ఇ.యు, చైనాల వాణిజ్య యుద్ధం, మొదటి అంకం మొదలు

యూరోపియన్ యూనియన్ చెప్పినట్లుగానే చైనా సోలార్ విద్యుత్ ఉత్పత్తి పరికరాలపై దిగుమతి సుంకం పెంచడానికి నిర్ణయం తీసుకుంది. తద్వారా చైనాతో వాణిజ్య యుద్ధానికి తెర లేపింది. చౌక పరికరాలను పెద్ద ఎత్తున డంపింగ్ చేయడానికి వ్యతిరేకంగానే తాను అదనపు సుంకం విధిస్తున్నట్లు ఇ.యు ప్రకటించింది. సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే సోలార్ పానెళ్లు, బ్యాటరీలు, వేఫర్లు మొదలైన పరికరాలకు 12 శాతం అదనపు సుంకం వేయనున్నట్లు ఇ.యు ట్రేడ్ కమిషనర్ కారెల్ డి గచ్ మంగళవారం తెలిపాడు.…

స్పాట్ ఫిక్సింగ్ వెనక దావూద్, ఛోటా షకీల్

పీట ముడి పడిందో, విడిపోయిందో గానీ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుడు ఛోటా షకీల్ ల పాత్ర ఉన్నదని కనుగొన్నామని పోలీసులు ప్రకటించేశారు. దానితో స్పాట్ ఫిక్సింగ్ నిందితులు అందరిపైనా MCOCA (Maharashtra Control of Organised Crimes Act) చట్టం కింద కేసులు పెడుతున్నామని వారు తెలిపారు. వారిలో శ్రీశాంత్ కూడా ఉన్నాడు. బుకీలు బెదిరించి ఆటగాళ్లను లొంగదీసుకున్నారని కూడా పోలీసులు చెబుతున్నారు. దావూద్ ముఠా ఆదేశాల…

కూతురిని నాలుగేళ్ళు హౌస్ అరెస్ట్ చేసిన తల్లిదండ్రులు?

కుటుంబ గౌరవాన్ని కాపాడే బాధ్యత ప్రధానంగా ఆడపిల్లదేనా? ‘వాడికేం మగాడు’ అనే సమాజం తల్లిదండ్రుల చేత తన కూతుళ్లపైన ఎంతటి ఘోరకలికయినా తెగించేట్లు చేస్తుందా? ఆడపిల్లలకు ఇష్టమైనవారిని ఇచ్చి పెళ్లి చేసే విషయంలో కొందరు తల్లిదండ్రులు ఎంత క్రూరంగా వ్యవహరించగలరో బెంగుళూరులోని ఈ హృదయ విదారక సంఘటన చెబుతోంది. తమకు ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు 31 యేళ్ళ (ఇప్పుడు 35) తమ కూతురిని నాలుగేళ్లుగా గదిలో బంధించి ఉంచిన తల్లి దండ్రులను ఎలా అర్ధం…

అద్వానీ కల తీరిది! -కార్టూన్

అద్వానీ భవిష్యత్తు ఏమిటి? భావి ప్రధాని కావడానికి తగిన ప్రయత్నాలన్నింటినీ ఆయన చేస్తున్నారు. కానీ ‘తానొకటి తలచిన దైవమొకటి తలచెను’ అన్న రీతిలో అద్వానీ కలను రాముడు పట్టించుకుంటున్నట్లు లేదు. ‘అన్నీ నేనే’ అని ఎప్పుడో చెప్పేసిన శ్రీ మహా విష్ణువు ఆయన పార్టీ చేత ‘ఇక మీరు రిటైర్మెంట్ తీసుకోండి’ అని పరోక్షంగా చెప్పిస్తున్నారు. మోడిని తీవ్ర స్ధాయిలో ప్రమోట్ చేయించడం ద్వారా ఆయనని విశ్రాంతి తీసుకొమ్మని ‘హింట్’ ఇప్పిస్తున్నారు. కానీ అద్వానీ శ్రీ మహా…

జైలులో 125 మంది నాయకులకు ఆతిధ్యం ఇచ్చిన జగన్!

సామాన్య మానవుడికి సాధ్యం కాని ఫీట్ ఇది. బహుశా గిన్నీస్ రికార్డ్ బుక్ ఎక్కడానికి కూడా అర్హత ఉందేమో కూడా. ఎంత వి.వి.ఐ.పి ఐతే మాత్రం, ప్రమాదకరమైన నేరానికి పాల్పడ్డాడని సుప్రీం కోర్టు పదే పదే వ్యాఖ్యానిస్తున్న ఒక నేరస్ధుడికి, సంవత్సర కాలంలో 125 మంది రాజకీయ నాయకులకి మూలాఖాత్ ఇచ్చే అవకాశం ఎవరికి దక్కుతుంది? ఈ సంఖ్య కేవలం రాజకీయ నాయకులదే. సినిమా నటులు, బంధువులు, పారిశ్రామికవేత్తలు తదితర పెద్దలను కూడా కలిపితే రోజుకి కనీసం…

సి.ఐ.సి సంచలనం: రాజకీయ పార్టీలూ ఆర్.టి.ఐ పరిధిలోనివే

సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సి.ఐ.సి) సంచలన తీర్పు ప్రకటించింది. ‘మేము ఆర్.టి.ఐ (రైట్ టు ఇన్ఫర్మేషన్) పరిధిలోకి రాము’ అని చెబుతూ పిటిషన్ దారులు కోరిన సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చిన రాజకీయ పార్టీలకు దిమ్మ తిరిగేలా ఈ తీర్పు ఉన్నది. రాజకీయ పార్టీలు అనేక విధాలుగా ఆర్ధికంగా ప్రభుత్వం నుండి లబ్ది పొందుతున్నందున అవి పబ్లిక్ ఆధారిటీ కిందకు వస్తాయని కనుక ప్రజలు కోరినప్పుడు తమ నిధులపై తగిన సమాచారం ఇవ్వాల్సిందేనని తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్,…

అబ్బే మా మధ్య విభేదాలేమీ లేవు -కార్టూన్

– – “అబ్బే తేడాలేమీ లేవు. మేమిద్దరం కలిసే పని చేస్తున్నాం!” “మళ్ళీ మీ పనిలోకి దిగిపోయారా? రాజకీయాలను క్రీడలతో కలపొద్దు చెబుతున్నా!” కాంగ్రెస్ అధ్యక్షురాలు, యు.పి.ఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ ల మధ్య విభేదాలు తలెత్తాయని మళ్ళీ పత్రికలు గుస గుసలు మొదలు పెట్టాయి. అవినీతి ఆరోపణలతో పవన్ కుమార్ బన్సాల్, బొగ్గు కుంభకోణంలో విచారణ చేస్తున్న సి.బి.ఐ విధుల్లో జోక్యం చేసుకున్నందుకు సుప్రీం కోర్టు చేత అభిశంసనకు గురయినందుకు అశ్వనీ…

హింస కాదు ప్రతి హింస: అరుంధతీ రాయ్ -3

రెండో భాగం తరువాయి………….. సాగరికా ఘోష్: మావోయిస్టులు, ప్రభుత్వం మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి మీరు ఇష్టపడతారా? ఎందుకంటే కబీర్ సుమన్ తో పాటు మీ పేరు కూడా వారు (మావోయిస్టులు) మధ్యవర్తిత్వం కోసం ప్రతిపాదించారు. అయితే మీరు తిరస్కరించారు. మీరు ఎవరికి భయపడుతున్నారు? మీరు మధ్యవర్తిత్వం వహించవచ్చు కదా? అరుంధతీ రాయ్: నేను నాకే భయపడుతున్నాను. అలాంటి నిపుణుతలు నాకు లేవు. నాపైన నాకు నమ్మకం లేదు. మీరు బాస్కెట్ బాల్ ఆటగాళ్లయితే మీరు ఈతగాళ్ళు…

బి.సి.సి.ఐ మ్యాచ్ ఫిక్స్, ‘శ్రీ’నివాసన్ ఔట్?

ఆదివారం బి.సి.సి.ఐ బోర్డు అత్యవసర సమావేశం జరిపి అధ్యక్షుడు శ్రీనివాసన్ కు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. కార్యదర్శి జగ్దాలే, ట్రెజరర్ అజయ్ షిర్కే ల రాజీనామాలతో శ్రీనివాసన్ పై ఒత్తిడి బాగా పెరిగినట్లు తెలుస్తోంది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ లాంటి పరిణామాలను కారణంగా చూపుతూ, ఐ.పి.ఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా శనివారం రాజీనామా చేయడంతో ఇక శ్రీనివాసన్ రాజీనామా దాదాపు ఖాయమేనని పత్రికలు చెప్పేస్తున్నాయి. అయితే రాజీనామాకు శ్రీనివాసన్ కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. తనకు…

అరుంధతీ రాయ్: హింస కాదు ప్రతి హింస -2

  మొదటిభాగం తరువాయి……………………. సాగరికా ఘోష్: ఈ హింసా వలయానికి వ్యతిరేకంగా మీలాంటివారు గొంతెత్తవలసిన అవసరం లేదంటారా? లేదా మీలాంటి వారు వాస్తవానికి దానికి హేతుబద్ధతను కనిపెట్టడానికి ప్రయత్నించాలంటారా? ఎందుకంటే, మిమ్మల్ని ‘మావోయిస్టుల ఆపాలజిస్టు’గా పిలుస్తున్నారు! బి.జె.పి మిమ్మల్ని ‘నగ్నలిజం యొక్క అధునాతన ముఖం’ అని పిలుస్తారు. వారి హింసకు వ్యతిరేకంగా మీరు గొంతెత్తకపోతే, రాజ్యం (యొక్క హింస) కు నైతికంగా న్యాయబద్ధమైన ప్రతిఘటన అని చెబుతూ అది నైతికంగా సమర్ధనీయం అని చెబితే, పౌర సమాజంలోని…

మావోయిస్టులది హింస కాదు, ప్రతి హింస -అరుంధతీ రాయ్ ఇంటర్వ్యూ -1

(అరుంధతీ రాయ్ కి పరిచయం అవసరం లేదు. తన మొదటి పుస్తకం ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ నవలకు బుకర్ ప్రైజ్ గెలుచుకుని ప్రపంచానికి పరిచయం అయినప్పుడు ఆమె భారతీయ ఆంగ్ల సాహిత్యానికి కీర్తి, వన్నె తెచ్చిన ఒక అర్బన్ మహిళ. తర్వాత్తర్వాత భారత దేశ శ్రామిక ప్రజలకు నిఖార్సయిన, రాజీలేని మద్దతుదారుగా అవతరించిన అరుంధతి, భారత పాలక వర్గాలకు కంటిలో నలుసుగా మారారు. ‘వాకింగ్ విత్ ద కామ్రేడ్స్’ వ్యాస రచన ద్వారా మావోయిస్టుల…

రక్తం కారేలా కొట్టుకున్న యు.పి పోలీసులు -వీడియో

ఇది ఇండియాలో మాత్రమే జరుగుతుందట! అలా చెప్పడం అతిశయోక్తే అయినా, జరిగింది మాత్రం ఘోరమే. ఏ తగాదా వచ్చిందో గానీ ఇద్దరు పోలీసులు బహిరంగంగా, అందరూ చూస్తుండగానే రక్తం కారేలా లాఠీలతో బాదుకున్నారు. కెమెరా పని చేస్తోందన్న స్పృహే లేకుండా కొట్టుకున్నారు. చూడడానికి ఒళ్ళు గగుర్పొడిచేలా కొట్టుకుని ఆనక వారిలో ఒకరు వీడియోగ్రాఫర్ తోనో, విలేఖరితోనో మాట్లాడారు కూడాను. తొమ్మిది రోజుల క్రితం ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. Times Now వార్తా ఛానెల్ ద్వారా యాహూ…

కంచి దారిలో ఇండియా జి.డి.పి వృద్ధి కధ!

దేశ వనరులన్నీ తవ్వి తీసి దేశ ప్రజలకు వినియోగపెట్టడం మాని విదేశాలకు ఎగుమతి చేయడమే అభివృద్ధిగా చెప్పుకున్న భారత పాలకుల అభివృద్ధి కధ కంచి దారి పట్టినట్లు కనిపిస్తోంది. 2012-13 సంవత్సరానికి గాను దశాబ్ద కాలంలోనే అత్యంత తక్కువ జి.డి.పి వృద్ధి రేటును భారత ఆర్ధిక వ్యవస్ధ నమోదు చేసింది. మాన్యుఫాక్చరింగ్, సేవలు, వ్యవసాయం, మైనింగ్, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, నిర్మాణం తదితర ముఖ్యమైన అన్ని రంగాలలోనూ వృద్ధి రేటు కుంటుబడడంతో గత ఆర్ధిక సంవత్సరం…

సుక్మా అడవుల్లో భారీ క్యాంపు ఎత్తివేసిన పోలీసులు

మావోయిస్టుల దాడి ఫలితంగా అడవుల్లోని తమ భారీ శిబిరాన్ని పోలీసులు ఎత్తివేసుకున్నారని ది హిందు తెలిపింది. దాడి జరిగిన 72 గంటల లోపే వ్యాహాత్మకంగా అత్యంత ముఖ్యమైనదిగా పోలీసులు చెప్పుకున్న శిబిరాన్ని ఎత్తివేయడం అడవుల్లోని పరిస్ధితికి ఒక సూచన కావచ్చు. పత్రిక ప్రకారం సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతం లోపల ‘మినప’ లో పోలీసులు 15 రోజుల క్రితమే భారీ శిబిరాన్ని నెలకొల్పారు. మరో భారీ దాడి ఎదురవుతుందన్న భయంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన రెండు…