పునరాగమనంలో ఎమోషనల్ ఐపోయిన టెన్నిస్ రాణి సెరెనా విలియమ్స్ -ఫోటోలు

పశ్చిమ దేశాల ఆధిపత్యంలో ఉండే ఫ్రొఫెషనల్ లాన్ టెన్నిస్ రంగంలోకి సెరెనా, వీనస్ సోదరీమణుల రాక ఓ సంచలనం. గ్రౌండ్‌లో అడుగు పెట్టిన ప్రతిసారీ సింహనాదాలతో చెలరేగే చిన్న విలియమ్స్ సెరెనా, ఈ సారి మొదటి రౌండ్ గెలవడంతోటే ఆనందంతో కన్నీటి పర్యంతం అయ్యింది. 13 గ్రాండ్ స్లామ్ టైటిళ్ళను సొంతం చేసుకున్న 29 ఏళ్ళ సెరెనా, ఈ ఏడు వింబుల్డన్ టెన్నిస్ లోకి డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగు పెట్టకముందు 49 వారాల పాటు టెన్నిస్‌కి దూరంగా…

సింగూరు భూమి పునః స్వాధీనంపై కోర్టుకెళ్తాం -టాటా మోటార్స్

లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ సుదీర్ఘ పాలనకు చరమగీతం పాడి అధికారంలోకి వచ్చిన త్రిణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల కూటమి సింగూరు భూమిని తిరిగి రైతులకు ఇచ్చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసింది. చెప్పినట్లుగానే సింగూరులో రైతులనుండి బలవంతంగా సేకరించిన భూమిని తిరిగి రైతులకు స్వాధీనం చేయడానికి వీలుగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి చట్టం కూడా ఆమోదించింది. అయితే లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ద్వారా సింగూరు భూమిని వశం చేసుకున్న టాటా మోటార్స్ సంస్ధ…

అమెరికా, గ్రీసు దేశాలు సమయానికి అప్పు చెల్లించలేక పోవచ్చు -ఫిచ్ రేటింగ్స్

అమెరికా, గ్రీసు దేశాల అప్పు చెల్లింపుల సామర్ధ్యం పైన ఫిచ్ రేటింగ్స్ సంస్ధ మరొకసారి ఆందోళన వ్యక్తం చేసింది. ఆగస్టు నెలలో రెండు దేశాలు తాము జారీ చేసిన సావరిన్ అప్పు బాండ్లపై వడ్డీ చెల్లింపులతో పాటు కొన్నింటికి మెచ్యూరిటీ చెల్లింపులు చేయవలసి ఉంది. అమెరికా అప్పుపై ఉన్న గరిష్ట పరిమితికి ఇప్పటికే చేరుకున్నందునా, గ్రీసు మరో విడత పొదుపు బడ్జెట్‌ను ప్రజల తీవ్ర వ్యతిరేకత వలన ఆమోదించలేక పోతున్నందున ఐ.ఎం.ఎఫ్, ఇ.యులు ఆ దేశానికి ఇవ్వవలసిన…

ఆరోజుతో నాజీవితం ముగిసినట్టే -కొడుకు తప్పుకు నగ్నంగా ఊరేగించబడ్డ పాక్ స్త్రీ వ్యధాభరిత కధనం

జూన్ నెలారంభంలో పాకిస్ధాన్‌లోని ఖైబర్ ఫక్తూన్ ఖ్వా రాష్ట్రంలోని నీలోర్ బాలా గ్రామంలో ఓ మధ్య వయసు స్త్రీని అతని కొడుకు చేసిన తప్పుకు బలవంతంగా వివస్త్రను కావించి ఊరేగించారు. ఈ ఘటన పాకిస్ధాన్‌లో సంచలనం కలిగించింది. ఆ రోజు ఏం జరిగిందీ తెలుసుకోవడానికి బిబిసి విలేఖరి అలీమ్ మక్బూల్ పాకిస్ధాన్‌ ఉత్తర ప్రాంతానికి వెళ్ళాడు. ఘటన జరిగిన నాటినుండి తన గ్రామంలో నివసించడానికి ఇష్టపడని ఆమె నివసిస్తున్న ప్రాంతాన్ని మక్బూల్ కనుగొని ఆమె ద్వారా ఆ…

నాటో “డ్రోన్ హెలికాప్టర్” ను కూల్చివేసిన లిబియా సైన్యం

మానవ రహిత “డ్రోన్ హెలికాప్టర్” ను నాటో దళాలు కోల్పోయాయని నాటో తెలియజేసింది. లిబియాపై సాగిస్తున్న మిలట్రీ క్యాంపెయిన్‌లో లిబియా గగనతలం నుండి గూఢచర్యం నిర్వహిస్తున్న మానవ రహిత “డ్రోన్ హెలికాప్టర్,” నేపుల్స్ (ఇటలీ) లొ ఉన్న కమాండ్ సెంటర్ తో కాంటాక్టు కోల్పోయిందని నాటోకి చెందిన వింగ్ కమాండర్ మైక్ బ్రాకెన్ చెప్పాడని బిబిసి తెలిపింది. మౌమ్మర్ గడ్డాఫీకి చెందిన బలగాలు లిబియా పౌరులను భయోత్పాతాలకు గురిచేస్తూ, వారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారిందీ లేనిదీ గగనతలం…

దసరా బుల్లోడు “క్రిస్ గేల్” -ఫోటోలు

ఇండియా, వెస్ట్ ఇండీస్ దేశాల మధ్య జరిగిన వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌తో పాటు టెస్ట్ సిరీస్‌కి కూడా స్టార్ బ్యాట్స్ మేన్ క్రిస్ గేల్ ను సెలెక్ట్ చేయడానికి సెలెక్టర్లు ఇష్టపడలేదు. అయినప్పటికీ తన జట్టు సభ్యులను ప్రోత్సహించడానికి గ్యాలరీలో ప్రత్యక్షమయ్యాడు క్రిస్ గేల్. అది కూడా కలర్ ఫుల్ డ్రస్సులో దసరా బుల్లోడిలా…

నాటో బాంబు దాడుల్లో మరో 15 మంది లిబియా పౌరుల మరణం

ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో చేసినట్లుగానే నాటో ఆధ్వర్యంలోని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు లిబియా పౌరుల హత్యాకాండను కొనసాగిస్తున్నాయి. ఆదివారం బాంబుదాడిలో ఐదుగురు పౌరులని చంపేసి ‘సారీ’ చెప్పిన నాటో సోమవారం తెల్లవారు ఝాము దాడిలో మరో 15 మంది పౌరుల్ని రాకెట్లు పేల్చి చంపేసింది. “సోమవారం, జూన్ 20 తెల్లవారు ఝామున నాటో యుద్ధ విమానాలు సొర్మాన్ లో గడ్డాఫీ ప్రభుత్వానికి చెందిన ఓ కీలకమైన కమాండ్ అండ్ కంట్రొల్ సెంటర్ పై సరిగ్గా గురి చూసి…

డాట్ కామ్, డాట్ ఓఅర్‌జి ల ఆధిపత్యానికి ఇక చెల్లు చీటీ, డొమెయిన్ నేమ్ ఏదైనా ఓకే

ఇంటర్నెట్ లో డొమెయిన్ నేమ్‌ల పూర్వ పదాలుగా ఇప్పుడు పరిమితంగానే ఉన్నాయి. డాట్ కామ్, డాట్ ఒఆర్‌జి, డాట్ ఇన్ఫో (.com, .org, .info etc…) తదితరాలతో పాటు ఆయా దేశాలను సూచించే పదాలు మాత్రమే డొమెయిన్ నేమ్ లో చివరి పదాలుగా ఉండాలన్న నిబంధన ఉంది. అవి తప్ప ఇతర పదాలను రిజిష్టర్ చేసుకునే సౌకర్యం ఇంతవరకూ లేదు. అయితే 2012 సంవత్సరం నుండీ ఈ పరిమితికి స్వస్తి పలకడానికి అంతర్జాతీయ ఇంటర్జెట్ నియంత్రణా సంస్ధ…

మారిషస్, ఐ.టి రేటింగ్ లతో నాలుగు నెలల కనిష్ట స్ధాయికి చేరిన ఇండియా షేర్ మార్కెట్లు

సోమవారం ఇండియా షేర్ మార్కెట్లు రెండు శాతం పైగా పతనమైనాయి. మారిషస్‌తొ పన్నుల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం సమీక్షనున్నదన్న భయాలు, ఇండియా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగం రేటింగ్‌ని తగ్గించడం షేర్ల పతనానికి కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా మారిందని కూడా వీరు భావిస్తున్నారు. సోమవారం పతనంతో భారత్ షేర్ మార్కెట్లు కొన్నాళ్ళపాటు కోలుకోవడం కష్టమనీ, సెంటిమెంట్ బలహీనపడ్డం వలన మరింత పతనం చవిచూడనున్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తుండగా, మరికొందరు సోమవారం నాటి భారీ పతనాన్ని…

మెరుగైన సేవలు కావాలంటే ప్రైవేటు కంపెనీలకి పట్టణ ప్రజలు మరింత చెల్లించుకోవాల్సిందే -కేంద్ర మంత్రి

భారత దేశ ప్రజలకు ఇప్పటివరకూ అన్నీ ఉచితంగా వాడుకోవడం అలవాటయ్యిందనీ, కానీ రోడ్లు, నీరు, విద్యుత్ లాంటి సేవలు మెరుగుపడాలంటే మరింతగా చెల్లించడానికి సిద్ధమైతే తప్ప సాధ్యం కాదనీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కమల్ నాధ్ తెగేసి చెబుతున్నాడు. రాయిటర్స్ వార్తా సంస్ధకి నాలుగు రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పట్టణాల్లొ సేవలను మెరుగుపరచడం కోసం ఇప్పటివరకూ ప్రభుత్వం ఒక్కటే బాధ్యత తీసుకున్నదనీ, ఇకనుండి ప్రైవేటు కంపెనీలకు పట్టణాల్లో మౌలిక సౌకర్యాల నిర్మాణానికి భాగస్వామ్యం…

ఈ యువతి చేతిని పట్టగలవాడెవ్వడు? పట్టాడా!…

ఈ యువతి చేతిని పట్టగలవాడెవ్వడు? పట్టాడా!…. ఈ యువతి చేతిని పట్టగలవాడెవ్వడు? పట్టాడా! దక్కినట్టే మరి, సిరి. [ఆలస్యమెందుకిక? పై లింక్‌ని క్లిక్ చేసి చూడడండి] – –

లిబియాపై నాటో బాంబు దాడిలో ఓ కుటుంబంతో సహా ఐదుగురు పౌరుల మరణం

గడ్డాఫీ బలగాల కాల్పులనుండి లిబియా పౌరులను రక్షించండంటూ భద్రతా సమితి నాటో దళాలకు అనుమతినిచ్చింది. పౌరులను కాపాడ్డానికి “అన్ని చర్యలూ తీసుకోండి” అని తమకు అనుమతి దొరికిందే తడవుగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల యుద్ధ విమానాలు లిబియా అంతటా బాంబుదాడులు మొదలు పెట్టాయి. వీరి దాడుల్లో లిబియా అంతటా పట్టణాలు, గ్రామాలు స్మశానాల్లా మారిపోయాయి. గడ్డాఫీ ఇంటిపై దాడి చేసి అతని మనవళ్ళను ముగ్గురినీ, చివరి కొడుకునీ చంపిన నాటో బలగాలు తాజాగా ట్రిపోలిలోని సౌక్ ఆల్-జుమా…

అమెరికా చర్చలు జరపనున్న తాలిబాన్ ఇక టెర్రరిస్టు సంస్ధ కాదట!?

తాలిబాన్‌తో పోరాటంలో డస్సిపోయిన అమెరికా తాలిబాన్‌తో చర్చలకు సిద్ధమై అందుకు తగిన ఏర్పాట్లను చేసుకుంటున్నది. మంచి తాలిబాన్‌తో చర్చలు జరుపుతామంటూ మూడు, నాలుగేళ్ళనుండే ప్రకటనలు చేస్తూ వచ్చిన అమెరికా అధికారులు అందుకోసం ఒక్కో అడుగూ వేస్తున్నారు. ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు, అమెరికా కీలుబొమ్మ హమీద్ కర్జాయ్ చేత “తాలిబాన్ తో అమెరికా చర్చలు జరుపుతున్నదంటూ రెండు రోజుల క్రితం ప్రకటన ఇప్పించింది. సంబంధాలు మెరుగుపరుచుకునే దిశలో తాలిబాన్‌ను ప్రోత్సహించడానికని చెబుతూ ఇప్పుడు ఆంక్షలు, నిషేధాలు విధించడానికి ఐక్యరాజ్యసమితి తాలిబాన్,…

వేశ్యల మానవ హక్కుల ఉల్లంఘనలను నిరసిస్తూ పెదవులు కలిపి కుట్టుకున్న మహిళ -ఫోటో

జూన్ 15 న బొలీవియాలో చోటు చేసుకున్న దృశ్యం ఇది. తమ మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నందుకు నిరసనగా అక్కడి వేశ్యలు, మహిళా వెయిటర్లు, వేశ్యా గృహాల ఓనర్లూ ఈ విధంగా పెదవులు కలిపి కుట్టుకుని నిరసనకు పాల్పడ్డారు. రాయిటర్స్ వార్తా సంస్ధ ఈ ఫోటోను ప్రచురించింది. బోలీవియాలోని “లా పాజ్” నగరంలో ఈ నిరసనలో పాల్గొన్న మహిళ ఈమె వేశ్యా వృత్తిలో ఉన్నట్లుగా స్ధానిక పోలీసులు తెలిపారని రాయిటర్స్ తెలిపింది.