ప్రయాణీకుల జెట్ విమానంపై పొరపాటున కాల్పులు జరిపిన దక్షిణ కొరియా సైన్యం

దేశాల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం ఎటువంటి ప్రమాదాలకు దారితీస్తుందో తెలియ జెప్పే సంఘటన ఇది. 119 మంది ప్రయాణికులు ఉన్న జెట్ విమానం ఉత్తర కొరియా ప్రయోగించిన యుద్ధ విమానంగా భావించి దక్షిణ కొరియా సైన్యం దానిపైకి కాల్పులు జరిపించి. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఆ రెండూ 1950ల్లో విడిపోయినప్పటినుండీ ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా దక్షిణ కొరియాలో సైనిక స్దావరాన్ని ఏర్పాటు చేసుకుని తద్వారా ఇరు పక్షాల…

న్యాయ సలహాలను పెడచెవిన పెట్టి లిబియా యుద్ధానికి దిగిన ఒబామా

తనను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైన్యాన్ని వెనక్కి రప్పిస్తానని వాగ్దానం చేసి అధికారానికి వచ్చిన ఒబామా ఆఫ్ఘనిస్ధాన్‌కి మరింతమంది సైనికుల్ని పంపడమే కాకుండా, కొత్తగా లిబియా యుద్ధానికి గూడా తెగబడ్దాడు. ఈ రెండు చర్యలతో ఒబామా అమెరికా ప్రజల్ని ఘోరంగా మోసం చేశాడు. అయితే ఆయన ప్రజల్ని మోసం చేయడమే కాకుండా అమెరికా చట్టాల్ని కూడా ఉల్లంఘించి లిబియాపై యుద్ధం కొనసాగిస్తున్నాడని అమెరికా కాంగ్రెస్ సభ్యులు అనేకులు, ప్రతినిధుల సభలోని రిపబ్లికన్ పార్టీ నాయకుడు…

టెర్రరిస్టు తాలిబాన్‌తో అమెరికా చర్చలు!!!

“టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం” (Global war on terrorism) ప్రకటించింది అమెరికా దేశమే. టెర్రరిజం వలన అమెరికా జాతీయ భద్రతకూ, అమెరికా ప్రజలకు ప్రమాదం ఏర్పడిందని, దరిమిలా టెర్రరిజం ప్రపంచం మొత్తానికీ ప్రమాదకరమనీ అమెరికా ప్రభుత్వం. ప్రపంచ దేశాలన్నీ తనతో కలిసి టెర్రరిజంపై పోరాటం చేయవలసిందేనని పరోక్షంగా శాసించింది. నీవెటువైపు? అని ప్రశ్నిస్తూ, నాతో లేకుంటే టెర్రరిజం వైపు ఉన్నట్లే అని హుంకరించింది అమెరికా అధ్యక్షుడే. అమెరికా హుంకరింపులతో ఇండియా లాంటి దేశాలు కూడా “నేను సైతం”…

కుక్కకు మరణ శిక్ష విధించిన ఇజ్రాయెల్ కోర్టు

‘పిచ్చి ముదిరింది అంటే రోకిలి తలకు చుట్టండీ’ అన్నాట్ట వెనకకటికెవడో. ఇజ్రాయెల్ రబ్బినికల్ కోర్టు తీరు కూడా అలానే ఉంది. కోర్టు వసారాలో తిరుగుతున్న కుక్క చనిపోయిన ఒక లాయర్ ఆత్మని ధరించిందని భావిస్తూ దానిని కొట్టి చంపమని సదరు కోర్టు అజ్ఞాపించింది. ఆ లాయర్ బ్రతికి ఉండగా ఆ కోర్టులోని జడ్జిలను అవమానిస్తూ మాట్లాడట. అలా అవమానిస్తూ మాట్లాడిన వ్యక్తి చనిపోయాక అతని ఆత్మ వీధి కుక్క రూపంలో తిరుగుతున్నట్లు జడ్జిలు భావించి దాన్ని రాళ్ళతో…

మహిళలకు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో పాక్ మూడోది, ఇండియా నాలుగోది

ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలు ఏవి? రాయిటర్స్ వార్తా సంస్ధ అనుబంధంగా ఉండే ట్రస్ట్‌లా అనే సంస్ధ ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడానికి సర్వే చేసింది. ఇది అవినీతి వ్యతిరేక అంశాలు (anti-corruption issues), సమర్ధ పాలన (good governance), మహిళల హక్కుల (women rights) అంశాలపై ప్రపంచ స్ధాయిలో ఉచితంగా వార్తలు, సమాచారం, న్యాయ సలహాలు అందించే సంస్ధ. ధామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ దీన్ని నడుపుతోంది. మహిళలకు సంబంధించిన ఆరు అంశాలపై ఇది ప్రపంచ…

టీనేజి కుర్రాడిని కాల్చి చంపిన పాకిస్ధాన్ రేంజర్లు జైలుపాలు

దొంగతనం చేయబోతున్నాడన్న అనుమానంతో ఓ టీనేజి కుర్రాడిని పబ్లిక్ పార్కులో దగ్గరినుండి కాల్చి చంపిన పారామిలిటరీ రేంజర్లు ప్రస్తుతం జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. గత వారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోనుటీ.వి ఛానెళ్ళు ప్రసారం చేయడంతో పాకిస్ధాన్ అంతటా నిరసన పెల్లుబుకింది. దొంగతన చేయడానికి వచ్చాడంటు సివిల్ దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి టీనేజీ కుర్రాడిని జుట్టుపట్టి లాక్కొచ్చి పారామిలటరీ దళాలైన “పాకిస్ధాన్ రేంజర్లు” అతి సమీపం నుండి రెండు సార్లు తూటాలు పేల్చి…

ఎం.పిలకు శుభవార్త: ఎం.పి లాడ్స్ నిధుల వినియోగంపై నిబంధనలు సడలించిన ప్రభుత్వం

భారత పార్లమెంటు సభ్యులకు ఓ శుభవార్త. తమ తమ నియోజకవర్గ ప్రాంతంలో అభివృద్ధి పనుల నిమిత్తం ఎం.పిలకు కేటాయించే నిధుల వినియోగంపై ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎం.పి. లాడ్స్ గా పిలిచే ఈ నిధులను ఖర్చు చేయడంలో ఇప్పటివరకు ఒకింత కఠినమైన నిబంధనలు ఉన్నాయి. దానితో చాలా మంది ఎం.పిలు వారికి కేటాయించిన నిధులను ప్రజలకోసం ఖర్చు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆ నిధులన్ని గణనీయ మొత్తంలొ…

అసభ్య ఫోటోలు పంపి, బొంకి, కన్నంలో వేలుతో దొరికి, రాజీనామా చేసిన అమెరికా కాంగ్రెస్‌మేన్

ఈ మధ్య కాలంలో పశ్చిమ దేశాల రాజకీయవేత్తలు, ఆర్ధికవేత్తలు, ఇంకా ఇతర వేత్తలు లైంగికపరంగా అసభ్య చేస్టలతో దొరికిపోయి రాజీనామాలు చేయవలసి రావడం ఎక్కువైంది. ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిగ్ స్ట్రాస్ కాన్ హోటల్ ఉద్యోగినిపై అత్యాచారం జరపబోయి దొరికిపోయాడు. ఇప్పుడాయన కోర్టుకు హాజరవుతూ చేతులకు బేడీలు వేయొద్దని బతిమాలుకుంటున్నాడు. అక్రమ సంబంధం బైటపడడంతో రిపబ్లికన్ పార్టీకి చెందిన నెవాడా సెనేటర్ జాన్ ఎన్‌సైన్, సెనేటర్ గా రాజీనమా చేశాడు. రిపబ్లికన్ పార్టీకే చెందిన న్యూయార్క్ కాంగ్రెస్…

ప్రభుత్వ వైఖరితో విసుగు చెందిన అన్నా హజారే, మరోసారి ఆమరణ నిరాహార దీక్ష

కేంద్ర ప్రభుత్వ వైఖరితో అన్నా హజారే విసుగు చెందాడు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విశ్వసించి ఏప్రిల్ లో ఆమరణ నిరాహార దీక్షను విరమించిన అన్నా హజారే, మరునాటి నుండే పౌర సమాజ కార్యకర్తలపై కేంద్ర మంత్రులు వివిధ ఆరోపణలతో దాడి ప్రారంభించడంతో ఖిన్నుడయ్యాడు. శాంతి భూషణ్, ఆయన కొడుకు ప్రశాంత్ భూషన్ ఇరువురూ కమిటీలో ఉండడం పట్ల మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రులు తర్వాత శాంతి భూషణ్ పై అవినీతి ఆరోపణను ఎక్కడో పాతాళం నుండి…

ఆర్ధిక వృద్ధికి నష్టమైనా, వడ్డీ రేట్ల పెంపుకే మొగ్గు చూపిన ఆర్.బి.ఐ

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో సారి వడ్డీ రేట్లను పెంచింది. జూన్ 16న చేపట్టిన ద్రవ్య పరపతి విధానం సమీక్షలో ఆర్.బి.ఐ రెపో రేటు (వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే అప్పులపై వసూలు చేసే వడ్డీ రేటు) 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రివర్స్ రెపో రేటు (వాణిజ్య బ్యాంకులు ఆర్.బి.ఐ వద్ద డిపాజిట్ చేసిన డబ్బుపై ఇచ్చే వడ్డీ రేటు) కూడా 0.25 శాతం పెంచింది. వడ్డీ రేట్ల పెంపుదల…

లాడెన్ హత్య – సి.ఐ.ఏ ఇన్ఫార్మర్లను అరెస్టు చేసిన పాకిస్ధాన్ ప్రభుత్వం

లాడెన్ హత్యతో సంబంధం ఉందని భావిస్తున్న ఐదుగురు పాకిస్దానీ ఇన్ఫార్మర్లను పాకిస్ధాన్ ఇంటలిజెన్స్ సంస్ధ ఐ.ఎస్.ఐ అరెస్టు చేసింది. ఒసామా బిన్ లాడెన్ హత్య వీరిచ్చిన సమాచారం వల్లనే జరిగిందని భావిస్తున్నారు. వీరు సి.ఐ.ఏ నియమించిన గూఢచారులుగా పని చేస్తూ అబ్బోత్తాబాద్ భవనానికి జరిగే రాకపోకలపై నిఘా ఉంచి ఆ సమాచారాన్ని సి.ఐ.ఏకి చేరవేసినట్లుగా అనుమానిస్తున్నారు. లాడెన్ రక్షణ తీసుకున్న ఇంటికి దగ్గర్లోనే సి.ఐ.ఏ ఒక సేఫ్ హౌస్ ఏర్పాటు చేసుకుంది. ఆ ఇంటి ఓనర్ అరెస్టు…

ఏకంగా సి.ఐ.ఏ వెబ్‌సైట్ నే మూసేసిన ‘లుల్జ్ సెక్యూరిటీ’ హ్యాకర్లు

సి.ఐ.ఏ. కుట్ర, కుతంత్రాల పుట్ట. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో ఎన్నో ప్రజాస్వామిక ప్రభుత్వాలను కూల్చిన దగుల్బాజీ సంస్ధ. ఎందరో నియంతలను కంటికి రెప్పలా కాపాడిన ధూర్త సంస్ధ. ఎందరో మానవ హక్కుల కార్యకర్తలను, ప్రజాపోరాటాల నాయకులను దుర్మార్గంగా హత్య చేసిన హంతక సంస్ధ. శాంతి విలసిల్లుతున్న దేశాల్లో విభేధాల కుంపట్లు రగిలించి జాతి హత్యాకాండలను ప్రోత్సహించిన జాత్యహంకార సంస్ధ. దాదాపు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలోనూ ఏజెంట్లను ఏర్పరుచుకుని అమెరికా అనుకూల-ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు…

బిన్ లాడెన్ వారసుడు, ఆల్-ఖైదా నాయకుడుగా డా. ఐమన్ అల్-జవహిరి నియామకం

ఒసమా బిన్ లాడెన్ హత్య జరిగిన ఆరు వారాల అనంతరం ఆయన వారసుడిని ఆల్-ఖైదా నియమించుకుంది. లాడెన్‌కి కుడిభుజంగా పేరుపొందిన ఐమన్ ఆల్-జవహిరి అందరూ భావించినట్లుగానే ఆల్-ఖైదా సుప్రీం నాయకుడుగా నియమితుడయ్యాడు. ఆల్-ఖైదా జనరల్ కమాండ్ ఈ నియామకం జరిపినట్లుగా ఆల్-ఖైదా మీడియా విభాగం ఒక మిలిటెంట్ల వెబ్ సైట్ లో ప్రకటించింది. “షేక్ డా. ఐమన్ ఆల్-జవహిరి, భగవంతుడు ఆయనను నడిపించుగాక, ఆల్-ఖైదా అమిర్ (నాయకుడు) గా భాధ్యతలు స్వీకరించాడు” అని ఆ ప్రకటన పేర్కొంది.…

ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తి ఫిలిప్పైన్ దేశీయుడు -ఫొటోలు

శనివారం వరకు ప్రపంచంలో అత్యంత తక్కువ ఎత్తు గల వ్యక్తి నేపాల్ దేశీయుడైన ఖగేంద్ర ధాపర్ మగర్ (26.3 అంగుళాలు) భావిస్తూ వచ్చాం. తాజాగా ఫిలిప్పైన్ దేశీయుడైన “జున్రే బలావింగ్” అతని రికార్డును బద్దలు చేసి గిన్నిస్ బుక్‌లో స్ధానం సంపాదించాడు. గత ఆదివారంతో 18 సంవత్సరాలు నిండిన జున్రే ఎత్తు 59.93 సెంటీ మీటర్లు (23.36 అంగుళాలు) గా నమోదయ్యింది. జున్రే ఇప్పుడు బ్రతికి ఉన్నవారిలో మాత్రమే పొట్టివాడు. 1997లో చనిపోయిన భారతీయుడు గుల్ మహమ్మద్…

టర్కీ ప్రధాని ‘ఎర్డోగాన్’ ద్విపాత్రాభినయం

టర్కీ ప్రధాని రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మూడో సారి ప్రధానిగా ఎన్నికయ్యాడు. ఈయన 2003 నుండి ప్రధానిగా అధికారంలో ఉన్నాడు. మూడోసారి కొంత మెజారిటీ తగ్గినా ప్రభుత్వం ఏర్పరచడానికి తగిన మెజారిటీ సంపాదించగలిగాడు. రెండో సారి అధికారానికి వచ్చినప్పటినుండి ఈయన పాలస్తీనా స్వతంత్రానికి మద్దతు తెలుపుతూ, ఇజ్రాయెల్ కి కోపం వచ్చే మాటలు మాట్లాడుతూ పశ్చిమాసియాలో ముస్లింల ప్రయోజనాలు కాపాడే ఛాంపియన్ గా టర్కీని నిలపడానికి బాగా ప్రయత్నిస్తూ వచ్చాడు. పశ్చిమాసియాలో ప్రాంతీయంగా ఇరాన్ తో పోటీపడి…