కువైట్ పై దాడికి 8 రోజుల ముందు, అమెరికా ఇరాక్ ల మధ్య ఏం జరిగింది?

ఆగస్టు 2, 1990 న కువైట్ పై ఇరాక్ దాడి చేసింది. ఇది దురాక్రమణ అని అమెరికా గగ్గోలు పెట్టింది. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిందని బి.బి.సి లాంటి వార్తా సంస్ధలు ప్రకటించాయి. స్వేచ్ఛా ప్రపంచంలో ఇలాంటి దాడులు కూడదని, ఇరాక్ బలగాలు బేషరతుగా కువైట్ నుండి విరమించుకోవాలని అమెరికా అధ్యషుడు జార్జి బుష్ (సీనియర్) అమెరికా పార్లమెంటు లోపలా బయటా ఎదతెరిపి లేకుండా నీతులు, బోధలు కురిపించాడు. ఒక స్వతంత్ర దేశంపై…

అమెరికా ఆశల మేరకు చైనాతో మిలట్రీ పోటీకి ఇండియా అనాసక్తి?

అమెరికా ప్రకటించిన ‘ఆసియా-పసిఫిక్’ విధానంలో చైనాతో మిలట్రీ పోటీకి ఇండియాను నిలపడం పట్ల భారత రక్షణ మంత్రి అనాసక్తి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఆసియా పై అమెరికా కేంద్రీకరణ పెరగడం వల్ల పొరుగున ఉన్న సముద్రాల్లో ముఖ్యంగా బంగాళాఖాతంలో ఆయుధ పోటీ పెరుగుతుందని ఇండియా భావిస్తున్నట్లు భారత అధికార వర్గాలను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది. అమెరికా తన విధానాన్ని పునరాలోచించాలనీ, పునర్మూల్యాంకనం చేసుకోవాలని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లియోన్ పెనెట్టాకు భారత్ సూచించిందని అధికారులు తెలిపారు. ‘ఆసియా-పసిఫిక్ కేంద్రంగా…

‘ప్రపంచ పటం నుండి ఇజ్రాయెల్ ని తుడిచెయ్యాలి’ అన్నదెవరు?

“ప్రపంచ పటం నుండి ఇజ్రాయెల్ ని తుడిచెయ్యాలి” అన్నాడని ఇరాన్ అధ్యక్షుడు ‘అహ్మది నెజాద్’ పైన పశ్చిమ దేశాల పత్రికలు, ఇజ్రాయెల్ తరచూ విషం కక్కుతుంటాయి. ఆయన ఎన్నడూ అనని మాటల్ని ఆయన నోటిలో కుక్కి అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్సు లాంటి దేశాలు ఇరాన్ పైన చేసే ఆధిపత్య దుర్మార్గాలకు చట్ట బద్ధతని అంటగట్టడానికి అవి నిత్యం ప్రయత్నిస్తుంటాయి. కెనడాకు చెందిన ప్రఖ్యాత పోలిటికల్ ఎకనమిస్టు ‘మైఖేల్ చోసుడోవ్ స్కీ’ ఇటీవల రాసిన పుస్తకం (Towards…

పాక్ లో ఆయుధాలు రవాణా చేస్తూ పట్టుబడిన అమెరికా రాయబారులు

పాకిస్తాన్ పట్టణం పెషావర్ లో ఆయుధాలు అక్రమంగా రవాణా చేస్తూ ముగ్గురు అమెరికా రాయబారులు సోమవారం పట్టుబడినట్లు పాక్ పత్రిక డాన్ తెలిపింది. పెషావర్ మోటార్ వే టోల్ ప్లాజా వద్ద రొటీన్ చెకింగ్ లో వీరు పట్టుబడ్డారు. ముగ్గురు అమెరికన్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తనిఖీలో నాలుగు అస్సాల్ట్ రైఫిళ్ళు + 36 మ్యాగజైన్లు, మరో నాలుగు పిస్టళ్లు + 30 మ్యాగజైన్లు దొరికాయని పోలీసులను ఉటంకిస్తూ డాన్ తెలిపింది. టోల్ ప్లాజా వద్ద…

‘సైబర్ హై వే’ పై బట్టలిప్పి గెంతుతున్న అమెరికా -2

– ‘నటాంజ్’ లో అండర్ గ్రౌండ్ లో శత్రు దుర్బేధ్యంగా నిర్మించబడిన ఇరాన్ అణు శుద్ధి కేంద్రంలోని కంప్యూటర్లను స్వాధీనంలోకి తెచ్చుకోవడమే ‘సైబర్ ఆయుధం’ లక్ష్యం. నటాంజ్ కర్మాగారంలో పారిశ్రామిక కంప్యూటర్ కంట్రోల్స్ లోకి జొరబడగలిగితే అణు శుద్ధి కార్యకలాపాలను విధ్వంసం చేయవచ్చన్నది పధకమని ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపింది. అలా జొరబడాలంటే ఇంటర్నెట్ నుండి నటాంజ్ ప్లాంటును వేరు చేసే ఎలక్ట్రానిక్ కందకాన్ని దాటాల్సి ఉంటుంది. టైమ్స్ సమాచారం ప్రకారం నటాంజ్ ప్లాంటును బైటి ప్రపంచం నుండి…

స్టక్స్ నెట్, ఫ్లేమ్: ‘ఇంటర్నెట్ హై వే’ పై బట్టలిప్పి గెంతుతున్న అమెరికా -1

‘నూనం-మానం, సిగ్గు-లజ్జ, చీము-నెత్తురు, నీతి-నియమం’ ఇలాంటివేవీ తాము ఎరగమని అమెరికా పాలక వ్యవస్ధ మరోసారి చాటుకుంది. ‘అమెరికా ఎంతకైనా తెగిస్తుంది’ అని చాటుకోవడంలో అమెరికా అధ్యక్షులు మినహాయింపు కాదని అమెరికా పత్రికలే నిర్ద్వంద్వంగా ఇంకోసారి తేల్చి చెప్పాయి. ఇరాన్ దేశ కంప్యూటర్లపై దాడి కోసం ‘కంప్యూటర్ వైరస్’ లను సృష్టించి, దుర్మార్గమైన ‘సైబర్ వార్’ కి తెర తీయడం వెనుక అమెరికా అధ్యక్షుడు ‘బారక్ ఒబామా’ ప్రత్యక్ష అనుమతి ఉందని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక వెల్లడి చేసింది.…

జూలియన్ అస్సాంజ్: స్వీడన్ తరలింపుకు ఇంగ్లండ్ కోర్టు అంగీకారం

ఆస్ట్రేలియాకు చెందిన వికీలీక్స్ చీఫ్ ఎడిటర్ ‘జూలియన్ అస్సాంజ్’ ను స్వీడన్ కు తరలించడానికి ఇంగ్లండు సుప్రీం కోర్టు అంగీకరించింది. జూలియన్ ను తమకు అప్పగించాలన్న స్వీడన్ ప్రాసిక్యూటర్ల కోరిక న్యాయబద్ధమేనని మెజారిటీ తీర్పు ప్రకటించింది. ‘రీ ట్రయల్’ కు జూలియన్ కోరవచ్చని తెలుస్తోంది. దానివల్ల తరలింపు మరింత ఆలస్యం అవుతుందే తప్ప ఆపడం జరగకపోవచ్చని న్యాయ నిపుణులను ఉటంకిస్తూ పత్రికలు వ్యాఖ్యానించాయి. డిసెంబరు 2010 లో జూలియన్ బ్రిటన్ లో అరెస్టయ్యాడు. ఒక మహిళను రేప్…

ఉత్తర కొరియాలో మేము గూఢచర్యం చేస్తున్నాం -అమెరికా మిలట్రీ

ఉత్తర కొరియాలో తాము గూఢచర్యం నిర్వహిస్తున్నామని అమెరికా మిలట్రీ అధికారి ఒకరు అంగీకరించాడు. దక్షిణ కొరియా ప్రత్యేక బలగాలతో కలిసి తాము ఉత్తర కొరియా మిలట్రీ వ్యవస్ధలు కనిపెట్టడానికి గూఢచర్యం నిర్వహించామని తెలిపాడు. పారాచూట్ల ద్వారా ఉత్తర కొరియాలో దిగి అండర్ గ్రౌండ్ లో దాగిన మిలట్రీ వ్యవస్ధలపై సమాచారం సేకరించామని అమెరికా అధికారి చెప్పినట్లు ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది. దక్షిణ కొరియాలో అమెరికా సైనిక స్ధావరాలున్నాయి. దక్షిణ కొరియాలో ‘స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్’ కమాండర్…

రష్యా విమానం కూల్చివేత అమెరికా పనే -రష్యా

రష్యాకు చెందిన ‘సుఖోయ్ సూపర్ జెట్ 100’ విమానం మే నెల మొదటి వారంలో ఇండోనేషియా కొండల్లో కూలి పోవడం వెనుక అమెరికా హస్తం ఉందని రష్యా మిలట్రీ గూఢచారి సంస్ధ జి.ఆర్.యు ఆరోపించిందని ప్రెస్ టి.వి తెలిపింది. విమాన ప్రమాదంలో ప్రయాణిస్తున్నవారంతా అక్కడే చనిపోయారు. విమానానికి గ్రౌండ్ సిబ్బందికి ఉన్న సంబంధాన్ని అమెరికా గూఢచర్య సంస్ధలు తెంపేయడంతో విమానం ప్రమాదానికి గురయ్యిందని రష్యా తెలిపింది. “ఒక ఎయిర్ క్రాఫ్ట్ కీ గ్రౌండ్ సిబ్బందికీ మధ్య జరిగే…

ఆఫ్ఘన్ ఫ్రెంచి బలగాలన్నీ ముందే ఉపసంహరణ

ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న తమ యుద్ధ బలగం (combat troops) అంతటినీ సంవత్సరం ముందే ఉపసంహరించుకోవడానికి నిర్ణయించినట్లు ఫ్రాన్సు కొత్త అధ్యక్షుడు ‘ఫ్రాంకోయిస్ హాలండే’ ప్రకటించాడు. ఒక రోజు సందర్శన కోసం ఆఫ్ఘనిస్ధాన్ వచ్చిన హాలండే, ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తో కలిసి విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశాడు. ఆఫ్ఘన్ నుండి ఫ్రెంచి బలగాల ఉపసంహరణ హాలండే ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి. ఈ వారం చికాగోలో జరిగిన నాటో సమావేశాల్లోనే తన ఉద్దేశ్యం…

అమెరికా మానవహక్కుల ఉల్లంఘనదారు -ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

అంతర్జాతీయ చట్టాలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ అమెరికా మానవ హక్కులను కాల రాస్తున్నదని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధగా ప్రాచుర్యం పొందిన ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ నివేదిక ఆరోపించింది. రహస్య కమెండో ఆపరేషన్ లో lethal force వినియోగించి ‘ఒసామా బిన్ లాడెన్’ ను  చట్ట విరుద్ధంగా హత్య చేసిందనీ విమర్శించింది. స్వతంత్ర దేశం యెమెన్ పై డ్రోన్ విమానాలతో దాడులు చేసి అమెరికా పౌరుడు అన్వర్ ఆల్-అవలాకి ని, ఆయన సహచరులను చట్ట విరుద్ధంగా హత్య చేసిందనీ విమర్శించింది.…

‘పర్షియన్ గల్ఫ్’ వివాదంపై గూగుల్ కి ఇరాన్ హెచ్చరిక

మధ్య ప్రాచ్యం (పశ్చిమాసియా) లో ప్రధాన నీటి అఖాతం ‘పర్షియన్ గల్ఫ్’ పేరును గూగుల్ తన మేప్ సర్వీస్ లో తొలగించడం పై న్యాయ చర్యలు తీసుకుంటానని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ను ఇతర గల్ఫ్ దేశాలనుండి ‘పర్షియన్ గల్ఫ్’ సముద్ర జలాలు వేరు చేస్తాయి. ప్రపంచంలోనే భారీ స్ధాయిలో క్రూడాయిల్ నిల్వలు ఈ సముద్ర జలాల్లో ఉన్నట్లు కనుగొన్నప్పటి నుండీ ఈ ప్రాంతానికి ఆర్ధిక, రాజకీయ, వాణిజ్య ప్రాముఖ్యత పెరిగింది. ఈ జలాల్లో ఉన్న హోర్ముజ్…

క్లుప్తంగా… 14.05.2012

జాతీయం పార్లమెంటుకి 60 సంవత్సరాలు భారత పార్లమెంటు సమావేశమై ఆదివారం (మే 13) తో 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆదివారం ప్రత్యేకంగా సమావేశం జరిపింది. రాజ్య సభ లో ప్రధాని మన్మోహన్, లోక్ సభలో ఆర్ధిక మంత్రి ప్రణబ్ చర్చ ప్రారభించారు. పార్లమెంటులో పదే పదే అవాంఛనీయ సంఘటనలు జరగడం పట్ల ప్రధాని ఆందోళన వెలిబుచ్చాడు. “సమావేశాలకు ప్రతిరోజూ ఆటంకాలు ఎదురు కోవడం, వాయిదాలు పడడం, కేకలు వేయడం వల్ల బైటి వారికి…

క్లుప్తంగా… 13.05.2012

జాతీయం డబ్ల్యూ.టి.ఒ లో ఇండియా పై అమెరికా ఫిర్యాదు ప్రపంచ వాణిజ్య సంస్ధలో ఇండియాపై అమెరికా ఫిర్యాదు చేసింది. అమెరికా నుండి దిగుమతి అయ్యే కోడి మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులతో సహా కొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై ఇండియా విధించిన నిబంధనలు ‘వివక్ష’తో కూడి ఉన్నాయని అమెరికా ఫిర్యాదు చేసింది. ‘సానిటరీ అండ్ ఫైటో సానిటరీ’ (ఎస్.పి.ఎస్) ఒప్పందం ప్రకారం మానవుల ఆరోగ్యంతో పాటు, జంతువులు మొక్కలను కూడా కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకునే హక్కు డబ్ల్యూ.టి.ఒ సభ్య…

వియత్నాం నెత్తిన అమెరికా రుద్ధిన యుద్ధ భీభత్సం -ఫొటోలు

1962 నుండి అమెరికా దురాక్రమణ యుద్ధ భీభత్సాన్ని అతి చిన్న దేశం ‘వియత్నాం’ నెత్తిన రుద్దింది. కమ్యూనిస్టు చైనా ప్రాబల్యం వియత్నాం దేశంలోకి విస్తరిస్తుందన్న భయంతో వియత్నాం ప్రజలపై అమెరికా బలవంతంగా రుద్దిన యుద్ధం ఇది. జాతీయ విముక్తి యుద్ధాల ఫలితంగా ప్రపంచంపై యూరోపియన్ దేశాల వలసాధిపత్యం అంతరించాక అమెరికా తన సామ్రాజ్యాధిపత్యాన్ని విస్తరించడానికి అనేక దుర్మార్గ యుద్ధాలను ప్రపంచ దేశాలపై రుద్ధడం ప్రారంభించింది. అమెరికా కంపెనీల ప్రయోజనాలను ప్రపంచ వ్యాపితంగా విస్తరించడంతో పాటు, కమ్యూనిస్టు వ్యవస్ధల…