లిబియాలో “ఆగ్రహ దినం”, పోలీసు కాల్ఫుల్లో 24 మంది మరణం

లిబియాలో గురువారం, ఫిబ్రవరి 17 న ప్రజలు “ఆగ్రహ దినం” (డే ఆఫ్ రేజ్) పాటించినట్లుగా వార్తా సంస్ధలు తెలిపాయి. అయితే ఆ వార్తలను అవి ధృవీకరించలేక పోతున్నాయి. పత్రికా విలేఖరులకు ఎటువంటి సమాచారం ప్రభుత్వ వర్గాలు అందించక పోవటం వలన పౌరులు చెప్పిన విషయాలను ప్రచురించాయి. రాజధాని ట్రిపోలి తప్ప ఇతర పట్టణాల్లోని కనీసం ఐదింటిలో ప్రజలు వీధుల్లోకి వచ్చినట్ల గా బిబిసి, రాయటర్స్, ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధలు పౌరులను ఉటంకిస్తూ తెలిపాయి. అమెరికా సంస్ధకు…

ఇంటర్నెట్ స్వేఛ్చపై అమెరికాకు చైనా హెచ్చరిక

చైనా మరోసారి అమెరికాను హెచ్చరించింది. “ఇంటర్నెట్ స్వేఛ్చ పేరుతో తన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేద”ని తీవ్రంగా హెచ్చరించింది. ఇంటర్నెట్ ఫ్రీడం కి సంబంధించి అమెరికాను చైనా హెచ్చరించడం ఇది రెండో సారి. తమ ఈ-మెయిల్ ఎకౌంట్లలోకి కొన్నింటిని చైనా హ్యాకర్లు జొరబడ్డారంటూ గూగుల్ 2010 సంవత్సరంలో చైనా ప్రభుత్వంతో తలపడినపుడు గూగుల్ కు మద్దతుగా అమెరికా ముందుకొచ్చింది. అమెరికా ‘సెక్రటరీ ఆఫ్ స్టేట్’ హిల్లరీ క్లింటన్ గూగుల్ పై నిబంధనలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ…

బహ్రెయిన్ హింస పై ఇంగ్లండ్ ఆందోళన

  బహ్రెయిన్ లో ప్రజల నిరసనల సందర్భంగా హింసాత్మక సంఘటనలు చెలరేగటంపై ఇంగ్లండ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాందోళనలతో వ్యవహరించేటప్పుడు శాంతియుత చర్యలకు పరిమితం కావలసిన అవసరాన్ని బహ్రెయిన్ ప్రభుత్వానికి నొక్కి చెప్పినట్లు ఇంగ్లండ్ ఫారెన్ సెక్రటరీ విలియం హేగ్ బ్రిటిష్ కామన్స్ సభలో సభ్యులకు తెలియ జేశాడు. అవసరమయితే తప్ప బహ్రెయిన్ ద్వీపానికి ప్రయాణం పెట్టుకోవద్దని హేగ్ బ్రిటన్ పౌరులకు సలహా ఇచ్చాడు. బహ్రెయిన్ రాజధాని మనామాలోని “పెరల్ స్క్వేర్” లో గుడారాలు వేసుకొని ఉన్న…

ముగ్గురు ‘గాజా’ పౌరులను కాల్చి చంపిన ఇజ్రాయెల్ సైనికులు

కొత్త సంవత్సరంలో ఇజ్రాయెల్ సైనికులు తమ హంతక చర్యలను ప్రారంభించారు. గాజాతో ఉన్న సరిహద్దు వద్ద సముద్రపు గవ్వలను ఏరుకొంటున్న ముగ్గురు పాలస్తీనా యువకులను ఇజ్రాయిల్ సైనికులు అమానుషంగా కాల్చి చంపారు. సరిహద్దు వద్ద మానవ నిషిద్ద ప్రాంతంలో పాలస్తీనీయులు పేలుడు పదార్ధాలు ఉంచుతున్నందున ఇజ్రాయిల్ సైనికులు వారిపైన కాల్పులు జరిపారని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. గాజాలో అధికారంలో ఉన్న ‘హమాస్’ పోరాట సంస్ధ మరణించిన వారు తమ కార్యకర్తలని ప్రకటించ లేదు. వారి కార్యకర్తలు ఏదైనా…

బహ్రెయిన్ ఆందోళనకారులపై ఉక్కుపాదం

  మరిన్ని ప్రజాస్వామిక హక్కుల కోసం డిమాండ్  చేస్తున్న ఆందోళనకారులపై బహ్రెయిన్ ప్రభుత్వం కఠినంగా అణచివేస్తున్నది. టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీ ఛార్జి చేయటమే కాకుండా కాల్పులు కూడా జరపడంతో ముగ్గురు ఆందోళనకారులు చనిపోయారు. మరొకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వంద మందికి పైగా గాయపడ్డారు. హెచ్చరికలేమీ లేకుండా లాఠీ చార్జీ చేసి కాల్పులు జరిపినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. శాంతి బధ్రతల కోసం చర్యలు అనివార్యమయ్యాయనీ, చర్చల ద్వారా నచ్చ జెప్పటానికి అన్ని ద్వారాలు మూసుకు…

ఈజిప్టు తిరుగుబాటు విజయవంతం అయినట్లేనా?

దాదాపు ముప్ఫై మంది వరకు అమరులై పద్దెనిమిది రోజుల పాటు కొనసాగిన ఈజిప్టు ప్రజల నియంతృత్వ వ్యతిరేక తిరుగుబాటు విజయవంతం అయినట్లేనా అన్న అనుమానం ఇప్పుడు అంతర్జాతీయ పరిశీలకులతో పాటు ఈజిప్టు ప్రజలను సైతం పట్టి పీడిస్తోంది. తిరుగుబాటు లేవనెత్తిన ప్రధాన డిమాండు ప్రజాస్వామ్య పరిపాలన రావాలని. పార్టీలు ఏర్పాటు చేసుకొనే స్వేచ్ఛ, అభిప్రాయం వ్యక్తం చేసుకొనే స్వేచ్ఛ, సంఘాలు నిర్మించుకొనే స్వేచ్ఛ కావాలని తిరుగుబాటుదారులు మనసారా కోరుకున్నారు. ఆ డిమాండ్లు నెరవేరుతాయా లేదా అన్న అనుమానాలు…

లిబియాలో ఫిబ్రవరి 17 న ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శన కోసం పధకం

యెమెన్, బహ్రెయిన్, ఇరాన్ ల అనంతరం ఇప్పుడు లిబియాలో ప్రభుత్వ వ్యతిరేకులు నిరసన ప్రదర్శనలకు పిలుపినిచ్చారు. ఇంటర్నెట్ ద్వారా ప్రదర్శకులు ప్రధానంగా ఆర్గనైజ్ అవుతున్నారు. కానీ లిబియాలో ప్రభుత్వాన్ని కూల్చివేసే బలం ప్రభుత్వ వ్యతిరేకులకు లేదని పరిశీలకుల అభిప్రాయం. గురువారం, ఫిబ్రవరి 17న “ఆగ్రహ దినం” జరపాలని నిరసనకారులు నిర్ణయించుకోగా దానికి ఒక రోజు ముందే లిబియాలోని ఓడరేవు పట్టణమయిన బెంఘాజి లో లిబియా నాయకుడు “మహమ్మద్ గఢాఫి” వ్యతిరేక, అనుకూలుర మధ్య ఘర్షణలు చెలరేగాయి. కొద్ది…

ఇండియా జపాన్ ల మధ్య కుదిరిన స్వేఛ్చా వాణిజ్య ఒప్పందం

ఇండియా, జపాన్ లు టోక్యోలో స్వేఛ్చా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇండియా ప్రతినిధిగా వాణిజ్య మంత్రి ఆనంద శర్మ, జపాన్ ప్రతినిధిగా విదేశాంగ మంత్రి సీజీ మాయెహారా ఒప్పందం పై సంతకాలు చేశారు. రానున్న దశాబ్ద కాలంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం జరిగే సరుకుల్లో 94 శాతం పైన పన్నులు ఈ ఒప్పందం ప్రకారం రద్దవుతాయి. టెక్స్ టైల్స్, మందులు, ఆటో లాంటి రంగాలతో పాటు సర్వీసు రంగాలు కూడా ఈ ఒప్పందం పరిధి…

ఇరాన్ లో ఈజిప్టు సంఘీభావ ప్రదర్శనలు

ఈజిప్టు ప్రజాందోళనకు ఇరాన్ లోని పాలక, ప్రతిపక్షాలు రెండూ మద్దతు పలికాయి, కానీ వేర్వేరు కారణాలతో. పాలక పక్షం పశ్చిమ దేశాలు పెంచి పోషించిన నియంతకు వ్యతిరేకంగా తలెత్తిన “ఇస్లామిక్ మేలుకొలుపు” గా అబివర్ణించి మద్దతు తెలపగా, ప్రతిపక్ష పార్టీలు మాత్రం “రాజకీయ స్వేఛ్చా వాయువుల కోసం ఎగసిపడిన ప్రజా ఉద్యమం”గా అభివర్ణించి ఈజిప్టు ప్రజల ఉద్యమానికి సంఘీభావంగా ఇరాన్ లో ప్రదర్శనలు పిలుపునిచ్చాయి. సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో జరిగిన ప్రదర్శన సందర్భంగా చెలరేగిన…

బహ్రెయిన్ ను తాకిన అరబ్ ప్రజా ఉద్యమ కెరటం

  ట్యునీషియాలో జన్మించి ఈజిప్టులొ ఇసుక తుఫాను రేపి పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాలను గడ గడా వణికిస్తున్న అరబ్ ప్రజా ఉద్యమ మహోత్తుంగ తరంగం అరేబియా అఖాతంలో ఓ చిన్న ద్వీప దేశం ఐన బహ్రెయిన్ ను సైతం తాకింది. ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లో దశాబ్దాల పాటు అధ్యక్షులుగా చెలామణి అవుతూ వచ్చిన నియంతృత్వ పాలకులను కూలదోసిన ఈ పోరాట తరంగం ఇప్పుడు బహ్రెయిన్ లో మత వివక్షకు వ్యతిరేకంగా, రాజకీయ సంస్కరణల కోసం ప్రజలను వీధుల్లోకి లాక్కొచ్చింది.…

సమ్మెలకు ఉద్యుక్తులవుతున్న ఈజిప్టు కార్మికులు, ఉద్యోగులు

ముబారక్ నియంతృత్వ పాలనకు పద్దెనిమిది రోజుల ఆందోళనతో తెర దించిన స్ఫూర్తితో ఈజిప్టులోని వివిధ రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు తమ తమ సమస్యలను పరిష్కరించుకోవటానికి ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. కొన్ని విభాగాల్లో ఇప్పటికే ఆందోళనలు ప్రారంభమయ్యాయి కూడా. సోమవారం సెంట్రల్ కైరోలో ఉన్న ‘బ్యాంక్ ఆఫ్ అలెగ్జాండ్రియా’ బ్రాంచి కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు వందల మంది కార్యాలయం బయట చేరుకుని తమ అధికారులను పదవి నుండి తప్పుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ముబారక్ ను వెళ్ళిపొమ్మన్నట్లే వారిని…

జపాన్ ను అధిగమించి రెండో స్ధానానికి చేరిన చైనా అర్ధిక వ్యవస్ధ

చైనా ఇప్పుడు ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ. రెండవ స్ధానంలో ఉన్న జపాన్ దేశాన్ని వెనక్కి నెట్టి చైనా రెండో స్ధానం లోకి అడుగు పెట్టింది. వాస్తవానికి 2010 సెప్టెంబరు నాటికే చైనా జపాన్ ను అధిగమించింది. వార్తా సంస్ధలు ఎందుకనో అప్పట్లో పట్టించుకోలేదు. 2010 డిసెంబరుతో చైనా ఆర్ధిక సంవత్సరం ముగుస్తుంది. చైనా, అమెరికా, జపాన్ లాంటి దేశాలకు ఆర్ధిక సంవత్సరం క్యాలెండర్ సంవత్సరంతో సమానంగా ఉంటుంది. ఆర్ధిక సంవత్సరం ముగిసాక చైనా…

నిష్క్రమించిన ఆందోళనకారులు, కొన్ని డిమాండ్లు నెరవేర్చిన మిలట్రీ పాలకులు

  ఆందోళనకారుల డిమాండ్లలో కొన్నంటిని మిలట్రీ పాలకులు నెరవేర్చడంతో వారు విమోచనా కూడలిని వదిలి వెళ్ళిపోవడం ప్రారంభించారు. వెళ్ళడానికి నిరాకరించిన కొద్దిమందిని అరెస్టు చేసినట్టు సమాచారం. పార్లమెంటును రద్దు చేస్తున్నట్లుగా మిలిట్రీ కౌన్సిల్ ప్రకటించింది. సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికలలో పార్లమెంటు సభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికలలో పోటీ చేయకుండా అనేక పార్టీలను ముబారక్ ఎప్పటిలాగే నిషేధించడంతో పార్లమెంటులో అత్యధికులు ముబారక్ పార్టీవారే మిగిలారు. ముబారక్ పార్టీ యధేఛ్చగా రిగ్గింగ్ చేసే అచారం ఈజిప్టులో ఉంది. అందువలన పార్లమెంటును…

విమోచనా కూడలిని వదలని ఈజిప్టు ఆందోళనకారులు, పెదవి విప్పని సైన్యం

  ముబారక్ గద్దె దిగిపోయాక ఇళ్ళకు వెళ్ళిపోతారనుకున్న ఈజిప్టు ఆందోళనకారులు తాహ్రిరి స్క్వేర్ (విమోచనా కూడలి) ను ఇంకా వదిలి వెళ్ళలేదు. ప్రజాస్వామ్య పరిపాలన స్ధాపించబడే వరకు తాము వెళ్ళేది లేదని వారు పంతం పట్టారు. శనివారం సాయంత్రం సైన్యం ప్రదర్శకులను పంపించివేయటానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కాగా ఆందోళన ప్రారంభ దినాల్లో ప్రదర్శకులపై హింసాత్మక దాడులు జరిపి వందల మంది మరణించడానికి కారకులై ప్రజల్లో అపఖ్యాతి పాలైన మిలట్రీ పోలీసులు తిరిగి “విమోచనా కూడలి” వద్ద మొహరించడం…

అల్జీరియా, యెమెన్ లలో ప్రదర్శకులను చెదరగొట్టిన ప్రభుత్వాలు

ఈజిప్టులో ప్రజాందోళనల ధాటికి తలొగ్గి ముబారక్ అధికారం త్యజించటాన్ని స్ఫూర్తిగా తీసుకున్న అల్జీరియా, యెమన్ ల పౌరులు తమ నియంతృత్వ ప్రభువులు సైతం దిగి పోవాలని డిమాండ్ చేస్తూ ఆయా రాజధానుల్లో శనివారం  ప్రదర్శనలు నిర్వహించారు. అయితే ముందునుండే అప్రమత్తతతో ఉన్న అక్కడి ప్రభుత్వాలు పోలీసులు, సైన్యాలతొ పాటు తమ మద్దతుదారులను కూడా ఉసిగొల్పి ప్రదర్శనలు పురోగమించకుండా నిరోధించ గలిగింది. “బౌటెఫ్లికా వెళ్ళిపో” -అల్జీరియా ప్రదర్శకులు అల్జీరియా రాజధాని అల్జీర్స్ లో మొహరించి ఉన్న పోలీసులకు భయపడకుండా…