కుట్టు కూలీలే డిజైనర్లయితే… -కార్టూన్

—— స్వెట్ షాప్ వర్కర్లు తాము కుట్టే చొక్కాలను తామే డిజైన్ చేస్తే… *నేను స్కూల్ లో ఉండాల్సిన దాన్ని! *బాత్ రూమ్ బ్రేక్ లంటే నాకిష్టం! *దోపిడిని లాండ్రీ చేయడం చాలా కష్టం! *నేనేమీ తగ్గింపు ధరల ఐటెమ్ ని కాను! *నేను కుట్టిందే నువ్వు పిండుకుంటావు! *1000 చావుల 40 దారాల కౌంట్! —— అత్యంత దారుణమైన పని పరిస్ధితుల్లో, అత్యంత తక్కువ వేతనానికి, రోజుకు అనేక గంటలపాటు పని చేయించే బట్టల తయారీ…

అమెరికాలో అతి పెద్ద కుంభకోణం ఏది? -కార్టూన్

—*— సర్వేయర్: ఒబామా పరిపాలనను ఎక్కువగా నష్టపరుస్తున్న కుంభకోణం ఏదని మీ అభిప్రాయం? బెంఘాజి… ఎ.పి, ఫాక్స్ న్యూస్ సంస్ధల ఫోన్ రికార్డులను ప్రభుత్వం సంపాదించడమా లేక కన్సర్వేటివ్ గ్రూపులను ఐ.ఆర్.ఎస్ టార్గెట్ చెయ్యడమా? ముక్త కంఠంతో: ఆర్ధిక వ్యవస్ధ!! —*— 2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దరిమిలా అమెరికా ప్రజల జీవన ప్రమాణాలు ఘోరంగా దిగజారాయి. సంక్షోభ భారం అంతా ప్రజలపై మోపి చేతులు దులుపుకున్న ప్రభుత్వం సంక్షోభానికి కారణమైన వాల్ స్ట్రీట్ కంపెనీలను మాత్రం…

వూల్ విక్ హంతకుడికి ఎం.ఐ-5 జాబ్, ఒక పరిశీలన

పశ్చిమ దేశాల మిలట్రీ గూఢచార సంస్ధలు టెర్రరిస్టులతో నిత్యం సంబంధం కలిగి ఉంటాయన్న వాస్తవాన్ని వూల్ విక్ హత్యోదంతం మరొకసారి వెలుగులోకి తెచ్చింది. పశ్చిమ దేశాలకు ఇస్లామిక్ టెర్రరిజం వ్యూహాత్మక మిత్రుడే కానీ శత్రువు కాదని అంతర్జాతీయ పరిశీలకులు ఎప్పుడూ చెప్పే మాట. లండన్ వీధుల్లో జరిగిన హత్య, అనంతరం వెల్లడి అవుతున్న విషయాలు ఈ సంగతిని ధృవీకరిస్తున్నాయి. లండన్ లోని వూల్ విక్ సబర్బ్ లో ఒక మిలట్రీ డ్రమ్మర్ ను పాశవికంగా చంపాడని బ్రిటిష్…

సొంత డబ్బాకు అమ్మ, నాయనమ్మలు కావాలా?

— “…తనకు నాయకత్వ సామర్ధ్యం ఏ మాత్రం ఉందో కనిపెట్టడానికి రాహుల్ జీ ప్రయత్నిస్తున్నట్లున్నారు…” — కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యాక రాహుల్ గాంధీ తన మొట్టమొదటి పార్టీ అధికారిక పర్యటనకు ఢిల్లీనే ఎంచుకున్నారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని గురువారం సందర్శించిన రాహుల్ గాంధీ తాను క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోనని చెప్పారు. అంతవరకు సంతోషమే. కానీ అలా చెప్పడానికి తన అమ్మగారు, నాయనమ్మ గారిని అడ్డం పెట్టుకోవడమే ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. తాను తన అమ్మగారు…

చెన్నై టీం ఓనర్లే స్పాట్ ఫిక్సర్లు, పందెందార్లు

కలుగులో ఎలుక బైటికి వచ్చేస్తోంది. పోలీసులు పెట్టిన పొగ తట్టుకోలేక పుట్టలో పాములు వరుసగా తోసుకుని బైటికొస్తున్నాయి. విందూ దారా సింగ్ ఇచ్చిన వివరాలు నిజమేనని ముంబై పోలీసులకు స్పష్టంగా అర్ధం అయింది. స్పాట్ ఫిక్సింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని, బి.సి.సి.ఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు, ఇండియా సిమెంట్స్ కంపెనీ అధినేతల్లో ఒకరు అయిన గురునాధ్ మీయప్పన్ పాత్ర ఉన్నదని ముంబై పోలీసుల వద్ద సరిపోయినన్ని సాక్ష్యాలు ఉన్నాయట. ఈ మేరకు ముంబై జాయింట్…

పన్ను ఎగవేతకు ఆప్! -కార్టూన్

ఆమె: యాపిల్ కంపెనీ బిలియన్ల కొద్దీ పన్నులు ఎగవేయగలిగింది తెలుసా! అతడు: భలే, దాని కోసం ఆప్ ఏమన్నా ఉందా ఏమిటి? – అప్లికేషన్ అనే పదానికి ‘ఆప్’ అనే పొట్టి మాటను బహుళ ప్రచారంలోకి తెచ్చింది బహుశా మొదట యాపిల్ కంపెనీయే అనుకుంటా. యాపిల్ ఫోన్ల పైన నిలువు అడ్డ వరుసల్లో కనిపించే విధంగా స్టీవ్ జాబ్స్ కంపెనీ వివిధ అప్లికేషన్ల ఐకాన్లను డిజైన్ చేసిన తరువాత అది విపరీతంగా క్లిక్ అయింది. దానితో ఇతర…

పాక్ పౌర విమానాన్ని దారిమళ్లించిన బ్రిటన్ ఫైటర్ జెట్స్, ఇద్దరు అరెస్టు

బి.బి.సి, రాయిటర్స్ వార్తా సంస్ధల ప్రకారం విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరిని బ్రిటన్ లోని ఎసెక్స్ పోలీసులు అరెస్టు చేశారు. విమానంలో 297 మంది ప్రయాణిస్తున్నారని ది హిందు, ఎన్.డి.టి.వి, రాయిటర్స్ చెప్పగా బి.బి.సి మాత్రం ప్రయాణికులు 308 మంది విమాన సిబ్బంది 14 మంది విమానంలో ఉన్నారని తెలిపింది. రెండు రోజుల క్రితం లండన్ లోని వూల్ విక్ అనే చోట ఇద్దరు నైజీరియా సంతతి యువకులు ఒక బ్రిటిష్ సైనికుడిని నడి రోడ్డు పైన హత్య…

ఐ.పి.ఎల్ ఫిక్సింగ్: విందూ, చెన్నై యజమాని పందెందారు

చనిపోయిన మాజీ నటుడు దారాసింగ్ తనయుడు విందూ దారా సింగ్, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని, బి.సి.సి.ఐ కార్యదర్శి శ్రీనివాసన్ అల్లుడు గురునాధ్ మీయప్పన్ తరుపున అనేకసార్లు పందెం కాసినట్లు తెలుస్తోంది. మీయప్పన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సి.ఐ.ఓ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) కూడా. అనేకమంది ప్రముఖుల పేర్లను కూడా విందూ సింగ్ చెన్నై పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అనేకమంది సినిమా తారలు, పేరు మోసిన మాజీ క్రికెటర్, ప్రస్తుతం కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న ప్రముఖ మాజీ…

ఐ.పి.ఎల్ మాయల బూరోడు -కార్టూన్

పైడ్ పైపర్ అనేది జర్మనీలో బహుళ ప్రచారంలో ఉన్న ఒక కధ. ఓ చిన్న నగరానికి ఎలుకలు పెద్ద బెడదగా ఉండేవిట. వాటిని వదిలించుకోడానికి నగర జనం, అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. ఒకసారి బూర (పైపర్) ఊదుకుంటూ రంగు రంగుల దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఆ నగరానికి వచ్చాడు. ఎలుకలను తాను తరిమేస్తానని, అందుకు తనకు తగిన ఫలితం ఇవ్వాలని కోరాడాయన. ప్రజలు, మేయర్ చర్చించుకుని పెద్ద మొత్తం ఇవ్వడానికి సరేనన్నారు.…

టెర్రరిస్టులకు మద్దతుగా ఇజ్రాయెల్ ట్యాంకు, ధ్వంసం చేసిన సిరియా

పశ్చిమ మీడియా రిపోర్ట్ చేయని వార్త ఇది. సరిహద్దు దాటి సిరియాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ ట్యాంకును సిరియా బలగాలు ధ్వంసం చేశాయని సిరియా మిలట్రీ కమాండ్ తెలియజేసింది. ఈ మేరకు గ్లోబల్ రీసర్చ్ సంస్ధ అధినేత ప్రొఫెసర్ మైఖేల్ చోసుడోవ్ స్కీ తమ వెబ్ సైట్ లో మంగళవారం సమాచారం ప్రచురించారు. సిరియాలో ఆల్-ఖైదా శాఖ ఆల్-నుస్రా ఫ్రంట్ టెర్రరిస్టులు చావు దెబ్బలు తింటూ స్ధైర్యం కోల్పోతున్న స్ధితిలో వారిని ఉత్సాహ పరిచే ఉద్దేశ్యంతో ఇజ్రాయెల్ తన…

మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం -కార్టూన్

ఉత్తర ప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ ప్రయాణం ఒక వింత రూపాన్ని సంతరించుకుంది. ఆ పార్టీ వ్యవస్ధాపకుడు కాన్షీరామ్ బతికి ఉంటే ఎలా ఉండేదో గానీ పార్టీ స్ధాపన సమయంలో ఆయన  చెప్పిన సిద్ధాంతాలకు చెదలు పట్టాయి. ఈ చెదలకు సైద్ధాంతీక పోషకత్వం స్వయంగా కాన్షీరామ్ వారసురాలు మాయావతియే కావడం ఒక విపరిణామం. భూస్వామ్య కులాల వలలో చిక్కిన కొద్దిమంది ఉప నాయకులు పార్టీ వ్యవస్ధాపాక సిద్ధాంతాలతో విభేదించి పార్టీని చీల్చి అగ్రకుల భూస్వామ్యులతో కలిసిపోతే…

అమెరికా: తుపాకులు పట్టుకు తిరిగేవారిలో తెల్లవారే ఎక్కువ

న్యూయార్క్ నగరంలో నల్లవారి కంటే తెల్లవారే ఎక్కువగా తుపాకులు పట్టుకుని తిరుగుతున్నారని న్యూయార్క్ పోలీసుల సర్వేలో తేలింది. నేరం జరిగినప్పుడల్లా నల్లవారిని అనుమానించే న్యూయార్క్ పోలీసుల ధోరణిలో తీవ్ర తప్పిదం ఉందని దీని ద్వారా స్పష్టం అవుతోంది. న్యూయార్క్ పోలీసులు గత రెండు మూడు సంవత్సరాలుగా పాటిస్తున్న stop-and-frisk ఆపరేషన్లలో సేకరించిన డేటా ద్వారా నల్లవారి కంటే రెట్టింపు సంఖ్యలో తెల్లవారి దగ్గరే ఆయుధాలు లభ్యమయ్యాయని రష్యా టుడే తెలిపింది. న్యూయార్క్ పోలీసుల స్టాప్-అండ్-ఫ్రిస్క్ ఆపరేషన్ పలు…

హ్యాట్రిక్ ఊపులో మన్మోహన్ -కార్టూన్

వేగంగా పరుగెత్తాలని గుర్రాన్ని ఆదేశించాలంటే అశ్వికుడు ‘గిడియాప్’ అంటాడట. యు.పి.ఏ ఆస్వారూఢుడైన అశ్వికులు మన్మోహన్ సింగ్ గారు తొమ్మిదేళ్ల శ్రమతో నిర్మించిన రోడ్డు పైన తన గుర్రానికి అదే ఆదేశాలిస్తున్నారు. హ్యాట్రిక్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ మధ్య విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్, మూడోసారి ప్రధాని అయ్యే అవకాశాలని తోసి పుచ్చలేదని వార్తలు వచ్చాయి. మొన్నటితో మన్మోహన్ పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్ళీ అదే చర్చ తలెత్తింది. దానినే కార్టూనిస్టు ఎత్తిచూపిస్తున్నారు. అసలు…

ప్రకృతి ఒక్క కసురు కసిరితే చాలు… విలయమే ఇక!

మే 20 తేదీన అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రాన్ని ఒక భారీ పెను తుఫాను తాకింది. ఓక్లహామా నగరం దగ్గర్లోని మూరే లో ఈ తుఫాను సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. మధ్యాహ్నం పూట సంభవించిన ఈ రాక్షస తుఫాను దెబ్బకి 24 మంది చనిపోయారని అంట్లాంటిక్ పత్రిక తెలిపింది. గంటకు 200 మైళ్ళ వేగంతో వీచిన విధ్వంసక పెనుగాలులు కలపతో నిర్మించిన ఇళ్లను ఎత్తి కుదేసినట్లు పెకలించి వేశాయి. రెండు మైళ్ళ వెడల్పున విస్తరించిన ఒక…

రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన యాపిల్!

పన్ను ఎగవేయడం ఒక కళ. ఆ కళలో ఆరితేరింది యాపిల్ కంపెనీ. ప్రపంచ వ్యాపితంగా పదుల కొద్దీ డూప్లికేట్ కంపెనీలు స్ధాపించి ‘టాక్స్ ప్లానింగ్’ పేరుతో ‘టాక్స్ ఏవేజన్’ కి పాల్పడడంలో యాపిల్ నేర్పరి అని ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను రుజువు చేస్తూ సదరు కంపెనీ 74 బిలియల్ డాలర్లు (దాదాపు రు. 4 లక్షల కోట్లకు సమానం) పన్ను ఎగవేసిందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఆరోపించడమే కాక విచారణ కూడా ప్రారంభించింది.…