ఐఎంఎఫ్ నిర్దేశిత కఠిన ఆర్థిక సంస్కరణలు: అంగోలా ప్రజల నిరసనోద్యమం

ఆంగ్లం: విజయశేఖర్ అనువాదం: రమాసుందరి అంగోలా ఇటీవలి కాలంలో ఆర్థిక సంస్కరణలు, సామాజిక కలహాల కూడలిలో చిక్కుకుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సూచనలతో మొదలైన కఠిన ఆర్థిక (పొదుపు) సంస్కరణల కారణంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పేదరికంతో అలమటిస్తున్న ప్రజలు తమను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా శాంతియుత ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం మీద ప్రభుత్వం ప్రాణాంతక ఆయుధాలను ప్రయోగించటం అత్యంత విషాదానికి దారితీసింది. 22 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తదుపరి…

యోగాను సైన్స్ ఎందుకు అంగీకరించదు?

———-రచన: డాక్టర్ దేవరాజు మహారాజు (ప్రముఖ సాహితీవేత్త, జీవ శాస్త్రవేత్త) కొన్నేళ్ళ క్రితం వరకూ శారీరక శ్రమకు చాలా విలువ ఉండేది. పొలాలకు వెళ్ళడం, మోట కొట్టడం, నాగలి దున్నడం, పశువులు మేపడం వంటి ఏ పని తీసుకున్నా అది శారీరక శ్రమతో కూడుకున్నదే! గృహిణులు ఇంటి పనులే కాకుండా వ్యవసాయపు పనులు కూడా చేసేవారు. వడ్లు దంచడం, పిండి విసరడం వంటివన్నీ శారీరక శ్రమలే! అవన్నీ జీవన శైలిలో అంతర్భాగంగా ఉండేవి. ప్రత్యేకంగా వ్యాయామం చేయడం…

ఇండియా, పాక్ సీజ్ ఫైర్ మరియు ట్రంప్ అను విచిత్ర గాధ!

ఇండియా, పాకీస్థాన్ దేశాల సైన్యం, పహల్గామ్ పై జరిగిన దాడి దరిమిలా పరస్పరం 4 రోజుల పాటు మిసైళ్లు, జెట్ ఫైటర్లు, డ్రోన్ లతో యుద్ధం చేస్తూ అకస్మాత్తుగా “కాల్పుల విరమణ” ప్రకటించటం వెనుక కారణం ఏమిటి? ఇండియా, పాకీస్థాన్ దేశాల ప్రభుత్వాలు కాల్పుల విరమణకు నిర్ణయించాయా? లేక భారత ప్రభుత్వం పదే పదే మొత్తుకుంటున్నట్లు ఇరు దేశాల మిలటరీలు నిర్ణయించాయా? లేక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నూరున్నొక్క సార్లు అలుపు సొలుపు లేకుండా డప్పు…

పహల్గామ్ దాడి గురించి ప్రధానికి ముందే తెలుసు! -ఖార్గే సంచలనం

పహల్గామ్ టెర్రరిస్టు దాడి, అనంతరం ఇండియా – పాకిస్థాన్ దేశాల 4 రోజుల యుద్ధం అంశాలపై పార్లమెంటులో రెండు రోజులుగా తీవ్రమైన చర్చ నడుస్తోంది. లోక్ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, హోమ్ మంత్రి అమిత్ షా లపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయి ప్రశ్నలతో నిలదీస్తుండగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే ప్రధాన మంత్రి మోడి పైన విరుచుకు పడ్డారు. పహల్గామ్ టెర్రరిస్టు దాడి తదనంతరం జరిగిన నాలుగు రోజుల…

యుద్ధము – వాణిజ్యం: పాలకవర్గాల దళారీ స్వభావం బట్టబయలు -రెండో భాగం

ఆంగ్లం: విశేఖర్; తెలుగు: రమా సుందరి; 03-06-2025 ప్రధాన మంత్రి మోడి విభిన్న స్పందన                                       పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా సామాన్య కశ్మీరీలు ప్రదర్శించిన హీరోయిజానికి సరిగ్గా భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి స్పందన ఉండింది. సామాన్య ప్రజల మానవతా ప్రతిస్పందనకు ఆయన ఏ మాత్రం సాటి రాలేకపోయాడు. స్థానిక నివాసులు తమ జీవితాలను పణంగా పెట్టి బాధితులను రక్షించటానికీ, సహాయం చేయటానికి ముందుకు రాగా; నరేంద్ర మోడి మాట్లాడిన మాటలు పొరుగు దేశం వైపు తప్పిదాన్ని…

యుద్ధం – వాణిజ్యం: బట్టబయలైన మోడి, ఆయన వంధిమాగధుల దళారి స్వభావం

————-ఆంగ్లం: విశేఖర్; తెలుగు: రమా సుందరి: తేదీ: 03-06-2025 ఆర్టికల్ 370ని రద్దు చేయటం వలన కశ్మీరీ లోయలో శాంతి పునః స్థాపన జరిగిందనీ, ఉగ్రవాదం సమూలంగా నాశనం అయిందనీ, కశ్మీరీలలో అసంతృప్తి తగ్గిపోతోందని -మోడీ, అతని పరివారాలు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కథ మాత్రం వేరుగా ఉంది. కశ్మీర్ లో పర్యాటకులు సేద తీరే పట్టణం పహల్గామ్ లో జరిగిన ఒకానొక దిగ్బ్రాంతికర సంఘటనలో నలుగురు ఉగ్రవాదులు ఎలాంటి హెచ్చరిక లేకుండా…

విమానం తోలటానికి నువ్వు పనికి రావు, వెళ్లి చెప్పులు కుట్టుకో ఫో!

చాతుర్వర్ణాల హైందవ నాగు భారత దేశ సామాజిక వ్యవస్థను తన విష కౌగిలిలో బంధించి ఉంచడం కొనసాగుతున్నదన్న సంగతిని దేశంలో ప్రతి రోజూ వెలుగు చూస్తున్న ఘటనలు చాచి కొట్టినట్లు చెబుతూనే ఉన్నాయి. బెంగుళూరుకు చెందిన 35 యేళ్ల వ్యక్తి పైలట్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇండిగో ఎయిర్ లైన్స్ లో పైలట్ డ్యూటీలో చేరేందుకు గురుగ్రాంలో ఉన్న కార్పొరేట్ ఆఫీసుకి వెళ్ళడం తోనే మరే ఇతర కొత్త పైలట్ కు ఎదురు కాని కష్టాలు మొదలయ్యాయి.…

ట్రంప్ దెబ్బకు అనిశ్చితిలో ఆర్ధిక వ్యవస్థలు!

Deportees entering the U.S. military plane అధ్యక్ష పగ్గాలు చేపట్టక ముందే గాజా యుద్ధాన్ని చిటికెలో ముగిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత మిత్ర దేశాలు శత్రు దేశాలు అన్న తేడా లేకుండా అన్ని దేశాలతో వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు. ముఖ్యంగా ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడిని పొగిడాడో, తిట్టాడో తెలియని వ్యాఖ్యలతో అయోమయం సృష్టించి ఇండియాను మాత్రం “అతి భారీ వాణిజ్య సుంకాలు మోపే దేశం” అని ప్రతికూల వ్యాఖ్యలతో భారత…

అలా అయితే నేను బలమైన ప్రధానిని కాను -డా. మన్మోహన్

యుపిఏ 2.0 ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అన్ని వైపుల నుండీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. 2జి సెక్ట్రమ్ స్కాం, బొగ్గు గనుల కేటాయింపుల స్కామ్, హెలికాప్టర్ స్కాం, ఇలా అనేక స్కాం లు వరస బెట్టి వెలుగు చూడటం వలన అసలు దోషులకు బదులు ప్రధాన మంత్రి పదవిలో ఉన్న డా. మన్మోహన్ సింగ్ పైనే విమర్శలు ఎక్కుపెట్టబడ్డాయి. ఎన్ని విమర్శలు వచ్చినా చాలా కాలం వరకు డా. మన్మోహన్ సింగ్…

డా|| ఎంఎంఎస్: హోమ్ శాఖ ఆంగ్ల పాండిత్యమా ఇది?

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖలో కేంద్ర ప్రజా సమాచార కార్యాలయం నుండి వెలువడిన లేఖ ఒకటి ట్విట్టర్ లేదా ఎక్స్ లో చక్కర్లు కొడుతోంది. సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ లో జాయింట్ సెక్రటరీ అయిన జి.పార్ధ సారధి సంతకంతో వెలువడిన ఈ లేఖలో ఆంగ్ల భాషకు సంబంధించి దొర్లిన తప్పులు భారత కేంద్ర మంత్రిత్వ శాఖలో పని చేస్తున్న ఉన్నతశ్రేణి అధికారుల భాషా పరిజ్ఞానంపై అనుమానాలు కలుగ జేస్తున్నాయి. ఈ లేఖ, ఎవరైనా ఆర్.టి.ఐ దరఖాస్తు…

ఇజ్రాయెల్ ప్రధానిపై ఐసిసి అరెస్ట్ వారంట్!

Yoav Gallant and Benjamin Netanyahu ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఎట్టకేలకు ఇజ్రాయెల్ ని ఏలుతున్న టెర్రరిస్టు ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహూ అరెస్టుకు, ఈ రోజు అనగా నవంబర్ 21 తేదీన, అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ప్రధాని నెతన్యాహూతో పాటు ఇటీవలి వరకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిగా పని చేసిన యెవ్ గాలంట్ అరెస్టుకు కూడా ఐసిసి వారంట్ జారీ చేసింది. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో చనిపోయిన హమాస్ సంస్థ రాజకీయ నేత ఇస్మాయిల్…

బ్రిక్స్ దేశాలకు ఉమ్మడి కరెన్సీ?

– బ్రిక్స్ కూటమి 16వ సమావేశాల్లో రష్యా అధ్యక్షుడు పుటిన్ కు బ్రిక్స్ కరెన్సీ పేరుతో ఒక నమూనా నోట్ ను బహూకరించటం ఇండియాలో కలకలం రేగటానికి కారణం అయింది. కరెన్సీ నోట్ నమూనా పైన భారత దేశం తరపున భారత జాతీయ పతాకంతో పాటు తాజ్ మహల్ బొమ్మ కూడా ఉండటం ఈ కలకాలానికి ప్రధాన కారణం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి 2014 లో అధికారం చేపట్టిన తర్వాత వివిధ ముస్లిం మత నిర్మాణాలకు,…

బ్రిక్స్: ద్రవ్య ఏకీకరణ జరగాలి -మోడి

రష్యా నగరం కాజన్ లో జరుగుతున్న ‘బ్రిక్స్ కూటమి’ 16వ సమావేశాల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ద్రవ్య ఏకీకరణ (Financial Integration) జరగాలని, ద్రవ్య ఏకీకరణకు ఇండియా మద్దతు ఇస్తుందని ప్రకటించాడు. బుధవారం అక్టోబర్ 23 తేదీన సమావేశాల్లో ఆయన పాల్గొంటూ అంతర్జాతీయ ఉగ్రవాదం విషయమై తయారు చేసిన పత్రాన్ని ప్లీనరీ సెషన్ లో ప్రవేశ పెట్టాడు. అంతర్జాతీయ ఉగ్రవాదం విషయంలో ఇండియా రాజీలేని ధోరణి అవలంబిస్తుందని మోడి…

బ్రిక్స్: ఇండియాపై అమెరికా ఆశలు నిలిచేనా?

పశ్చిమాసియాలో అరబ్ పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ జరుపుతున్న సామూహిక దారుణ మారణకాండ, ఉక్రెయిన్-రష్యా యుద్ధంల పుణ్యమాని ఇరుగు పొరుగు దేశాలైన ఇండియా, చైనాల మధ్య సంబంధాలు మెరుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవి కేవలం సూచనలేనా లేక వాస్తవ రూపం దాల్చేనా అన్న సంగతి మాత్రం ఇప్పుడప్పుడే తెలిసే అవకాశం మాత్రం లేదు. రష్యన్ నగరం కాజన్ లో ఈ రోజు (అక్టోబర్ 23) బ్రిక్స్ కూటమి దేశాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. విశ్లేషకులు ఊహించినట్లుగానే ఇండియా, చైనా…

తూర్పు లడఖ్: చైనా, ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం!

10 దేశాల బ్రిక్స్ కూటమి సమావేశాలు రష్యన్ నగరం కాజన్ లో ప్రారంభం కావటానికి రెండు రోజుల ముందు తూర్పు లడఖ్ సరిహద్దు కాపలా విషయంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన మాట నిజమేనని ఈ రోజు (అక్టోబర్ 22) చైనా ధృవీకరించింది. ఒప్పందం కుదిరిన సంగతిని సోమవారమే (అక్టోబర్ 21) ఇండియా ప్రకటించింది. ఇండియా ప్రకటనను చైనా ఈ రోజు ధృవీకరించింది. లడఖ్ ప్రాంతంలో చైనా, ఇండియా దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖను…