భారత ద్రవ్యవిధానం పై ఈజిప్టు పరిణామాల ప్రభావం -ఆర్.బి.ఐ

ఈజిప్టులో హఠాత్తుగా తలెత్తిన పరిణామాలు భారత దేశ ద్రవ్యవిధానం పైన ప్రభావం చూపుతాయని ఆర్.బి.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారెడ్డి ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఈజిప్టు పరిణామాలు బొత్తిగా ఊహించని విధంగా వచ్చి పడ్డాయని, జనవరి ద్రవ్య విధాన సమీక్ష తర్వాత జరిగిన ఈ పరిణామాలు సమీక్షను పూర్వ పక్షం చేశాయనీ ఆయన అన్నారు. RBI Governer Duvvuri Subba Rao గత జనవరి 25 న రిజర్వు బ్యాంకు భారత పరపతి విధానాన్ని సమీక్షించి వడ్డీ…

ఈజిప్టులో అమెరికా దాగుడు మూతలు

ముప్ఫై ఏళ్ళనుండి పాలిస్తూ తమకు కనీస హక్కులు కల్పించని ముబారక్ దిగిపోవాలని ఈజిప్టు ప్రజలు గత పన్నెండు రోజిలుగా ఆందోళన చేస్తుండగా అమెరికా కల్లోలంలో తమకు ఏ విధంగా లాభం చేకూరుతుందా అని అమెరికా, యూరోపియన్ యూనియన్ గోతికాడ గుంటనక్కల్లా చూస్తున్నాయి. Muslim Brotherhood Leader Mohammed Badie అధికారారం అప్పగించడానికి శాంతియుత ప్రక్రియను ప్రారంభించాలని ప్రకటనలిస్తూ వస్తున్న అమెరికా తన మరో ముఖాన్ని చూపించింది. అమెరికా తరఫున ప్రత్యేక దూతగా వచ్చిన ఫ్రాంక్ విజ్నర్ అధికారం…

కొత్త రాజధాని కోసం దక్షిణ సూడాన్ వెతుకులాట

త్వరలో కొత్త దేశంగా ప్రపంచ దేశాల జాబితాలో చేరనున్న దక్షిణ సూడాన్ కొత్త రాజధాని కోసం వెతుకులాటలో పడింది. 2005 లో కుదిరిన శాంతి ఒప్పందం ప్రకారం దక్షిణ్ సూడాన్ ప్రజలు తమ భవిష్యత్ గురించి తామె నిర్ణయంచుకోవటం కోసం జనవరి 9 నుండి  15 వరకు జరిగిన రెఫరండంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రాధమిక ఫలితాల ప్రకారం దాదాపు 99 శాతం మంది స్వతంత్రం దేశం కోసమే మొగ్గు చూపడంతో మరొక కొత్త దేశం ఏర్పాటు…

“డే ఆఫ్ డిపార్చర్” పాటిస్తున్న ఈజిప్టు జనం, తెర వెనుక అమెరికా బిజీ

ఈజిప్టులో ఆందోళనకారులు ముబారక్ శుక్రవారం (ఫిబ్రవరి ౪) లోగా రాజీనామా చేయాలని గడువు విధించిన సంగతి విదితమే. తమ డిమాండును గట్టిగా వినిపించటానికి శుక్రవారం అన్ని ప్రధాన పట్టణాలలో ప్రజలు పదుల వేల సంఖ్యలో చేరుతున్నట్లుగా బిబిసి వార్తా సంస్ధ తెలిపింది. ప్రెసిడెంటు గా తానూ విసిగిపోయాననీ, కానీ తాను దిగిపోతే దేశంలో అల్లకల్లోల పరిస్థిలు ఏర్పడతాయి కనుక తాను రాజీనామా చేయబోననీ ముబారక్ ప్రకటించాడు. ఆందోళనకారుల నాయకుల్లో ఒకరైన్ అల్ బరాదీ అధ్యక్షునికి సమధానం ఇస్తూ…

షేర్ మార్కెట్ కు భారీ నష్టాలు, ద్రవ్యోల్బణం సాకుతో రిటైల్ రంగం ప్రైవైటీకరణ

శుక్రవారం షేర్ మార్కెట్ బారీగా నష్తపోయింది. బోంబే స్టాక్ ఎక్చేంజ్ (సెన్సెక్స్) 441 పాయింట్లు కోల్పోయి 18008 వద్ద ముగియగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్.ఎస్.ఇ లేదా నిఫ్టీ) 131 పాయింట్లు కోల్పోయి 5395 దగ్గర క్లోసయ్యింది. ఈజిప్టు ప్రజాందోళనలతో ఆయిలు ధర కొండెక్కడం ఖాయం అన్న ఆందోళన పెరగడం, దానివలన నిత్యావసరాల ధరలు కూడా పేరిగి పోతాయన్న భయాలతో దేశీయ మదుపరులు స్టాక్ మార్కెట్ జోలికే రాక పోవటం, ఎఫ్.ఐ.ఐ లు తమ పెట్టుబడులను ఉపసంహరిచుకొవటం…

ఈజిప్టు అధ్యక్షుడు రాజీనామా చేస్తాడా?

ఈజిప్టు అధ్యక్షుదు హొస్నీ ముబారక్ రాజీనామా చేయాలనంటూ ఈజిప్తు ప్రజలు గత పది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిన విషయమే. ప్రజలు ఈ శుక్రవారం లోగ అధ్యక్ష్తుదు రాజీనామా చేయాలని అల్టిమేటం ఇచ్చిన సంగతీ తెలిసిందే. గత పది రోజులుగా వెల్లువెత్తుతున్న ప్రజాందోళనలకు ఠారెత్తిన ముబారక్ శుక్రవారం నాడు తాను రాజీనామా చేయటానికి అంగీకరిస్తూనే ఒక మెలిక పెట్టాడు. తనకు రాజీనామా చేయాలనే ఉన్నప్పటకీ తన రాజీనామా తర్వాత దేశంలో అల్లర్లు తలెత్తుతాయేమోనని…