ద్వవ్యోల్బణం అరికట్టే పేరుతో లక్షల కుటుంబాల జీవనోపాధికి ప్రభుత్వం ఎసరు

అనుకున్నదే జరగబోతోంది. భారత దేశంలోని లక్షల కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీయడానికి భారత ప్రభుత్వం రెండో అడుగు వేసింది. ద్రవ్యోల్బణాన్ని అరి కట్టడమే తమ ప్రధమ కర్తవ్యం అంటూ రెండేళ్ళనుండి ఆందోళన వ్యక్తం జేస్తూ కూడా ఆ దిశలో ఏ చర్యా తీసుకోని ప్రభుత్వం ఇప్పుడు తన ఆందోళన వెనక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని బైటపెట్టుకుంది. ప్రధాన మంత్రి ఆర్ధిక సలహాదారుల బృందానికి అధిపతి అయిన కౌశిక్ బసు శుక్రవారం ప్రభుత్వ ఉద్దేశ్యాలను మెల్లగా బైటపెట్టాడు. భారత దేశ…

అసభ్యకర టి.వి. ప్రకటనలను ప్రసారం చేయవద్దని ఛానెళ్ళను కోరిన ప్రభుత్వం

భారత సమాచార మంత్రిత్వ శాఖ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. పచ్చిగా, అసభ్యకరంగా లైంగిక ప్రకటనలను ప్రసారం చేయవద్దని టి.వి చానళ్ళకు ఆదేశాలు జారీ చేసింది. డియోడెరంట్ అమ్మకం దారులు తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం జారీ చేస్తున్న వీడియో ప్రకటనలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని ప్రత్యక్షంగా లైంగికతలను ప్రదర్శించే ప్రకటనలు భారత దేశ ప్రచార, ప్రసార చట్టాలను ఉల్లంఘించేవిగా ఉన్నాయనీ, వీటిని ప్రసారం చేయడం వెంటనే ఆపాలని తన ఆదేశాల్లో ప్రభుత్వం కోరించి. అటువంటి ప్రకటనలు…

ఒక తీవ్రవాది, ఒక స్నేహబంధం, కొన్ని కార్టూన్లు

అమెరికాకీ, అమెరికా వాదనని నమ్మినవారికీ ఒసామా బిన్ లాడెన్ నెం. వన్ తీవ్రవాది. దక్షీణాసియాలో అమెరికాకి పాకిస్ధాన్ అత్యంత నమ్మకమైన మిత్రుడు. వారిది ఆరు దశాబ్దాల స్నేహబంధం. లాడెన్‌ని వెతకటంలో తన మిత్రుడు సహాయపడుతున్నాడని అమెరికా సెప్టెంబరు 11, 2001 నుండి ఇప్పటి వరకు 20.7 బిలియన్ డాలర్లను పాకిస్ధాన్‌కి ధారపోసింది. పది సంవత్సరాల నుండీ వెతుకుతున్న తన శత్రువు తన మిత్రుడి బెడ్ రూంలోనే హాయిగా సేద తీరడం చూసిన అమెరికా బిత్తరపోయింది. మిత్రుడుగా భావిస్తున్న…

16 సం. నాన్ బెయిలబుల్ వారంట్ తప్పించుకొని ఇప్పుడు లొంగిపోయిన బీహార్ ఎం.ఎల్.ఎ

ఆయన పేరు రామాధర్ సింగ్. బీహార్‌లో బి.జె.పి పార్టీ తరఫున ఔరంగాబాద్ నియోజక వర్గం నుండి నాలుగుసార్లు ఎన్నికయిన ఎం.ఎల్.ఎ. 2010 లో ఎన్నికయ్యాక నితీష్ కుమార్ ప్రభుత్వంలో సహకార శాఖా మంత్రిగా పని చేస్తున్నాడు. ఈయన గురువారం మంత్రి పదవికి రాజీనామ చేశాడు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సలహా మేరకు గవర్నర్ ఆ ఎం.ఎల్.ఏ రాజీనామాని ఆమోదించాడు. మే 19న రాజీనామా చేశాక బీహార్ హై కోర్టు ఆయనను క్రింది కోర్టులో లొంగిపొమ్మని ఆదేశాలు ఇచ్చింది.…

అమెరికాకు పాకిస్ధాన్ “తలాక్! తలాక్!! తలాక్!!!” చెప్పనున్నదా?

జరుగుతున్న పరిణామాలు అమెరికా పట్టునుండి పాకిస్ధాన్ జారిపోనున్నదా అన్న అనుమాలు కలగజేస్తున్నాయి. పాకిస్ధాన్ నుండి అమెరికా మనుషుల (ప్రత్యేక భద్రతా బలగాలు లేదా సి.ఐ.ఏ గూఢచారులు) సంఖ్యను సగానికి తగ్గించాల్సిందిగా పాకిస్ధాన్ మిలట్రీ అమెరికాను డిమాండ్ చేసింది. పాకిస్ధాన్ మిలట్రీ కోరిక మేరకు తమ పాకిస్ధాన్ నుండి తమ మనుషులను వెనక్కి పిలిపిస్తున్నామని అమెరికా కూడా ప్రకటించింది. “అనవసరమైన మనుషులు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాకు సాయం చేయడానికి బదులు మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నారు”…

చైనాలో కారు బాంబు పేలుళ్ళు, ఇద్దరు మృతి

చైనాలోని జీయాంక్సి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ముందు కారు బాంబులు పేలాయి. కనీసం మూడు పేలుళ్ళు జరిగాయని, ఈ పేలుళ్ళలొ ఇద్దరు పౌరులు చనిపోయారనీ బిబిసి తెలిపింది. ఫుఝౌ పట్టణంలో జరిగిన ఈ పేలుళ్ళలో మరో ఆరుగురు గాయపడ్డారు. రాష్ట్ర ప్రాసిక్యూటర్ కార్యాలయం, నగర ఆహరము మందుల ఏజెన్సీ కార్యాలయం, జిల్లా పాలనా కార్యాలయ భవనాల ముందు ఉన్న కారు బాంబులుంచారని తెలుస్తోంది. ఇవన్నీ ఒకేసారి పేలినట్లు జిన్‌హువా వార్తా సంస్ధ తెలిపింది. పేలుళ్ళకు కారణాలను…

ఐ.ఎం.ఎఫ్ పదవికి దేశం కాదు, ఏకాభిప్రాయమే ప్రాతిపదిక -ఇండియా

ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ప్రతిభ, ఏకాభిప్రాయమే ప్రాతిపదికగా ఉండాలి తప్ప జాతీయత, దేశం కాదని ఇండియా ప్రకటించింది. యూరోపియన్ దేశం నుండి మాత్రమే ఆ పదవికి ఎన్నుకోవాలని యూరోపియన్ యూనియన్ ప్రకటించడం పట్ల ఇండియా తో పాటు ఇతర బ్రిక్స్ దేశాలైన చైనా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టీన్ లాగార్డే తాను ఐ.ఎం.ఎఫ్ అత్యున్నత పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇ.యు ఆమెకు పూర్తి…

భారత రాయబారి కూతురికి అమెరికా స్కూల్‌లో ఘోర పరాభవం, పరువు నష్టం కేసు దాఖలు

అమెరికా ప్రభుత్వాధికారులు, పోలీసులు, ఇతర తెల్ల మేధావులు భారత అధికారుల పట్ల అవమానకరంగా వ్యవహరించిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుండి భారత మహిళా రాయబారి నుండి బాలివుడ్ హీరో షారుఖ్ ఖాన్ వరకు విమానాశ్రయాలలో తనిఖీలు ఎదుర్కొన్న ఘటనలు మనకు తెలుసు. సిక్కు మతస్ధుడైన భారత రాయబారిని అతని మత సాంప్రదాయన్ని అవమాన పరుస్తూ, పేలుడు పదార్ధాలు ఉన్నాయేమోనని అనుమానిస్తూ తలపాగా విప్పించిన ఘటనలు పత్రికల్లో చదివాం. అమెరికా సెక్రటరీ ఆఫ్…

ఐ.ఎం.ఎఫ్ పదవికోసం పశ్చిమ దేశాలు, బ్రిక్స్ దేశాలకు మధ్య పోటీ

ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డొమినిక్ స్ట్రాస్ కాన్ లైంగిక ఆరోపణలతో పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడా పదవి కోసం పశ్చిమ దేశాలూ, ఎమర్జింగ్ దేశాలూ పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా బ్రిక్స్ (BRICS) గ్రూపుకి చెందిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ అఫ్రికా దేశాలు ఈసారి ఎమర్జింగ్ దేశాలకు చెందినవారిని ఐ.ఎంఎఫ్ పదవికి నియమించాలని కోరుతున్నాయి. కానీ యూరప్ అప్పు సంక్షోభంలో మరిన్ని దేశాలు జారిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్నందున, సంక్షోభాన్ని సమర్ధవంతంగా…

టెర్రరిస్టు అజ్మల్ కసబ్‌ను 1 1/2 సం.లు భద్రంగా ఉంచడానికి ఐన ఖర్చు రు.11 కోట్లు

ముంబై టెర్రరిస్టు దాడుల్లో పాల్గొని దొరికిపోయిన అజ్మల్ కసబ్ భద్రత కోసం ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు 10.87 కోట్ల రూపాయలని తేలింది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐ.టి.బి.పి) విభాగం అజ్మల్ కసబ్ కి సెక్యూరిటీ అందిస్తున్నందుకు ఇప్పటివరకూ ఖర్చయిన రు. 10.87 కోట్లను తమకు తిరిగి చెల్లించాలని బిల్లు పంపడంతో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం షాక్‌కి గురైంది. ఐటిబిపి డైరెక్టర్ జనరల్ ఆర్.కె.భాటియా ఈ బిల్లును పంపాడు. మార్చి 28, 2009 నుండి సెప్టెంబరు…

పాకిస్ధాన్ నావల్ బేస్‌పై పాక్ తాలిబాన్ దాడి దృశ్యాలు -ఫోటోలు

సోమవారం పాకిస్ధాన్ తాలిబాన్‌కి చెందిన 6 గురు మిలిటెంట్లు కరాచిలోని “పి.ఎన్.ఎస్ మెహ్రాన్” అనే పేరుగల నావల్ అండ్ ఎయిర్ బేస్ పై ఆకస్మిక దాడి చేశారు. ఈ బేస్ లోనే పాకిస్ధాన్ తన అణ్వస్త్రాలను భద్రం చేసిందని భావిస్తున్నారు. దాదాపు 16 గంటలపాటు ఆరుగురు మిలిటెంట్ల వందలమంది పాక్ సైనికుల్ని నిలువరించారు. జలాంతర్గాముల్ని నాశనం చేయగల రెండు యుద్ధ విమానాల్ని (అమెరికా తయారీ) వాళ్ళూ ధ్వంసం చేశారు. 12 మంది సైనికుల్ని చంపేశారు. ఆరుగురిలో నలుగురు…

పాకిస్ధాన్ మిలట్రీని పరిహసిస్తూ తిట్టిపోస్తున్న పాక్ మీడియా

వరుసగా ఎదురవుతున్న అవమానాలతో పాక్ మిలట్రీ అందరినుండీ దూషణలను, తిరస్కారాలనూ ఎదుర్కొంటోంది. అమెరికా కమెండోలు పాక్ లోకి జొరబడి లాడెన్ హత్య చేయనున్న విషయం తమకు తెలియకుండా జరిగిందని చెప్పడం, సి.ఐ.ఏ గూఢచారులు వందల సంఖ్యలో పాక్‌లో ఉన్నట్లు వెల్లడి కావడం, ఇద్దరు పాక్ పౌరులను కాల్చి చంపినా సి.ఐ.ఏ గూఢచారి రేమండ్ డేవిస్ ను ఏ శిక్షా లేకుండా విడిచిపెట్టడం, అవసరమైతే ఇంకోసారైనా పాక్‌లో జొరబడ్డానికి వెనకాడం అని ఒబామా ప్రకటించినా అదేమని అడగకుండా నోర్మూసుకుని…

ఆడపిండం హత్యలు విద్యాధిక కుటుంబాలలోనే ఎక్కువ -సర్వే

ఆడపిల్లలను పిండ దశలోనే హత్య చేయడం నిరక్ష్యరాస్య కుటుంబాల కంటే విద్యాధిక కుటుంబాలలోనూ, ధనికుల కుటుంబాలలోనూ అధికంగా జరుగుతున్నాయని భారత దేశంలో జరిగిన ఓ సర్వేలో తేలింది. విద్యాధిక, ధనిక కుటుంబాలు మొదటి బిడ్డ ఆడపిల్ల పుట్టాక రెండవ బిడ్డ ఆడపిల్లే పుట్టబోతున్నదని తెలిస్తే అబార్షన్ చేయించుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది. ఇలా రెండో ఆడపిల్లలను పిండ దశలోనే చంపివేయడం విద్యాధికులు, ధనికుల కుటుంబాలలోనే అధికంగా ఉండడం కలవరపరిచే అంశమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంటర్…

అమెరికాలో ముంబై దాడులపై ట్రయల్స్ ప్రారంభం, ఐ.ఎస్.ఐ టెర్రరిస్టుల సంబంధాలను ధృవపరిచిన హేడ్లీ

ముంబై టెర్రరిస్టు దాడులపై అమెరికాలోని చికాగో కోర్టులో ట్రయల్స్ కోర్టులో సోమవారం విచారణ ప్రారంభమయ్యింది. రాణాపై ప్రారంభమైన విచారణలో అతను నిర్ధోషీ అనీ కేవలం హేడ్లీతో బాల్య స్నేహితుడిగా ఉండడమే అతని దోషమని రాణా లాయరు వాదించాడు. బాల్య స్నేహితుడిగా నమ్మి తన కంపెనీలో చేర్చుకున్నందుకు హేడ్లీ రాణాను మోసం చేశాడనీ ఆయన వాదించాడు. అయితే మంగళవారం హేడ్లీ కోర్టులో సాక్ష్యం ఇచ్చాడు. ఐ.ఎస్.ఐ తో లష్కర్-ఎ-తొయిబా సంస్ధకు సంబంధాలున్నాయని తన సాక్ష్యంలో ధృవ పరిచాడు. ఐ.ఎస్.ఐ…

యూరోజోన్ సంక్షొభం భయాలతో కుప్పకూలిన భారత షేర్‌మార్కెట్లు

యూరప్ అప్పు సంక్షోభం భయాలు విస్తరించడంతో ప్రపంచ వ్యాపితంగా సోమవారం నాడు షేర్ మార్కెట్లు వణికిపోతున్నాయి. భారత షేర్ మార్కెట్లు దాదాపు రెండు శాతం నష్టపోయాయి. గ్రీసు అప్పు రేటింగ్‌ను ఫిచ్ రేటింగ్ సంస్ధ బాగా తగ్గించడం, ఇటలీ అప్పు రేటింగ్‌ను ఎస్ & పి రేటీంగ్ సంస్ధ నెగిటివ్ కి తగ్గించడంతో షేర్ మార్కెట్లలో అమ్మకాల వత్తిడి పెరిగింది. రేటింగ్ సంస్ధల చర్యలతో యూరో విలువ తగ్గింది. ఇప్పటికే గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ దేశాలు అప్పు…