ఇ-బ్రిక్స్ మా కల -ఈజిప్టు అధ్యక్షుడు

ఇండియా భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ (BRICS) లో చేరడం తమ లక్ష్యంగా ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ మోర్సి ప్రకటించాడు. సోమవారం నుండి ఇండియాలో పర్యటిస్తున్న విప్లవానంతర ఈజిప్టుకు మొదటి అధ్యక్షుడుగా ఎన్నికయిన మోర్సి పర్యటనకు ముందు ది హిందు పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. భారత దేశంతో వాస్తవిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా తమ దేశ ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించుకోవాలని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల కూటమి బ్రిక్స్ కూటమి…

మా కోర్టుల గురించి మీరేమనుకుంటున్నారు? –ఇటలీతో సుప్రీం

– భారత సుప్రీం కోర్టు సోమవారం ఉగ్రరూపం దాల్చింది. హామీని ఉల్లంఘించిన ఇటలీ రాయబారి డేనియల్ మాన్సిని పైన విరుచుకుపడింది. దేశం విడిచి వెళ్లరాదని మార్చి 14 తేదీన తాము ఇచ్చిన ఆదేశాలను ఏప్రిల్ 2 వరకు పొడిగించింది. వియన్నా సదస్సు లో అంగీకరించిన అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం విదేశీ రాయబారులకు వర్తించే ‘నేర విచారణ నుండి మినహాయింపు‘ (immunity) డేనియల్ కు వర్తించదని స్పష్టం చేసింది. ఒక పిటిషనర్ గా కోర్టులో ఒక ప్రక్రియను ప్రారంభించిన…

మావో మూడు ప్రపంచాలు -ఈనాడు ఆర్టికల్ 5వ భాగం

ఈ రోజు ఈనాడు చదువు పేజిలో ‘జాతీయ అంతర్జాతీయ వార్తలపై అవగాహన సాధించడమెలా?’ ఆర్టికల్ ఐదవ భాగం వచ్చింది. ఇందులో మధ్య ప్రాచ్యం, బ్రిక్స్, బేసిక్, మూడు ప్రపంచాల సిద్ధాంతం తదితర అంశాలను చర్చించబడింది. ఈనాడు వెబ్ సైట్ లో నేరుగా చదవాలనుకుంటే ఈ లింక్  క్లిక్ చేస్తే ఆ పేజికి వెళ్లొచ్చు. కింద బొమ్మని క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ కాపీలో ఆర్టికల్ చదివచ్చు.

హాకీ ప్రత్యర్థి పాక్ ఐతే మన టీం సభ్యులు డజను -కార్టూన్

హాకీ ఆటలో ఒక్కో టీం లో ఎంతమంది సభ్యులు ఉంటారు? లెక్క ప్రకారం అయితే 11 మంది. భారత్ ప్రత్యర్థి పాకిస్ధాన్ ఐతే మాత్రం మనవాళ్లు 12 మంది ఆడుతారు. ఫీల్డ్ లో ఆడేది 11 మందే అయినా భారత టీం లో మరో అదృశ్య ప్లేయర్ తప్పనిసరిగా ఉంటారు. వారే మన విదేశాంగ శాఖ (Ministry of External Affairs – MEA). ఆటను ఆటగా ఉండనిస్తేనే అందం. ఆటలో ప్రభుత్వాలు, వారి తరపున రాజకీయ…

ఇజ్రాయెల్: మితవాదం నుండి మధ్యేవాదం వైపుకు

జనవరి చివరి వారంలో జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగిపోయింది. గాజా ప్రాంతం పైకి హంతక దాడులు చేసి 150 మందికి పైగా పాలస్తీనీయులను బలిగొనడం ద్వారా స్పష్టమైన మెజారిటీ సాధిస్తానని కలలు కన్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆశలు నెరవేరకపోగా గణనీయమైన సంఖ్యలో సీట్లు కోల్పోవడంతో ఇజ్రాయెల్ రాజకీయాలు ఒక మాదిరి మలుపు తిరిగాయి. కొత్తగా ఏర్పడిన రెండు సెంట్రిస్టు పార్టీలు అనూహ్య రీతిలో 31 స్ధానాలు గెలుచుకోవడంతో నెతన్యాహు…

మన్మోహన్ కి కోరలు మొలిచాయి! -కార్టూన్

ఎప్పుడో తప్ప మాటలు పెగలని ప్రధాని మన్మోహన్ సింగ్ కి కొత్తగా ఉన్నట్లుంది కోరలు మొలిచాయని పత్రికలు గుసగుసలు పోతున్నాయి. ఇటలీ మెరైన్లు ఇండియాకు తిరిగి రాబోరని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో ప్రధాన మంత్రి ఉభయ సభల్లో కాస్త గట్టిగా మాట్లాడడం ఈ గుసగుసలకు కారణం. ఇద్దరు కేరళ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి ఇటలీ నౌకపై ఉన్న మెరైన్లు కాల్చి చంపడంతో వారిని అరెస్టు చేసి సుప్రీం కోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే.…

దేశం వదిలి వెళ్లొద్దు, ఇటలీ రాయబారికి సుప్రీం ఆదేశం

ఇద్దరు కేరళ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి కాల్చి చంపిన ఇటాలియన్ మెరైన్లను ఇండియాకి తిరిగి పంపేది లేదని ఇటలీ ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో సుప్రీం కోర్టు అసాధారణ చర్య చేపట్టింది. ఇటలీ రాయబారి డేనియల్ మన్సిని తమ అనుమతి లేకుండా దేశం వదిలి వెళ్లరాదని ఆదేశించింది. ఫిబ్రవరి 24-25 తేదీలలో జరిగిన ఇటలీ సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేసి తిరిగి వెనక్కి వస్తామని మెరైన్లు సుప్రీం కోర్టును కోరగా వారికి ఇటలీ రాయబారి హామీగా నిలిచాడు.…

మోడి ప్రసంగం కేన్’సెల్’ -కార్టూన్

‘వార్టన్ ఇండియా ఎకనమిక్ ఫోరం‘, మోడి ప్రసంగం రద్దు చేయడం వలన ఎవరికి మేలు జరిగినట్లు? మార్చి 22-23 తారీఖుల్లో ఫిలడెల్ఫియా లో జరగనున్న ఫోరం సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించాలని నరేంద్ర మోడిని ‘వార్టన్ ఇండియా ఎకనమిక్ ఫోరం‘ ఆహ్వానించింది. కానీ ‘యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా‘ లోని కొందరు విద్యార్ధులు, బోధన సిబ్బంది మోడికి ఆహ్వానం పంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 2002లో ముస్లిం ప్రజలపై జరిగిన అమానుష హత్యాకాండ దరిమిలా అమెరికా ప్రభుత్వమే మోడీకి…

ఇటలీ నమ్మక ద్రోహం!

అసలే ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతున్న ఇండియా, ఇటలీ సంబంధాలు ఇటలీ ప్రభుత్వ నిర్ణయంతో మరింత క్షీణించే పరిస్ధితి ఏర్పడింది. పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసొస్తామని చెప్పి వెళ్ళిన భారతీయ జాలరుల హంతకులను తిరిగి ఇండియాకి పంపేది లేదని ఇటలీ ప్రకటించింది. రాయబార చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని తాము చేసిన ప్రతిపాదనకు భారత్ స్పందించకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఇటలీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు భారత విదేశాంగ కార్యాలయానికి సోమవారం రాత్రి సమాచారం వచ్చినట్లు…

ఐక్య వేదికలూ… వ్యూహాలు -ఈనాడు ఆర్టికల్ 4వ భాగం

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ ఆర్టికల్ నాలుగవ భాగం ఈ రోజు ఈనాడు పత్రికలోని ‘చదువు’ పేజీలో ప్రచురించబడింది. బ్లాగ్ పాఠకుల కోసం ఇక్కడ ఇవ్వడమైనది. ఈనాడు ఇంటర్నెట్ ఎడిషన్ లో ఈ ఆర్టికల్ ను నేరుగా చదువాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయగలరు. కింద బొమ్మ పైన క్లిక్ చేస్తే ఆర్టికల్ ను పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో చూడవచ్చు. – –

హ్యాకింగ్ దాడుల్లో సగం అమెరికా నుండి వస్తున్నవే -చైనా

2013 సంవత్సరంలో చైనా దేశం పైన జరిగిన హ్యాకింగ్ దాడుల్లో సగానికి పైన అమెరికానుండి వచ్చినవేనని చైనా ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా ను ఉటంకిస్తూ రాయిటర్స్ ఆదివారం తెలిపింది. అమెరికాతో పాటు ప్రపంచంలో జరుగుతున్న ఇంటర్నెట్ హ్యాకింగ్ దాడులకు షాంఘై లోని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కి చెందిన ఒక భవంతి ప్రధాన కేంద్రంగా ఉందంటూ అమెరికా సైబర్ కంపెనీ ‘మాండియంట్‘ ఒక నివేదిక వెలువరించిన మూడు…

‘సెక్యులరిజం అంటే ‘ఇండియా ఫస్ట్’, మోడి కొత్త నిర్వచనం

గుజరాత్ స్త్రీల పోషకాహార లోపానికి ఎవరూ ఊహించలేని కారణం కనిపెట్టి అటు సామాన్యులను, ఇటు శాస్త్ర పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తిన నరేంద్ర మోడి ఈసారి ‘సెక్యులరిజం‘ కు కొత్త నిర్వచనం కనిపెట్టారు. సెక్యులరిజం అంటే ఎక్కడికి వెళ్ళినా ఇండియాను మొదటి స్ధానంలో నిలబెట్టడం అనీ, అన్ని మతాలకు, సిద్ధాంతాలకు అతీతంగా ఇండియాకు మొదటి ప్రాధాన్యం ఇస్తే అదే సెక్యులరిజం అనీ ఆయన నిర్వచించారు. బిజెపి విదేశీ మిత్రులు (Overseas Friends of BJP) ఏర్పాటు చేసిన వీడియో…

యజమాని గర్వం, పొరుగువాని అసూయ -కార్టూన్

– ‘Owner’s pride, neighbor’s envy.’ ఒనిడా టి.వి ప్రవేశపెట్టిన ఈ నినాదం దాదాపు సామెతగా మారిపోయింది. రాజకీయ, సామాజిక పరిస్ధితుల గురించి మాట్లాడుకునే సందర్భాల్లో కూడా ఇది సామెతగా చొరబడిందంటే అతిశయోక్తి కాదేమో! యు.పి.ఎ-2 ప్రభుత్వ పాలనలో వెల్లివిరుస్తున్న కుంభకోణాల జాతరను ప్రతిపక్ష పాలక వర్గాలు అసూయతో ఎలా వీక్షిస్తున్నదీ ‘ది హిందు’ కార్టూనిస్టు సురేంద్ర ఈ ‘సామెత కానీ సామెత’ ద్వారా ఈ కార్టూన్ లో చక్కగా వివరించారు. బోఫోర్స్ కుంభకోణం దేశ రాజకీయాలను…

కై పొ చె! కాంగ్రెస్, బి.జె.పి ల గాలిపటాలాట -కార్టూన్

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ నాయకులతో పాటు పత్రికల కేంద్రీకరణ అటు మళ్లడం సహజమే. రాజకీయ నాయకులే తమ ఏర్పాట్లతో పత్రికలను ఆకర్షిస్తారా లేక పత్రికలే రాజకీయ నాయకులను రెచ్చగొట్టి వార్తలు సృష్టిస్తాయా అన్నది చెప్పడం ఒకింత కష్టమే అయినా, ఒకరికొకరు సహకరించుకోవడం మాత్రం ఒక వాస్తవం. ప్రధాన మంత్రి పదవికి పోటీదారుగా ఎవరిని ప్రకటించాలి అన్న విషయమై బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలలో సాగుతున్న అంతర్గత మరియు బహిరంగ ఉత్సుకత లేదా ఉద్రిక్తతల వ్యక్తీకరణలు వివిధ రూపాల్లో…

ఛావెజ్ మరణం అమెరికా పన్నాగం కావచ్చు –రష్యా నాయకుడు

వెనిజులా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్ కేన్సర్ జబ్బుతో మరణించడం వెనుక అమెరికా పధకం ఉండవచ్చని రష్యా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు గెన్నడీ జుగనోవ్ తెలిపాడు. లాటిన్ అమెరికాలో తన శత్రువులకు కేన్సర్ జబ్బు తగిలించే ప్రక్రియను అమెరికా అభివృద్ధి చేసి ఉండవచ్చని రష్యాలో రెండవ అతి పెద్ద పార్టీకి నాయకుడైన జుగనోవ్ వ్యాఖ్యానించాడు. “అమెరికా విధానాలను తీవ్రంగా విమర్శించిన జాబితాలో ఉన్న, స్వతంత్రమైన, సార్వభౌమ రాజ్యాలను ఏర్పరుచుకునే కృషిలో భాగంగా ఒక ప్రభావవంతమైన కూటమిలో సభ్యులుగా ఉన్న…