మా శత్రువుకు సాయం చేస్తే సహకారం ఉండదు, ఇండియాకు బి.ఎన్.పి హెచ్చరిక!

బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ అయిన ‘బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ’ ఇండియాకు హెచ్చరిక జారీ చేసింది. “మా శత్రువు (షేక్ హసీనా) కు సహాయం చేస్తే మీతో సహకారం కొనసాగించడం కష్టం అవుతుంది” అని బి.ఎన్.పి పార్టీ ఇండియాను గట్టిగా హెచ్చరించింది. ఈ మేరకు బి.ఎన్.పి పార్టీ ప్రతినిధి మరియు బంగ్లాదేశ్ మాజీ మంత్రి గయేశ్వర్ రాయ్, హెచ్చరించాడు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఇండియాలో రక్షణ కల్పించడం ఆ దేశ ప్రతిపక్ష పార్టీ బి.ఎన్.పి…

బిజెపి కేసుల బండారం బైట పెట్టిన సిసోడియా బెయిల్!

ఢిల్లీ లిఫ్టినెంట్ గవర్నర్, బిజెపి/మోడి ప్రభుత్వం (ఇడి, సిబిఐ) కనిపెట్టిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కు బెయిల్ మంజూరు చేసింది. ‘బెయిల్, నాట్ జెయిల్, ఈజ్ ద రూల్’ అని జస్టిస్ బి. ఆర్. గవాయ్, కెవి విశ్వనాధన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్ పై విడుదలయిన మనీష్ సిసోడియా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తనపై సుదీర్ఘ కాలంగా సాగుతున్న…

బంగ్లా నుండి కోటిమంది హిందువులు ఇండియా వస్తారట!

ఎద్దు ఈనింది అంటే దూడని దొడ్లో కట్టేయమన్నాడట వెనకటికొకరు! పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు, తృణమూల్ కాంగ్రెస్ నుండి బిజెపిలోకి దూకిన టర్న్ కోట్ సువేందు అధికారి చేసిన ప్రకటన ఇలాగే ఏడ్చింది! పత్రికల వార్తల ప్రకారం సువేందు అధికారి “సిద్ధంగా ఉండండి. బంగ్లాదేశ్ నుండి కోటి మంది హిందువులు (పశ్చిమ) బెంగాల్ కు వలస రాబోతున్నారు” అని ప్రకటించాడు. సువేందు అధికారి అంతటితో ఆగలేదు. ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న…

బంగ్లా సంక్షోభం, అమెరికా పుణ్యం!

Awami League Leader and Ousted PM Shaik Hasina జనవరి 2024 ఎన్నికల్లో 4వ సారి బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా ఎన్నికయిన అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనా సోమవారం ఆగస్టు 5 తేదీన అక్కడి మిలటరీ సమకూర్చిన హెలికాప్టర్ లో ఇండియాకు పారిపోయి రావడంతో భారత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. జులై 1 తేదీ నుండి బంగ్లా దేశ్ లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నప్పటికీ పరిస్ధితి ఇంతటి తీవ్ర పరిణామాలకు…

క్రీమీ లేయర్: కొండ నాలుకకు మందేస్తే…

సుప్రీం కోర్టు నియమించిన 7గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో 4గురు సభ్యులు తమకు అప్పగించని పనిని నిర్వర్తించారు. ఒకరైతే ఏకంగా ఏ భగవద్గీత అయితే భారత ప్రజలను నాలుగు వర్ణాలుగా విభజించి పంచముల గురించి అసలు మాట్లాడలేదో అదే భగవద్గీతను తన తీర్పు సందర్భంగా ఉటంకించటానికి వెనకాడ లేదు. అసలు భగవద్గీత శ్లోకాలను తమ తీర్పులలో ఈ మధ్య తరచుగా తెస్తున్న న్యాయమూర్తులకు మన దేశానికి ఒక రాజ్యాంగం, శిక్షా స్మృతి ఉన్నాయనీ, కోర్టులు వాటిని మాత్రమే…

ఎస్.సి వర్గీకరణకు సుప్రీం కోర్టు ఆమోదం

ఆగస్టు 1 తేదీన భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం అయిన సుప్రీం కోర్టు, ఎస్.సి కులాల జాబితాను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయవచ్చని తీర్పు ప్రకటించింది. గతంలో ఇ.వి.చిన్నయ్య తీర్పులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును 7 గురు జడ్జిలతో కూడిన సుప్రీం కోర్టు బెంచి తప్పు పట్టింది. వివిధ కులాల అబివృద్ధి మరియు సామాజిక స్థాయిల గురించి వివరాలను క్రమ పద్ధతిలో సేకరించి, అలా సేకరించిన ఎంపిరికల్ డేటా ఆధారంగా మాత్రమే ఎస్.సి…

ఇజ్రాయెల్ పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశాలు!

అనుమానించినట్లే జరుగుతున్నది. ఇరాన్ గడ్డపై హమాస్ సంస్థ పోలిటికల్ లీడర్ ను హత్య చేయడం పట్ల ఇరాన్ తీవ్రంగా స్పందిస్తోంది. ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దేశంపై ప్రత్యక్ష దాడి చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఆలీ ఖమెనీ ఆదేశాలు ఇచ్చాడు. ఆలీ ఖమెనీ ఈ ఆదేశాలు ఇచ్చాడని ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక జులై 31 తేదీన తెలియజేసింది. సుప్రీం నేషనల్ కౌన్సిల్ (ఎస్.ఎన్.సి) అత్యవసరంగా జరిపిన సమావేశంలో ఖమెనీ ఈ…

ఇజ్రాయెల్ ఘాతుకం: హమాస్ నేత హనియే హత్య!

ఇజ్రాయెల్ మరో ఘాతుకానికి తెగబడింది. హమాస్ సంస్థ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియేను హత్య చేసింది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రభుత్వం ప్రారంభోత్సవం నిమిత్తం ఇరాన్ రాజధాని టెహరాన్ లో ఉండగా ఇస్మాయిల్ హనియే బస చేస్తున్న భవనంపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో హనియే మరణించినట్లు వివిధ వార్తా సంస్థలు తెలియజేశాయి.  జులై 31 ఉదయం జరిగిన ఈ హత్యలో, ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ప్రధాన పాత్ర పోషించినట్లు…

కులం వికృత రూపాన్ని చూడండి!

సో-కాల్డ్ అగ్ర కులాల్లో పుట్టిన వాళ్ళకి దళితులు కుల అణచివేత గురించి మాట్లాడటం అంత ఇష్టం ఉండదు. ఇప్పుడు మీకేం తక్కువయిందట అని ప్రశ్నిస్తుంటారు. ‘నువ్వు కడ జాతి వాడివి’ అని చెప్పకుండానే చూపుల్తో చెప్పేసే చూపులని భరించడం ఎంత కష్టమో అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించరు. చిన్న కులాల పట్ల వాళ్ళ తేలిక భావాల్ని పెద్ద విషయం కాదన్నట్లు తేలికగా తేల్చేస్తారు. మీరు ప్రభుత్వానికి దత్త పుత్రులు అంటూ ఒక వ్యంగ్యాన్ని మొఖం మీద విసిరి కొడతారు.…

ఎపికి ఇచ్చేది గ్రాంటు కాదు, ప్రపంచ బ్యాంకు అప్పు

Amaravati the Ghost Town 2024-25 బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయింపులు ప్రకటించారు. టిడిపి, జెడి(యు) పార్టీల మద్దతు పైన బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నందునే ఆర్ధిక మంత్రి ‘కుర్సీ కో బచావో’ పధకం మేరకు ఆ రెండు రాష్ట్రాలకు నిధులు ప్రకటించిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించాడు. ఇతర రాష్ట్రాలపై వివక్ష చూపిందని ఆరోపించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి…

రెండిందాల నష్టపోతున్న మిడిల్ క్లాస్!

పన్ను చెల్లింపుదారుల్లో కార్పొరేట్ కంపెనీల కంటే మిడిల్ క్లాస్ ఆదాయంతో రోజులు కనాకష్టంగా వెళ్లదీసే వర్గమే అధిక మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నారని గత ఆర్టికల్ లో, ప్రభుత్వం విడుదల చేసిన ఆర్ధిక సర్వే సాక్షిగా, చూశాం. అత్యధిక పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ‘అడకత్తెరలో పోకచెక్క’ పరిస్ధితిని కాస్త చూద్దాం. కేంద్ర ప్రభుత్వానికి ప్రధానంగా రెండు రకాల పన్నుల ద్వారా ప్రజల నుండి ఆదాయం సమకూరుతుంది. ఒకటి ప్రత్యక్ష పన్నులు: ఆదాయ పన్ను, కార్పొరేట్ల లాభాలపై పన్నులు. రెండవది,…

మోడీ పుణ్యం: కార్పొరేట్ల కంటే మిడిల్ క్లాస్ చెల్లించే పన్నులే ఎక్కువ!

ఇండియాలో చాలా మందికి తెలియని సంగతి ఏమిటంటే ఇక్కడి కార్పొరేట్ కంపెనీల కంటే మధ్య తరగతి జీవులు చెల్లిస్తున్న పన్నుల మొత్తమే ఎక్కువ అని. బిజెపి ప్రభుత్వం అనుసరించిన ఆర్ధిక విధానాలు ఈ పరిస్ధితికి దారితీశాయి. యుపిఏ హయాంలో కార్పొరేట్లు తెగ పన్నులు కట్టేశాయని కాదు గానీ, కొద్దో గొప్పో మిడిల్ క్లాస్ కంటే కాసింత ఎక్కువ పన్నుల ఆదాయం కార్పొరేట్ కంపెనీల నుండి వచ్చేది. మోడీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా 2021-22 ఆర్ధిక సం.…

బడ్జెట్ 24-25: ఆదాయ పన్నులో నలుసంత ఉపశమనం!

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు అనగా జులై 23 తేదీన 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఎప్పటి లాగానే కార్పోరేట్ సూపర్ ధనిక వర్గాలకు రాయితీలు ప్రకటించిన ఆర్ధిక మంత్రి మధ్య తరగతి ఉద్యోగులకు మాత్రం నాలుగు మెతుకులు విధించారు. ప్రస్తుతం రెండు రకాల ఆదాయ పన్ను విధింపును ఉద్యోగులు కలిగి ఉన్నారు. ఒకటి ఓల్డ్ రెజిం, రెండు కొత్త రెజిం. రెండేళ్ళ క్రితం కొత్త రెజిం…

కన్వర్ యాత్రలో మత ఘర్షణలకు ఏర్పాట్లు?

బి‌జే‌పి ప్రభుత్వాల మతతత్వ పూరిత ఆదేశాలు నానాటికి శృతి మించుతున్నాయి. ఏదో విధంగా ముస్లింలపై వ్యతిరేకతను సృష్టించి తగవులు పెట్టేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. గత లోక్ సభ ఎన్నికల ప్రచార సందర్భంగా సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారే ముస్లింలకు వ్యతిరేకంగా ప్రసంగాలు గుప్పించినప్పటికీ లోక్ సభలో సీట్ల సంఖ్యను పెంచుకోవడంలో సఫలం కాలేక పోయాడు. ఐనప్పటికీ బి‌జే‌పి నేతృత్వం లోని ఉత్తరాది రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశలో తమ…

పోటీ నుండి బైడెన్ ఉపసంహరణ, ట్రంప్ కు తలనొప్పి!

అమెరికా అద్యక్ష పదవి రేసు నుండి తప్పుకుంటున్నట్లు జోసెఫ్ బైడెన్ ప్రకటించాడు. ఎక్స్ (ట్విట్టర్) ఈ మేరకు బైడేన్ ఒక లేఖను పోస్ట్ చేశాడు. అదే లేఖలో ఆయన తన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వానికి మద్దతు (ఎండార్స్ మెంట్) ప్రకటించాడు. అధ్యక్షుడుగా ఉండగా బైడెన్ డిమెన్షియాతో బాధపడుతున్నట్లు ఆయన బహిరంగ ప్రవర్తన ద్వారా ప్రజలకు స్పష్టంగా తెలుస్తూ వచ్చింది. అనేకసార్లు తన సొంత సిబ్బంది పేర్లు మర్చిపోవటం, విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ అకస్మాత్తుగా…