టీం అన్నా రాజకీయ రంగ ప్రవేశం -కార్టూన్

అన్నా బృందం రెండో నిరాహార దీక్ష ఎంత చప్పగా ప్రారంభం అయిందో అంతే చప్పగా ముగిసిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ పది రోజుల పాటు నిరాహార దీక్ష చేసినా, జనం కోసం అన్నా కూడా ఆయనతో జత కలిసినా పట్టించుకున్నవారు లేరు. అన్నా హజారే గత సంవత్సరం చేసిన నిరాహార దీక్షకి పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన పత్రికలు, ఛానెళ్ళు ఈసారి అంతగా పట్టించుకోలేదు. అన్నా దీక్ష విరమణ కోసం పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం,…

కుదంకుళం: అణు పరిహార చట్ట ఉల్లంఘనకు అణు విద్యుత్ శాఖ ప్రయత్నాలు?

కుదంకుళం అణు కర్మాగారం పట్ల స్ధానిక ప్రజల భయాలు ఎంత నిజమో తెలిసి వస్తోంది. విదేశీ అణు కంపెనీల ప్రయోజనాలే తప్ప భారత ప్రజల ప్రయోజనాలకు ప్రభుత్వంలో విలువలేదని తెలిపే సంఘటన వెల్లడయింది. 2010 లో భారత ప్రభుత్వం చేసిన ‘అణు ప్రమాద పరిహార’ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం సరైన అణు పరికరాలను సరఫరా చేయకపోవడం వల్ల ఏర్పడే అణు ప్రమాదాలకు నష్టపరిహారాన్ని పరికరాల సరఫరాదారు కంపెనీలు కూడా భరించవలసి ఉంటుంది. తమిళనాడులోని కుదంకుళంలో రష్యా…

మంగుళూరు దాడి నాయకుడు నరేంద్ర మోడీకి పరమ భక్తుడు

మంగుళూరులో ‘హిందూ సంస్కృతి’ పరిరక్షణ కోసం అంటూ బర్త్ డే పార్టీ జరుపుకుంటున్న యువతీ, యువకులపై నీచమైన రీతిలో దాడి చేసిన మూకలకు నాయకత్వం వహించిన సుభాష్ పాడిల్ గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడి కి పరమ భక్తుడని ‘ది హిందూ’ వెల్లడించింది. 2009 లో పబ్ పై దాడి చేసి అమ్మాయిలపై చేయి చేసుకున్న బృందంలో కూడా సుభాష్ పాడిల్ చురుకయిన సభ్యుడని తెలిపింది. 2009 దాడిలో టి.వి చానెళ్ళు, పత్రికల ద్వారా బహుళ…

పూనే పేలుళ్లు పధకం ప్రకారం జరిగినవే -కేంద్రం

బుధవారం పూనేలో జరిగిన పేలుళ్లు పధకం ప్రకారం జరిగినవేనని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. 500 మీటర్ల పరిధిలో, 45 నిమిషాల సమయంలో జరిగిన ఈ పేలుళ్లు ఒక పధకం ప్రకారం సమన్వయంతో జరిగాయని హోమ్ సెక్రటరీ ఆర్.కె.సింగ్ విలేఖరులకు చెప్పాడు. కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఎన్.ఐ.ఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ), ఎన్.ఎస్.జి (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్), సి.ఎఫ్.ఎస్.ఎల్ (సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ) ల బృందాలు పూణే చేరుకుని పేలుడు పేలుడు జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నాయని ఆయన…

పెట్టుబడిదారీ సంక్షోభ పరిష్కారం అంటే ప్రజల గోళ్ళూడగొట్టడమే -కార్టూన్

పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభాలు సర్వ సాధారణం. పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు వీటికి ‘సైక్లిక్ క్రైసిస్’ అని పేరు పెట్టి సైద్ధాంతీకరించేశారు కూడా. (అంటే సిద్ధాంతం కనక ఇక అడగొద్దని.) పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభం అంటే ప్రధానంగా పెట్టుబడిదారుల సంక్షోభమే. పెట్టుబడిదారులకు లాభాలు తగ్గిపోతే అదే సంక్షోభం. దేశంలో దరిద్రం తాండవిస్తున్నా అది సంక్షోభం కాదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, నూటికి యాభై మందికి ఇళ్ళు లేకపోయినా, నలభై మంది ఆకలితో, అర్ధాకలితో చస్తూ బతుకుతున్నా, మొత్తంగా ప్రజల జీవన…

సిరియాలో ఆల్-ఖైదా ను ప్రవేశపెట్టింది అమెరికా, నాటోలే -అమెరికా చరిత్రకారుడు

‘టెర్రరిజం పై ప్రపంచ యుద్ధం’ పేరుతో ఆల్-ఖైదా పై అమెరికా యుద్ధం ప్రకటించిన సంగతి విదితమే. ఆల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను అంతం చేశామని కూడా ప్రకటించిన అమెరికా అదే సంస్ధకు చెందిన టెర్రరిస్టులకు ఆయుధాలు ఇచ్చి సిరియాలో ప్రవేశపెట్టిందని ప్రముఖ అమెరికా చరిత్రకారుడు, రచయిత, ఆర్ధికవేత్త, జర్నలిస్టు అయిన వెబ్స్టర్ టార్ప్లే తెలిపాడు. ప్రాంతీయంగా టర్కీ ప్రధాని ఎర్డోగన్, విదేశీ మంత్రి దవుతోగ్లు ల దురభిమానాన్ని, అత్యాశను రెచ్చగొట్టి సిరియా కిరాయి తిరుగుబాటులో…

ఇండియాకి ఒలింపిక్స్ మెడళ్ళు ఎందుకు రావు? -కార్టూన్

ఒలింపిక్స్ సంరంభం ప్రారంభమై ఐదు రోజులు గడిచిపోయాయి పొరుగు దేశం చైనా 13 బంగారు పతకాలతో అగ్ర స్ధానంలో ఉండగా ఇండియా ఇంకా బంగారు ఖాతా తెరవనే లేదు. బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా, షూటర్ గగన్ నారంగ్, బాక్సర్ విజేందర్ సింగ్ ల పై బంగారు ఆశలు ఉన్నా అవి మినుకు మినుకు మంటున్నవే. గగన్ ఇప్పటికైతే ఒక తామ్ర పతకాన్ని మాత్రం అందించాడు. గతంలో హాకీ లో బంగారు పతాకం గ్యారంటీ అన్నట్లు ఉండేది. ఇప్పుడలాంటి…

ఆర్.బి.ఐ సమీక్ష: జి.డి.పి టార్గెట్ కి కోత, వడ్డీ రేట్లు యధాతధం

వడ్డీ రేట్లు తగ్గించాలన్న పారిశ్రాక సంఘాల డిమాండ్ ను ఆర్.బి.ఐ తలొగ్గలేదు. ద్రవ్యోల్బణంపై పోరాటం తన లక్ష్యమని చెప్పింది. ఈ దశలో ఆర్.బి.ఐ వడ్డీ రేటు తగ్గించి మరింత డబ్బుని మార్కెట్ కి వదిలితే ద్రవ్యోల్బణం కట్లు తెంచుకుంటుందని తెలిపింది. 2012-13 ఆర్ధిక సంవత్సరానికి గాను జి.డి.పి వృద్ధి రేటు అంచనాను 7.3 శాతం నుండి భారీగా 0.8 శాతం తగ్గించుకుని 6.5 శాతం నమోదయితే చాలని చెప్పింది. ఎస్.ఎల్.ఆర్ లో మాత్రం కొంత సడలింపు ప్రకటించింది.…

హిందూ పరిరక్షకుల చేతిలో మానవీయ సంస్కృతి విధ్వంసం -ఫొటోలు

“దాడి చేసినవారిలో ఒకడు ఆకలిగొన్న కుక్కలా నా స్నేహితురాలి శరీరం అంతా తాకాడు. ఆటవస్తువులా ఆడుకున్నాడు. నేను వివరించలేను… వాడి అసలు ఉద్దేశ్యం ఏమిటో మీరే అర్ధం చేసుకోవాలి.” మంగుళూరులో హిందూ సంస్కృతి పరిరక్షకులమంటూ పెచ్చరిల్లిన మూకల దాడిలో బాధితురాలు సిగ్గుతో చస్తూ చెప్పిన నాలుగు మాటలివి. “అది రేవ్ పార్టీ కాదు. మేమలాంటివారం కాదు. మా ఫ్రెండ్ తన పేరెంట్స్ పర్మిషన్ తీసుకుంది. ఆడపిల్లల్ని ఇలాగేనా చూసేది? మంగుళూరులో నేనిక ఏ పార్టీకీ వెళ్లను… మా…

‘బర్త్ డే పార్టీ’ లపై హిందూ సంస్కృతి పరిరక్షకుల అసభ్య దాడి, అరెస్టులు

హిందూ సంస్కృతిని పరిరక్షిస్తామంటూ బయలుదేరిన గుంపు కర్ణాటక లోని మంగుళూరులో మరోసారి వీరంగం ఆడింది. పుట్టిన రోజు పార్టీ జరుపుకుంటున్న యువతీ, యువకుల బృందం పై ‘హిందూ జాగరణ వేదిక’ కు చెందిన మూకలు దాడి చేసి విచక్షణారహితంగా చావబాదారు. పుట్టిన రోజు పార్టీ అని చెబుతున్నప్పటికీ వినకుండా మృగాల్లా ప్రవర్తించారు. అమ్మాయిలను తాకకూడని చోట తాకుతూ, జుట్టు పట్టి లాగుతూ, కొడుతూ నీచంగా ప్రవర్తించారు. హిందూ సంస్కృతి పరిరక్షణ పేరుతో భారతీయ సంస్కృతికి మచ్చ తెచ్చేలా…

మరోసారి క్షీణించిన జి.డి.పి, తీవ్ర రిసెషన్ లో బ్రిటన్

వరుసగా మూడో క్వార్టర్ లో కూడా బ్రిటన్ స్ధూల దేశీయోత్పత్తి (జి.డి.పి) పడిపోయింది. గత సంవత్సరం చివరి క్వార్టర్ (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) లో ప్రారంభం అయిన బ్రిటన్ జి.డి.పి పతనం ఈ సంవత్సరం మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో కూడా కొనసాగడంతో బ్రిటన్ అధికారికంగా రిసెషన్ (మాంద్యం) లోకి జారుకున్నట్లయింది. ఈ పతనం వరుసగా ఈ సంవత్సరం రెండో క్వార్టర్ లో కొనసాగి మునుపటి కంటే ఎక్కువగా నెగిటివ్ జి.డి.పి వృద్ధి నమోదు…

స్త్రీలపై అత్యాచారాలు, కురచ దుస్తులు, ఒక పరిశీలన

  (స్త్రీల వస్త్రధారణ వారిపై అత్యాచారాలకు ఒక కారణం అంటూ డి.జి.పి దినేష్ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా బొందలపాటిగారు తన కోణంలో విశ్లేషిస్తూ ఒక టపా డిసెంబర్ 29 తేదీన రాశారు. సదరు టపా కు స్పందనగా మిత్రులు రాజశేఖర్ రాజు గారు చేసిన వ్యాఖ్యానం అద్భుతం. ఆయన చేసిన విశ్లేషణకు మరింత వెలుగు కల్పించవలసిన అవసరం ఉంది. అందుకే ఆయన వ్యాఖ్యలలోని ప్రధాన భాగాన్ని టపాగా మారుస్తున్నాను.  రాజశేఖర్ రాజు, బొందలపాటి గార్ల అనుమతి ఉన్నదని…

ఈవ్ టీజింగ్ కి ఆడపిల్లల డ్రస్సులే కారణం -తృణమూల్ ఎమ్మెల్యే

ఆడవాళ్లపై అత్యాచారాలకు, అత్యాచార ప్రయత్నాలకు వారి కురచ దుస్తులే కారణమని పోలీసు బాసులు, ప్రభుత్వాధికారులు నుండి గ్రామ పెద్దల వరకు ఏకబిగిన వాపోతున్న సంగతి తెలిసిందే. ‘ఈవ్ టీజింగ్’ నేరానికి కూడా ఆడపిల్లల డ్రస్సులే ప్రేరణనిస్తున్నాయని తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్ధారించాడు. అంతలోనే ఈవ్ టీజింగ్ కొత్తదేమీ కాదని కూడా సమర్ధించుకొచ్చాడు. మరోసారి నాలుక మడతేసి కురచ దుస్తులనూ అభినందించాడు. సొంత పార్టీ మంత్రులతో పాటు ప్రముఖులంతా తూర్పారబట్టినా సంరక్షకుడిగానే తానా మాటలన్నానని తనను తాను…

భారత జలాల్లోకి రాకుండా ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లపై నిషేధం

అమెరికా షరతులకు తలొగ్గి ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులను తగ్గించుకునేది లేదంటూ డంబాలు పలికిన భారత ప్రభుత్వం సరిగ్గా అందుకు విరుద్ధమైన కార్యాచరణకు దిగింది. అమెరికా ఆంక్షలు విధించిన ఇరానియన్ నౌకలను భారత సముద్ర జలాల్లో ప్రవేశించకుండా నిషేధం విధించింది. తద్వారా, ఐక్యరాజ్య సమితి విధిస్తే తప్ప వివిధ దేశాలు సొంతగా విధించే ఆంక్షలను ఇండియా అమలు చేయదన్న విధాన ప్రకటనను ప్రభుత్వం తానే ఉల్లంఘించింది. అంతేకాక భారత ప్రజల ప్రయోజనాలా లేక పశ్చిమ దేశాల కంపెనీల ప్రయోజనాలా…

అవినీతి నిర్లక్ష్యాల మూల్యం, స్కూల్ బస్సు రంధ్రంలోంచి జారి బాలిక మృతి

చెన్నైలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. స్కూలు బస్సులోపల ఉన్న రంధ్రంలోంచి జారిపడి రెండో తరగతి చదువుతున్న బాలిక చనిపోయింది. బస్సు వెనక చక్రాల కింద పడి నలిగిపోవడంతో ఆరేళ్ళ శృతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రవాణా అధికారుల వద్ద నెల క్రితమే స్కూలు బస్సు ఫిట్ నెస్ సర్టిఫికేట్ పొందినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించగా, ప్రజలు ఆగ్రహంతో బస్సుని తగలబెట్టారు. బస్సు డ్రైవర్ తో పాటు…