సి.బి.ఐ అటానమీ -కార్టూన్

బొగ్గు కుంభకోణం దర్యాప్తు నేపధ్యంలో సి.బి.ఐ కి స్వయం ప్రతిపత్తి గ్యారంటీ చేసేలా చట్టం చేయాలని సుప్రీం కోర్టు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. బొగ్గు కుంభకోణం విషయమై జులైలో తదుపరి హియరింగ్ జరగనుంది. ఆ లోపు చట్టాన్ని తెస్తే తాము సంతోషిస్తామని సుప్రీం కోర్టు అటార్నీ జనరల్/ కేంద్ర ప్రభుత్వం ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది. “పంజరంలో చిలక” లాగా మారిన సి.బి.ఐ తమ యజమాని ఏమి చెప్పమంటే అదే చెబుతోందని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బహుళ…

పాక్ ప్రభుత్వానికి మన్మోహన్ స్నేహ హస్తం -కార్టూన్

– ఇటీవల ఎన్నికల్లో నెగ్గిన నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్ధాన్ నూతన ప్రభుత్వానికి ప్రధాని మన్మోహన్ తన స్నేహ హస్తాన్ని చాచారు.                                                        —-వార్త – పాకిస్ధాన్ లో అలా ఎన్నికలు ముగిశాయో లేదో ఇలా భారత ప్రధాని ఇంకా ఏర్పడని నూతన ప్రభుత్వానికి స్నేహ హస్తం చాచారు. ఇన్నాళ్లూ పాకిస్ధాన్ ని పాలించిన ఆసిఫ్ జర్దారీ అధ్యక్షరికంలోని పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వంలో కొరవడిందీ, నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్ధాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ…

కర్ణాటక: కష్టం ఒకరిది, పేరు మరొకరిది -కార్టూన్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ బావుటా ఎగరవేయడానికి కారణం ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియడానికి పెద్దగా రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. దక్షిణ భారతంలో మొట్టమొదటిసారి బి.జె.పి పార్టీ ఖాతాలో ఒక రాష్ట్ర అసెంబ్లీని చేర్చిన ఘనతను సొంతం చేసుకున్న యెడ్యూరప్ప ఈసారి కూడా గెలుపును, ఓటమిని కూడా ప్రభావితం చేశాడని ప్రతి ఒక్కరికీ తెలిసిన నిజం. ‘కర్ణాటక జనతా పక్ష’ పేరుతో యెడ్యూరప్ప ప్రత్యేక పార్టీయే పెట్టకపోయినట్లయితే కాంగ్రెస్ పార్టీ బహుశా సీట్ల…

బలి పశువులు కావలెను -కార్టూన్

ఎట్టకేలకు కళంకిత మంత్రులుగా పేరుబడిన ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. అనవసర వివాదంతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే రాజీనామా చేశానని అశ్వనీ కుమార్ అంటే, పవన్ కుమార్ బన్సాల్ ఆ మాట కూడా చెప్పలేదు. సి.బి.ఐ నివేదికను మంత్రి అశ్వనీ కుమార్, ఇతర బ్యూరోక్రాట్ అధికారులు మార్చడం వల్ల నివేదిక ఆత్మ మారిపోయిందని, వారి జోక్యం వలన విచారణ పక్కదారి పట్టే అవకాశం ఏర్పడిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించినప్పటికీ తనను కోర్టు తప్పు…

యు.పి.ఎ జవాబుదారీతనం ఇలా తగలడింది -కార్టూన్

భారత రాజకీయ వ్యవస్ధ ఎన్నడూ లేనంతగా గబ్బు పట్టిపోయింది. రాజకీయానికి, ఆరాచకానికి సరిహద్దులు చెరిగిపోయాయి. ఎన్ని పరిమితులున్నా, ఒకప్పుడు ఎంత నీతిగా ఉంటే అంత గొప్ప. ఇప్పుడు ఎంత దిగజారి అవినీతికి పాల్పడినా అంత సంపాదిస్తే అంత గొప్ప!  కాగ్ ఛీ అంటుంది. సుప్రీం కోర్టు ఛీ ఛీ అంటుంది. అయినా మంత్రులు, ప్రధాన మంత్రి దగ్గర్నుండి రాష్ట్రాల మంత్రుల వరకూ దులుపుకుని పోయేవారే తప్ప జనానికి తాము జవాబు చెప్పాల్సి ఉంటుందన్న ధ్యాసే లేదు.  జనానికి…

బి.జె.పి కుమ్ములాటలే కాంగ్రెస్ గెలుపు కిరీటం -కార్టూన్

కర్ణాటకలో బి.జె.పి సెల్ఫ్ గోల్ సంపూర్ణం అయింది. జాతీయ స్ధాయిలో కాంగ్రెస్ అవినీతిని ఎండగడుతున్నట్లు ఫోజు పెడుతున్న బి.జె.పి పార్టీకి కర్ణాటకలో సొంత నాయకుల అవినీతిని నెత్తిన పెట్టుకోలేకపోయింది. జాతీయ స్ధాయిలో పరువు ప్రతిష్టలు నిలుపుకోవాలంటే కార్ణాటకలో అవినీతి నాయకుడు యెడ్యూరప్పను దూరం పెట్టక తప్పని పరిస్ధితి. ఫలితంగా బి.జె.పి ఓటు బ్యాంకు చీలిపోవడంతో ఎన్నికలకు ముందే కాంగ్రెస్ గెలుపు ఖాయమైపోయింది. సొంత కుంపటి పెట్టుకుని తగిన సీట్లు తెచ్కుకుని ప్రభుత్వాల్ని శాసించవచ్చు అనుకున్న కర్ణాటక జనతా…

వడ్డించేవారు కొట్టుకుంటే… -కార్టూన్

‘అదిగో, ఇదిగో’ అంటూ యు.పి.ఏ ప్రభుత్వం ఊరిస్తూ వచ్చిన ‘ఆహార భద్రతా బిల్లు’, ‘భూముల స్వాధీనం  బిల్లు’ ఆమోదానికి నోచుకోకుండానే పార్లమెంటు నిరవధికంగా వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. న్యాయ శాఖ మంత్రి అశ్విని కుమార్, రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్ లు రాజీనామా చేయడమో, లేదా పదవుల నుండి తప్పించడమో జరిగేదాకా పార్లమెంటులో ఏ బిల్లూ ఆమోదం పొందకుండా అడ్డుకుంటామని బి.జె.పి ప్రకటించడంతో ఈ పరిస్ధితి వచ్చింది. బుధవారం సభ ముగిశాక పార్లమెంటు నిరవధికంగా వాయిదాపడుతుందని…

కోతికి పదవిచ్చి, ఆనక కళ్ళూ నోరు మూసుకుని…. కార్టూన్

బొగ్గు కుంభకోణం కాంగ్రెస్ ప్రధాన నేతలను చుట్టుముట్టినా ఏ ఉపద్రవమూ జరగని విపరీత పరిస్ధితి దేశంలో రాజ్యమేలుతోంది. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను గట్టెక్కించడానికి న్యాయ మంత్రి అశ్వని కుమార్ కోతి తరహాలో చేసిన ప్రయత్నం చివరికి వారికే ఎదురు తిరిగింది. అశ్వని కుమార్ అహంకార ధోరణితో గాయపడిన సి.బి.ఐ అధికారి ద్వారా కోర్టుకు సి.బి.ఐ సమర్పించిన నివేదికను కోర్టు కంటే ముందు ప్రభుత్వమే చూసి మార్పులు కూడా చేసిందని పత్రికలకు లీక్ కావడంతో యు.పి.ఏ…

ఇరాన్ పుణ్యం, సిరియా సమస్యలో ఇండియా మాటకు విలువ!

సిరియా కిరాయి తిరుగుబాటు విషయంలో ఇండియా మాట చెల్లుబాటు అయ్యేందుకు అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. అలీన దేశాల కూటమి ‘అలీనోద్యమం’ (Non-Aligned Movement) నాయకురాలుగా ఇరాన్ గత యేడు బాధ్యత తీసుకున్న నేపధ్యంలో పశ్చిమ రాజ్యాల ప్రాభవానికి ప్రత్యామ్నాయ శిబిరాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలను ఇరాన్ ప్రారంభించింది. ఈ కృషిలో ఇండియాను భాగస్వామిగా స్వీకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ పర్యటనలో ఉన్న భారత విదేశీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తో ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మహ్మౌద్…

రెక్కలు కట్టుకుంటే మాత్రం ఎగరగలమా? -కార్టూన్

రైట్స్ సోదరులు విమానం కనిపెట్టక ముందు మనిషి గాలిలో ఎగరడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కొందరు ఉత్సాహపరులు పక్షి రెక్కల లాగా అట్టలతో రెక్కలు తయారు చేసుకుని చేతులకు కట్టుకుని కొండలపైకి ఎక్కి దూకడం కూడా చేశారట. అలాంటివారు అనేకమంది చనిపోగా మరి కొందరు వికలాంగులు అయ్యారని చిన్నప్పుడు చదువుకున్నాం. భారత దేశంలో ధర్డ్ ఫ్రంట్ కోసం ములాయం సింగ్ చేస్తున్న ప్రయత్నాలను అలా రెక్కలు కట్టుకుని పక్షిలా ఎగరాలని ప్రయత్నించడంగా కార్టూనిస్టు పోల్చారు. రెక్కలు కట్టుకుని…

ప్రత్యేకతలే కొండగుర్తులు -ఈనాడు ఆర్టికల్ 12వ భాగం

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ వ్యాస పరంపరలో చివరి భాగం ఈ రోజు ఈనాడు దినపత్రికలో చదువు పేజీలో వచ్చింది. “ప్రత్యేకతలే కొండగుర్తులు” శీర్షికన వచ్చిన ఈ భాగం, మరిన్ని దేశాల ప్రత్యేకతలను వివరిస్తూ వాటి ఆధారంగా వివిధ దేశాలను ఎలా గుర్తు పెట్టుకోవచ్చునో చర్చించింది. ఈ భాగాన్ని నేరుగా ఈనాడు వెబ్ ఎడిషన్ లో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. కింద బొమ్మను క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో ఆర్టికల్ చూడవచ్చు. బొమ్మ…

సరబ్ జిత్ లాగే మాకూ డబ్బివ్వాలి, కోర్టుకు గూఢచారుల మొర

ఇంతకీ సరబ్ జిత్ సింగ్ ఎవరు? పాకిస్ధాన్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు టెర్రరిస్టా? ఆయన కుటుంబం చెబుతున్నట్లు తాగి ఏమి చేస్తున్నాడో, ఎటు  వెళుతున్నాడో తెలియని అమాయక తాగుబోతా? భారత ప్రభుత్వం సొంతం చేసుకోలేని గూఢచారా? భారత పత్రికలు సరబ్ జిత్ సింగ్ గురించి అతని కుటుంబ సభ్యులు చెప్పిన ‘అమాయక తాగుబోతు’ కధని వల్లించినప్పటికీ బి.బి.సి, సి.ఎన్.ఎన్ లాంటి పశ్చిమ దేశాల పత్రికలు ఆయనను భారత గూఢచారి అనే సంబోధిస్తూ వచ్చాయి. ది హిందు పత్రిక ఆదివారం…

సీతాకోకచిలకలా ఎగరాలి, తేనెటీగలా కుట్టాలి… -కార్టూన్

“Float like a butterfly, sting like a bee” అనేది ఒక పాట. బ్రిటిష్ పాప్ సింగర్ ఫిల్ మార్షల్ రాసి పాడిన పాట ఇది. ఆ పాటని భారత విదేశాంగ విధానానికి అన్వయించారు కార్టూనిస్టు కేశవ్. ఆయన సెన్సిబుల్ కార్టూనిస్టు అనడానికి ఈ కార్టూన్ మరొక మచ్చుతునక. ఇటీవల కాలంలో రెండు (స్వ)విదేశీ సమస్యలు భారత విదేశాంగ విధానానికి పరీక్ష పెట్టాయి. అమెరికా ‘ఆసియా పివోట్’ వ్యూహంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ ను మిత్రుడుగా…

శవ పేటికలే చర్చల బల్లలుగా… -కార్టూన్

మొట్ట మొదటి బి.జె.పి ప్రధాని అతల్ బిహారీ వాజ్ పేయి కాలంలోనే భారత్-పాకిస్ధాన్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలు నిర్మాణాత్మక దృష్టితో ప్రారంభం అయ్యాయని పత్రికలు తరచూ చెబుతుంటాయి. అక్కడ మిలట్రీ పాలకుడు ముషార్రాఫ్, ఇక్కడ మొట్టమొదటి మితవాద ప్రభుత్వం రెండు దేశాల్ని నడుపుతుండగా ప్రారంభమైన చర్చలు వాణిజ్య సంబంధాల్లోకి ప్రవేశించి ఊపందుకుంటున్న సమయంలోనే ముంబై టెర్రరిస్టు దాడుల ఫలితంగా అటకెక్కాయి. అప్పటి నుండి వివిధ సంఘటనలు, దుర్ఘటనల సాకు చూపుతూ రెండు దేశాలు దూరం జరుగుతూ…

జమ్ము జైలులో పాకిస్ధానీ ఖైదీపై దాడి, విషమం

పదుల వేల సంఖ్యలో ప్రజలు సరబ్ జిత్ సింగ్ అంతిమ యాత్రలో పాల్గొనేందుకు భిఖివింద్ గ్రామం చేరుకుంటుండగానే జమ్ము జైలులో ఒక పాకిస్ధానీ ఖైదీ పైన దాడి జరిగింది. 64 సంవత్సరాల సోనాయుల్లా ఖాన్ ఈ దాడిలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉత్తర ఖండ్ రాష్ట్రానికి చెందిన భారతీయ ఖైదీ, వినోద్ కుమార్, శుక్రవారం ఉదయం ఆయనపై దాడి చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత తగాదాయే దాడికి కారణమని పత్రికలు చెబుతున్నాయి.…