇష్టారీతిన పంచి పెట్టడం వలన భారత ప్రభుత్వ ఖజానాకు గరిష్టంగా 1,76,645 కోట్ల నష్టం వచ్చిందని ‘కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్’ (సి.ఎ.జి) 10 నవంబర్, 2010 తేదీన నివేదిక వెలువరించింది. కాగ్ నివేదిక అంచనా వేసిన మొత్తం భారీగా ఉండడంతో పత్రికలు దానిని సంచలనం చేశాయి. అప్పటి నుండీ ఏదో ఒక రూపంలో (కేసులు, ఖండన మండన ప్రకటనలు, నీరా…

రాజకీయం దృష్టిలో ‘అవినీతి వ్యతిరేక ఉద్యమం’ -కార్టూన్

సంవత్సరం క్రితం అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం  దేశ వ్యాపితంగా ప్రకంపనలు సృష్టించింది. ఆయనకి మద్దతు ఇవ్వడానికి రాజకీయ నాయకులు పోటీలు పడ్డారు. ప్రతి రాష్ట్రంలోనూ పార్టీలకు అతీతంగా సీనియర్ల నుండి ఛోటా మోటా నాయకుల వరకూ అవినీతిపై ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తూ అన్నా ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న యెడ్యూరప్ప లాంటి వారు సైతం అప్పట్లో ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక మిగిలింది గాలి జనార్ధన రెడ్డి, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి లాంటివారేనని…

‘లండన్ ఒలింపిక్స్ 2012’ స్ట్రీట్ ఆర్ట్ -ఫోటోలు

ప్రఖ్యాత వీధి చిత్రకారుడు బ్యాంక్సీ, లండన్ లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్న సందర్భంగా రెండు వీధి చిత్రాలను తన వెబ్ సైట్ లో ప్రదర్శించాడు. ఈ చిత్రాలు ఏ వీధిలో ఉన్నదీ ఇంకా ఎవరికీ తెలిసినట్లు లేదు. బ్యాంక్సీ కూడా ఆ వివరాలేవీ చెప్పలేదు. (ఆ మాటకొస్తే తన వెబ్ సైట్ లో ఆయన ఉంచిన ఏ చిత్రానికీ వివరాలు లేవు.) వెబ్ సైట్ లో ప్రదర్శించేదాకా ఆ చిత్రాల సంగతి ఎవరికీ తెలిసినట్లు కూడా కనిపించడం…

కోర్టు ధిక్కారం: కొత్త ప్రధానినీ వదలని పాక్ సుప్రీం కోర్టు

పాకిస్ధాన్ దేశ అత్యున్నత రాజ్యాంగ నాయకుడిపై అక్కడి సుప్రీం కోర్టు రెండో సారి ‘కోర్టు ధిక్కారం’ కేసు కింద విచారణ జరపడానికి ఉద్యుక్తం అవుతోంది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడన్న నేర నిర్ధారణ చేసి మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ ని పదవీ భ్రష్టుడిని చేసిన పాక్ సుప్రీం కోర్టు, సరిగ్గా అవే కారణాలతో ఆ తర్వాతి ప్రధాని రాజా పర్వేజ్ అష్రాఫ్ పై కూడా చర్యలు మొదలు పెట్టింది. పాకిస్ధాన్ అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ…

+92, +90 లనుండి మేసేజ్ లా? మీ మొబైల్ సిమ్ క్లోనింగ్ ప్రయత్నం కావచ్చు

మొబైల్ ఫోన్ ల సిమ్ లను క్లోనింగ్ చేసి ఆర్ధిక మోసాలకు పాల్పడే ప్రయత్నాలు జోరందుకున్నట్లు ఢిల్లీకి చెందిన సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా తెలుస్తోంది. ఒక ఢిల్లీ నివాసి నుండి వచ్చిన ఫిర్యాదును ఛేదించే క్రమంలో సిమ్ కార్డ్ క్లోనింగ్ కోసం జరుగుతున్న ప్రయత్నాల గురించిన సమాచారం వెల్లడయింది. మొబైల్ సిమ్ ను క్లోనింగ్ చేసే సౌకర్యం కొన్ని వెబ్ సైట్లు అందిస్తున్నాయనీ, వీటిని ఉపయోగించి సొంతదారులకు తెలియకుండానే వారి మొబైల్ సిమ్ లను రహస్య…

‘టీం అన్నా’ ఇక లేదు -కార్టూన్

ప్రభుత్వం నుండి ఎటువంటి హామీ లేకుండానే నిరాహార దీక్ష ముగించిన అన్నా హజారే, తర్వాత మూడు రోజులకే ‘అన్నా బృందం’ రద్దు అయినట్లు ప్రకటించి ఒకింత సంచలనం సృష్టించాడు. రాజకీయ పార్టీ ఏర్పాటుని సుగమం చేయడానికే అన్నా హాజరే తన బృందాన్ని రద్దు చేసినట్లు ‘ది హిందూ’ వార్త రాసింది. అంటే ఆ వార్తలో సానుకూలత ఉందే తప్ప సంచలన కారకం ఏమీ లేదు. ఒకటో రెండో ఇతర పత్రికలు కూడా అన్నా అభిప్రాయాన్ని ఇదే విధంగా…

టార్చర్ ఛాంబర్ల నుండి దేశాధ్యక్ష పదవి వరకూ…

కాళ్ళకూ, చెవులకూ ఎలక్ట్రిక్ షాక్ లు, బట్టలు ఊడడదీసి చేతులూ కాళ్ళూ కట్టేసి తలకిందులుగా వేలాడదీసి లాఠీలతో కుళ్లబోడవడం ఇవీ బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ నలభైయేళ్ల క్రితం ఎదుర్కొన్న చిత్రహింసలు. యుక్త వయస్సులో లెఫ్టిస్టు గెరిల్లా పోరాటంలో ఉండగా నియంతృత్వ ప్రభుత్వ పోలీసులకు పట్టుబడి మూడేళ్ళ చీకటి కారాగారవాసం అనుభవించిన దిల్మా రౌసెఫ్ తన గత జీవితాన్ని బహిరంగంగ ఇంతవరకూ ఏ పత్రికకూ, వ్యక్తులకూ చెప్పలేదు. ఎస్టెల్లా అనే యుద్ధ నామం (nom de guerre)…

గీతిక శర్మ ఆత్మహత్యకు కారకుడు హర్యానా హోమ్ మంత్రి

ఎయిర్ హోస్టెస్ గీతిక శర్మ ఢిల్లీలోని తన గదిలో ఫ్యానుకి ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హర్యానా రాష్ట్ర హోమ్ మంత్రి గోపాల్ గోయల్ కాండా, అతని ఎక్జిక్యూటివ్ అరుణ చద్దా లే తన ఆత్మహత్యకు కారకులని ఆత్మహత్య లేఖలో రాసి చనిపోయింది. వీరిద్దరూ తన జీవితాన్ని నాశనం చేశారనీ, నమ్మకద్రోహానికి పాల్పడ్డారనీ, వారి స్వప్రయోజనాల కోసం తన జీవితాన్ని బలితీసుకున్నారనీ ఆమె తన లేఖలో ఆరోపించింది. తన జీవితాన్ని నాశనం చేసిందే కాక తన తల్లిదండ్రులను…

నోరు మూసుకో! -అమెరికాతో చైనా ‘పీపుల్స్ డెయిలీ’

నోరు మూసుకొమ్మని చైనా ప్రభుత్వ పత్రిక ‘పీపుల్స్ డెయిలీ’ అమెరికాను హెచ్చరించింది. చైనా సార్వభౌమ వ్యవహారాల్లో జోక్యం వద్దని పత్రిక విదేశీ విభాగం గట్టిగా చెప్పింది. చైనా, దాని పొరుగు దేశాల మధ్య తగాదాలు పెట్టడానికి అమెరికా ప్రయత్నిస్తోందని పీపుల్స్ డెయిలీ ప్రధాన పత్రిక కూడా తీవ్రంగా వ్యాఖ్యానించిందని ఎన్.డి.టి.వి తెలిపింది. ఉద్దేశ్యపూర్వకంగా విరోధాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూడడం అమెరికాకి కొత్త కాదనీ ఇటీవలీ కాలంలో చైనా విషయంలో కూడా ఈ ట్రిక్కు వినియోగిస్తున్నదని నిందించింది.…

అమెరికా గురుద్వారాలో 6గురు సిక్కులను కాల్చి చంపిన తెల్ల దురహంకారి

అమెరికాలో సిక్కుల ప్రార్ధనామందిరం గురుద్వారా లో జొరబడిన తెల్లజాతి దురహంకారి (వైట్ సూపర్ మాసిస్ట్) ప్రార్ధనలో మునిగి ఉన్న ఆరుగురు సిక్కు మతస్ధులను కాల్చి చంపాడు. తీవ్రవాది కాల్పుల్లో కనీసం మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని ‘ది హిందూ’ తెలిపింది. విస్కాన్సిన్ రాష్ట్రంలో మిల్వాకీ సబర్బన్ ప్రాంతం అయిన ‘ఓక్ క్రీక్’ లోని సిక్కుల ప్రార్ధనామందిరం లో ఆదివారం ఉదయం ఈ హత్యాకాండ జరిగింది. విచారణ జరిపిస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబామా హామీ ఇవ్వగా, ఇండియాలోని సిక్కు…