ఓ సమైక్య మొగుడి ఆధిపత్యం చూసి తీరాలి -వీడియో

రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్ధితులకు ఈ వీడియో చక్కగా అద్దం పడుతోంది. సంసారంలో భార్యా, భర్తలు ఇద్దరూ సమానం అయితేనే అది సజావుగా నడుస్తుంది.  కానీ పురుషాధిక్య సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం అనేక సందర్భాల్లో డొల్లగా మారిపోయింది. చట్టాలు పురుషాధిక్యతను తిరస్కరిస్తున్నట్లు చెబుతాయి. స్త్రీలపై జరిగే అన్యాయాలను అరికట్టడానికే కంకణం కట్టుకున్నట్లు బల్లలు గుద్దుతాయి. కానీ అమలు విషయంలో అదంతా నాటకం అని తేలిపోతుంది. ఆచరణలోకి వచ్చేసరికి అమలు చేయాల్సింది మళ్ళీ ఆ పురుషులే, లేదా పురుషాధిక్య…

ప్రవేశపెడ్తున్నాం, మోడి ఫిడేల్ సింఫొనీ -కార్టూన్

బి.జె.పి ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడిని ప్రకటించే రోజు ‘ఇదిగో ఈ రోజే’ అనీ, ‘కాదు, కాదు రేపే’ అనీ పత్రికలు, ఛానెళ్లు ఒకటే రచ్చ! కానీ ఆ రోజు మాత్రం రావడం లేదు. సెప్టెంబరు 17 లోపు ప్రకటిస్తారని తాజాగా పత్రికల కధనం. కానీ అద్వానీని మె(ఒ)ప్పించడమే బి.జె.పి, ఆర్.ఎస్.ఎస్ సంస్ధలకు మహా కష్టం అయిందని వార్తలు చెబుతున్నాయి. ఆర్.ఎస్.ఎస్ పనుపున, ఆర్.ఎస్.ఎస్ రాయబారిగా మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ అద్వానితో చర్చలు జరపడం ఒకసారి…

యు.పి: మంటలు ఆర్పు తున్నట్లా? ఎగదోస్తున్నట్లా?

ఉత్తర ప్రదేశ్ లో మరొకసారి మత విద్వేషపు మంటలు రగిలాయి. కాదు, రగల్చబడ్డాయి. బి.జె.పి ఒక ప్రణాళిక ప్రకారం కుట్ర చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టిందని సమాజ్ వాదీ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ కూడా అదే ఆరోపణలు చేస్తోంది. జరిగిన సంఘటనలు కూడా ఆ వాదనను నిజం చేస్తున్నాయి. బి.కె.యు అనే రైతు సంఘం నిర్వహించిన భారీ బహిరంగ సభలో బి.జె.పి నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లనే భారీ సంఖ్యలో (ఇప్పటివరకూ 40 మంది చనిపోయారని…

హైద్రాబాద్ రెవిన్యూ, పెట్టుబడులు, వాస్తవాలు

‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఖాయం, వెనక్కి వెళ్ళేది లేదు’ అని కాంగ్రెస్ అధినాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర నాయకులు హైద్రాబాద్ సెంటిమెంటును తమ ప్రాంత ప్రజల్లో విస్తృతంగా ప్రవేశపెట్టారు. దశాబ్దాల తరబడి సీమాంధ్రులు రాజధానిని అభివృద్ధి చేశారని, ఇప్పుడు వెళ్లమంటే ఎలా వెళ్తాం అని పెట్టుబడిదారులు, భూస్వాములు వాదిస్తున్నారు. వారి వాదనలను ప్రజలు కూడా మోస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది. ‘హైద్రాబాద్ రెవిన్యూ ఆదాయం ఎలా పోగొట్టుకుంటాం?’ అన్న సూపర్ ధనికుల ప్రశ్నకు పై…

సిరియా: కాంగ్రెస్ లో నేను ఓడిపోవచ్చు -ఒబామా

సిరియాపై దాడి చేయడానికి కాంగ్రెస్, సెనేట్ ల అనుమతి కోరిన బారక్ ఒబామా, ఓటింగులో తాను ఓడిపోవచ్చని అంగీకరించాడని అసోసియేటెడ్ ప్రెస్ (ఎపి) వార్తా సంస్ధ తెలిపింది. సోమవారం ఎన్.బి.సి చానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఒబామా ఈ విధంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఐతే ఓటింగులో ఓడిపోతే ఏమి చేసేదీ చెప్పడానికి ఒబామా నిరాకరించారు. ఆ విషయమై తానింకా నిర్ణయించుకోలేదని ఆయన చెప్పారు. సిరియాపై దాడికి అమెరికా ఉభయ సభలను, ప్రజలను ఒప్పించడానికి తంటాలు పడుతున్న ఒబామా…

అమెరికా రసాయన దుష్ట చరిత్ర -2

(ఇది కూడా రామ్మోహన్ గారు రాసినదే.) విలియం బ్లం చెప్పింది నేను పాక్షికంగానే రాశాను. ఇరాక్ లో 1985 నుండి 1989 దాకా వివిధ రకాల విషపదార్ధాలను ఆయుదాల తయారీకి కోసం ఇరాక్ కు ఎగుమతి చేశారు. బాసిలస్ ఆంత్రాక్స్ – ఆంత్రాక్స్ కోసం క్లొస్ట్రిడియం బొటులినం -ఒక విషపదార్ధం. హిస్ట్రొప్లస్మా కాప్స్లేటం- శ్వాశకొశం, మెదడు, వెన్నెముక, హృద్రోగాలు కలిగించే విషం ఇది. బ్రుసెలా మెలిటిన్సి-అంగవికలురను చేసేపదార్ధం. క్లొస్ట్రియం పెర్విజెన్స్- దీర్ఘకాలిక జబ్బులను కలిగించటానికి. క్లొస్ట్రిడియం టిటాని-…

అమెరికాను చుట్టుముట్టిన యుద్ధ వ్యతిరేకత

సిరియాపై దాడికి సిద్ధపడుతున్న ఒబామా ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా అమెరికా ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నారు. దేశాన్ని తీవ్ర ఆర్ధిక సంక్షోభం లోకి నెట్టిన ఆఫ్ఘన్, ఇరాక్ యుద్ధాలనుండి పాఠాలు నేర్వని పాలకులపై అమెరికా ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజాభీష్టాన్ని గమనించిన అనేకమంది కాంగ్రెస్ సభ్యులు ఒబామా దాడి నిర్ణయానికి మద్దతు ఇవ్వాలా లేదా అన్న విషయంలో ఊగిసలాటలో పడిపోయారు. కాంగ్రెస్ సభ్యుల ఊగిసలాట వైఖరిని గుర్తించిన ఒబామా ప్రభుత్వం సిరియాలో రసాయన దాడి జరిగిందనడానికి రుజువు చేసే వీడియోలను…

అమెరికా రసాయన దుష్ట చరిత్ర, క్లుప్తంగా….

(ఇది రామ్మోహన్ గారి వ్యాఖ్య. కొంచెమే అయినా విలువైన సమాచారం!) అమెరికా జీవ రసాయన ఆ యుదాలను 1940 నుండి వాడుతోంది. అమెరికా, కెనడా, బ్రిటన్ సంయుక్తంగా కరేబియన్ సముద్రంలొబాక్టీరియా స్ప్రే చేశాయి. లక్షలాది జలచరాశులు మరణించాయి. కొరియా మీదా వెదజల్లింది. దీనివల్ల లక్షలాది మంది ప్లేగు, ఆంత్రాక్స్, మెదడు వాపు వ్యాధి వగైరా రోగాలు ప్రబలి జనం మరణించారు. 1967-69లో ఏజెంట్ ఆరెంజ్ ను 23,607 ఎకరాల కొరియా పంట పొలాల మీద స్ప్రే చేసింది…

బహుశా, ఈ టెంప్లేట్ అందరికీ నచ్చుతుంది!

‘తెలుగువార్తలు డాట్ కామ్’ ఉరఫ్ ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగ్ కోసం టెంప్లెట్ వేట ఇంకా ఆగిపోలేదు. ఆక్సిజన్ అలంకారం (అదేనండీ, ధీమ్ ఉరఫ్ టెంప్లేట్) కూడా ఎవరికీ పెద్దగా నచ్చలేదని అర్ధం అయిపోయింది. మిత్రులు ఆ సంగతి నేరుగా చెప్పలేక ‘అది ఉంది కానీ ఇది లేదు’ ‘ఫర్ఫాలేదు, కానీ అంతకుముందుదే బాగుంది’ లాంటి వ్యాఖ్యలతో తమ అసంతృప్తిని పరోక్షంగా చెప్పేశారు. నిజానికి ‘ఆక్సిజన్’ నాకూ నచ్చలేదు. వేణు గారు అన్నట్లు అది క్లమ్సీగా…

చదువు: కొందరికి లక్షలతో, అనేకులకు వివక్షలతో…

‘అక్షర లక్షాధికారి’ అని శ్రీశ్రీకి పేరు. అక్షరాలను ఒడుపుగా పట్టుకుని, ఛందోబద్ధ పరిష్వంగాలను వదులించుకుని, లక్షలాది అక్షరాలతో యధేచ్చ ఉరికిపడే జలపాతంలా కవితా ఝరులను సృష్టించినందుకు ఆయనకు ఆ పేరు దక్కింది. ఇప్పుడు అక్షరాలతో లక్షాధికారులు అవుతున్నవారు ఎంతమందో కానీ, లక్షల రూపాయలకు అక్షరాలను అమ్ముకుంటున్నవారికి కొదవలేదు. తమ విద్యార్ధులకు ఇప్పటికీ ప్రభుత్వ బడుల్లోనే విద్యా బుద్ధులు నేర్పిస్తున్న పశ్చిమ దేశాలు మూడో ప్రపంచ దేశాల్లో మాత్రం విద్యను అమ్మి తీరాలని శాసించాయి. డంకేల్ ఒప్పందం ద్వారా,…

ప్రశ్నలు పంపాల్సిన ఈ మెయిల్ అడ్రస్

పాఠకుల సలహా మేరకు ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగ్ లో ‘ప్రశ్న-జవాబు’ కేటగిరీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాఠకులు తమ ప్రశ్నలు ఎక్కడ వేయాలో ఇంకా ఆలోచించలేదని ఆ కేటగిరీ ప్రారంభిస్తూ చెప్పాను. ‘ఎందుకో? ఏమో’ బ్లాగర్ గారు నా ఈ మెయిల్ అడ్రస్ కు ప్రశ్నలు పంపే అవకాశం ఇవ్వొచ్చని సలహా ఇచ్చారు. ఆలోచించగా, చించగా…. అదే బెటర్ గా తోచింది. పాఠకులు తమ ప్రశ్నలను పంపాల్సిన నా ఈ-మెయిల్ చిరునామా: visekhar@teluguvartalu.com నేను…

అమెరికా దాడి చేస్తే సిరియాకు సాయం చేస్తాం -పుతిన్

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ రంగంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో సాహసోపేతమైన అడుగు వేసినట్లే కనిపిస్తోంది. అంతర్ధానం అవుతున్న అమెరికా ప్రాభవం స్ధానంలో రష్యాను ప్రవేశపెట్టడానికి లేదా రష్యాకు వీలయినంత చోటు దక్కించడానికి పుతిన్ ఏ అవకాశాన్ని వదులుకోదలచలేదని ఆయన మాటలు చెబుతున్నాయి. పెద్దగా పటాటోపం లేకుండా, వాగాడంబరం జోలికి పోకుండా నిశ్శబ్దంగానే అయినా స్ధిరంగా ఆయన వేస్తున్న అడుగులు, చేస్తున్న ప్రకటనలు పశ్చిమ సామ్రాజ్యవాదులకు బహుశా చెమటలు పట్టిస్తుండవచ్చు. సిరియాపై అమెరికా ఏకపక్షంగా దాడి…

పోనీ, ఈ టెంప్లేట్ ఎలా ఉంది?

సెలెక్టా ధీమ్ మెజారిటీ పాఠకులకు నచ్చలేదని అర్ధం అయింది. ఒక్క తిరుపాలు గారు తప్ప ఇతర మిత్రులంతా బాగాలేదనే చెప్పారు. ముఖ్యంగా చందుగారు చెప్పినట్లు బ్లాగ్ లోని వివిధ టపాలకు తేలికగా ప్రవేశం ఉండేలా డిజైన్ ఉండడం చాలా అవసరం. అది సెలెక్టా ధీమ్ కి లేదని అర్ధం అవుతోంది. ఈసారి ఆక్సిజన్ ధీమ్ ని అమర్చాను. బహుశా ఇది బాగుందనుకుంటాను. దీని పైన కూడా మిత్రుల అభిప్రాయాలను కోరుతున్నాను.

‘తెలుగు వార్తలు’ కొత్త టెంప్లేట్, సూచనలివ్వండి!

సందర్శకులకు ఓ చిన్న విన్నపం! ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగు కోసం కొత్త టెంప్లేట్ ను అమర్చాను. ఇది పాఠకులకు అనుకూలంగా ఉన్నదని నా అంచనా. కానీ పాఠకులకు అనుకూలంగా ఉందా లేదా అన్న సంగతి ప్రధానంగా పాఠకులు చెప్పాలి తప్ప నేను కాదు. అందుకే మీ సూచనలను ఆహ్వానిస్తున్నాను.