పాక్ పౌర విమానాన్ని దారిమళ్లించిన బ్రిటన్ ఫైటర్ జెట్స్, ఇద్దరు అరెస్టు

బి.బి.సి, రాయిటర్స్ వార్తా సంస్ధల ప్రకారం విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరిని బ్రిటన్ లోని ఎసెక్స్ పోలీసులు అరెస్టు చేశారు. విమానంలో 297 మంది ప్రయాణిస్తున్నారని ది హిందు, ఎన్.డి.టి.వి, రాయిటర్స్ చెప్పగా బి.బి.సి మాత్రం ప్రయాణికులు 308 మంది విమాన సిబ్బంది 14 మంది విమానంలో ఉన్నారని తెలిపింది. రెండు రోజుల క్రితం లండన్ లోని వూల్ విక్ అనే చోట ఇద్దరు నైజీరియా సంతతి యువకులు ఒక బ్రిటిష్ సైనికుడిని నడి రోడ్డు పైన హత్య…

టెర్రరిస్టులకు మద్దతుగా ఇజ్రాయెల్ ట్యాంకు, ధ్వంసం చేసిన సిరియా

పశ్చిమ మీడియా రిపోర్ట్ చేయని వార్త ఇది. సరిహద్దు దాటి సిరియాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ ట్యాంకును సిరియా బలగాలు ధ్వంసం చేశాయని సిరియా మిలట్రీ కమాండ్ తెలియజేసింది. ఈ మేరకు గ్లోబల్ రీసర్చ్ సంస్ధ అధినేత ప్రొఫెసర్ మైఖేల్ చోసుడోవ్ స్కీ తమ వెబ్ సైట్ లో మంగళవారం సమాచారం ప్రచురించారు. సిరియాలో ఆల్-ఖైదా శాఖ ఆల్-నుస్రా ఫ్రంట్ టెర్రరిస్టులు చావు దెబ్బలు తింటూ స్ధైర్యం కోల్పోతున్న స్ధితిలో వారిని ఉత్సాహ పరిచే ఉద్దేశ్యంతో ఇజ్రాయెల్ తన…

మధ్య ఆసియా: మూసివేత దిశలో కిర్ఘిస్తాన్ అమెరికా ఆర్మీ బేస్

మధ్య ఆసియాలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే సంవత్సరం జులై నెల లోపుగా అమెరికా తన సైనిక స్ధావరాన్ని మూసేయాలని కిర్ఘిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వబోతోంది. ఈ మేరకు పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెడుతున్నామని ఆ దేశ ప్రభుత్వ కేబినెట్ తెలిపింది. ఈ పరిణామంతో మధ్య ఆసియాలో ప్రభావం కోసం అమెరికా, రష్యాల మధ్య జరుగుతున్న పోటీలో రష్యా మరొకసారి పైచేయి సాధించినట్లే. కొద్ది సంవత్సరాల క్రితం అమెరికా మద్దతుతో తనతో యుద్ధానికి తలపడిన జార్జియాను…

సిరియా భవిష్యత్తు నిర్ణయించడానికి వాళ్ళెవరు? -బషర్

సిరియా భవిష్యత్తు నిర్ణయించాల్సింది సిరియా ప్రజలు మాత్రమేనని ఆ దేశ అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సద్ మరోసారి స్పష్టం చేశారు. సిరియా ప్రజల తరపున మాట్లాడడానికి జాన్ కెర్రీ ఎవరని ఆయన సూటిగా ప్రశ్నించారు. అర్జెంటీనా టి.వి చానెళ్ల విలేఖరులకు ఇంటర్వ్యూ ఇచ్చిన బషర్ అమెరికా-రష్యా ల శాంతి సమావేశం ప్రయత్నాలు ఫలిస్తే సంతోషమని, కానీ పశ్చిమ దేశాలకు శాంతి ప్రయత్నాలు సఫలం కావడం ఇష్టం లేదని వ్యాఖ్యానించాడు. సిరియాలో కిరాయి తిరుగుబాటుదారులు ఎదురు దెబ్బలు తింటూ వరుస…

సిరియా: ఐరాసలో అమెరికాకు పడిపోతున్న మద్దతు

సిరియా కిరాయి తిరుగుబాటు విషయంలో అమెరికా క్రమంగా మద్దతు కోల్పోతోంది. అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలతో పాటు మధ్య ప్రాచ్యంలోని వివిధ ఇస్లాం మత ఛాందస రాజ్యాలు మద్దతు ఇస్తున్న కిరాయి తిరుగుబాటుదారులు సిరియా ప్రజలపై సాగిస్తున్న అకృత్యాలు క్రమంగా వెల్లడి అవుతుండడంతో పశ్చిమ రాజ్యాల ఎత్తుగడలకు మద్దతు ఇవ్వడానికి వివిధ దేశాలు వెనకాడుతున్నాయి. బుధవారం పశ్చిమ దేశాల మద్దతుతో ఐరాసలో కతార్ ప్రవేశపెట్టిన తీర్మానానికి గతం కంటే మద్దతు తగ్గిపోవడాన్ని అంతర్జాతీయ పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.…

కరుగుతున్న ఆర్కిటిక్, చమురు సంపదలో ఇండియాకీ వాటా?

భూ గ్రహం ఉత్తర ధ్రువం అయిన ఆర్కిటిక్ ఖండం వద్ద మంచు గడ్డలు వేగంగా కరిగిపోతున్నాయి. దానితో ఆ ఖండం వద్ద దాగిన అపార ఖనిజ, చమురు వనరుల కోసం పోటీ పేరుగుతోంది. ఈ పోటీలో భారత దేశం కూడా ప్రవేశించిన పరిణామం చోటు చేసుకుంది. ‘ఆర్కిటిక్ కౌన్సిల్’ లో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తూ వచ్చిన ఇండియాకు ‘పరిశీలక’ హోదా ఇస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇండియా, చైనాలతో పాటు ఆరు దేశాలకు ఈ హోదా…

రష్యాలో అమెరికా రాయబారి గూఢచర్యం, బహిష్కరణ

గూఢచర్యం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఒక అమెరికా రాయబారిని రష్యా ప్రభుత్వం అరెస్టు చేసింది. తర్వాత విడుదల చేసి వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అనంతరం అమెరికా రాయబార కార్యాలయం ప్రధాన రాయబారిని విదేశాంగ కార్యాలయానికి పిలిపించుకుని తన నిరసన తెలియజేసింది. ‘ప్రచ్ఛన్న యుద్ధం’ ముగిసిందని ప్రకటించినప్పటికీ అమెరికా, రష్యాల మధ్య గూఢచర్యం ఇంకా చురుకుగా కొనసాగుతోందనడానికి తాజా బహిష్కరణ మరొక సూచిక. రెండేళ్ల క్రితం అమెరికాలో గూఢచర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ అరడజనుకు…

సిరియా: ఇజ్రాయెల్ దూకుడుకి రష్యన్ మిసైల్ ముకుతాడు

సిరియా కిరాయి తిరుగుబాటులో అంతిమ అంకానికి అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది.  సిరియా లోని ఒక జాతీయ సైనిక శిబిరం పైకి ఇజ్రాయెల్ చేత ఇప్పటికీ మూడుసార్లు మిసైళ్లతో అమెరికా దాడి చేయించడంతో రష్యా తన శక్తివంతమైన ఎస్-300 మిసైల్ వ్యవస్ధను సిరియాకు సరఫరా చేయడానికి వేగంగా నిర్ణయం తీసుకుంది. ఎస్-300 క్షిపణులు సిరియా ప్రభుత్వం చేతికి వస్తే (ఒక మిసైల్ బ్యాటరీ ఇప్పటికే సరఫరా అయిందని వార్త) అమెరికా పధకాలు దాదాపు తల్లకిందులు అయినట్లే. అమెరికా అమ్ముల…

ఉత్తర కొరియా శాంతించినా, అణు వాహక నౌక తరలించిన అమెరికా

ఉభయ కొరియాల వద్ద నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్ధితులను శాంతింపజేయడానికి ఉత్తర కొరియా ప్రయత్నిస్తున్నప్పటికీ అమెరికా, దక్షిణ కొరియా దేశాలు మాత్రం తమ భారీ మిలట్రీ డ్రిల్ తో రెచ్చగొట్టుడు కార్యక్రమం కొనసాగిస్తున్నాయి. సరిహద్దు వద్ద మొహరించిన మధ్య శ్రేణి క్షిపణులను ఉపసంహరించడంతో పాటు ఉత్తర కొరియా తమ మంత్రివర్గంలో కూడా మార్పులు చేసి తద్వారా ఉద్రిక్తతలు శాంతించడానికి తన వంతు చర్యలు చేపట్టింది. అయితె అమెరికా, దక్షిణ కొరియాలు తదనుగుణంగా స్పందించలేదు. పైగా అమెరికా అణు…

అమెరికా డ్రోన్ హత్యలు అక్రమం -పాక్ కోర్టు

పాకిస్ధాన్ గిరిజన ప్రాంతాల్లో అమెరికా సైన్యం సాగిస్తున్న డ్రోన్ హత్యలు చట్ట విరుద్ధం అని ఒక పాకిస్ధాన్ కోర్టు తీర్పు ఇచ్చింది. అమెరికా డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా పాక్ ప్రభుత్వం, ఐరాస జోక్యం కోరాలని కూడా కోర్టు పాక్ ప్రభుత్వాన్ని కోరింది. అమెరికా తన వీటో అధికారాన్ని వినియోగించినట్లయితే ఆ దేశంతో దౌత్య సంబంధాలను రద్దు చేసుకునే అవకాశాలు పరిశీలించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. డ్రోన్ దాడులను అంగీకరిస్తూ పాక్ ప్రభుత్వం అమెరికాతో రహస్య ఒప్పందం…

అనూహ్య పరిణామం: సిరియాపై వెనక్కి తగ్గిన అమెరికా

నిత్యం పెనం మీద కాలుతుండే మధ్యప్రాచ్యం (Middle-East) ప్రాంతంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రష్యా పర్యటనలో ఉన్న అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ, ఊహించని రీతిలో సిరియా ప్రభుత్వానికి, తిరుగుబాటుదారులకు చర్చలు జరగడానికి అంగీకరించాడు. అధ్యక్షుడు బషర్ అస్సద్ గద్దె దిగితే తప్ప చర్చలు సాధ్యం కాదని హుంకరిస్తూ వచ్చిన అమెరికా, చర్చలకు అంగీకరించడం ప్రపంచంలో బలా బలాలు మారుతున్నాయనడానికి మరో ప్రబల సంకేతం. అమెరికా, ఐరోపాల ప్రాభవ క్షీణతలో మరో అధ్యాయానికి…

అధ్యక్షా! తల ఎక్కడ పెట్టుకుంటారు?

సిరియా ప్రభుత్వ బలగాల వద్ద రసాయన ఆయుధాలు ఉన్నాయని, సామూహిక విధ్వంసక ఆయుధాలుగా ఐరాస వర్గీకరించిన ఈ ఆయుధాలను సిరియా ప్రభుత్వం తిరుగుబాటుదారులపై వినియోగించినట్లయితే అది ‘ఎర్ర గీత’ దాటినట్లేనని అమెరికా అధ్యక్షుడు ఒబామా గత సంవత్సరం హెచ్చరించాడు. కానీ ఐరాస మానవ హక్కుల సంస్ధ ప్రతినిధి, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ప్రాసిక్యూటర్లలో ఒకరు అయిన కార్లా డెల్ పాంటే ప్రకారం సిరియా కిరాయి తిరుగుబాటుదారులే సిరియా ప్రజలపై రసాయన ఆయుధాలు వాడారనేందుకు ప్రాధమిక సాక్ష్యాలు లభ్యమయ్యాయని…

కొత్త పరిణామం: మధ్యప్రాచ్యంలో చైనా రంగ ప్రవేశం?

అంతర్జాతీయ రంగంలో ఎంత మెల్లగానైనా బలాబలాల్లో మార్పులు వస్తున్నాయనడానికి తార్కాణంగా మరో పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ రాజకీయాలకు కేంద్రంగా ఉండే మధ్య ప్రాచ్యంలో చైనా రాజకీయ అరంగేట్రంకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. బద్ధ శత్రువులైన పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రభుత్వాల అధినేతలు ఇద్దరూ ఇప్పుడు చైనా పర్యటనలో ఉండడం ఈ ఏర్పాట్లలో ఒక భాగంగా చూడవచ్చు. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ రాజధాని బీజింగ్ లో విమానం దిగుతుండగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చైనా వాణిజ్య…

చైనా సేనలు వెనక్కి వెళ్లాయోచ్!

యు.పి.ఎ ప్రభుత్వానికి ఒక తలనొప్పి తప్పినట్లుంది. దౌలత్ బేగ్ ఒల్డీ సెక్టార్ లో 19 కి.మీ మేర భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చాయని ఆరోపించబడిన చైనా సేనలు వెనక్కి వెళ్లిపోయాయి. చైనా చొరబాటుకు ప్రతిగా చైనా సైనిక గుడారాలకు 300 కి.మీ దూరంలోనే మరో శిబిరం ఏర్పాటు చేసిన భారత సేనలు కూడా వెనక్కి వచ్చేశాయని తెలుస్తోంది. ఉన్నతస్ధాయి చర్చల అనంతరం ఈ ఆకస్మిక పరిణామం జరిగింది. ఇరు సేనలు నాలుగు పతాక సమావేశాలు జరిపినా ముగిసిపోని…

సరబ్ జిత్ లాగే మాకూ డబ్బివ్వాలి, కోర్టుకు గూఢచారుల మొర

ఇంతకీ సరబ్ జిత్ సింగ్ ఎవరు? పాకిస్ధాన్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు టెర్రరిస్టా? ఆయన కుటుంబం చెబుతున్నట్లు తాగి ఏమి చేస్తున్నాడో, ఎటు  వెళుతున్నాడో తెలియని అమాయక తాగుబోతా? భారత ప్రభుత్వం సొంతం చేసుకోలేని గూఢచారా? భారత పత్రికలు సరబ్ జిత్ సింగ్ గురించి అతని కుటుంబ సభ్యులు చెప్పిన ‘అమాయక తాగుబోతు’ కధని వల్లించినప్పటికీ బి.బి.సి, సి.ఎన్.ఎన్ లాంటి పశ్చిమ దేశాల పత్రికలు ఆయనను భారత గూఢచారి అనే సంబోధిస్తూ వచ్చాయి. ది హిందు పత్రిక ఆదివారం…