సి.ఐ.సి సంచలనం: రాజకీయ పార్టీలూ ఆర్.టి.ఐ పరిధిలోనివే

సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సి.ఐ.సి) సంచలన తీర్పు ప్రకటించింది. ‘మేము ఆర్.టి.ఐ (రైట్ టు ఇన్ఫర్మేషన్) పరిధిలోకి రాము’ అని చెబుతూ పిటిషన్ దారులు కోరిన సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చిన రాజకీయ పార్టీలకు దిమ్మ తిరిగేలా ఈ తీర్పు ఉన్నది. రాజకీయ పార్టీలు అనేక విధాలుగా ఆర్ధికంగా ప్రభుత్వం నుండి లబ్ది పొందుతున్నందున అవి పబ్లిక్ ఆధారిటీ కిందకు వస్తాయని కనుక ప్రజలు కోరినప్పుడు తమ నిధులపై తగిన సమాచారం ఇవ్వాల్సిందేనని తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్,…

అబ్బే మా మధ్య విభేదాలేమీ లేవు -కార్టూన్

– – “అబ్బే తేడాలేమీ లేవు. మేమిద్దరం కలిసే పని చేస్తున్నాం!” “మళ్ళీ మీ పనిలోకి దిగిపోయారా? రాజకీయాలను క్రీడలతో కలపొద్దు చెబుతున్నా!” కాంగ్రెస్ అధ్యక్షురాలు, యు.పి.ఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ ల మధ్య విభేదాలు తలెత్తాయని మళ్ళీ పత్రికలు గుస గుసలు మొదలు పెట్టాయి. అవినీతి ఆరోపణలతో పవన్ కుమార్ బన్సాల్, బొగ్గు కుంభకోణంలో విచారణ చేస్తున్న సి.బి.ఐ విధుల్లో జోక్యం చేసుకున్నందుకు సుప్రీం కోర్టు చేత అభిశంసనకు గురయినందుకు అశ్వనీ…

బి.సి.సి.ఐ మ్యాచ్ ఫిక్స్, ‘శ్రీ’నివాసన్ ఔట్?

ఆదివారం బి.సి.సి.ఐ బోర్డు అత్యవసర సమావేశం జరిపి అధ్యక్షుడు శ్రీనివాసన్ కు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. కార్యదర్శి జగ్దాలే, ట్రెజరర్ అజయ్ షిర్కే ల రాజీనామాలతో శ్రీనివాసన్ పై ఒత్తిడి బాగా పెరిగినట్లు తెలుస్తోంది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ లాంటి పరిణామాలను కారణంగా చూపుతూ, ఐ.పి.ఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా శనివారం రాజీనామా చేయడంతో ఇక శ్రీనివాసన్ రాజీనామా దాదాపు ఖాయమేనని పత్రికలు చెప్పేస్తున్నాయి. అయితే రాజీనామాకు శ్రీనివాసన్ కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. తనకు…

అరుంధతీ రాయ్: హింస కాదు ప్రతి హింస -2

  మొదటిభాగం తరువాయి……………………. సాగరికా ఘోష్: ఈ హింసా వలయానికి వ్యతిరేకంగా మీలాంటివారు గొంతెత్తవలసిన అవసరం లేదంటారా? లేదా మీలాంటి వారు వాస్తవానికి దానికి హేతుబద్ధతను కనిపెట్టడానికి ప్రయత్నించాలంటారా? ఎందుకంటే, మిమ్మల్ని ‘మావోయిస్టుల ఆపాలజిస్టు’గా పిలుస్తున్నారు! బి.జె.పి మిమ్మల్ని ‘నగ్నలిజం యొక్క అధునాతన ముఖం’ అని పిలుస్తారు. వారి హింసకు వ్యతిరేకంగా మీరు గొంతెత్తకపోతే, రాజ్యం (యొక్క హింస) కు నైతికంగా న్యాయబద్ధమైన ప్రతిఘటన అని చెబుతూ అది నైతికంగా సమర్ధనీయం అని చెబితే, పౌర సమాజంలోని…

మోడి నోరు తెరవరేమి? -కార్టూన్

— “కొద్దిగా మార్పులు చేసి వాటిని మీరు ఉపయోగించొచ్చు కదా!” — ఐ.పి.ఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం విషయంలో దాదాపు అందరూ ఏదో ఒక మాట అనేశారు. భావి ప్రధాని కావాలని ఆశిస్తున్న మోడి మాత్రం ఎందుకో ఇంకా నోరు తెరవలేదు! మోడి అటెన్షన్ కోరడానికి కారణం ఆయన కూడా బి.సి.సి.ఐ బోర్డు సభ్యుడు కావడమే. గుజరాత్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఆయన కూడా బి.సి.సి.ఐ బోర్డు సభ్యులే. అవడానికి క్రికెట్ ఆట బోర్డే అయినా దాని…

ఎస్-300 సిరియాకి ఇచ్చావో…, రష్యాకి ఇజ్రాయెల్ హెచ్చరిక

సిరియా యుద్ధంలో ‘గేమ్ ఛేంజర్’ గా రష్యా టుడే అభివర్ణించిన ఎస్-300 క్షిపణుల సరఫరా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎస్-300 క్షిపణులను సిరియాకు సరఫరా చేయొద్దంటూ ఇజ్రాయెల్ మరోసారి రష్యాను కోరింది. ఈసారి రష్యాకు హెచ్చరికలు జారీ చేసింది. ఎస్-300 క్షిపణులను సిరియాకు సరఫరా చేసినట్లయితే షిప్పింగ్ చేస్తున్న వాహనాలపై దాడి చేసి నాశనం చేస్తామని హెచ్చరించింది. కాగా క్షిపణుల సరఫరాను రష్యా గట్టిగా సమర్ధించుకుంది. సిరియాతో కుదుర్చుకున్న పాత ఒప్పందాన్ని తాము గౌరవిస్తున్నామని తెలియజేసింది. ఇజ్రాయెల్ రక్షణ…

భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడిన జస్టిస్ చిన్నపరెడ్డి గారి స్మృతిలో…

(సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఒంటెత్తుపల్లి చిన్నప రెడ్డి ఏప్రిల్ 13 తేదీన మరణించారు. భారత దేశంలో అటు న్యాయ పరిపాలనతో పాటు ఇటు రాజకీయ పరిపాలనను కూడా ప్రగతిశీల దృక్పధం వైపుకు నడిపించడానికి ప్రయత్నించిన ‘లెజెండరీ-క్వార్టెట్’ లో జస్టిస్ చిన్నప రెడ్డి ఒకరు. జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్, జస్టిస్ పి.ఎన్.భగవతి, జస్టిస్ డి.ఎ.దేశాయ్ లతో పాటు ‘లెజెండరీ క్వార్టెట్’ గా మన్ననలు అందుకున్న నలుగురిలోకి ఆయనే చిన్నవారు. తన 90 వ యేట వృద్ధాప్యం తెచ్చిన…

సొంత డబ్బాకు అమ్మ, నాయనమ్మలు కావాలా?

— “…తనకు నాయకత్వ సామర్ధ్యం ఏ మాత్రం ఉందో కనిపెట్టడానికి రాహుల్ జీ ప్రయత్నిస్తున్నట్లున్నారు…” — కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యాక రాహుల్ గాంధీ తన మొట్టమొదటి పార్టీ అధికారిక పర్యటనకు ఢిల్లీనే ఎంచుకున్నారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని గురువారం సందర్శించిన రాహుల్ గాంధీ తాను క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోనని చెప్పారు. అంతవరకు సంతోషమే. కానీ అలా చెప్పడానికి తన అమ్మగారు, నాయనమ్మ గారిని అడ్డం పెట్టుకోవడమే ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. తాను తన అమ్మగారు…

చెన్నై టీం ఓనర్లే స్పాట్ ఫిక్సర్లు, పందెందార్లు

కలుగులో ఎలుక బైటికి వచ్చేస్తోంది. పోలీసులు పెట్టిన పొగ తట్టుకోలేక పుట్టలో పాములు వరుసగా తోసుకుని బైటికొస్తున్నాయి. విందూ దారా సింగ్ ఇచ్చిన వివరాలు నిజమేనని ముంబై పోలీసులకు స్పష్టంగా అర్ధం అయింది. స్పాట్ ఫిక్సింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని, బి.సి.సి.ఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు, ఇండియా సిమెంట్స్ కంపెనీ అధినేతల్లో ఒకరు అయిన గురునాధ్ మీయప్పన్ పాత్ర ఉన్నదని ముంబై పోలీసుల వద్ద సరిపోయినన్ని సాక్ష్యాలు ఉన్నాయట. ఈ మేరకు ముంబై జాయింట్…

మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం -కార్టూన్

ఉత్తర ప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ ప్రయాణం ఒక వింత రూపాన్ని సంతరించుకుంది. ఆ పార్టీ వ్యవస్ధాపకుడు కాన్షీరామ్ బతికి ఉంటే ఎలా ఉండేదో గానీ పార్టీ స్ధాపన సమయంలో ఆయన  చెప్పిన సిద్ధాంతాలకు చెదలు పట్టాయి. ఈ చెదలకు సైద్ధాంతీక పోషకత్వం స్వయంగా కాన్షీరామ్ వారసురాలు మాయావతియే కావడం ఒక విపరిణామం. భూస్వామ్య కులాల వలలో చిక్కిన కొద్దిమంది ఉప నాయకులు పార్టీ వ్యవస్ధాపాక సిద్ధాంతాలతో విభేదించి పార్టీని చీల్చి అగ్రకుల భూస్వామ్యులతో కలిసిపోతే…

హ్యాట్రిక్ ఊపులో మన్మోహన్ -కార్టూన్

వేగంగా పరుగెత్తాలని గుర్రాన్ని ఆదేశించాలంటే అశ్వికుడు ‘గిడియాప్’ అంటాడట. యు.పి.ఏ ఆస్వారూఢుడైన అశ్వికులు మన్మోహన్ సింగ్ గారు తొమ్మిదేళ్ల శ్రమతో నిర్మించిన రోడ్డు పైన తన గుర్రానికి అదే ఆదేశాలిస్తున్నారు. హ్యాట్రిక్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ మధ్య విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్, మూడోసారి ప్రధాని అయ్యే అవకాశాలని తోసి పుచ్చలేదని వార్తలు వచ్చాయి. మొన్నటితో మన్మోహన్ పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్ళీ అదే చర్చ తలెత్తింది. దానినే కార్టూనిస్టు ఎత్తిచూపిస్తున్నారు. అసలు…

వేడి సెగల డ్రాగన్ షేక్-హ్యాండ్ -కార్టూన్

చైనా ప్రధాని లీ-కెషాంగ్ భారత్ పర్యటన నేటితో మూడో రోజులోకి ప్రవేశించింది. ఈ రెండు రోజుల్లోనే పలు కీలక ఒప్పందాలు కుదిరాయని ఇరు దేశాల ప్రధాన మంత్రులు సంయుక్త విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. పలు ‘అవగాహనా ఒప్పందాలు’ (Memorandum of Understanding -MoU) కుదిరాయని కూడా వారు తెలిపారు. పర్యటన ప్రారంభంలో ‘తొలుత వాణిజ్య సంబంధాలు బాగా అభివృద్ధి చేసుకుని సరిహద్దు సమస్య దీర్ఘకాలికంగా పరిష్కరించుకుందాం’ అని లీ-కెషాంగ్ చెప్పినట్లు ది హిందు పత్రిక ప్రకటించింది. తీరా…

ధర్మాన, సబిత రాజీనామా చేసేశారు

కాంగ్రెస్ అవినీతి వ్యతిరేక నాటకంలో ఒక అంకం పూర్తయింది. ధర్మాన రాజీనామా తిరస్కరణను గతంలో ఆమోదించిన అధిష్టానమే ఇప్పుడు ఆయన రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టిందట! ధర్మానతో పాటు ‘కళంకిత మంత్రుల’ ఒకరయిన సబిత ఇంద్రారెడ్డి రాజీనామా కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం ఆదేశించిందట. ఈ విషయం ముఖ్యమంత్రి ద్వారా తెలుసుకున్న మంత్రులు ఇరువురు ఆయనను కలుసుకుని తమ రాజీనామా పత్రాలు అందజేశారని ది హిందు తెలిపింది. అయితే మంత్రుల రాజీనామా విషయం ఇంకా…

కర్ణాటకలో పదవుల కొట్లాట -కార్టూన్

– నా తక్షణ కర్తవ్యం, మంత్రులు కానివారిని అదుపులో పెట్టడం… – మెట్టు తర్వాత మెట్టు ఎక్కడం రాజకీయ నాయకుల వంతయితే, పెనం మీద నుండి పొయ్యిలోకి నిరంతరాయంగా జారుతుండడం ప్రజల వంతు. తమ మధ్య వైరుధ్యాల పరిష్కారం కోసం ఎన్నికల రూపంలో ప్రజల వద్దకు వచ్చే రాజకీయ నాయకులు, పార్టీలు, ఆ కాస్త ఎన్నికల యజ్ఞం అయ్యాక పదవుల పండేరంలో మునిగి తేలడం రివాజు. కర్ణాటకలో ఇపుడు జరుగుతోంది అదే. అక్రమ మైనింగ్ కేసులు నడుస్తున్నందుకు…

కరుగుతున్న ఆర్కిటిక్, చమురు సంపదలో ఇండియాకీ వాటా?

భూ గ్రహం ఉత్తర ధ్రువం అయిన ఆర్కిటిక్ ఖండం వద్ద మంచు గడ్డలు వేగంగా కరిగిపోతున్నాయి. దానితో ఆ ఖండం వద్ద దాగిన అపార ఖనిజ, చమురు వనరుల కోసం పోటీ పేరుగుతోంది. ఈ పోటీలో భారత దేశం కూడా ప్రవేశించిన పరిణామం చోటు చేసుకుంది. ‘ఆర్కిటిక్ కౌన్సిల్’ లో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తూ వచ్చిన ఇండియాకు ‘పరిశీలక’ హోదా ఇస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇండియా, చైనాలతో పాటు ఆరు దేశాలకు ఈ హోదా…