ర్రయ్… ర్రయ్… యు.పి.ఎ-2 పయనం ఎందాక? -కార్టూన్

చిన్న పిల్లలకి వాహనాలను స్వయంగా నడపాలన్న కోరిక బుర్రని తొలుస్తూ ఉంటుంది. కానీ పెద్దవారి భయం వారిని వెనక్కి లాగుతుంటుంది. వాహనాలు ఉన్న ఇంట్లో అయితే స్టీరింగ్ ముందు కూర్చుని దాన్ని తిప్పుతూ ‘ర్రయ్… ర్రయ్…’ అని ఆడుకుంటారు. వాహనాలు లేనివారయితే ఉత్త చేతుల్ని స్టీరింగ్ పట్టుకున్నట్లు గాలిలో ఉంచి స్టీరింగ్ ని తిప్పుతున్నట్లు చేతులు ఆడిస్తూ ‘ర్రయ్… ర్రయ్…’ అని ఆడుతుంటారు. తాడు రెండు కొసల్ని ముడివేసి మధ్యలో నలుగురైదుగురు చేరి ‘బస్సమ్మ బస్సు…’ అంటూ…

సి.బి.ఐ దయనీయ స్ధితి -కార్టూన్

“రాజకీయ నాయకుల నుండి సి.బి.ఐ ని విముక్తం చేయడం మా తక్షణ కర్తవ్యం” అని సుప్రీం కోర్టు నిన్న సి.బి.ఐకి తలంటుతూ వ్యాఖ్యానించింది. “రాజకీయ నాయకుల ఆదేశాలు పాటించవలసిన అవసరం మీకు లేదు” అని సుప్రీం బెంచి చెప్పాక “ఇక నుండి బుద్ధిగా నడుచుకుంటాం. బొగ్గు కుంభకోణం విచారణ పురోగతి నివేదికలన్నీ నేరుగా మీకే చూపుతాం. ప్రభుత్వానికి చూపించం” అని తలూపి కోర్టు బైటికి వచ్చిన సి.బి.ఐ అధిపతి కోర్టు ఆవరణలోనే మాట మార్చేశారు. “సి.బి.ఐ స్వతంత్ర…

అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలతో కొరియాల వద్ద ఉద్రిక్తతలు

ఉభయ కొరియాల వద్ద అమెరికా సాగిస్తున్న ‘మిలట్రీ డ్రిల్’ (కోడ్ నేమ్ ఫోల్ ఈగిల్) ఉద్రిక్తతలు రెచ్చగొడుతోంది. మున్నెన్నడూ లేని విధంగా అణు బాంబులు జారవిడిచే బి-2 బాంబర్ యుద్ధ విమానాలను కొరియా భూభాగంపై ఎగరడంతో ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది. కొరియా భూభాగంపై 10,000 కి.మీ ఎత్తు ఎగురుతూ బి-2 బాంబర్లు ‘మాక్ బాంబింగ్’ డ్రిల్ (పేలుడు పదార్ధాలు లేని బాంబు జారవిడిచి అది అనుకున్న చోట పడేదీ, లేనిదీ నిర్ధారించుకోవడం) నిర్వహించడంతో ఉత్తర కొరియా…

కర్ణాటక ఎన్నికలు: బి.జె.పి విచిత్ర పోరాటం

మాకు ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీయేనని కర్ణాటక బి.జె.పి ప్రకటిస్తోంది. తమ నుండి చీలి ‘కర్ణాటక జనతా పార్టీ’ పేరుతో వేరు కుంపటి పెట్టిన యెడ్యూరప్ప ప్రభావాన్ని ఆ విధంగా తక్కువ చేసి చూపాలని బి.జె.పి ప్రయత్నం. బి.జె.పి పాలనలో నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించిన పార్టీ జనతాదళ్ (సెక్యులర్) అని కనుక తామే బి.జె.పి కి ప్రధాన పోటీ అని జె.డి(ఎస్) ప్రకటిస్తోంది. ఆ పార్టీకి ప్రత్యేకంగా పోరాటం చేయాల్సిన పని లేదని దాని ఓటు…

సి.బి.ఐని కడిగేసిన సుప్రీం కోర్టు

– బొగ్గు కుంభకోణం విచారణలో సి.బి.ఐ నిర్వహిస్తున్న పాత్ర పలు అనుమానాలకు తావిస్తోంది. సి.బి.ఐ ని ప్రభావితం చేయడానికి న్యాయ శాఖ మంత్రి స్వయంగా పూనుకోవడం, ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ఇందులో పాత్ర వహించడాన్ని బట్టి పాలకులు అవసరం అయితే ఎంతకు తెగిస్తారో తెలిసి వస్తోంది. విచారణ పురోగతి నివేదికలను ప్రభుత్వానికి చూపడం లేదని మార్చి 8 తేదీన చెప్పిన సి.బి.ఐ ఏప్రిల్ 26 తేదీన సమర్పించిన అఫిడవిట్ లో ప్రభుత్వానికి చూపిన తర్వాతే కోర్టుకు…

బొగ్గు: రాజకీయుల ఆదేశాలు తీసుకోవద్దు, సి.బి.ఐతో సుప్రీం

బొగ్గు కుంభకోణం విచారణకు సంబంధించి ఇక నుండి రాజకీయ కార్యనిర్వాహకుల (political executive) నుండి ఆదేశాలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు సి.బి.ఐ ని ఆదేశించింది. ఏప్రిల్ 26 తేదీన సి.బి.ఐ సమర్పించిన అఫిడవిట్ లో అత్యంత కలతపరిచే అంశాలు ఉన్నాయని సుప్రీం వ్యాఖ్యానించింది. బొగ్గు కుంభకోణం విచారణలో సుప్రీం కోర్టుకు సి.బి.ఐ సమర్పిస్తున్న (దర్యాప్తు) పురోగతి నివేదికలను కోర్టుకు సమర్పించే ముందు ప్రభుత్వ మంత్రులకు బ్యూరోక్రాట్ అధికారులకు చూపిస్తున్నామని సి.బి.ఐ అఫిడవిట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే.…

సి.ఐ.ఎ వద్ద డబ్బు తీసుకున్నా, ఆఫ్ఘన్ అధ్యక్షుడి ఒప్పుకోలు

ఆఫ్ఘనిస్ధాన్ ప్రభుత్వంలో అవినీతి గురించి తెగ బాధపడిపోయే అమెరికా అవినీతి భాగోతాన్ని ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ స్వయంగా బైటపెట్టాడు. తాను సి.ఐ.ఎ వద్ద డబ్బు తీసుకున్నమాట నిజమేనని కానీ ఆ డబ్బు గాయపడినవారికి, జబ్బు పడినవారికి, కొన్ని ఇళ్లకు అద్దె చెల్లించడానికి వినియోగించానని హమీద్ కర్జాయ్ నమ్మబలికాడు. ఆఫ్ఘనిస్ధాన్ లో సి.ఐ.ఎ లంచాలు మేపడం కొత్తేమీ కాదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక సి.ఐ.ఎ చర్యలను సమర్ధించుకురాగా, సి.ఐ.ఎ సొమ్ము చివరికి తాలిబాన్ వద్దకే చేరుతోందని అనేకమంది…

జ్యోతి సింగ్ సింగపూర్ కి, సరబ్ జిత్ సింగ్ ఇండియాకి!?

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక విచిత్రమైన ప్రకటన జారీ చేసింది. సరబ్ జిత్ సింగ్ ని విడుదల చేసి ఇండియాకి పంపిస్తే ఇక్కడ ఉన్న అత్యున్నత వైద్య చికిత్సను అందజేసి ఆయన్ను బతికించుకుంటామన్నది ఆ ప్రకటన సారాంశం. ‘బతకడం కష్టమే’ అని పాకిస్ధాన్ డాక్టర్లు పెదవి విరుస్తున్న సరబ్ జిత్ సింగ్ కి అత్యున్నత స్ధాయి వైద్య చికిత్స అందజేసి గుర్రాన్ని ఎగిరించగల భారతీయ వైద్యం జ్యోతి సింగ్ పాండేకు ఎందుకు పనికిరాకుండా పోయింది?…

జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన -11 భాగాలు

ఈనాడు దిన పత్రికలో ప్రతి సోమవారం ప్రచురించే చదువు పేజీలో ‘జాతీయ అంటార్జాతీయ పరిస్ధుతులపై అవగాహన సాధించడమెలా?’ వ్యాస పరంపర వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాసాలను కొత్తగా చూసినవారు పాత భాగాల కోసం అడుగుతున్నారు. కొంతమంది ‘కటింగ్ తీసి పెట్టారా’ అని అడుగుతుంటే, ఇంకొందరు ‘అన్నీ కలిపి బుక్ వేస్తారా’ అని అడుగుతున్నారు. నేను కటింగ్స్ తీసి పెట్టలేదు. బ్లాగ్ లో ఉన్నాయి గనుక ఆ జాగ్రత్త తీసుకోలేదు. బుక్ వేయదలిస్తే ఈనాడు వాళ్ళు వేయాలనుకుంటా.…

మన్మోహన్ ఫైలుకి పరిష్కారం లేదు -కార్టూన్

ది హిందు పత్రికలో కేశవ్ కార్టూన్లు చాలా సెన్సిబుల్ గా ఉంటాయి. ఒక్కోసారి కేశవ్ కవి కాబోయి కార్టూనిస్టు అయ్యారా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కార్టూన్లకు కవిత్వానికి ఉన్నంత లోతు ఉంటుంది. ఆ లోతు ఒక్కోసారి చాలామందికి అందదు. (నాక్కూడా.) ఈ కార్టూన్ అందులో ఒకటిగా కనిపిస్తోంది. ‘మిస్టర్ క్లీన్’గా ఒకప్పుడు మన్ననలు అందుకున్న మన్మోహన్ సింగ్ ఇప్పుడు అవినీతి రాజుగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మన్మోహన్ కి ఆపాదిస్తున్న అవినీతి ద్వారా ఆయన స్వయంగా లబ్ది పొందకపోవడమే…

ఏ దేశానిది ఏ నేపధ్యం -ఈనాడు ఆర్టికల్ 11వ భాగం

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా’ వ్యాస పరంపరలో 11 వ భాగం ఈ రోజు ప్రచురించబడింది. వివిధ దేశాలను తేలికగా గుర్తుపెట్టుకోవడం ఎలా అన్న అంశానికి కొనసాగింపు ఈ వ్యాసం. 10వ ఆర్టికల్ లో అమెరికా యూరప్ ల గురించి చర్చించుకున్నాం. ఈసారి మిగిలిన ప్రాంతంలో మరి కొన్నింటిని ఎలా గుర్తుంచుకోవచ్చో చర్చిస్తాము. ఈనాడు చదువు పేజీలో ఈ వ్యాసం చూడవచ్చు. వ్యాసాన్ని ఈనాడు వెబ్ సైట్ లో నేరుగా చదవాలనుకుంటే ఈ లింక్ పైన…

బోడిగుండుకు మోకాలుకు ముడి పెట్టడం అంటే ఇదే

రాజకీయ నాయకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. తిమ్మిని బమ్మిని చేయగలరు, బోడిగుండుకు మోకాలుకు పీట ముడి వేయగలరు. బి.జె.పి అధికార ప్రతినిధి రవి శంకర్ ప్రసాద్ ఈ విద్యలో అనూహ్య స్ధాయిలో ఆరితేరినట్లు కనిపిస్తోంది. ఆయన చెప్పిందాని ప్రకారం: భారత భూభాగం లోకి చైనా జరిపిన చొరబాటు నుండి దృష్టి మరల్చడానికే పాకిస్ధాన్ జైలులో భారతీయ ఖైదీ సరబ్ జిత్ సింగ్ పైన హంతక దాడి జరిగింది. ఈ మేరకు పాకిస్ధాన్ ప్రభుత్వం పూనుకుని మోసపూరితంగా సరబ్…

ఇరాక్: ఆల్-జజీరా చానెల్ అనుమతి రద్దు

కతార్ రాజ్యాధినేత నడుపుతున్న ఆల్-జజీరా ఛానెల్ ఇరాక్ లో ప్రసారాలు చేయకుండా అక్కడి ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది. సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు ఆయుధ, ధన, మానవ వనరుల సహాయం అందజేస్తున్న కతార్ చానెల్ ఇరాక్ లో కూడా సెక్టేరియన్ విభజనలను రెచ్చగొడుతోందని ఇరాక్ ప్రభుత్వం ఆరోపించింది. ఆల్-జజీరాతో పాటు మరో 9 టి.వి చానెళ్లకు కూడా ఇరాక్ ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది. ఈ మేరకు ఇరాక్ అధికారులు ఆదివారం ప్రకటించారు. మెజారిటీ మతస్ధుల షియా…

ఇటలీలో వర్గ సంకర ప్రభుత్వం!

ఇటలీలో ఎట్టకేలకు ఒక ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఎన్నికలు ముగిసి రెండు నెలలు దాటినా అక్కడ ప్రభుత్వం ఏర్పడలేదు. ఏ పార్టీకి గానీ, ఏ కూటమికి గానీ ప్రభుత్వం ఏర్పాటు చేయగల మెజారిటీ రాకపోవడంతో ఇన్నాళ్లూ పాత ప్రధాని నేతృత్వంలోనే తాత్కాలిక ప్రభుత్వం నడిచిందక్కడ. అయితే శనివారంతో ప్రతిష్టంభనకు తెరపడింది. తెరపడడం కాదు గానీ విచిత్ర పద్ధతిలో తెరపడడమే అసలు వార్త. రాజకీయ సమతలం పైన దాదాపు వైరి శిబిరాలుగా వ్యవహరించే మిత వాద కూటమి, వామపక్ష పార్టీల…

తాటిచెట్టు ఎందుకెక్కావంటే దూడ మేతకు అన్నాట్ట! -కార్టూన్

“అబ్బే ఏ దారిలో వెళ్లాలో తెలుసుకోడానికి ఇక్కడకు వచ్చారంతే!” – బొగ్గు కుంభకోణం నుండి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను, ఆయనతో పాటు కాంగ్రెస్ (యు.పి.ఏ) ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అధికార పార్టీ నేతలు పిల్లి మొగ్గలు అన్నీ ఇన్నీ కాదు. బొగ్గు కుంభకోణం పైన విచారణ జరుపుతున్న సి.బి.ఐ సుప్రీం కోర్టుకు దశలవారీగా స్ధాయి నివేదికలను (status reports) సమర్పిస్తోంది. మార్చి నెలలో నివేదికను కోర్టుకు సమర్పించడానికి ముందు న్యాయ శాఖ మంత్రి అశ్వని కుమార్…