గరిష్ట స్ధాయికి ఆయిల్ ధరలు, షేర్ మార్కెట్ కు భారీ నష్టాలు

  ఇండియా షేర్ మార్కెట్లు గురువారం భారీ స్ధాయిలో నష్ట పోయాయి. అసలే అధిక ద్రవ్యోల్బణం, వరుసగా చుట్టుముడుతున్న అవినీతి ఆరోపణల కారణంగా కొత్త సంవత్సరం ప్రారంభం నుండీ ఒడిదుడుకులకు లోనవుతున్న భారత షేర్లు లిబియా ఆందోళనలు ఆశనిపాతంగా పరిణమించాయి. పదహారు నెలల గరిష్ట స్ధాయిలో నష్టాలను నమోదు చేశాయి. బోంబే స్టాక్ ఎక్ఛేంజ్ 546 పాయింట్లు (3 శాతం) నష్టపోయి 17,632 పాయింట్ల వద్ద క్లోజ్ కాగా నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ 175 పాయింట్లు (3.2…

వికీలీక్స్ ఛీఫ్ ఎడిటర్ ను స్వీడన్ కు అప్పగించడానికి బ్రిటన్ కోర్టు ఆమోదం

  వికీలీక్స్ ఛీఫ్ ఎడిటర్ జులియన్ అస్సాంజ్ కు ప్రపంచ వ్యాపింతంగా ఉన్న అభిమానులకు నిరాశ కలిగిస్తూ బ్రిటన్ కోర్టు అతనిని స్వీడన్ పోలీసులకు అప్పగించడానికి ఆమోదం తెలిపింది. స్వీడన్ లో తనకు నిష్పక్షపాత న్యాయం దొరకదని జులియన్ వాదించినప్పటికీ కోర్టు అంగీకరించ లేదు. అయితే కోర్టు రూలింగ్ పై అప్పీలుకు వెళ్ళటానికి జులియన్ నిర్ణయించుకున్నట్లుగా అతని లాయర్లు తెలిపారు. స్విడన్ లో రేప్ చట్టాలు స్త్రీలకు మనోభావాలకు అనుగుణంగా సున్నితంగా ఉంటాయన్న పేరుంది. సహచరి అయినప్పటికీ…

ధాన్యం ఎగుమతికి వ్యవస్యాయ మంత్రి శరద్ పవార్ అత్యుత్సాహం

  రెండున్నర సంవత్సరాల నుండి ధాన్యం ధరలు చుక్కల్లో కొనసాగుతుండటం వలన ఆహార ద్వవ్యోల్బణం, దానివల్ల ప్రదాన ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పటికీ, దాన్ని తగ్గించే విషయం ఏ మాత్రం పట్టించుకోని కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్, ఇప్పుడు దేశంలోని ధాన్యాన్ని ఎగుమతి చేయటానికి మాత్రం తెగ ఉత్సాహపడి పోతున్నాడు. అంతర్జాతీయంగా బియ్యం, గోధుమల ధరలు పెరగడంతో, పెరిగిన ధరల్ని సొమ్ము చేసుకోవటానికి ఇదే మంచి సమయమని ఆయన బుధవారం ప్రకటించాడు. ఇప్పుడు ఎగుమతి చేస్తే…

పతనం బాటలో గడ్డాఫీ ప్రభుత్వం, ప్రపంచ దేశాల మధ్య విభేదాలు?

  కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ రోజు రోజుకీ ఒంటరి అవుతున్నాడు. విదేశీ రాయబారుల్లో చాలామంది గడ్డాఫీకి ‘బై’ చెప్పేశారు. ప్రజలపై హింస ఆపమని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులవి న్యాయమైన్ డిమాండ్లు, వాటిని ఒప్పుకొని దిగిపో అని సలహా ఇస్తున్నారు. గడ్డాఫీ అనుకూల సైనికులు వీధుల్లో జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకూ 1,000 మంది పౌరులను చనిపోయారని ఇటలీ విదేశాంగ మంత్రి ఫ్రాట్టిని ప్రకటించాడు. వ్యాపార సంబంధాల వలన లిబియాలో ఉన్న తమ పౌరులను అక్కడినుండి ఖాళీ చేయించడానికి త్వరపడుతున్నారు.…

రెండో రోజూ కొనసాగిన ఇండియా షేర్ల పతనం, ఆశలన్నీ బడ్జెట్ పైనే

సోమవారం లాభాల్లో ముగిసిన ఇండియా షేర్ మార్కెట్లు మంగళ, బుధ వారాల్లో మళ్ళీ నష్టాల బాట పట్టాయి. ఇటీవలి వరకూ ఈజిప్టు ఆందోళనలు ప్రపంచ షేర్ మార్కెట్లపై ప్రభావం చూపగా ప్రస్తుతం లిబియా పరిణామాలు ప్రభావం చూపుతున్నాయి. ప్రజాందోళనలు ఆయిల్ ఉత్పత్తి చేసే ఇతర దేశాలకు సైతం విస్తరించవచ్చనే భయం నెలకొనడంతో ఆయిల్ ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. దానితో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాలు ఉండడంతో బ్యాంకుల షేర్లు మార్కెట్ పతనానికి దోహదం చేశాయి. 30 షేర్ల…

కొత్త ఆర్ధిక సంవత్సరంలో ఇండియా అప్పు రూ. 4.5 ట్రిలియన్లు -రాయిటర్స్ సర్వే

రానున్న ఆర్ధిక సంవత్సరంలో (2011-12) 4.5 ట్రిలియన్ల రూపాయల (4.5 లక్షల కోట్ల రూపాయలు) అప్పును ఇండియా సేకరించే అవకాశం ఉందని రాయిటర్స్ వార్తా సంస్ధ సర్వేలో తేలింది. ఇది 99.3 బిలియన్ల డాలర్లకు (99,300 కోట్ల రూపాయలు) సమానం. ప్రభుత్వాలు “సావరిన్ డెట్ బాండ్లు” జారీ చేయటం ద్వారా అప్పును సేకరిస్తాయి. వివిధ ఫైనాన్షియల్ (ద్రవ్య) కంపెనీలు, ఆర్ధిక రేటింగ్ కంపెనీలు, విశ్లేషణా సంస్ధలు, అర్ధిక మేధావులు మొదలైన వారిని వార్తా సంస్ధలు సర్వే చేసి…

గడ్డాఫీ చేజారుతున్న లిబియా, లిబియానుండి వెళ్ళిపోతున్న విదేశీయులు

  65 లక్షల జనాభా గల ఎడారి దేశం లిబియా క్రమంగా గడ్డాఫీ చేజారుతోంది. విదేశాల్లో లిబియా తరపున నియమించబడిన రాయబారులు ఒక్కొక్కరు గడ్డాఫీకి ఎదురు తిరుగుతున్నారు. సైనికులు గడ్డాఫీకి వ్యతిరేకంగా ఆందోళనకారుల్లో చేరిపోతున్నారు. వ్యతిరేకులుగా మారిన సైనిక బ్యారక్ లపై ప్రభుత్వ దళాలు విమానాలనుండి బాంబు దాడులు చేస్తున్నారు. హింసాత్మకంగా మారుతున్న లిబియానుండి విదేశీయులు తమ తమ స్వస్ధలాలకు వెళ్ళిపోతున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాలు విమానాల ద్వారా, ఓడల ద్వారా తమ దేశీయులను వెనక్కి రప్పించుకుంటున్నాయి.…

“మల్లెల విప్లవం” నేపధ్యంలో దేశ వ్యాపిత “డేటాబేస్” నిర్వహణకై చైనా అధికారి సూచన

  అరబ్ ప్రజా ఉద్యమాల స్ఫూర్తితో చైనాలో క్రితం వారం ఇంటర్నెట్ ద్వారా అటువంటి ప్రదర్శనను నిర్వహించాలంటూ ప్రచారం జరిగిన నేపధ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఝౌ యాంగ్ కాంగ్ హెచ్చరించాదు. పొలిట్ బ్యూరోలో ఝౌ, చట్ట పాలనకు (లా అండ్ ఆర్డర్) భాద్యుడు. సామాజిక వ్యవస్ధ నిర్వహణ పట్ల జాగ్రత్త వహించాలనీ సమాజంలో సంఘర్షణలను, సమస్యలను ముందే గుర్తించాలనీ ఆయన సీనియర్ అధికారులను కోరినట్లుగా అధికార…

బలహీన పడుతున్న గడ్డాఫీ, వదిలి వెళ్తున్న మద్దతుదారులు

  42 సంవత్సరాల నుండి లిబియాను ఏకచ్ఛత్రాధిపత్యంతో ఏలిన కల్నల్ మహమ్మద్ గడ్డాఫీని మద్దతుదారులు ఒక్కొక్కరు వదిలి ఆందోళనకారులకు మద్దతు తెలుపుతుండడంతో క్రమంగా బలహీన పడుతున్నాడు. రెండు తెగలు కూడా ఆందోళనకారులకు మద్దతు తెలిపాయి. ఆందోళనకారులపై హింసను ప్రయోగించడాన్ని ఆ తెగల పెద్దలు తప్పు పట్టారు. లిబియాలో అది పెద్ద తెగ “వార్ఫ్లా” కూడా ఆ తెగల్లో ఉండటం గమనార్హం. లిబియా తరపున ఇండియా కు రాయబారిగా ఉన్న అలీ అల్-ఎస్సావీ భద్రతా దళాల దాడులను, కాల్పులను…

మొరాకోలో రాజకీయ సంస్కరణలు కోరుతూ ప్రదర్శనలు

గత డిసెంబరులో ట్యునీషియాలో ప్రారంభమై అక్కడి అధ్యక్షుడిని జనవరికల్లా దేశం నుండి పారిపోయేలా చేసిన అరబ్ ప్రజా ఉద్యమ తుఫాను కొద్దో గొప్పో ధనిక దేశమైన మొరాకోను సైతం తాకింది. మొరాకో రాజు మొహమ్మద్ VI, తన అధికారాల్లో కొన్నింటిని వదులుకొని ప్రజాస్వామిక పరిపాలనకు మార్గం సుగమం చేయాలని డిమాండ్ చేస్తూ మొరాకో ప్రజలు దేశం లోని వివిధ పట్టణాలలో ప్రదర్శనలు నిర్వహించారు. రాజధాని “రాబత్” లో ప్రదర్శన పార్లమెంటు వరకు వెళ్ళటానికి పోలీసులు అనుమతించారు. “బానిసలకోసం…

లిబియా పోలీసు కాల్పుల్లో వందల మంది మృతి, చెదరని గడ్డాఫీ ఆధిపత్యం

లిబియాలో సైనికులు ఆందోళన చేస్తున్న ప్రజలపై నేరుగా కాల్పులు జరపడంతో అనేక మంది మరణించడమో, గాయపడటమో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎంతమంది మరణించినదీ ఖచ్చితమయిన సంఖ్య తెలియటం లేదు. ఇంటర్నెట్ సౌకర్యాన్ని దాదాపుగా అడ్డుకోవటం, మీడియా పై అనేక ఆంక్షలు అమలులో ఉండటంతో ఆందోళనలు, కాల్పులకు సంబంధించిన వివరాలను ధృవపరిచేవారు లేరు. రెండు వందల మందికి పైగా చనిపోయారని ఆసుపత్రి డాక్టర్లను ఉటంకిస్తూ బిబిసి తెలియజేయగా, అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధను ఉటంకిస్తూ రాయిటర్స్…

సిగ్గూ, లజ్జా వదిలేసిన అమెరికా, ఐక్యరాజ్యసమితిలో మరో సారి నవ్వుల పాలు

  పాపాల పుట్ట అమెరికా తాను సిగ్గూ, లజ్జా ఎప్పుడో వదిలేశానని మరోసారి ఋజువు చేసుకుంది. తాను నిత్యం వల్లించే విలువలూ, సూత్రాలూ తనకు ఏ మాత్రం వర్తించవని ప్రపంచ వేదిక ఐక్యరాజ్యసమితి లోనే విలువల వలువలు ఊడదీసుకుని మరీ చాటి చెప్పుకుంది. తనకు నీతీ, నియమాలు ఒక లెక్క కాదనీ, తనకు ఉపయోగం అనుకుంటే ఎన్నిసార్లు మొఖం మీద ఉమ్మేసినా తుడుచుకు పోగలననీ నిస్సిగ్గుగా ప్రకటించుకుంది. తన హీనపు బతుక్కి వేరే ఎవరూ అద్దం పట్టనవసరం…

కలైజ్గ్నర్ టీ.వి ఛానల్ కార్యాలయంపై సి.బి.ఐ దాడి, షేర్ మార్కెట్ పతనం

  తమిళనాడులో అధికార పార్టీగా ఉన్న డి.ఎం.కె పార్టీ అధినేత కరుణానిది కుటుంబానికి చెందిన కలైజ్గ్నర్ టీ.వి చానల్ కార్యాలయాలపై శుక్రవారం సి.బి.ఐ దాడులు నిర్వహించింది. 2-జి స్పెక్ట్రం స్కాముకు సంబంధించి లైసెన్సు పొందిన టెలి కంపెనీల్లో ఒకటైన స్వాన్ టెలికం సంస్ధ లైసెన్సు పొందటం కోసం టి.వి ఛానెల్ కు 47 మిలియన్ డాలర్లు (దాదాపు 214 కోట్ల రూపాయలు) ముడుపులుగా చెల్లించినట్లుగా ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. సి.బి.ఐ దాడులు జరిగిన…

ఒక్క నెలలో 32 లక్షల సెల్ ఫోన్ల అమ్మకం

  అనీల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ (ఎ.డి.ఎ.జి – అడాగ్) కి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ ఒక్క జనవరి నెలలోనే 3.2 మిలియన్ ల (32 లక్షలు) మొబైల్ ఫోన్లు అమ్మినట్లుగా శుక్రవారం తెలిపింది.  జనవరి నెలలో అమ్మిన ఫోనలతో కలిపి రిలయన్స్ కాం కంపెనీ ఇప్పటికి మొత్తం ఇండియాలో 128.9 మిలియన్ల (12.89 కోట్లు) సెల్ ఫోన్లు అమ్మినట్లుగా ఆ కంపెనీ తెలిపింది. అంటే జనవరి ఆఖరుకల్లా భారతీయుల చేతుల్లో కేవలం రిలయన్స్ కంపెనీ…

ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం రిజర్వ్ రేట్లను మళ్ళీ పెంచిన చైనా

ప్రపంచంలో రెండో పెద్ద ఆర్ధిక వ్యవస్ధను కలిగి ఉన్న చైనా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం ఆర్.ఆర్.ఆర్ ను మళ్ళీ 50 బేసిస్ పాయింట్ల మేరకు (0.5 శాతం) పెంచింది. బ్యాంకు ఖాతాదారుల సొమ్ము భద్రత కోసం  బ్యాంకులు సేకరించే డిపాజిట్లలో కొంత శాతాన్ని సెంట్రల్  బ్యాంకు వద్ద రిజర్వ్ డబ్బుగా ఉంచాలి. అలా రిజర్వు డబ్బుగా డిపాజిట్లలో ఎంత శాతం ఉంచుతారో దాన్ని చైనాలో ఆర్.ఆర్.ఆర్ (రిజర్వ్ రిక్వైర్మెంట్  రేషియో) అనీ, ఇండియాలో సి.ఆర్.ఆర్ (కేష్ రిజర్వ్…