అధ్యక్షా! తల ఎక్కడ పెట్టుకుంటారు?

సిరియా ప్రభుత్వ బలగాల వద్ద రసాయన ఆయుధాలు ఉన్నాయని, సామూహిక విధ్వంసక ఆయుధాలుగా ఐరాస వర్గీకరించిన ఈ ఆయుధాలను సిరియా ప్రభుత్వం తిరుగుబాటుదారులపై వినియోగించినట్లయితే అది ‘ఎర్ర గీత’ దాటినట్లేనని అమెరికా అధ్యక్షుడు ఒబామా గత సంవత్సరం హెచ్చరించాడు. కానీ ఐరాస మానవ హక్కుల సంస్ధ ప్రతినిధి, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ప్రాసిక్యూటర్లలో ఒకరు అయిన కార్లా డెల్ పాంటే ప్రకారం సిరియా కిరాయి తిరుగుబాటుదారులే సిరియా ప్రజలపై రసాయన ఆయుధాలు వాడారనేందుకు ప్రాధమిక సాక్ష్యాలు లభ్యమయ్యాయని…

కొత్త పరిణామం: మధ్యప్రాచ్యంలో చైనా రంగ ప్రవేశం?

అంతర్జాతీయ రంగంలో ఎంత మెల్లగానైనా బలాబలాల్లో మార్పులు వస్తున్నాయనడానికి తార్కాణంగా మరో పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ రాజకీయాలకు కేంద్రంగా ఉండే మధ్య ప్రాచ్యంలో చైనా రాజకీయ అరంగేట్రంకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. బద్ధ శత్రువులైన పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రభుత్వాల అధినేతలు ఇద్దరూ ఇప్పుడు చైనా పర్యటనలో ఉండడం ఈ ఏర్పాట్లలో ఒక భాగంగా చూడవచ్చు. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ రాజధాని బీజింగ్ లో విమానం దిగుతుండగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చైనా వాణిజ్య…

చైనా సేనలు వెనక్కి వెళ్లాయోచ్!

యు.పి.ఎ ప్రభుత్వానికి ఒక తలనొప్పి తప్పినట్లుంది. దౌలత్ బేగ్ ఒల్డీ సెక్టార్ లో 19 కి.మీ మేర భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చాయని ఆరోపించబడిన చైనా సేనలు వెనక్కి వెళ్లిపోయాయి. చైనా చొరబాటుకు ప్రతిగా చైనా సైనిక గుడారాలకు 300 కి.మీ దూరంలోనే మరో శిబిరం ఏర్పాటు చేసిన భారత సేనలు కూడా వెనక్కి వచ్చేశాయని తెలుస్తోంది. ఉన్నతస్ధాయి చర్చల అనంతరం ఈ ఆకస్మిక పరిణామం జరిగింది. ఇరు సేనలు నాలుగు పతాక సమావేశాలు జరిపినా ముగిసిపోని…

సరబ్ జిత్ లాగే మాకూ డబ్బివ్వాలి, కోర్టుకు గూఢచారుల మొర

ఇంతకీ సరబ్ జిత్ సింగ్ ఎవరు? పాకిస్ధాన్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు టెర్రరిస్టా? ఆయన కుటుంబం చెబుతున్నట్లు తాగి ఏమి చేస్తున్నాడో, ఎటు  వెళుతున్నాడో తెలియని అమాయక తాగుబోతా? భారత ప్రభుత్వం సొంతం చేసుకోలేని గూఢచారా? భారత పత్రికలు సరబ్ జిత్ సింగ్ గురించి అతని కుటుంబ సభ్యులు చెప్పిన ‘అమాయక తాగుబోతు’ కధని వల్లించినప్పటికీ బి.బి.సి, సి.ఎన్.ఎన్ లాంటి పశ్చిమ దేశాల పత్రికలు ఆయనను భారత గూఢచారి అనే సంబోధిస్తూ వచ్చాయి. ది హిందు పత్రిక ఆదివారం…

సీతాకోకచిలకలా ఎగరాలి, తేనెటీగలా కుట్టాలి… -కార్టూన్

“Float like a butterfly, sting like a bee” అనేది ఒక పాట. బ్రిటిష్ పాప్ సింగర్ ఫిల్ మార్షల్ రాసి పాడిన పాట ఇది. ఆ పాటని భారత విదేశాంగ విధానానికి అన్వయించారు కార్టూనిస్టు కేశవ్. ఆయన సెన్సిబుల్ కార్టూనిస్టు అనడానికి ఈ కార్టూన్ మరొక మచ్చుతునక. ఇటీవల కాలంలో రెండు (స్వ)విదేశీ సమస్యలు భారత విదేశాంగ విధానానికి పరీక్ష పెట్టాయి. అమెరికా ‘ఆసియా పివోట్’ వ్యూహంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ ను మిత్రుడుగా…

చైనా చేతిలో అమెరికా మిలట్రీ రహస్యాలు

ఒక అమెరికా మిలట్రీ కాంట్రాక్టర్ లాప్ టాప్ ను హ్యాక్ చెయ్యడం ద్వారా అమెరికాకి చెందిన అతి కీలక మిలట్రీ రహస్యాలను దొరకబుచ్చుకున్నారు చైనా మిలట్రీ హ్యాకర్లు. ఒకటి, రెండూ కాదు ఏకంగా మూడేళ్ళ పాటు అమెరికా మిలట్రీకి చెందిన మిలియన్ల కొద్దీ డాక్యుమెంట్లను లేదా టెరా బైట్ల కొద్దీ డేటాను షాంఘై ఆధారిత హ్యాకర్ గ్రూప్ ఒకటి సంపాదించగలిగింది. “కామెంట్ క్రూ” గా పిలుస్తున్న ఈ హ్యాకర్ గ్రూపు పనితనాన్ని తక్కువ చేయడానికి కాంట్రాక్టర్ సంస్ధ…

అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలతో కొరియాల వద్ద ఉద్రిక్తతలు

ఉభయ కొరియాల వద్ద అమెరికా సాగిస్తున్న ‘మిలట్రీ డ్రిల్’ (కోడ్ నేమ్ ఫోల్ ఈగిల్) ఉద్రిక్తతలు రెచ్చగొడుతోంది. మున్నెన్నడూ లేని విధంగా అణు బాంబులు జారవిడిచే బి-2 బాంబర్ యుద్ధ విమానాలను కొరియా భూభాగంపై ఎగరడంతో ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది. కొరియా భూభాగంపై 10,000 కి.మీ ఎత్తు ఎగురుతూ బి-2 బాంబర్లు ‘మాక్ బాంబింగ్’ డ్రిల్ (పేలుడు పదార్ధాలు లేని బాంబు జారవిడిచి అది అనుకున్న చోట పడేదీ, లేనిదీ నిర్ధారించుకోవడం) నిర్వహించడంతో ఉత్తర కొరియా…

సి.ఐ.ఎ వద్ద డబ్బు తీసుకున్నా, ఆఫ్ఘన్ అధ్యక్షుడి ఒప్పుకోలు

ఆఫ్ఘనిస్ధాన్ ప్రభుత్వంలో అవినీతి గురించి తెగ బాధపడిపోయే అమెరికా అవినీతి భాగోతాన్ని ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ స్వయంగా బైటపెట్టాడు. తాను సి.ఐ.ఎ వద్ద డబ్బు తీసుకున్నమాట నిజమేనని కానీ ఆ డబ్బు గాయపడినవారికి, జబ్బు పడినవారికి, కొన్ని ఇళ్లకు అద్దె చెల్లించడానికి వినియోగించానని హమీద్ కర్జాయ్ నమ్మబలికాడు. ఆఫ్ఘనిస్ధాన్ లో సి.ఐ.ఎ లంచాలు మేపడం కొత్తేమీ కాదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక సి.ఐ.ఎ చర్యలను సమర్ధించుకురాగా, సి.ఐ.ఎ సొమ్ము చివరికి తాలిబాన్ వద్దకే చేరుతోందని అనేకమంది…

ఇరాక్: ఆల్-జజీరా చానెల్ అనుమతి రద్దు

కతార్ రాజ్యాధినేత నడుపుతున్న ఆల్-జజీరా ఛానెల్ ఇరాక్ లో ప్రసారాలు చేయకుండా అక్కడి ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది. సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు ఆయుధ, ధన, మానవ వనరుల సహాయం అందజేస్తున్న కతార్ చానెల్ ఇరాక్ లో కూడా సెక్టేరియన్ విభజనలను రెచ్చగొడుతోందని ఇరాక్ ప్రభుత్వం ఆరోపించింది. ఆల్-జజీరాతో పాటు మరో 9 టి.వి చానెళ్లకు కూడా ఇరాక్ ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది. ఈ మేరకు ఇరాక్ అధికారులు ఆదివారం ప్రకటించారు. మెజారిటీ మతస్ధుల షియా…

విదేశీ జమలు, సిరియాలో అమెరికా కుట్ర…. క్లుప్తంగా-27.02.13

స్వదేశీయుల విదేశీ జమల్లో ఇండియా టాప్ విదేశాలలో పని చేసే స్వదేశీయులు తమ తమ దేశాలలోని కుటుంబాలకు తమ సంపాదనలో కొంత భాగాన్ని పంపుతుంటారు. ఇలా పంపే మొత్తాల్లో భారతీయులు పంపే మొత్తం మిగతా అన్నీ దేశాల కంటే ఎక్కువని ప్రపంచ భ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. 2012లో ఈ జమలు భారత దేశానికి 69 బిలియన్ డాలర్లు రాగా, చైనాకి వచ్చిన మొత్తం $60 బిలియన్లు. ఫిలిప్పైన్స్ ($24 B), మెక్సికో ($23 B), నైజీరియా ($21…

అంతులేని సరబ్ జిత్ కధ, ఇపుడు అంతానికి దగ్గర్లో?

తాగి ఎటు వెళుతున్నాడో తెలియని స్ధితిలో సరిహద్దు దాటాడని అతని కుటుంబ సభ్యులు సంవత్సరాలుగా మొత్తుకుంటున్నారు. పాక్ భూభాగం లోని పంజాబ్ రాష్ట్రంలో 1990లో జరిగిన వరుస పేలుళ్లకు కుట్ఱ పన్నాడని పాకిస్ధాన్ ప్రభుత్వం, పోలీసులు, న్యాయస్ధానం ఆరోపించి మరణ శిక్ష కూడా వేశేసాయి. ఆయన్ని విడిచి పెట్టాలని, కనీసం క్షమాభిక్ష అయినా పెట్టాలని కుటుంబ సభ్యులు ఏళ్ల తరబడి వేడుకుంటుండగానే సరబ్ జిత్ సింగ్ గురువారం ప్రాణాంతక దాడికి గురై తీవ్ర స్ధాయి కోమాలోకి వెళ్ళిపోయి…

ఘర్షణ వైపు నడుస్తున్న భారత్-చైనా సంబంధాలు?

  భారత్-చైనా సంబంధాలు మరొకసారి ఘర్షణాత్మక వైఖరిలోకి ప్రవేశించాయి. ఇరు పక్షాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునే దిశలో ఇరు దేశాలు కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వచ్చిన ప్రయత్నాలు ఒక్కసారిగా రద్దు కానున్నాయా అన్న అనుమానం కలిగే వైపుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ సరిహద్దు లో తిరిగి యధాతధ స్ధితిని తీసుకురావాలని భారత ప్రభుత్వం మంగళవారం చేసిన ప్రకటన పరిస్ధితి తీవ్రతను తెలియజేస్తోంది. ‘దౌలత్ బేగ్ ఓల్డి’ సెక్టార్ లో చైనా బలగాలు 10 కి.మీ దూరం…

లడఖ్ లో చొరబాటు వార్తలను తిరస్కరించిన చైనా

తూర్పు లడఖ్ ప్రాంతంలో పది కిలో మీటర్ల మేర చైనా సాయుధ బలగాలు ఇండియా భూభాగంలోకి చొచ్చుకు వచ్చాయన్న వార్తలని చైనా ఖండించింది. వాస్తవాధీన రేఖ (Line of Actual Control – LAC) కు సంబంధించి ఇండియాతో కుదిరిన ఒప్పందాలను తాము అతిక్రమించబోమని, తమ సైనికులు రేఖను దాడి వెళ్లలేదని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా సరిహద్దులో భారత ప్రయోజనాలను కాపాడుకోవడానికి భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని రక్షణ మంత్రి ఆంటోని ప్రకటించాడు.…

బోస్టన్ పేలుళ్లు: నిందితులు ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారే

బోస్టన్ బాంబు పేలుళ్లకు బాధ్యులుగా అమెరికా ప్రకటించిన చెచెన్యా జాతీయులు అనేక సంవత్సరాలుగా ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారేనని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారు బాంబులు అభివృద్ధి చేసి సి.సి కెమెరాలు చూస్తుండగా వాటిని సంచుల్లో పెట్టుకుని బోస్టన్ మారధాన్ స్ధలానికి తెచ్చి ఎలా పేల్చగలరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలిద్దరిని కుట్ర చేసి ఇరికించారని తల్లిదండ్రులు ఆరోపించినట్లు రష్యా టుడే తెలియజేసింది. ఎఫ్.బి.ఐ గూఢచారులు ఎప్పుడూ తమ ఇంటికి వచ్చేవారని, తమ పిల్లల గురించి…

శ్రీలంక: సాయంలో కోత పెట్టిన అమెరికా

శ్రీలంకకు ఇస్తున్న సహాయంలో అమెరికా కోత విధించింది. మానవ హక్కుల హరణ, మిలట్రీ జోక్యం వల్ల కోత విధిస్తున్నట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి చెప్పినట్లు పి.టి.ఐ తెలిపింది. ఎల్.టి.టి.ఇ యుద్ధం ముగిసిన తర్వాత ఉత్తరాన నివశిస్తున్న తమిళులకు పౌరహక్కులు కల్పించడంలోనూ, నాశనం అయిన నిర్మాణాలను పునర్నిర్మించడంలోను, రాజకీయంగా తమిళులను దేశంలో కలుపుకోవడంలోనూ శ్రీలంక ప్రగతి సాధించలేదని తాము ఇస్తున్న సాయం బాధితులకు అందకుండా మిలట్రీ జోక్యం చేసుకుంటోందని అమెరికా ప్రతినిధి తమ చర్యకు కారణంగా చెప్పాడు. ది…