ఇండియా వస్తున్న జర్మనీ ఛాన్సలర్ విమానాన్ని గాల్లోనే అడ్డుకున్న ఇరాన్

రక్షణ రంగ కొనుగోళ్ళ విషయం గురించి చర్చించడానికి ఇండియా వస్తున్న జర్మనీ ఛాన్సలర్ విమానాన్ని ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించకుండా అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో రెండు గంటలపాటు సదరు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. చివరికి టర్కీ మద్యవర్తిత్వంతో మెత్తబడిన ఇరాన్ జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రయాణిస్తున్న విమానానికి అనుమతి ఇవ్వడంతో ఆమె క్షేమంగా ఇండియా చేరగలిగింది. విమానాన్ని తమ గగన తలం లోకి ఇరాన్ ఎందుకు అనుమతించనిదీ కారణం ఇంకా తెలియలేదు. ఇరాన్…

ప్రపంచ ఆహార పంపిణీ వ్యవస్ధే రైతులకు నష్టాల్నీ పేదలకు ఆకలి చావుల్నీ సృష్టిస్తోంది -ఆక్స్‌ఫాం

ప్రపంచ దేశాల్లొ ప్రస్తుతం కొనసాగుతున్న ఆహార పంపిణీ వ్యవస్ధలే పేదల్ని ఆకలి చావులకు గురి చేస్తున్నదని చారిటీ సంస్ధ ఆక్స్‌ఫాం కుండ బద్దలు కొట్టింది. ప్రపంచ ఆహార వ్యవస్ధ కేవల కొద్దిమంది కోసమే పని చేస్తున్నదని, మిగిలిన వారందరికీ అది విఫల వ్యవస్ధగా మారిందనీ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆక్స్‌ఫాం పేర్కొంది. ప్రపంచ ఆహార పంపిణీ వ్యవస్ధ, ఆహారాన్ని వినియోగించే బిలియన్ల మంది ప్రజలకు తాము ఏమి కొంటున్నదీ, ఏమి తింటున్నదీ అన్న అంశాలపై సరిపోయినంత…

కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తిలో జర్మనీ ఆదర్శంగా నిలుస్తుంది -జర్మనీ ఛాన్సలర్

భవిష్యత్తులో కాలుష్యంలేని విద్యుత్ ఉత్పత్తిలో జర్మనీ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందనీ, తద్వారా విద్యుత్ పరికరాల వ్యాపారంలో జర్మనీ లాభపడుతుందనీ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఆశాభావం వ్యక్తం చేసింది. 2022 సంవత్సరానికల్లా అణు విద్యుత్ వినియోగానికి స్వస్తి పలకాలని జర్మనీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అణు రియాక్టర్ల మూసివేత ద్వారా ఇతర విద్యుత్ ఉత్పత్తి మార్గాలను ఆవిష్కరించడానికి చేసే ప్రయత్నాలు జర్మనీని రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో అగ్రస్ధానంలో నిలుపుతాయనీ, తద్వారా జర్మనీ ఆర్ధికంగా లాభపడుతుందనీ ఆమె…

అమెరికన్లపై నిఘా, ప్రపంచదేశాలపై శాశ్వత యుద్ధం: నల్లచట్టాలకు కాంగ్రెస్ ఆమోదం

అమెరికా లోపలా, బయటా తన అమానుషకృత్యాలను మరింత తీవ్రంగా, శక్తివంతంగా కొనసాగించడానికి అమెరికా ప్రతినిధుల సభ రెండు నల్ల చట్టాలను ఆమోదించింది. ఇప్పటికే దేశం లోపల అమలు చేయడానికి ఉన్న ఓ నల్ల చట్టాన్ని మరింతకాలం కొనసాగించడానికి ఆమోదం తెలుపుతూ, దేశం బైట ప్రపంచం మీద పెత్తనం కోసం అంతం లేని యుద్ధాలు చేసే హక్కును తమకు తాము దఖలుపరుచుకుంటూ రిపబ్లికన్ పార్టీ సభ్యులు మెజారిటీగా కల అమెరికా ప్రతినిధుల సభ, గతవారం చట్టాలను ఆమోదించింది. అమెరికా…

అణు విద్యుత్‌ ఉత్పత్తిని పూర్తిగా నిషేధించటానికి జర్మనీ నిర్ణయం

అణు విద్యుత్ కర్మాగారాలకు సంబంధించి జర్మనీ ప్రభుత్వం సాహసోపేతమైన, ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. 2022 కల్లా అణు విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపి వేయాలని నిర్ణయించింది. ఇప్పుడున్న అణు కర్మాగారాలను దశలవారిగా మూసి వేస్తూ, 2022కల్లా అణు విద్యుత్ అనేదే దేశంలో లేకుండా చేయాలని నిర్ణయించుకుంది. జపాన్‌లో మార్చిలో సంభవించిన భూకంపం, సునామీల వలన 30,000 మంది చనిపోవడమో, ఆచూకీ గల్లంతవడమో జరిగింది. దాంతో పాటు ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం భూకంపం, సునామీల ధాటికి బాగా…

యూరప్‌ని వణికిస్తున్న కీరా దోసకాయ, 10 మంది జర్మన్లు మరణం

కీర దోసకాయ యూరప్ ఖండం లోని దేశాలను వణికిస్తోంది. ఇ.కోలి బాక్టీరియాతో ఇన్‌ఫెక్ట్ అయి విషతుల్యంగా మారడంతో వాటిని తిన్న వారు అనారోగ్యానికి గురవుతున్నారు. జర్మనిలో ఇప్పటికే దీని బారిన పడి 10 మంది చనిపోయారు. ఈ కీర దోసకాయలు స్పెయిన్ నుండి దిగుమతి అయినవిగా భావిస్తున్నారు. అయితే ఇవి బయలుదేరిన చోటనే ఇన్‌వెక్షన్ కి గురయ్యాయా లేక రవాణాలో ఇన్‌ఫెక్షన్ ని గురయ్యాయా అన్నది ఇంకా తేలలేదు. ఈ దోస కాయలు ఇప్పటికే అర డజను…

ఔట్‌లుక్ ఇంటర్వూ: బి.జె.పిలో సుష్మా, జైట్లీ ల ఆధిపత్య పోరు

బి.జె.పి పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ ఔట్‌లుక్ వార పత్రిక తాజా సంచికకు ఇంటర్వూ ఇస్తూ ఇనప ఖనిజ అక్రమ తవ్వకాల్లో వేల కోట్లు కాజేసిన గాలి బ్రదర్సుకి కర్ణాటక ప్రభుత్వంలో మంత్రి పదవులిచ్చి పైకి తేవడానికి బాధ్యతను బి.జె.పిలోని మరో నాయకుడు, రాజ్యసభలో బి.జె.పి నాయకుడూ ఐన అరుణ జైట్లీ పైకి నెట్టేసింది. బి.జె.పి పార్టీకి భావి నాయకులుగా భావిస్తున్న ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఇలా బహిరంగంగా వేలెత్తి చూపించడం చర్చనీయాంశంగా మారింది. గాలి…

కొత్త సర్వీసు కోసం ‘పేపాల్’ వ్యాపార రహస్యాలను దొంగిలించిన ‘గూగుల్’?

గూగుల్ పాపాల జాబితాలో మరొక పాపం చేరింది. శిశుపాలుడి పాపాలను శ్రీ కృష్ణుడు వందవరకే అనుమతించాడు. గూగుల్ పాపాలకు మాత్రం అంతూ పొంతూ ఉండడం లేదు. ప్రమాద వశాత్తూ బిలియనీర్ అయిన కంపెనీల్లో ఒకటిగా మొదట పేరు పొందిన గూగుల్ ఆ తర్వాత నియమ నిబంధనల్లోని లొసుగులను ఉపయోగించుకుంటూ, ఇంటర్నెట్ ద్వారా వినియోగదారుల వ్యక్తిగత వివరాలను దొంగిలిస్తూ, ఒక మాదిరి కంపెనీలన్నింటినీ అక్విజిషన్ల ద్వారా మింగివేస్తూ అనతి కాలంలోనే అతి పెద్ద కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో…

ఐదు రోజుల వ్యవధిలో 32 మంది ఆఫ్ఘన్ పౌరుల్ని చంపేసిన నాటో సేనలు

లిబియా పౌరుల్ని చంపాడంటూ గడ్దాఫీపై  అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ద్వారా అరెస్టు వారెంటు జారీ చేయించిన అమెరికా తదితర పశ్చిమ దేశాల నాటో కూటమి ఆఫ్ఘనిస్ధాన్‌లో పౌరులను చంపడం నిరాకటంకంగా కొనసాగిస్తూనే ఉంది. గత బుధవారం 18 మందినీ పొట్టన బెట్టుకున్న అమెరికా సేనలు ఆదివారం 14 మందిని చంపేశాయి. ఆదివారం చనిపోయినవారిలో ఇద్దరు స్త్రీలు కాగా మిగిలినవారంతా పిల్లలే. చనిపోయినవారిలో 2 సం.ల పసిపిల్లలు కూడా ఉండడం గమనార్హం. ఇవి మానవతకి వ్యతిరేకంగా జరిగిన నేరం.…

ప్రధాని మంచోడే, రిమోట్ కంట్రోల్ తోనే సమస్య -అన్నా హజారే

భారత రాజకీయ నాయకులు , బ్యూరోక్రట్ల అవినీతిని అంతం చేయడానికే కంకణం కట్టాడని భావిస్తున్న అన్నా హజారే తాజాగా సోనియా గాంధీని తన విమర్శలకు లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. బెంగుళూరులో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్‌కు క్లీన్ సర్టిఫికెట్ ఇస్తూ రిమోట్ కంట్రోలు వల్ల సమస్యలు వస్తున్నాయని సంచలన ప్రకటన చేశాడు. “ప్రధాన మంత్రి మంచి వ్యక్తి. ప్రధాన మంత్రి చెడ్డవాడు కాడు. రిమోట్ కంట్రోలు కారణంగా సమస్యలు వస్తున్నాయి” అని…

“కులములో ఏముందిరా?” పాత పాట, మంచి పాట!

పాత తెలుగు సినిమా పాటలపై తెలుగు వారి మమకారం శాశ్వతమేనేమో! సందర్భశుద్ధితో రాయడం, సినిమా కధకు తగిన పాటలు కావడం, సందర్భాలకు తగిన విధంగా రాసిన సాహిత్యానికి ఆ తర్వాత మాత్రమే సంగీతం సమకూర్చడం… ఈ కారణాల వలన అప్పటి పాటలు ఇప్పటికీ ప్రజల మనసుల్లో, గుండెల్లో, నాలుకలపైనా తిష్టవేయగలిగాయి. మరీ ముఖ్యంగా సమాజంలోని వాస్తవ స్ధితిగతులతో సినిమా కధలకు దగ్గరి సంబంధం ఉండడం, ఆయా సినిమా కధల్లోని వివిధ పాత్రలతో తమ నిజ జీవితాలనూ, జీవిత…

చైనా కరెన్సీ యువాన్ విలువపై మాట మార్చిన అమెరికా ట్రెజరీ

చైనా తన కరెన్సీ యువాన్ విలువను కృత్రిమంగా తక్కువ స్ధాయిలో ఉంచుతున్నదంటూ గత రెండు, మూడు సంవత్సరాలనుండీ వాదిస్తూ వచ్చిన అమెరిక ట్రెజరీ డిపార్టుమెంటు ఇప్పుడు “అబ్బే, అదేం లేదు” అంటోంది. యువాన్ విలువ అమెరికా, చైనాల మధ్య ఒక వివాదాంశంగా చాలాకాలం నుండి ఉంది. ముఖ్యంగా గత రెండు, మూడు సంవత్సరాల నుండి, ఇంకా చెప్పాలంటే ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తలెత్తినప్పటి నుండి యువాన్ విలువను తగ్గించాలని అమెరికా, ఐరోపా దేశాలతో పాటు ఇండియా, జపాన్‌లు…

పాకిస్ధాన్‌కి అమెరికా మిలట్రీ సాయాన్ని మళ్ళీ విమర్శించిన ఇండియా

అమెరికా, పాకిస్ధాన్‌కి బిలియన్లకొద్దీ మిలట్రీ సహాయం ఇవ్వడాన్నీ భారత దేశం మరొకసారి విమర్శించింది. అమెరికా, ఇండియాల సంబధాల మధ్య ఈ అంశం మొదటినుండీ ఒక చికాకు గా ఉంటూ వచ్చింది. పాకిస్ధాన్‌కి అందిస్తున్న మిలట్రీ సహాయంలో చాలా భాగం ఇండియాకి వ్యతిరేకంగా రక్షణ సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి వినియోగిస్తోందని భారత ఆరోపిస్తున్నది. న్యూయార్కు నగరంలోని జంట టవర్లపై టెర్రరిస్టు దాడులు జరిగినప్పటినుండీ టెర్రరిజంపై పోరాటంలో సహకరిస్తున్నందుకు అమెరికా, పాకిస్ధాన్‌కి 20.7 మిలియన్ డాలర్లను (రు. 95220 కోట్లు) సహాయంగా…

‘మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె!’, ఆఫ్రికాలో ఇండియా ఔదార్యం

“ఓ వైపు ఇండియాలో ఆకలితో ప్రతి సంవత్సరం లక్షల మంది చనిపోతుండగా, మరో వైపు భారత్ శక్తివంతమైన దేశంగా ఎలా చెలామణి అవుతోంది? రెండు ఇండియాలు ఎలా సాధ్యం?” అంటూ భారత ప్రభుత్వానికి సుప్రీం కోర్టు తలంటు పోసి రెండు నెలలు కూడా కాలేదు. “గోదాములు లేక ఆరుబైట పరదాల క్రింద ఉంచిన ధాన్యం వర్షాలకు తడిసి పాడుపెట్టే బదులు ఆకలితో ఉన్నవారికి ఉచితంగా పంచండి” అని సుప్రీం కోర్టు సలహా ఇస్తే “ఉచితంగా ఇవ్వడం సాధ్యం…

తన మిలట్రీ కాంట్రాక్టుల్లో చైనా కంపెనీలు ప్రవేశించకుండా నిషేధించిన అమెరికా

అమెరికా జారీ చేసే మిలట్రీ కాంట్రాక్టులకు చైనాకి చెందిన కంపెనీలు బిడ్ లు దాఖలు చేయకుండా నిషేధిస్తూ అమెరికా చట్టాని ఆమోదించింది. అంతర్గత భద్రత దృష్యా చైనా కంపెనీలు తమ మిలట్రీ కాంట్రాక్టులకు ప్రయత్నించడం తమకు సమ్మతం కాదని అమెరికా ప్రతినిధుల సభ ఈ చట్టం ద్వారా తేల్చి చెప్పింది. అమెరికా డిఫెన్సు బడ్జెట్ బిల్లును ఆమోదిస్తున్న సందర్భంగా అమెరికా కాంగ్రెస్ చైనా కంపెనీల నిషేధ బిల్లును కూడా బుధవారం ఆమోదించింది. తాజా బిల్లు అమెరికా, చైనాల…