మోడి నోరు తెరవరేమి? -కార్టూన్

— “కొద్దిగా మార్పులు చేసి వాటిని మీరు ఉపయోగించొచ్చు కదా!” — ఐ.పి.ఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం విషయంలో దాదాపు అందరూ ఏదో ఒక మాట అనేశారు. భావి ప్రధాని కావాలని ఆశిస్తున్న మోడి మాత్రం ఎందుకో ఇంకా నోరు తెరవలేదు! మోడి అటెన్షన్ కోరడానికి కారణం ఆయన కూడా బి.సి.సి.ఐ బోర్డు సభ్యుడు కావడమే. గుజరాత్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఆయన కూడా బి.సి.సి.ఐ బోర్డు సభ్యులే. అవడానికి క్రికెట్ ఆట బోర్డే అయినా దాని…

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఐరోపాయే పెద్ద ప్రమాదం -ఒ.ఇ.సి.డి

ఒ.ఇ.సి.డి = ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డవలప్ మెంట్ ఒ.ఇ.సి.డి అర్ధ వార్షిక సమావేశాలు బుధవారం పారిస్ లో జరిగాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఐరోపా పెద్ద ప్రమాదంగా పరిణమించిందని ఈ సమావేశాల్లో సంస్ధ సమీక్షించింది. 34 ధనిక దేశాల కూటమిలో 24 దేశాలు ఐరోపాకి చెందినవే కావడం గమనార్హం. ఐరోపా ఆర్ధిక బలహీనత మరింత కాలం కొనసాగితే అది ఆర్ధిక స్తంభనకు దారి తీసి మొత్తం ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకే ముప్పుగా పరిణమిస్తుందని…

సిరియా: అంతులేని విధ్వంసం, హత్యాకాండల యుద్ధక్షేత్రం -ఫోటోలు

సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం అన్న లెనిన్ మహాశయుని చారిత్రక ప్రతిపాదన ఎంత వాస్తవమో చరిత్ర అనేకసార్లు రుజువు చేసింది. సిరియా అందుకు తాజా రుజువు. అమెరికా, ఐరోపా రాజ్యాల వనరులు, మార్కెట్ల దాహానికీ, అంతర్జాతీయ జియో-పోలిటికల్ వ్యూహ ప్రతివ్యూహాల్లో ప్రధాన ప్రత్యర్ధుల ‘ముసుగు యుద్ధానికి’ కేంద్రంగా రక్తం ఓడుతున్న సిరియా, నేటి సామ్రాజ్యవాద యుద్ధ క్షేత్రం. శాంతి విరామం లేని అనంత యుద్ధానికి బహిరంగంగానే నాందీ వాచకం పలికిన జార్జి డబ్ల్యూ బుష్, అమెరికా వాల్ స్ట్రీట్…

గాంధేయవాదులూ బహిష్కృతులే -రెండో భాగం

(జస్టిన్ పొదుర్ టొరొంటో నగరంలో ఒక రచయిత. యార్క్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ప్రస్తుతం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్మాలియాలో విజిటింగ్ ప్రొఫెసర్ కూడా. ఆయన బ్లాగ్: http://www.killingtrain.com ట్విట్టర్: @JustinPodur) మొదటి భాగం తరువాయి………………… జె.పి: ఆశ్రమ్ కూల్చివేత కూడా ఒక ఉదాహరణ అనుకుంటాను. హెచ్.కె: ప్రభుత్వ అనుమతితో, ప్రభుత్వ భూమిలోనే మా ఆశ్రమ్ ని ప్రారంభించామని గుర్తుంచుకోండి. సల్వాజుడుం సాగిస్తున్న దాడులు, లైంగిక అత్యాచారాలు, హత్యలు, గ్రామ దహనాలు మొదలైన వాటిని మేము ప్రశ్నించడం ప్రారంభించాక…

గాంధేయవాదులు కూడా బహిష్కృతులే -గాంధియన్ హిమాంషుతో ఇంటర్వ్యూ

హిమాంషు కుమార్ గాంధీయన్ కార్యకర్త. మావోయిస్టులకు పట్టు ఉన్నట్లు భావించే దంతెవాడ జిల్లాలో ‘వనవాసి చేతన్ ఆశ్రమ్’ అనే ఎన్.జి.ఓ సంస్ధను 22 సంవత్సరాల పాటు తన భార్యతో కలిసి నిర్వహించారాయన. స్ధానిక ఆదివాసీల భాష ‘గోండి’ నేర్చుకుని చట్టబద్ధంగా ఆదివాసీలకు హక్కులు దక్కేలా చేయడానికి ఆశ్రమ్ ద్వారా ప్రయత్నించారు. 2005 మొదలుకుని ఆదివాసీలకు వ్యతిరేకంగా సల్వాజుడుం పేరుతో స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (ఎస్.పి.ఓ) నిర్వహించిన దారుణ హంతక దాడులతో కకావికలై అడవి వదిలి వెళ్ళిపోయిన గిరిజనులను…

కనీస వేతనాలకు ప్రధాన మంత్రే అడ్డం!

భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెబుతుంటారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా దేశం లోపలా, బయటా తనకు అవసరం అనిపించినప్పుడల్లా ఆ సంగతి చెప్పుకుని మురిసిపోతుంటారు. ప్రజల ఓట్లతో అధికారం సంపాదించాక కనీసంగానైనా జనం గురించి పట్టించుకోకపోతారా అని సాధారణంగా మనమూ అనుకుంటాం. కానీ ఉపాధి హామీ పధకం కింద పని చేస్తున్న కూలీలకు కనీస వేతనం చెల్లించడానికి ప్రధానమంత్రి, ఆయన కార్యాలయమే సైంధవుడిలా అడ్డు పడుతున్న సంగతి వెలుగులోకి వచ్చింది. కర్ణాటక హై…

రెంటల్ మేన్స్ గేమ్ -కార్టూన్

ఐ.పి.ఎల్ కుంభకోణం గురించి పత్రికల్లో కార్టూన్ల వరద పారుతోంది. జెంటిల్మెన్ గేమ్ గా గొప్పలు చెప్పుకున్న గేమ్ కాస్తా రెంటల్మెన్ గేమ్ గా మారిపోయిందని కార్టూనిస్టు నవరే శ్రేయాస్ వినూత్న రీతిలో స్పష్టం చేస్తున్నారు. ఐ.పి.ఎల్ లో పాత్రధారులైన వివిధ సెక్షన్లకు కుంభకోణం దరిమిలా అది ఒక్కో కంటికి ఎలా కనిపిస్తోందో కార్టూనిస్టు విశ్లేషించారు. ఒక్కోక్కరికి ఒక్కో విధంగా కళ్ళు మూసుకుపోయాయని కూడా ఈ కార్టూన్ కి అర్ధం తీసుకోవచ్చు. ఆటగాళ్లకు డబ్బు తప్ప ఆట కనిపించడం…

అమాయకులు కాదు, కాంగీ నాయకులే లక్ష్యం -మావోయిస్టులు

మహేంద్ర కర్మ, తదితరుల కాంగ్రెస్ పార్టీ నాయకులే తమ మెరుపుదాడికి లక్ష్యం అని మావోయిస్టులు ప్రకటించారు. తమ దాడిలో మరణించిన అమాయకులకు వారు క్షమాపణలు తెలిపారు. సల్వాజుడుం ద్వారా గిరిజన గ్రామాల్లో విధ్వంసం సృష్టించిన మహేంద్ర కర్మ, ఇతర కాంగ్రెస్ నాయకులపై గిరిజనుల తరపున ప్రతీకారం తీర్చుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించిన మావోయిస్టులు దాడిలో పాల్గొన్న పీపుల్స్ లిబరేషన్, గెరిల్లా ఆర్మీ మరియు మిలీషియా సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ప్రతినిధి ఉసెండి…

ఎస్-300 సిరియాకి ఇచ్చావో…, రష్యాకి ఇజ్రాయెల్ హెచ్చరిక

సిరియా యుద్ధంలో ‘గేమ్ ఛేంజర్’ గా రష్యా టుడే అభివర్ణించిన ఎస్-300 క్షిపణుల సరఫరా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎస్-300 క్షిపణులను సిరియాకు సరఫరా చేయొద్దంటూ ఇజ్రాయెల్ మరోసారి రష్యాను కోరింది. ఈసారి రష్యాకు హెచ్చరికలు జారీ చేసింది. ఎస్-300 క్షిపణులను సిరియాకు సరఫరా చేసినట్లయితే షిప్పింగ్ చేస్తున్న వాహనాలపై దాడి చేసి నాశనం చేస్తామని హెచ్చరించింది. కాగా క్షిపణుల సరఫరాను రష్యా గట్టిగా సమర్ధించుకుంది. సిరియాతో కుదుర్చుకున్న పాత ఒప్పందాన్ని తాము గౌరవిస్తున్నామని తెలియజేసింది. ఇజ్రాయెల్ రక్షణ…

కావాలంటే ఇస్తాలే, మావన్నీ ఇక మీవెలే -జపాన్ లో ప్రధాని

భారత ప్రధాని మన్మోహన్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. భారత దేశంలో ప్రజలకు హామీలు ఇచ్చే అవకాశం ఎన్నడూ రాని ఆయన (ఎన్నికల్లో పోటీ చేయరు గనుక) దానిని జపాన్ లో దొరకబుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. అడిగిందే తడవుగా జపాన్ పారిశ్రామిక వేత్తలకు హామీలు ఇచ్చేశారు ప్రధాని మన్మోహన్ సింగ్. ‘కావాలంటే ఇస్తాలే, మావన్నీ ఇక మీవెలే’ అంటూ పరమానంద రాగం ఆలపించినంత పని చేశారు. ‘మీ మార్కెట్లు ఇంకా బాగా తెరవాలి’ అంటే ‘దాందేముంది, మా ప్రజలకు…

సిరియాపై ఆయుధ నిషేధం ఎత్తివేసిన ఐరోపా

తాను చెప్పిన నీతిని తానే అడ్డంగా ఉల్లంఘించింది యూరోపియన్ యూనియన్. రెండేళ్ల క్రితం సిరియాలో హింస చెలరేగినందున ఆయుధ సరఫరా మరింత హింసను ప్రేరేపిస్తుందన్న కారణం చెబుతూ సిరియాపై ఆయుధ నిషేధాన్ని (arms embargo) యూరోపియన్ యూనియన్ విధించుకుంది. ఇపుడా నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎత్తివేతతో సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు యధేచ్ఛగా, బహిరంగంగా ఆయుధాలు సరఫరా చేసుకునే అవకాశం ఐరోపా దేశాలకు వస్తుంది. ఐరోపా దేశాల ఆయుధ కంపెనీలకు లాభాలు పెంచి, వెంటిలేషన్ పై ఉన్న…

జెంటిల్మెన్ గేమ్ రోజులు గతించాయా? -కార్టూన్

—*— గుర్తుంచుకోండి, ఇది జెంటిల్మెన్ గేమ్ కాదు. అంపైర్ ఔట్ ఇస్తే వెళ్లిపోవద్దు. ఆయన ఒత్తిడి చేస్తే కసి తీరా తిట్లకు లంకించుకోండి! జెంటిల్మెన్ గేమ్ అని క్రికెట్ ఆట గురించి చెబుతుంటారు. క్రికెట్ ఆట కోట్లు కురిపించే ఆటగా మారి అందులోకి రాజకీయ నాయకులు, కార్పొరేట్ కంపెనీలు ఎప్పుడైతే ప్రవేశించారో అప్పుడే అది క్రూడ్ మెన్ గేమ్ గా మార్పులు సంతరించుకుంది. కంటికి కనిపించే ప్రతిదీ సరుకుగా మారిపోతుందని కారల్ మార్క్స్ ఊరికే అన్లేదు. సరుకుగా…

నిర్బంధానికి ఆహ్వానం (ఛత్తీస్ ఘర్ మావోయిస్టుల దాడి పై ‘ది హిందు’ సంపాదకీయం)

ఛత్తీస్ ఘర్ లో కాంగ్రెస్ పార్టీ కాన్వాయ్ పై మెరుపు దాడి చేసి సీనియర్ నాయకులు మహేంద్ర కర్మ, నంద కుమార్ పటేల్ లతో సహా 24 మందిని దారుణంగా చంపడం ద్వారా మావోయిస్టులు ఈ ప్రాంతంలో సాధారణ ప్రజలు ఎదుర్కోనున్న విపరిణామాలతో సంబంధం లేకుండా బస్తర్ లో ఘర్షణను విస్తరించడానికి తమ సంసిద్ధతను చాటుకున్నారు. 2005లో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల మద్దతుతో స్ధానిక పోలీసులు ప్రారంభించిన హింసాత్మకమైన మావోయిస్టు వ్యతిరేక ‘సల్వా జుడుం’ ఉద్యమానికి బహిరంగ…

భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడిన జస్టిస్ చిన్నపరెడ్డి గారి స్మృతిలో…

(సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఒంటెత్తుపల్లి చిన్నప రెడ్డి ఏప్రిల్ 13 తేదీన మరణించారు. భారత దేశంలో అటు న్యాయ పరిపాలనతో పాటు ఇటు రాజకీయ పరిపాలనను కూడా ప్రగతిశీల దృక్పధం వైపుకు నడిపించడానికి ప్రయత్నించిన ‘లెజెండరీ-క్వార్టెట్’ లో జస్టిస్ చిన్నప రెడ్డి ఒకరు. జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్, జస్టిస్ పి.ఎన్.భగవతి, జస్టిస్ డి.ఎ.దేశాయ్ లతో పాటు ‘లెజెండరీ క్వార్టెట్’ గా మన్ననలు అందుకున్న నలుగురిలోకి ఆయనే చిన్నవారు. తన 90 వ యేట వృద్ధాప్యం తెచ్చిన…

జర్మనీలో చైనా ప్రధాని, చర్చకు రానున్న వాణిజ్య ఉద్రిక్తతలు

మూడు దేశాల పర్యటనను ముగించుకున్న చైనా ప్రధాని లీ కెషాంగ్ తన పర్యటనలో చివరి మజిలీ అయిన జర్మనీ చేరుకున్నారు. ప్రధాని పదవి స్వీకరించిన తర్వాత ఇండియాతో తన మొట్టమొదటి విదేశీ పర్యటనను ప్రారంభించిన లీ అనంతరం పాకిస్తాన్, స్విట్జర్లాండ్ సందర్శించారు. ఆదివారం జర్మనీ చేరుకున్న లీ, జర్మనీ ఛాన్సలర్ తో జరిపే చర్చల్లో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు చర్చకు రానున్నాయని తెలుస్తోంది. వాణిజ్య వ్యవహారాల్లో పరస్పర ఆరోపణలు చేసుకుని ఒకరిపై మరొకరు…