వామ్మో ఫేస్ బుక్!

“ఇక ఫేస్ బుక్ జోలికి పోకూడదు” అనిపించటాలుగా పరిస్ధితి వచ్చేసినట్లుంది చూడబోతే. లేకపోతే ఐ.టి చట్టం సెక్షన్ 66-ఎ పేరు చెప్పి ఈ వరుస అరెస్టులు ఏమిటి? బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనపై కార్టూన్ షేర్ చేశాడని ఒక ప్రొఫెసర్ ని అరెస్టు చేసి జైల్‌లోకి తోయించింది లగాయతు చిదంబరం కొడుకు కార్తీక్ దగ్గర్నుంచి యు.పి ప్రభుత్వం మీదుగా చండీఘర్ అమ్మాయి వరకూ ఫేస్ బుక్ వ్యాఖ్యలను క్రిమినలైజ్ చేయడం జాస్తి అయింది. తాడేపల్లి, కృష్ణమోహన్…

ఆ శిక్ష చాలదు –ఇండియా, చాలు -అమెరికా

ముంబై టెర్రరిస్టు దాడులకు నెలల ముందుగానే తగిన ఏర్పాట్లు చేసిన ‘డేవిడ్ కోలమన్ హేడ్లీ’కి అమెరికా కోర్టు 35 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ శిక్ష తమను కొద్దిగా అసంతృప్తికి గురి చేసిందని భారత ప్రభుత్వం ప్రకటించగా, విచారణలో సహకరించాడు గనక ఆ శిక్ష చాలు అని అమెరికా చెబుతోంది. అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్ల పైన జరిగిన టెర్రరిస్టు దాడిని 9/11 పేరుతో పిలుస్తున్న నేపధ్యంలో ముంబై దాడులను 26/11 పేరుతో…

కీచులాటలు ఇండియా, పాక్ లవి, కాశ్మీర్ రొట్టె ఐరాసకు

రెండు పిల్లుల రొట్టె తగాదాని కోతి తీర్చినట్లయింది ఇండియా, పాకిస్థాన్ దేశాల పరిస్ధితి. కాశ్మీర్ లో ఐక్యరాజ్యసమితి పరిశీలక బృందం కొనసాగాలా లేదా వద్దా అని ఇండియా, పాకిస్థాన్ లు కీచులాడుకుంటుంటే ఆ సంగతి తేల్చవలసింది మీ ఇద్దరిలో ఎవ్వరూ కాదు మేమే అని ఐరాస తేల్చి చెప్పింది. అమెరికా, యూరప్ దేశాలకు ప్రపంచ స్థాయిలో రాజకీయ ముసుగుగా పనిచేసే ఐరాస చేతి లోకి ఒక అధికారం వెళ్ళడం అంటే అది అమెరికా, యూరప్ చేతుల్లోకి వెళ్ళినట్లే.…

చచ్చిపోయిన రిపోర్టర్ –‘ది హిందూ’ సంచలనాత్మక కధనం

(ఇది సోమవారం ది హిందూ పత్రికలో వచ్చిన వ్యాసం. బడా కార్పొరెట్ కంపెనీలు మీడియాను కొనెయ్యడం వలన వార్తల సేకరణలో విలేఖరి పాత్ర నామమాత్రం అవుతోందని, సంపాదకుడే యజమానికి నేరుగా ఫ్రంట్ గా వ్యవహరించవలసిన దుర్దినాలు దాపురించాయని ప్రతిభావంతంగా ఇందులో ఆయన వివరించాడు. టి.వి వార్తల సమయాన్ని రియాలిటీ షోలు కబళిస్తున్న వైనం కార్పొరేటీకరణ పుణ్యమేనని అనుభవంతో చెబుతున్న సందీప్ భూషణ్ వివరణ మనకు తెలియని కోణాలనుండి టి.వి కవరేజిని చూసే అవకాశం ఇస్తుంది. ఆంగ్ల వ్యాసానికి…

మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా అంతిమ బాధితులు ప్రజలే

మతోన్మాదం గురించి ఆంధ్ర ప్రదేశ్ లో మళ్ళీ చర్చ జరుగుతోంది. మైనారిటీ మతోన్మాదం వార్తలకు ఎక్కడం ఈసారి ప్రత్యేకత. ‘మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ (ఎంఐఎం) పార్టీకి చెందిన యువ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ చోట్ల ఇచ్చిన విద్వేష పూరిత ప్రసంగాలు ఈ చర్చకు ప్రేరణగా నిలిచాయి. ఆర్ఎస్ఎస్, బిజెపి లాంటి హిందూ తీవ్రవాద సంస్థలు, పార్టీల నుండి సెక్యులరిస్టు పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్ నుండి వివిధ సెక్యులర్ ముస్లిం సంస్థల వరకూ…

తొడగొడుతున్న చైనా, మీసం మెలివేస్తున్న జపాన్

ఒకరు అరే అంటే మరొకరు ఏరా అంటారు. ఒకరు తొడగొడితే మరొకరు మీసం మెలివేస్తారు. ఒకరు పౌర విమానం పంపితే మరొకరు ఏకంగా జెట్ ఫైటర్ విమానాన్నే పంపుతారు. తూర్పు చైనా సముద్రంలో చైనా, జపాన్ లు మళ్ళీ కీచులాటలు మొదలు పెట్టాయి. కీచులాటలు కాస్తా యుద్ధం వైపుకి దారి తీస్తాయేమోనని ఉగ్గబట్టుకోవడం ఇరుగు పొరుగు దేశాల పనిగా మారుతోంది. నివాస యోగ్యం కాని చిన్న చిన్న దీవుల పైన ఆకాశంలో చక్కర్లు కొడుతున్న యుద్ధ విమానాలను…

పాక్‌లో మళ్ళీ అధికార కుస్తీలు, సూఫీ గురువు వెనుక దాగిన మిలట్రీ?

సూఫీ గురువు తాహిర్-ఉల్-ఖాద్రి కెనడా నుండి పాకిస్థాన్ లోకి తిరిగి ప్రవేశించినప్పటినుండీ అక్కడ అధికార కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయి. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయాలనీ, మే నెలలో జరగనున్న ఎన్నికలను వాయిదా వేయాలనీ ఖాద్రి ఒకవైపు డిమాండ్ చేస్తుండగా, మరో వైపు పాకిస్థాన్ ప్రధాని రాజా పర్వేజ్ అష్రాఫ్ పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపధ్యంలో ఆయనను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశాలిచ్చిందని ఫస్ట్ పోస్ట్ తెలిపింది .…

అంతర్జాల స్వేచ్ఛా పిపాసి, RSS, Redditల నిర్మాత ఆత్మహత్య

విజ్ఞానం ఒకరి సొత్తు కాదనీ, అది అందరికీ స్వేచ్ఛగా అందుబాటులో ఉండాలని పోరాడిన ఆరన్ స్వార్జ్ ఎఫ్.బి.ఐ వేధింపుల ఫలితంగా ఆత్మహత్య చేసుకున్నాడు. 14 సంవత్సరాల అతి పిన్న వయసులోనే ప్రఖ్యాత వెబ్ ఫీడ్ వ్యవస్థ అయిన RSSను నిర్మించిన ఆరన్ ఆ తర్వాత సోషల్ న్యూస్ వెబ్ సైట్ Reddit నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించాడు. పిన్న వయసులోనే ఇంటర్నెట్ మేధావి గానూ, గుత్త స్వామ్య వ్యతిరేకి గానూ అవతరించిన ఆరన్ 26 యేళ్ల వయసులోనే…

మూతపడని నోళ్ళు, గీత దాటితే సీత గతేనట!

అత్యాచారాలకి వ్యతిరేకంగా అంతపెద్దఎత్తున జనం ఉద్యమించినా పురుష పుంగవుల నోళ్ళు మూతపడబోమంటున్నాయి. గీత దాటితే సీతకి పట్టిన గతే పడుతుందని బి.జె.పి నాయకుడొకరు నోరు పారేసుకుంటే, మహిళలపై అత్యాచారాలు ఇండియాలో జరుగుతున్నాయి గానీ భారత్ లో జరగడం లేదని ఆర్.ఎస్.ఎస్ సుప్రీం నాయకుడు స్పష్టం చేస్తున్నాడు. మధ్య ప్రదేశ్ బి.జె.పి మంత్రి కైలాస్ విజయ్ వర్గియా, ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ తాజాగా మహిళాలోకం ఆగ్రహాన్నీ, పౌర ప్రపంచం ఖండన మండనలను ఎదుర్కొన్నారు. “Ek…

గుజరాత్ లోకాయుక్త: మోడికి ఓటమి, గవర్నర్ కి మొట్టికాయ

కోర్టుల్లో ఓటమి పరంపరను నరేంద్ర మోడీ దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. గుజరాత్ గవర్నర్ నియమించిన లోకాయుక్తకు తన ఆమోదం లేనందున నియామకాన్ని రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టు గడప తొక్కిన మోడి అక్కడ కూడా ఓటమి చవిచూశాడు. తొమ్మిదేళ్లకు పైగా రాష్ట్ర లోకాయుక్త పదవిని ఖాళీగా అట్టిపెట్టిన నీతివంతమయిన ముఖ్యమంత్రి మోడి గవర్నర్ చొరవను హర్షించే కనీసనీతిని ప్రదర్శించలేకపోయాడు. తనను తాను అజేయుడుగా భావించుకునే అపోహనుండి మోడీ బైటికి రావాలని గుజరాత్ హైకోర్టు చేత అత్యంత అవమానకరంగా అభిశంసన…

ఢిల్లీ అత్యాచారం: కొనసాగుతున్న గోప్యత ఎవరి ప్రయోజనాలకు?

మరిన్ని రక్షణలతో రూపొందనున్న కొత్త అత్యాచార నిరోధ చట్టానికి ఢిల్లీ అత్యాచారం బాధితురాలి పేరు పెట్టడానికి సూచన వచ్చింది. కేంద్ర మంత్రి శశిధరూర్ ఈ సూచన చేశాడు. అమ్మాయి పేరుని ఇంతవరకూ బైటపెట్టకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన శశిధరూర్ అమ్మాయి తల్లిదండ్రులు, సోదరులు అంగీకరిస్తే నూతన సవరణలతో కూడిన చట్టానికి అమ్మాయి పేరే పెట్టాలని ఆయన కోరాడు. బాధితురాలి తల్లిదండ్రులు, సోదరులు అందుకు తమకు అభ్యంతరం లేదని తెలియజేశారని ‘ది హిందూ’ తెలిపింది. ప్రభుత్వానికి ఈ ఆలోచన…

అమ్మాయిల గౌన్లు అశ్లీలమా? వీళ్ళు కదా రేపిస్టులకు కాపలాదార్లు!

స్కూళ్ళు, కాలేజీల అమ్మాయిలు గౌనులు ధరించడం వల్లనే వారికి సమస్యలు వస్తున్నాయనీ, కనుక విద్యార్ధినులు గౌను ధరించడం నిషేధించాలనీ రాజస్ధాన్ కి చెందిన ఒక ఎమ్మెల్యే తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖరాసి కలకలం సృష్టించాడు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఆగ్రహించిన విద్యార్ధినులు ఆయన ఇంటిముందు నిరసన నిర్వహించడమే కాకుండా ఆయనాకొక గౌను బహూకరించారు. అమ్మాయిల దుస్తుల ధారణపై ప్రతికూల వ్యాఖ్యలు చేసి అప్రతిష్టపాలవుతున్న వారి జాబితాలో ఆళ్వార్ నగర నియోజకవర్గ ఎమ్మెల్యే బన్వరీలాల్ సింఘాల్ చేరిపోయాడు.…

బాధితురాలి సింగపూర్ తరలింపు రాజకీయం -డాక్టర్లు; కాదు -ప్రభుత్వం

ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారానికి గురయిన అమానత్ (అసలు పేరు కాదు) ను సింగపూర్ లోని ‘మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్’ కి తరలించాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయమే తప్ప తాము తీసుకున్న వైద్య నిర్ణయం కాదని అమానత్ కి వైద్యం చేసిన డాక్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం వైద్యం కోసమే సింగపూర్ తరలింపు నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. బాధితురాలి ఆరోగ్యం మరింత క్షీణిస్తున్నదనీ, ఆమె శరీర అవయవాలు పని చేయడం లేదనీ, ఆమె మెదడుకు…

బాధితురాలి స్టేట్‌మెంట్‌ని మార్చడానికి ఢిల్లీ పోలీసుల కుయత్నం?

ఢిల్లీ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్.డి.ఎం) ముందు సామూహిక అత్యాచారం బాధితురాలు ఏమి జరిగిందీ తెలియజేసింది. ఎస్.డి.ఎం ముందు బాధితురాలు అమానత్ (అసలు పేరు కాదు) ఏమి చెప్పిందీ సౌత్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డి.సి.పి) ఛాయా శర్మ క్లుప్తంగా పత్రికలకు తెలిపింది. ఆమె ప్రకారం ఆ రోజు రాత్రి దాదాపు 9:30 గంటలకు అమానత్ తన ఫ్రెండ్ తో కలిసి మునిర్కాలో బస్ స్టాప్ వద్ద నిలబడి ఉన్నారు. బస్సులో ఉన్న మైనర్…

నరేంద్ర మోడి అభివృద్ధి బండారం ఇంకోసారి

దేశంలో మిగతా రాష్ట్రాలకంటే గుజరాత్ అభివృద్ధిపధంలో దూసుకెళుతోందనీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడి సమర్ధతే దానికి కారణమనీ పత్రికలు భజన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంలో వాస్తవం ఏమిటో ‘గుజరాత్ అభివృద్ధి కధ‘ పేరుతో ఈ బ్లాగ్ లో ఓ ఆర్టికల్ రాయడం జరిగింది. గుజరాత్ లో జరిగిందంటున్న అభివృద్ధి స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులదే తప్ప అక్కడి ప్రజలది కాదని అందులో తెలియజేశాను. మరికొన్ని వివరాలు ఇపుడు చూద్దాం. వారపత్రిక అయిన తెహెల్కా నవంబరు…