యెమెన్ లో ఆగని అనుకూల, ప్రతికూల ప్రదర్శనలు, షరతులతో రాజీనామాకి సిద్ధమన్న అధ్యక్షుడు

యెమెన్ లో అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతుండగా అధ్యక్షుడు కూడా తనకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహింప జేస్తున్నాడు. అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ నెలన్నర క్రితం రాజధాని సనా లోని యూనివర్సిటీ విధ్యార్ధులు మొదలు పెట్టిన ఉద్యమం ఇతర సెక్షన్ల ప్రజల చేరికతో తీవ్ర రూపం దాల్చింది. శుక్రవారం (మార్చి, 25) ఇరుపక్షాలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాయి. ర్యాలిల్లొ పదుల వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని బిబిసి తెలిపింది.…

తొత్తు అరబ్ ప్రభుత్వాల మద్దతుతో లిబియాపై దాడికి ‘నాటో’ నాయకత్వం

తమ మాట వినే అరబ్ దేశాల మద్దతుతొ లిబియాపై జరుపుతున్న దాడులకు ఆమోద యోగ్యత సాధించడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మొదట లిబియాపై సైనిక చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన కతార్ ఇప్పటికే దాడుల్లో పాల్గొంటున్నది. తాజాగా టర్కీ కూడా కతార్ తో జత కలిసింది. “అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక ఉచ్యమాలు తలెత్తడానికి పశ్చిమ దేశాలు అరబ్ దేశాల పట్ల అనుసరిస్తూ వచ్చిన విధానాలే కారణమ”ని హెచ్చరించిన టర్కీ ఇప్పుడు నో-ఫ్లై అమలుకు నాటొ నాయకత్వానికి అంగీకరించింది. గురువారం…

తెలంగాణపై కేంద్రం సానుకూల నిర్ణయాన్ని అడ్డుకోవడానికే రహస్య నోట్ -జస్టిస్ నరసింహారెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకుండా అడ్డుకోవడానికే రహస్య నోట్ గా ప్రస్తావించిన 8 వ ఛాప్టర్ ను తమ నివేదికలో జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ పొందుపరిచిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. శ్రీ కృష్ణ కమిటీ తాను సమర్పించిన నివేదికలోని ఎనిమిదవ అధ్యాయాన్ని రహస్యంగా ఉంచడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను విచారించిన జస్టిస్ నరసింహా రెడ్డి బుధవారం తుది తీర్పును వెలువరించిన…

పోర్చుగీసు అప్పు సంక్షోభం నేపధ్యంలో ఇ.యు శిఖరాగ్ర సమావేశం

బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో గురువారం జరగనున్న యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశంలో పోర్చుగీసు అప్పు సంక్షోభం పైనే ప్రధాన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ట్యునీషియా, ఈజిప్టు పరిణామాలు ఎజెండా గా సమావేశం ఏర్పాడు చేసినప్పటికీ పోర్చుగీసు లో ప్రభుత్వ సంక్షోభం ముంచుకు రావడంతో సమావేశంలో ఆ అంశమే మిగతా అంశాలను పక్కకు నెట్టే పరిస్ధితి కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. పోర్చుగీసు ప్రభుత్వం బడ్జేట్ లో తలపేట్టిన నాల్గవ విడత పొదుపు చర్యలను సమర్ధించడానికి ప్రతిపక్షాలు…

జెరూసలేంలో సూట్ కేసు బాంబు పేలుడు, ఒకరి మృతి

పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య తాజాగా ఘర్షణలు రాజుకుంటున్నాయి. మంగళవారం ఇజ్రాయెల్ సైనిక విమానం జరిపిన దాడిలో  పాలస్తీనా మిలిటెంట్ల రాకేట్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగిన తర్వాత పశ్చిమ జెరూసలేం లోని ఒక బస్ స్టేషన్ లో ఉంచిన సూట్ కేసు బాంబు పేలింది. ఇద్దరు పిల్లలతో సహా 8 మంది పాలస్తీనీయులు ఈ దాడిలో చనిపోయారు. ఇజ్రాయెల్ వైమానిక దాడికి ప్రతీకార చర్యగా గాజాలోని ఇస్లామిక్ జీహాద్ సంస్ధ రెండు రాకెట్లను ఇజ్రాయెల్…

కూలిపోయే దిశలో పోర్చుగల్ ప్రభుత్వం

యూరప్ అప్పు సంక్షోభం మళ్ళీ జడలు విప్పుతోంది. తాజాగా అది పోర్చుగల్ ను బలి కోరుతోంది. యూరోపియన్ యూనియన్ (ఇ.యు), ఐ.ఎం.ఎఫ్ లనుండి బెయిలౌట్ తీసుకోవడానికి వ్యతిరేస్తున్న సోషలిస్టు ప్రభుత్వం ప్రతిపాదించిన పొదుపు చర్యలను పార్లమెంటు వ్యతిరేస్తుండడంతో పోర్చుగల్ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. గురువారం జరగనున్న ఇ.యు సమావేశం నాటికి పొదుపు చర్యల బిల్లును ఆమోదించుకుని వెళ్ళాలన్న ప్రధాన మంత్రి “జోస్ సోక్రటీస్” ఆశల్ని వమ్ము చేస్తూ, సోషల్ డెమొక్రట్ పార్టీ బిల్లును వ్యతిరేకిస్తున్నది. “బిల్లు…

కాంగ్రెస్ లో కలిసిపోయే టి.ఆర్.ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు క్షమించవచ్చా?

కాంగ్రెస్ పార్టీలో టి.ఆర్.ఎస్ ని కలిపేస్తే తప్ప “తెలంగాణ రాష్ట్రం” ఇవ్వబోమని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధి అన్నట్లు కే.సి.ఆర్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కే.సి.ఆర్ దాన్ని అవాస్తవమని కొట్టిపారేసినా, ఆయన ఎం.ఎస్.ఓ ల సంఘం సమావేశంలో ఈ విషయాన్ని చెప్పినట్లు వార్తా ఛానెళ్ళు మంగళవారం అంతా ప్రసారం చేశాయి. ఒక సంఘం సమావేశంలో చెప్పాడంటున్న వార్తను అంత తేలిగ్గా కొట్టేయలేము. అదీకాక కే.సి.ఆర్ కి ఇటువంటి ప్రకటనలు ఇవ్వడం మామూలే. ప్రజలు, ఇతర రాజకీయ పార్టీలు…

‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి – 2

“దీనికి మోడి గుర్రుమంటూ ‘భారత జాతీయ మాన వహక్కుల సంఘం పక్షపాత పూరితమైనది. దాని నిర్ణయాల్లో తీవ్ర తప్పిదాలున్నాయి. అదీ కాక అమెరికా కొద్ది సంఖ్యలో ఉన్న చిన్న చిన్న ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్ధలపైనే ఆధారపడుతోంది. వాటికి వాస్తవ పరిస్ధితులేవీ తెలియదు. పైగా వాటికి స్వార్ధ ప్రయోజనాలున్నాయి. ఏదైమైనా అధికారులు తప్పు చేసినట్లయితే వారిని విచారించి, శిక్షించేందుకు కోర్టులున్నాయి. ముఖ్యమంత్రులు న్యాయ ప్రక్రియల్లో జోక్యం చేసుకోలేరు’ అని సమాధానమిచ్చాడు” అని ఓవెన్ రాశాడు.  కాన్సల్ జనరల్ దానికి…

‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి – 1

2002 సంవత్సరంలో గోధ్రా రైలు బోగీ దహనం అనంతరం నరేంద్ర మోడి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలో ముస్లిం ప్రజలపై సాగించిన నరమేధానికి బాధ్యులైన వారిపై ఏం చర్య తీసుకున్నారు అనడిగిన అమెరికా రాయబారి ప్రశ్నకు కోపంతో, “అది గుజరాత్ అంతర్గత వ్యవహారం. ఆ విషయం గురించి ప్రశ్నించే అధికారం అమెరికాకు లేదు” అని నరేంద్ర మోడి హుంకరించిన విషయం అమెరికా రాయబారి రాసిన కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. ఇండియాలో పని చేసిన అమెరికా రాయబారులు అమెరికా…

‘నందిగ్రాం హింస’తో అమెరికాలో శిక్షణార్హత కోల్ఫోయిన ఐ.పి.ఎస్ అధికారి -వికీలీక్స్

తమ భూముల్ని అక్రమంగా లాక్కుని ఇండోనేషియా వ్యాపార గ్రూపుకి అప్పగించడానికి వ్యతిరేకంగా నందిగ్రాం ప్రజలు జరిపిన వీరోచిత పోరాటంపై కాల్పులు జరిపి అనేకమంది చనిపోవడానికి కారణమయ్యాడన్న ఆరోపణ ఉండడం వలన అమెరికాలో ట్రైనింగ్ పొందే అవకాశాన్ని పశ్చిమ బెంగాల్ పోలీసు ఉన్నతాధికారి కోల్పోయిన విషయం వికీలీక్స్ బయట పెట్టిన డిప్లొమాటిక్ కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. అమెరికాలో పోలీసు, మిలట్రీ శిక్షణ పొందాలనుకునే వారు మానవహక్కులు గౌరవించడంలో వ్యతిరేక రికార్డు ఉండకూడదని అమెరికా చట్టాలు నిర్దేశిస్తాయి. నందిగ్రాం ఆందోళకారులపై…

మణిపూర్ ఇండియా వలసలా ఉంది తప్ప రాష్ట్రంలా లేదు -అమెరికా రాయబారి (వికీలీక్స్)

ఇండియా ఈశాన్య ప్రాంతంలో ఉన్న మణిపూర్ రాష్ట్రం ఇండియాలో భాగమైన ఒక రాష్ట్రం కంటే ఇండియా ఆక్రమించుకున్న ఒక వలస ప్రాంతం వలె ఉందని మణిపూర్ సందర్శించిన తర్వాత అమెరికా రాయబారి తమ ప్రభుత్వానికి పంపిన కేబుల్ లో రాశాడు. మిలట్రీ, పారా మిలట్రీ, పోలీసులు అడుగుడునా ఉన్న మణిపూర్ ని చూసి అది ఇండియా ఆక్రమణలో ఉన్న భావన కలిగిందని రాయబారి రాశాడు. 2006 సంవత్సరంలో మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించాక కోల్ కతా లోని అమెరికా…

లిబియా – ఓవైపు అంతర్యుద్ధం, మరోవైపు పశ్చిమ దేశాల దాడులు

లిబియాపై పశ్చిమ దేశాలు అధునాతన యుద్ధ విమానాలతో క్షిపణి దాడులు జరుపుతుండగా, మరోవైపు గడ్డాఫీ బలగాలు, తిరుగుబాటు బలగాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమ దేశాల దాడులపై అంతర్జాతీయంగా వ్యతిరేకత పెరుగుతున్నది. ఆఫ్రికన్ యూనియన్ దేశాలు పశ్చిమ దేశాల దాడులను ఖండించాయి. నో-ఫ్లై జొన్ అమలు చేయడానికి మద్దతిచ్చిన అరబ్ లీగ్ సైతం భారీ దాడులు జరపడం పట్లా, పౌరులు చనిపోవడం పట్లా అసంతృప్తి వ్యక్తం చేసింది. పశ్చిమ దేశాల ఉద్దేశాల పట్ల అనుమానాలు వ్యక్త…

ఇరాన్ అధ్యక్షుడి సందర్శన వార్త అమెరికాకి ముందుగా తెలిపిన భారత అధికారులు -వికీలీక్స్

ఇరాన్ అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించబోతున్న విషయం భారత ప్రభుత్వంలోని ఇతర మంత్రిత్వశాఖలకు తెలపడానికి ముందు అమెరికా రాయబారికి భారత విదేశీ మంత్రిత్వశాఖ అధికారులు తెలియజేసిన విషయం వికీలీక్స్ బయట పెట్టిన ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ ద్వారా వెల్లడయ్యింది. ఏప్రిల్ 29, 2008 తేదీన ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ ఇండియా రానున్నాడని కొత్తఢిల్లీ లోని అమెరికా రాయబారి కార్యాలయంలో ఉండే రాజకీయ విభాగాధిపతికి భారత విదేశీ మంత్రిత్వ శాఖ లొని ఓ సీనియర్ అధికారిణి సమాచారం ఇచ్చినట్లుగా రాజకీయ…

జీ-మెయిల్ సర్వీసును చైనా ప్రభుత్వం అడ్డగిస్తోంది -గూగుల్

తమ ఈ-మెయిల్ సర్వీసుకు చైనా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని గూగుల్ సంస్ధ ఆరోపించింది. ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లొ లాగా చైనా ప్రదర్శనలు నిర్వహించాలన్న సందేశాలు వ్యాప్తి చెందుతున్నందు వలన చైనా ప్రభుత్వం జీ-మెయిల్ సర్వీసుకు ఆటంకాలు సృష్టిస్తోందని జీ-మెయిల్ వినియోగదారులు చెప్పినట్లు బిబిసి తెలిపింది. గత కొద్ది వారాలుగా చైనా అధికారులు గూగుల్ మెయిల్ సర్వీసు వినియోగించకుండా ఆటంకాలు సృష్టిస్తూ జీ-మెయిల్ సాఫ్ట్ వేర్ లోనే ఏదో సమస్య ఉందని భావించేలా చేస్తోందని గూగుల్ తన ఆరోపణలను…

యెమెన్ ఆందోళనకారులతో చేతులు కలుపుతున్న మిలట్రీ అధికారులు

యెమెన్ అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే కి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం అయ్యేకొద్దీ మిలట్రీ అధికారులు ఒక్కరొక్కరుగా అధ్యక్షుడిని వదిలి ఆందోళనకారులతో చేరుతున్నారు. మిలట్రీ జనరల్ ఆలీ మొహసేన్ అల్-అమ్హర్ సోమవారం తన పదవికి రాజీనామా చేశాడు. “పోరాటం రాను రానూ క్లిష్ట సమస్యగా మారుతోంది. హింస, అంతర్యుద్ధం వైపుగా వెళ్తోంది. నా ఆలోచనలు, నాటోటి కమాండర్ల, సైనికుల ఆలోచనల ప్రకారం మేము యువకుల విప్లవానికి శాంతియుత మద్దతు తెలుపుతున్నాము. భద్రత, దేశ సుస్ధిరత లను కాపాడటంలో…