పోర్నోగ్రఫీ ధుష్ప్రభావం: ఐదేళ్ళ పాప హత్య కేసులో పదేళ్ళ బాబు అరెస్టు

అభం శుభం తెలియని పసి పిల్లలపై పోర్నోగ్రఫీ ఎంత దుష్ప్రభావం పడేస్తుందో ఈ సంఘటన తెలుపుతుంది. ఐదేళ్ళ బాలిక చెరువులో పడి మృతి చెందిన కేసులో పదేళ్ళ బాలుడిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో నెడుంగండం గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుందని “ది హిందూ” పత్రిక తెలిపింది. బాలిక శవం నెడుంగండం లోని ఎస్టేట్ ఏరియా వద్దనున్న చెరువులో లభించిందని పత్రిక తెలిపింది. బాలుడు చేసిన రేప్…

జులై 9న వెలసిన కొత్త దేశం, 196వ దేశంగా దక్షిణ సూడాన్

ప్రపంచ పటంలోకి మరొక కొత్త దేశం వచ్చి చేరింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన రిఫరెండంలో దక్షిణ సూడాన్ ప్రజలు 90 శాతానికి పైగా కొత్త దేశాన్ని కోరుకున్నారు. ప్రజల నిర్ణయాన్ని అమలు పరుస్తూ జులై 9, శనివారం తెల్లవారు ఝాము ప్రారంభ క్షణాల్లో దక్షిణ సూడాన్ ను ఏర్పాటు చేస్తూ ప్రకటన జారీ అయింది. ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు బాన్ కి మూన్, ఐక్య సూడాన్ అధ్యక్షుడు ఆల్-బషర్, 30 ఆఫ్రికా దేశాల ప్రతినిధుల సమక్షంలో…

సుదీర్ఘ లక్ష్య క్షిపణులను మొదటిసారి హిందూ మహాసముద్రంలోకి పేల్చి పరీక్షించిన ఇరాన్

ఈ సంవత్సరం ప్రారంభంలో తన సుదీర్ఘ లక్ష్య క్షిపణులను మొట్టమొదటిసారిగా హిందూ మహాసముద్రంలోకి పేల్చడం ద్వారా పరీక్షించినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం, ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌లొ ఈ ప్రకటన వెలువడింది. రెండు లాంగ్-రేంజ్ మిసైళ్ళను పరీక్షించినట్లు ఇరాన్ వెల్లడించింది. “బహమాన్ నెలలో (జనవరి 21 నుండి ఫిబ్రవరి 19 వరకు) 1900 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఉత్తర ఇరాన్ లో గల సెమ్‌నాన్ రాష్ట్రం నుండి హిందు మహాసముద్రం ముఖద్వారం వద్దకు…

3 సం.ల అత్యధిక స్ధాయిలో చైనా ద్రవ్యోల్బణం, చైనా ఆర్ధిక వృద్ధిపై భయాలు

జూన్ నెలలో చైనా ద్రవ్యోల్బణం గత మూడు సంవత్సరాల అత్యధిక స్ధాయికి చేరింది. ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి వీలుగా చైనా ఆర్ధిక వ్యవస్ధలో ద్రవ్య చలామణిని తగ్గించడానికి సెంట్రల్ బ్యాంకు వడ్దీ రేట్లను మరింత పెంచే అవకాశాలు పెరగడంతో, వడ్డీ రేట్ల పెంపుదల వలన చైనా ఆర్ధిక వృద్ధి రేటు పడిపోయే ప్రమాదం ఉందని ప్రపంచ పెట్టుబడుదారులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటును ముందుకు తీసుకెళ్ళడంలో చైనా ఆర్ధిక వ్యవస్ధ…

నాటో దాడుల నుండి రక్షణ కోసం నడుం బిగించిన లిబియా మహిళలు -వీడియో

అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు లిబియాపై దాడులకు సిద్ధమవుతున్న ప్రారంభ కాలంలో లిబియా అధిపతి గడ్దాఫీ లిబియాను రక్షించుకోవడం కోసం ప్రజలకు ఆయుధాలిస్తామని హెచ్చరించాడు. నాటో వైమానిక దాడులకు ముందు గడ్దాఫీ సుదీర్ఘపాలనతో విసిగి ఉన్న లిబియన్లు కూడా విదేశాల దాడులకు వ్యతిరేకంగా నిలబడిన గడ్దాఫీ వెనక అనివార్యంగా సమీకృతులయ్యారు. లిబియా ప్రజల రక్షణ కోసమే లిబియాపై బాంబింగ్ జరుపుతున్నామన నాటో దేశాల మోసపు మాటలలో నిజం ఎంత ఉందో లిబియన్లకు బాగానే తెలుసు. లిబియాలో ఇప్పుడు…

స్పెయిన్‌లో ఉద్యొగాల పరిస్ధితి -కార్టూన్

యూరప్ అప్పు సంక్షోభం యూరప్ దేశాలకు శాపంగా మారింది. ఖచ్చితంగా చెప్పాలంటే యూరప్ అప్పు సంక్షోభం యూరప్ ప్రజలకు శాపంగా మారింది. అప్పు కొండలా పేరుకు పోయి మార్కెట్ నుండి ట్రెజరీ బాండుల ద్వారా తేలికగా అప్పు సేకరించలేని పరిస్ధితిని అప్పు సంక్షోభంగా పిలుస్తున్నారు. ఇప్పటివరకూ గ్రీసు, ఐర్లండ్, పోర్చుగల్ దేశాల ప్రజలు దీని బారిన పడి నిరుద్యోగం, ఉద్యోగాల కోత, పెన్షన్ల కోత, సంక్షేమ సదుపాయాల రద్దు లాంటి అనేక సమస్యలతో అల్లాడుతున్నారు. స్పెయిన్ కార్టూనిస్టు…

రిలయన్స్ కంపెనీకి నేను మేలు చేయలేదు -కపిల్ సిబాల్ తొండాట

తనపై సుప్రీం కోర్టులో ఒక ఎన్.జి.ఒ సంస్ధ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసిన మరుసటి రోజు కేంద్ర టెలికం మంత్రి కపిల్ సిబాల్ స్పందించాడు. పత్రికా సమావేశం నిర్వహించి ఇచ్చిన వివరణలో కపిల్ సిబాల్ “ఆకుకూ అందక, పోకకూ పొందక” అన్నట్లు సమాధానాలిచ్చి తొండాట ఆడటానికి ప్రయత్నించాడు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ వినియోగదారులకు చెప్పకుండా నిర్ధిష్ట సేవలను ఆపేసినందుకుగాను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అధికారులు ఆ కంపెనీపై సర్కిల్ కి రు.50 కోట్ల చొప్పున మొత్తం…

జులై 1 కి భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 315.715 బిలియన్లు

భారత దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు జూన్ 24 తో ముగిసిన వారంతో పోలిస్తే జులై 1 తో ముగిసిన వారంలో 2.17 శాతం పెరిగాయి. జూన్ 24 అన్ని రకాల విదేశీ మారక ద్రవ్య నిల్వలు మొత్తం 309.020 బిలియన్ డాలర్లు ఉండగా అది జులై 1 కి 315.715 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత రిజర్వ్ బ్యాంకు శుక్రవారం విడుదల చేసిన వారం వారీ ప్రకటనలో తెలిపింది. డాలర్లలో లెక్కించిన విదేశీ మారక…

మార్కెట్ హెవీ వెయిట్ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ రేటింగ్ తగ్గింపు

భారత షేర్ మార్కెట్‌కు హెవీ వెయిట్ గా పేరుపొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్‌ను వాల్‌స్ట్రీట్ స్ట్రీట్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ తగ్గించేసింది. పెట్టుబడి ఎక్కువ చేసి చూపిందని ఆరోపణ ఎదుర్కొంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చుట్టూ ఇటీవల అనేక ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. గ్యాస్ నిక్షేపాలు అధికంగా ఉన్నాయని భావిస్తున్న కెజి బేసిన్ లో అనుకున్నంత స్ధాయిలో నిల్వలు లేవన్న అనుమానాలు తలెత్తాయి. సమీప భవిష్యత్తులో రిలయన్స్ ఇండస్ట్రీట్ కంపెనీకి అనుకూలంగా పనిచేసే పరిణామాలేవి సంభవించవని మోర్గాన్ స్టాన్లీ ఇన్‌వెస్ట్‌మెంట్…

భారత షేర్ల సూచి ‘సెన్సెక్స్’ టార్గెట్‌ అంచనా తగ్గించిన యు.బి.ఎస్ బ్యాంకు

ప్రవేటు వెల్త్ మేనేజ్‌మెంట్ వ్యాపారంలో ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకుగా ప్రసిద్ధి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (యుబిఎస్) భారత దేశానికి చెందిన బోంబే స్టాక్ ఎక్ఛేంజ్ (సెన్సెక్స్) సూచిపై గతంలో తాను అంచనా వేసిన లక్ష్యాన్ని బాగా తగ్గించింది. యు.బి.ఎస్ సెన్సెక్స్ సూచి 22,500 పాయింట్లకు చేరుకుంటుందని అంచనా వేయగా, ప్రస్తుతం దానిని 21,000 పాయింట్లకు తగ్గించింది. లాభాల సంపాదనలో ప్రతికూల ఒరవడిలో ఉన్నందున సెన్సెక్స్ లక్ష్యాన్ని తగ్గిస్తున్నట్లుగా అది తెలిపింది.…

పాక్ విలేఖరి హత్యలో పాక్ ప్రభుత్వ హస్తం -అమెరికా మిలట్రీ అధికారి ముల్లెన్

మే నెలాఖరులో జరిగిన పాకిస్ధాన్ విలేఖరి షహజాద్ హత్యలో పాకిస్ధాన్ ప్రభుత్వంలోని కొన్ని శక్తుల హస్తం ఉందని అమెరికా మిలట్రీ ఉన్నతాధికారి మైక్ ముల్లెన్ వెల్లడించాడు. అమెరికా మిలట్రీలో ఉన్నత స్ధాయి అధికారి ఒకరు ఈ విధంగా జర్నలిస్టు హత్య కేసు విషయంలో ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి. విలేఖరి హత్యలో ఐ.ఎస్.ఐ హస్తం ఉందని తాను చెప్పలేనని కూడా ఆయన అన్నాడు. విలేఖరి హత్యకు పాక్ ప్రభుత్వానికి సంబంధించిన నిర్ధిష్ట ఏజన్సీతో సంబధం ఉందనడానికి మద్దతుగా…

2జి కుంభకోణం: మంత్రివర్గంలో రాలిపడే తదుపరి తల కపిల్ సిబాల్?

2జి స్పెక్ట్రం కుంభకోణం ఫలితంగా కేంద్ర మంత్రివర్గం నుండి దొర్లిపడే తదుపరి తల విద్యా, టెలికం శాఖల మంత్రి కపిల్ సిబాల్‌ది కావచ్చనడానికి తగిన పరిణామాలు ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. మాజీ టెలికం మంత్రి, డి.ఎం.కె పార్టీ నాయకుడు ఎ.రాజా, సి.బి.ఐ దర్యాప్తు ఫలితంగా జైలు పాలు కావడంతో ఆయన స్ధానంలో కపిల్ సిబాల్ టెలికం శాఖ బాధ్యతలు చేపట్టాడు. ఆయన వచ్చీ రావడంతోనే 2జి స్పెక్ట్రం కేటాయింపుల్లో కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (సి.ఎ.జి) నివేదించినట్లు, కేంద్ర ప్రభుత్వం…

తెలంగాణ డిమాండ్‌పై అంతర్జాతీయ పెట్టుబడుల దృక్పధం ఎలా ఉంది?

తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తూ ఆ ప్రాంతంలో ఉద్యమాలు సాగుతున్నందున రాష్ట్రానికి రావలసిన పెట్టుబడులు వెనక్కి పోతున్నాయని గత సంవత్సరం నుండి ఆరోపణలు వస్తున్నాయి. నిరంతరం ఎదో ఒక ఆందోళన జరుగుతున్నందున రవాణా సౌకర్యం దెబ్బతిని కంపెనీల కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని వార్తా సంస్ధలు కూడా రాస్తున్నాయి. వివిధ అంతర్జాతీయ సంస్ధల సిబ్బంది తమ తమ కార్యాలయాలకు చేరుకోవడంలో విఫలమవుతున్నందున నష్టం జరుగుతున్నదని అవి తెలుపుతున్నాయి. ముఖ్యంగా హైద్రాబాద్ బ్రాండ్ నేమ్ అంతర్జాతీయంగా మారుమోగుతున్న సందర్భంలో తెలంగాణ కోసం…

2జి కుంభకోణంలో రాలిపడిన రెండో తల, కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రి దయానిధి మారన్ రాజీనామా

2జి స్పెక్ట్రం కుంభకోణంలో రెండో తలకాయ రాలిపడింది. బుధవారం సుప్రీం కోర్టుకి సి.బి.ఐ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్ లో కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖా మంత్రి దయానిధి మారన్ పాత్రపై వివరాలు పొందుపరిచిన సంగతి విదితమే. చెన్నైకి చెందిన శివరామ కృష్టన్, తన ఎయిర్ సెల్ కంపెనీ లోని మెజారిటీ షేర్లను మలేషియాకి చెందిన మేక్సిస్ కంపెనీకి అమ్మేలా ఒత్తిడి చేశాడనీ, తద్వారా మేక్సిస్ కంపెనీ చేత తన కుటుంబానికి చెందిన సన్ టి.వి లో 600 కోట్ల…

అణు సాంకేతిక పరిజ్ఞానం కోసం పాక్ మిలట్రీ అధికారులకు లంచం చెల్లించిన ఉత్తర కొరియా

పాకిస్ధాన్‌కు అణుశాస్త్ర, అణ్వస్త్ర పితామహుడుగా పేరుపొందిన అబ్దుల్ ఖదీర్ ఖాన్ పాక్ మిలట్రీ పరువు తీస్తూ అణుబాంబు పేల్చినంత పని చేశాడు. పాకిస్ధాన్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉత్తర కొరియాకు అణు సాంకేతిక పరిజ్ఞాన్ని ఉత్తర కొరియాకు బదలాయించాడని పాక్ ప్రభుత్వం ఖదీర్ ఖాన్‌పై ఇప్పటివరకూ ఆరోపిస్తూ వచ్చింది. ఆ అరోపణలకు భిన్నంగా అణు సాంకేతికత బదలాయింపులో పాక్ మిలట్రీకే నేరుగా సంబంధం ఉందనీ, అందుకు మిలట్రీ అధికారి ఒకరు 3 మిలియన్ డాలర్లు, మరొక అధికారి…