పరిభాష తెలిస్తే తేలికే -ఈనాడు ఆర్టికల్ 3వ భాగం

“జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాంధించడమెలా?” ఆర్టికల్ మూడవ భాగం ఈనాడు చదువు పేజిలో ఈ రోజు ప్రచురించబడింది. బ్లాగ్ పాఠకుల కోసం ఇక్కడ ఇస్తున్నాను. బొమ్మపైన క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో ఆర్టికల్ చూడవచ్చు. ఈనాడు వెబ్ సైట్ లో చూడదలిచినవారు ఈ లింక్ క్లిక్ చేయగలరు.

షిండే గారు మళ్ళీ తొట్రుపడ్డారు…

అమెరికా ఉపాధ్యక్షుడు జోసెఫ్ బిడెన్ లాగా భారత హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు తొట్రుపడం అలవాటుగా మారినట్లుంది. ప్రభుత్వం లోని పెద్దలు రహస్యంగా దాచిపెట్టుకోవాల్సిన అంశాలను బహిరంగంగా ప్రకటించి ఆనక నాలిక్కరుచుకోవడం జో బిడెన్ కు ఉన్న అలవాటు. ఆ అలవాటు వలన బిడెన్ పైన అమెరికాలో అనేక జోకులు వ్యాప్తిలో ఉన్నాయి. మన షిండే గారు కూడా చెప్పకూడని సంగతులు బైటికి చెప్పడం, అనకూడని మాటలు అనేయడం, ఆనక ‘సారీ‘ చెప్పడం మామూలుగా మారింది.…

ఇరాన్, పశ్చిమ దేశాల అణు చర్చలు సానుకూలం?!

ఇది దాదాపు ఎవరూ ఊహించని పరిణామం! అప్పుడే ఒక అవగాహనకు రావడం తొందరపాటే అయినా ఈ మాత్రం సానుకూల వార్త రావడం కూడా అనూహ్యమే. కజకిస్తాన్ పాత రాజధాని అల్మాతిలో ఇరాన్, P5+1 దేశాల మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల అవగాహనతో ముగిసాయని ఇరాన్ ప్రతినిధి ప్రకటించడం ఇప్పటి ప్రపంచ పరిస్ధితులలో ‘అమ్మయ్య’ అనుకోవాల్సిన వార్త. ఇరాన్ అణు బాంబు తయారు చేస్తోందని చెబుతూ పశ్చిమ రాజ్యాలు ఆ దేశంపై దశాబ్దాలుగా అక్రమ ఆంక్షలు విధించి పసిపిల్లలకు…

పొదుపు విధానాలకు తిరస్కరణ, ఇటలీలో హంగ్ పార్లమెంటు

ఐ.ఎం.ఎఫ్, యూరోపియన్ యూనియన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు బలవంతంగా అమలు చేస్తున్న పొదుపు ఆర్ధిక విధానాలను తిరస్కరిస్తూ ఇటలీ ఓటర్లు తీర్పు చెప్పారు. ఆది, సోమ వారాల్లో జరిగిన ఓటింగ్ ఫలితాలు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వలేదు. కనీసం కూటములు కూడా స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోయాయి. యూరోపియన్ మానిటరీ యూనియన్ (యూరోజోన్) నుండి వైదొలగాలని ప్రచారం చేసిన కొత్త పార్టీకి మొదటి ప్రయత్నంలోనే పెద్ద ఎత్తున ఓట్లను కట్టబెట్టి ఇటలీ ప్రజలు తమ ఉద్దేశాలు చాటారు. సెంటర్-లెఫ్ట్…

దిల్‌షుక్‌నగర్ పేలుళ్లు: ముఖ్యమంత్రి రాకతో సాక్ష్యాలు భంగం

ముఖ్యమంత్రి తదితరుల వి.వి.ఐ.పి ల సందర్శన వలన పోలీసుల పరిశోధన ముందుకు సాగని పరిస్ధితి ఏర్పడింది. వారితో పాటు ఉత్సుకతతో చూడడానికి వచ్చిన జనం పేలుడు జరిగిన చోట్ల ఇష్టం వచ్చినట్లు తొక్కిపారేయడంతో కీలక సాక్ష్యాలు లభ్యం కాకుండా పోయాయి. పేలుడు జరిగాక జనం హాహాకారాలతో అటు ఇటు పరుగులు పెట్టడం సహజమే. కానీ ఆ పరుగులు కూడా కీలక సాక్ష్యాలలో భాగంగా ఉండవచ్చు. వారు కాకుండా బైటివారు రావడం వలన పేలుడు జరిగిన తర్వాత పరిసరాలలో…

హైదరాబాద్ బాంబు పేలుళ్లు, ముందే సమాచారం?!

హైదరాబాద్ మళ్ళీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. అత్యంత రద్దీగా ఉండే దిల్ షుక్ నగర్ బస్ స్టాండ్ ప్రాంతంలో రెండు చోట్ల అమర్చిన సైకిల్ బాంబులు పేలడంతో అనేకమంది మరణించగా మరెంతోమంది గాయపడ్డారు. 11 మంది చనిపోయారని, మరో 80 మంది గాయపడ్డారని, గాయపడినవారిలో ఐదు లేక ఆరుగురు తీవ్రంగా గాయపడినందున వారి పరిస్ధితి ప్రమాదకరంగా మారిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పత్రికలు, ఛానళ్లతో క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ చెప్పాడు. ముఖ్యమంత్రి పత్రికలతో…

జలియన్‌వాలా బాగ్: క్షమాపణకు బ్రిటిష్ ప్రధాని నిరాకరణ

అమృత్ సర్ లోని జలియన్‌వాలా బాగ్ ను సందర్శించిన బ్రిటిష్ ప్రధాని కామెరూన్ నాటి మారణకాండకు క్షమాపణ చెప్పడానికి మాత్రం నిరాకరించాడు. మాజీ బ్రిటిష్ ప్రధాని చర్చిల్ చెప్పినట్లే మొక్కుబడిగా విచారం ప్రకటించి ఊరుకున్నాడు. కుంటిసాకులు చెప్పి క్షమాపణ చెప్పడానికి నిరాకరించాడు. తాను బ్రిటన్ దేశ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి అన్న విషయం మరిచి ‘జలియన్‌వాలా బాగ్ దుర్మార్గం’ జరిగినప్పటికి తాను అసలు పుట్టనే లేదని అసందర్భ వ్యాఖ్యలు చేసి తప్పించుకున్నాడు. హిల్స్ బరో ఫుట్…

సైబర్ దాడుల వెనుక చైనా సైన్యం పాత్ర!

అమెరికాకి చెందిన కంప్యూటర్ సెక్యూరిటీ కంపెనీ ఒకటి మంగళవారం ఓ జోకు పేల్చింది. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడానికి తంటాలు పడింది. ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న సైబర్ దాడుల వెనుక చైనా ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ హస్తం ఉందని కనిపెట్టినట్లు వర్జీనియా నుండి పని చేసే ‘మాండియంట్’ కంపెనీ ప్రకటించింది. షాంఘై నగరంలో ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలియని ఒక భవంతి నుండి ‘Advanced Persistent Threat’ (ఎపిటి) వస్తున్నట్లు కనుగొన్నామని తెలిపింది. సైబర్ దాడుల గురించి…

అఫ్జల్ గురు ఉరి: మన బద్ధ శత్రువు కూడా మెరుగుగా చేసి ఉండడు

భారత దేశంలోనే ప్రముఖ న్యాయ నిపుణుడుగా (జ్యూరిస్టుగా) పేరు ప్రఖ్యాతులు పొందిన ఫాలి నారిమన్ కాశ్మీరు జాతీయుడు అఫ్జల్ గురు ఉరితీత పైన స్పందించారు. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ లో కరణ్ ధాపర్ నిర్వహించే ‘డెవిల్స్ అడ్వొకేట్’ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వాన్ని కడిగేశాడు. అఫ్జల్ కుటుంబానికి సరైన సమాచారం ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా ఉరితీసి పాతిపెట్టడం పట్ల అసంతృప్తి ప్రకటించారు. మానవతకు భారత దేశ సాంప్రదాయంలో అత్యున్నత స్ధానం ఉన్నదని, ఫోన్ చేసి చెప్పగల సమాచారాన్ని స్పీడ్…

జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా? -ఈనాడు

ఈనాడు దిన పత్రిక సోమవారం (18-02-2013) నాటి ‘చదువు’ పేజిలో ఈ బ్లాగర్ రాసిన ఆర్టికల్ ని ప్రచురించింది. బ్లాగ్ పాఠకుల కోసం ఆర్టికల్ కాపీని కింద ఇస్తున్నాను. (బొమ్మపై క్లిక్ చేసి పెద్ద సైజులొ చూడగలరు.) మొదటి భాగం వరకు ఈ రోజు ప్రచురించారు. రెండో భాగాన్ని, తరువాత వచ్చే చదువు పేజిలో (వచ్చే సోమవారం) ప్రచురించనున్నట్లు పత్రిక తెలిపింది. గత సంవత్సరం ఏప్రిల్ 23 తేదీన ఈనాడు పత్రికే ఈ బ్లాగ్ ను తన…

అరేబియా అత్తరులు అన్నీ కలిపి కడిగినా… -జస్టిస్ కట్జు

(సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుతం ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ ఛైర్మన్ కూడా అయిన జస్టిస్ మార్కండేయ కట్జు నిర్మొహమాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో పేరు సంపాదించాడు. బాల్ ధాకరే మరణానంతరం అంతిమ యాత్ర కోసం ముంబై బంద్ చెయ్యడం పైన ఫేస్ బుక్ లో వ్యాఖ్య చేసిన, లైక్ చేసిన ఇద్దరు యువతులపై ఐ.టి చట్టం ప్రయోగించడాన్ని బహిరంగంగా తప్పు పట్టి తద్వారా ధాకరే నివాళుల పర్వంలో బారులు తీరిన పత్రికల పతాక శీర్షికలను…

ఈ “చెడిపోయిన” సూర్యనెల్లి పిల్ల, మరో మహానది!?

కమల హాసన్ హీరోగా నటించిన మహానది సినిమా గుర్తుందా? సూర్యనెల్లి అత్యాచార బాధితురాలి సుదీర్ఘ న్యాయ పోరాటం కాస్త అటు ఇటుగా ఆ సినిమాను గుర్తుకు తెస్తోంది. కాకపోతే ఇక్కడ ఒక్క చెల్లెలే ఉంది తప్ప ఆమె తరపున పగ తీర్చుకునే హీరో అన్నయ్యే లేడు. అత్యాచారం చేసినవారు డబ్బు రాజకీయ పలుకుబడి ఉన్నవారయితే అత్యాచార బాధితులే ఎలా నేరస్థులుగా ముద్ర వేయబడతారో సూర్యనెల్లి సామూహిక అత్యాచారం ఒక సజీవ సాక్ష్యం. ప్రత్యేక కోర్టు 35 మంది…

ప్రజాస్వామ్యానికి నిఖార్సయిన రోజు (అరుంధతీ రాయ్ రచన)

అవును కదా? నా ఉద్దేశం నిన్నటి రోజు అని. వసంతం ఢిల్లీలో తనను తాను ప్రకటించుకుంది. సూర్యుడు ఉదయించాడు, చట్టం తన పని తాను చేసుకుని పోయింది. బ్రేక్ ఫాస్ట్ కి కొద్దిసేపటి ముందు, 2001 నాటి పార్లమెంటు దాడి కేసులో ప్రధాన నిందితుడు అఫ్జల్ గురు రహస్యంగా ఉరితీయబడ్డాడు. అతని విగత దేహాన్ని తీహార్ జైలులోనే పూడ్చిపెట్టారు. మక్బూల్ భట్ కి పక్కనే ఆయనను పూడ్చిపెట్టారా? (1984లో ఉరి తీయబడిన మరో కాశ్మీరీ ఆయన. ఆయన…

అఫ్జల్ గురు ఉరితీత, ఢిల్లీలో కాశ్మీరీల ఆందోళనలు -ఫొటోలు

2001 సంవత్సరంలో పార్లమెంటుపై దాడి జరిపిన కేసులో అరెస్టు అయి అప్పటినుండి జైలులో మగ్గుతున్న అఫ్జల్ గురుకి కోర్టు విధించిన మరణ శిక్షను శనివారం ఉదయం అమలు చేసారు. అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించడంతో ఆయనకు విధించిన ఉరి శిక్షను అమలు చేసామని ప్రభుత్వం ప్రకటించింది. రాజకీయ లబ్ది పొందడానికే ఈ సమయంలో ఆయనని ఎన్నికలముందు ఉరి తీసారన్న ఆరోపణలను ప్రభుత్వ వర్గాలు తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఉరి శిక్ష అమలుపై…

సహారా నిలువు దోపిడి: పెట్టుబడిదారీ విధానం అంటే ఇదే

ప్రజల కష్టార్జితాన్ని పెట్టుబడిదారీ కంపెనీలు దోచుకుని జల్సా చేస్తాయన్న సంగతి చరిత్రలో అనేక కంపెనీలు అనేక సార్లు రుజువు చేశాయి. 2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభాన్ని తెచ్చిన వాల్ స్ట్రీట్ కంపెనీల పేరాశ, ఇన్వెస్టర్ల సొమ్ము కాజేసి తాము మేపే అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాల చేత కూడా గడ్డి పెట్టించుకున్న గోల్డ్ మేన్ సాచ్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు, అంతర్జాతీయ ప్రామాణిక ఫైనాన్స్ వడ్డీ రేటు అయిన లిబర్ (Libor – London Interbank Offered…