బ్రిక్స్: ఇండియాపై అమెరికా ఆశలు నిలిచేనా?

పశ్చిమాసియాలో అరబ్ పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ జరుపుతున్న సామూహిక దారుణ మారణకాండ, ఉక్రెయిన్-రష్యా యుద్ధంల పుణ్యమాని ఇరుగు పొరుగు దేశాలైన ఇండియా, చైనాల మధ్య సంబంధాలు మెరుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవి కేవలం సూచనలేనా లేక వాస్తవ రూపం దాల్చేనా అన్న సంగతి మాత్రం ఇప్పుడప్పుడే తెలిసే అవకాశం మాత్రం లేదు. రష్యన్ నగరం కాజన్ లో ఈ రోజు (అక్టోబర్ 23) బ్రిక్స్ కూటమి దేశాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. విశ్లేషకులు ఊహించినట్లుగానే ఇండియా, చైనా…

తూర్పు లడఖ్: చైనా, ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం!

10 దేశాల బ్రిక్స్ కూటమి సమావేశాలు రష్యన్ నగరం కాజన్ లో ప్రారంభం కావటానికి రెండు రోజుల ముందు తూర్పు లడఖ్ సరిహద్దు కాపలా విషయంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన మాట నిజమేనని ఈ రోజు (అక్టోబర్ 22) చైనా ధృవీకరించింది. ఒప్పందం కుదిరిన సంగతిని సోమవారమే (అక్టోబర్ 21) ఇండియా ప్రకటించింది. ఇండియా ప్రకటనను చైనా ఈ రోజు ధృవీకరించింది. లడఖ్ ప్రాంతంలో చైనా, ఇండియా దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖను…

ఓ అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం!

ఒక అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు బాబాలు సైన్స్ బోధిస్తారు ఇతిహాసకులు చరిత్రను రాస్తారు సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు ప్రవాస భారతీయులు దేశాన్ని ఎలా ప్రేమించాలో చెబుతారు నేరగాళ్ళు విలువలను బోధిస్తారు రాజకీయ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు దేవుడు మాత్రం నిశ్శబ్దం పాటిస్తాడు – పై పాఠ్యం వాట్సప్ మెసేజ్ గా నా మిత్రుడొకరు పంపారు. పాఠ్యాన్ని ప్రముఖ…

ఇజ్రాయెల్ పై ఇరాన్ ముందస్తు దాడి? రష్యా మద్దతు?

అక్టోబర్ 1 తేదీన ఇరాన్ దాదాపు 180 కి పైగా మిసైళ్లతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. హమాస్ రాజకీయ నేత ఇస్మాయిల్ హనీయేను ఇరాన్ లో ఉండగా మిసైల్ దాడితో ఇజ్రాయెల్ హత్య చేసింది. హమాస్ సుప్రీం నేత హసన్ నాసరల్లా తో పాటు మరో 7 గురు హిజ్బోల్లా టాప్ కమాండర్లు బీరూట్ లోని బంకర్లలో సమావేశమై ఉండగా వరుస మిసైల్ దాడితో ఇజ్రాయెల్ హత్య చేసింది. ఈ హత్యలకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ రాజధాని…

గాజా: నేను చాలా మంది విగత బాలల లోపలి భాగాల్ని చూశాను!

యధాతధ రాజకీయాల్ని, సెంట్రిస్ట్ ఇంక్రిమెంటలిజాన్ని భరించే ఓపిక కలిగి ఉండటానికి, నేనిప్పటికే చాలా మంది విగత బాలల లోపలి భాగాల్ని చూశాను. నవంబర్ లో అమెరికన్లు ఎవర్ని ఎన్నుకుంటారో పట్టించుకోటానికి నేనిప్పటికే చాలా మంది విగత బాలల లోపలి భాగాల్ని చూశాను. డెమొక్రాట్లకు ఓటు వేస్తే “అపాయం తగ్గుతుందన్న” ఐడియాను సీరియస్ గా తీసుకోటానికి నేనిప్పటికే చాలా మంది విగత బాలల లోపలి భాగాల్ని చూశాను. ఇజ్రాయెల్, దాని పశ్చిమ మిత్ర దేశాల్ని ఎప్పటికైనా క్షమించటానికి నేనిప్పటికే…

హర్యానాలో అనూహ్య ఫలితాలు!

హర్యానా రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం ఒక మాయగా కనిపిస్తున్నాయి. దాదాపు ఎగ్జిట్ పోల్ నిర్వహించిన ప్రతి ఒక్క సంస్థా ఎలాంటి అనుమానం లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి తీరుతుందని ఢంకా బజాయించాయి. తీరా ఫలితాలు చూస్తే సరిగ్గా ఎగ్జిట్ ఫోల్ ఫలితాలకు పూర్తి భిన్నంగా వాస్తవ ఫలితాలు ఉండటం ఒక అర్ధం కానీ వ్యవహారంగా ఉండిపోయింది. సాయంత్రం 4 గంటల 4 నిమిషాల సమయానికి బిజెపి 17 స్థానాలు గెలుచుకోగా 33 స్థానాల్లో లీడింగ్…

మార్కెట్లో ‘బై చైనా, సెల్ ఇండియా’ సెంటిమెంట్!

గోల్డెన్ వీక్ సెలవులు (అక్టోబర్ 1 నుండి 7 వరకు) ముగిసిన అనంతరం మంగళవారం చైనా స్టాక్ మార్కెట్లు వ్యాపారం నిమిత్తం తెరుచుకోనున్న నేపధ్యంలో మార్కెట్లో “బై చైనా, సెల్ ఇండియా” సెంటిమెంట్ జోరందుకుంది. గత 6 ట్రేడింగ్ రోజుల్లో 30 షేర్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ ఏకంగా 4,786 పాయింట్లు కోల్పోవడంతో బేర్ సెంటిమెంట్ బలంగా ఉన్నదనీ ఎఫ్.ఐ.ఐ లు ఇండియన్ షేర్ మార్కెట్ల నుండి చైనా స్టాక్ మార్కెట్ కు తరలిపోయేందుకు సిద్ధంగా…

తుఫాను సాయం ప్లీజ్ -ఆగ్నేయ అమెరికా!

– ఆగ్నేయ అమెరికన్లు: హెలెనే తుఫాను సాయం చేయండి, ప్లీజ్! వాషింగ్టన్: సారీ, ఇజ్రాయెలీ యుద్ధ పిపాసులకు మద్దతుగా మరిన్ని వేల మంది అమెరికా సైన్యాన్ని పంపించాలనా మీరు అడుగుతున్నది? ఆగ్నేయ అమెరికన్లు: కాదు మహా ప్రభో! హెలెనే హరికేన్ వల్ల తీవ్రంగా దెబ్బ తిన్నాం, కాస్త సాయం చేయమని అడుగుతున్నాం. వాషింగ్టన్: ఒకే. మీకు పరిస్ధితి ఏమీ అర్ధం అవుతున్నట్లు లేదు. కానీ మన సైన్యం ఇప్పటికే ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండలో ఒక చెయ్యి వేసేందుకు…

మీ ఇష్టారీతిన జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్యం ఉంటుందా? -సుప్రీం కోర్టు

బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏఏపి ఆధ్వర్యం లోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ని ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను ఈ రోజు సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా అభిశంచింది. (అభిశంసన అన్న పదాన్ని టెక్నికల్ అర్ధంలో రాయలేదు. పాఠకులు గమనించగలరు.) మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసిడి) కి చెందిన స్టాండింగ్ కమిటీ లో 6వ…

లడ్డు వివాదం: సి.బి.ఐ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్

తిరుపతి లడ్డు వివాదం పైన సుప్రీం కోర్టు స్వతంత్ర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేత దర్యాప్తు జరిపించాలని ఆదేశించింది. లడ్డు వివాదం పైన ఎలాంటి కమిటీ వేయాలో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకొమ్మని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను గత హియరింగ్ సందర్భంగా సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం, కోరిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 4 తేదీన (ఈ రోజు) ధర్మాసనం తిరిగి విచారణ జరిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం…

లడ్డు: భక్తుల మనోభావాలతో ప్రభుత్వమే ఆడుకుంది -సుప్రీం కోర్టు

తిరుపతి లడ్డు తయారీలో కల్తీ జరిగిన వివాదం సుప్రీం కోర్టును చేరింది. తన ముందుకు వచ్చిన పత్రాలను పరిశీలించిన సుప్రీం కోర్టు, ప్రాధమిక ఆధారాల ప్రకారం లడ్డులో కల్తీ జరిగిందని చెప్పటం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రపంచ వ్యాపితంగా ఉన్న భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని స్పష్టం చేసింది. ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తిగా ముఖ్యమంత్రికి ఇది తగదు అని గడ్డి పెట్టింది. అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు…

సనాతన ధర్మం అంటే?

అప్పుడప్పుడూ వాట్సప్ లో అర్ధవంతమైన మెసేజ్ లు వస్తుంటాయి. ఎవరు రాశారో తెలియదు గానీ కింది పాఠ్యం కూడా నాకు వాట్సప్ లో మేసేజ్ గా వచ్చింది. క్రింద కవిత రూపంలో ఉన్న భాగం లేదా ప్రశ్న జవాబు రూపంలో ఉన్న భాగం వరకు మెసేజ్ గా వచ్చింది. సనాతన ధర్మం చాలా గొప్పదని చెబుతూ గత కొన్నేళ్లుగా మధ్య యుగాల నాటి అసమాన, అమానవీయ, మహిళా వ్యతిరేక, కులాల కాలకూట విషంతో నిండిన, సమాజాన్ని పునరిద్ధరించాలని…

లడ్డు గొడవ జగన్ అరెస్టు కోసమా?

తిరుపతి లడ్డు క్వాలిటీ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపిన రగడ చిలికి చిలికి గాలివానగా మారుతున్నది. ‘గాలివానగా మారిపోయింది’ అని కూడా అనవచ్చునేమో? ఒక సాధారణ తినుబండారానికి దైవత్వం ఆపాదించి భగవంతుడు స్వయంగా ఆశీర్వదించి ప్రసాదించిన ప్రసాదంగా మార్చివేశాక, ఆ తినుబండారం కేంద్రంగా ఇక ఎన్ని రాజకీయాలు చేయవచ్చో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కాకుండా ఆచరణలో చేసి చూపిస్తున్నారు. సెప్టెంబర్ 18 తేదీన అధికారానికి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా…

ఆడవారికి రక్షణ లేని కర్మభూమి!

ఒక్క ఆగస్టు 17, 18 తేదీలలో మాత్రమే ఎన్.డి.టి.వి అనే ఒక వార్తా పత్రిక దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆడవాళ్లపై జరిగిన ఆరు అత్యాచారాల గురించి రిపోర్ట్ చేసింది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కాంగ్రెస్ పరిపాలిస్తుంటే మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలను బిజెపి పరిపాలిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న చోట ప్రభుత్వ వైఫల్యం గురించి బిజెపి నేతలు విమర్శిస్తున్నారు, ఆడ పిల్లల రక్షణ గురించి ఆందోళన ప్రకటిస్తున్నారు. బిజెపి పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్…

కేంద్రం ఐ.టి రూల్స్ సవరణపై బొంబే హై కోర్టు మొనగాడి తీర్పు!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, హోమ్ మంత్రి అమిత్ షాల నేతృత్వం లోని బిజెపి ప్రభుత్వం ఐ.టి రూల్స్ 2021 చట్టానికి 2023లో తలపెట్టిన సవరణలు రాజ్యాంగ విరుద్ధం అని బొంబే హై కోర్టు నియమించిన ‘టై బ్రేకర్’ జడ్జి జస్టిస్ అతుల్ చందూర్కర్ తీర్పు ఇచ్చారు. తాజా తీర్పుతో జనవరి 2024లో ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచిలోని ఇద్దరు జడ్జిలు ఇచ్చిన విభిన్నమైన చెరొక తీర్పు (split verdict) ప్రజల ప్రయోజనాలకు అనుకూలంగా మారింది. ఐ.టి…