తెలంగాణ రాష్ట్రం కోసం 48 గంటల బంద్ -ఫొటోలు

రెండు రోజు తెలంగాణ బంద్ విజయవంతమైంది. ఒక్క సైబరాబాద్ మినహా తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల్లోనూ బంది సక్సెస్ అయింది. కేంద్రం మాత్రం తొందరపడడం లేదు. డిసెంబరు 9, 2009 నాటి ప్రకటన అనంతరం సీమాంధ్ర జిల్లాల్లో ప్రజా ప్రతినిధుల రాజినామాలతో పాటు, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రజలు కూడా ఉద్యమించడంతో కొద్ది రోజులకే ఆ ప్రకటనను కేంద్రం వెనక్కి తీసుకోవలసి వచ్చింది. ఆ అనుభవం ఇంకా పీడకలగా కాంగ్రెస్‌ను వెన్నాడుతోంది. దానితో ఏ నిర్ణయమూ తీసుకోకుండా…

2జి స్పెక్ట్రమ్ కుంభకోణం: కేంద్ర మంత్రి దయానిధి మారన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

సి.బి.ఐ ని తనపని తనను చేసుకోనిస్తే తగిన ఫలితాలను చూపించగల సత్తా ఉన్న సంస్ధ అని నిరూపించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ నుండి సి.బి.ఐ ని తాత్కాలికంగా తప్పించి సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పని చేస్తున్నందున ఒక్కో తీగా లాగుతూ అనేక డొంకల్ని కదిలిస్తోంది. సి.బి.ఐ బుధవారం సుప్రీం కోర్టుకి సమర్పించిన ‘స్టేటస్ రిపోర్ట్’ లో ప్రస్తుతం కేంద్రంలో టెక్స్ టైల్స్ శాఖ మంత్రిగా ఉన్న దయానిధి మారన్ అఘాయిత్యాన్ని పొందుపరిచింది. మలేషియా కంపెనీకి మేలు చేయడానికీ,…

తీవ్రమవుతున్న యూరప్ అప్పు సంక్షోభం, పోర్చుగల్ రేటింగ్ ఢమాల్

గత సంవత్సరం రెండో అర్ధ భాగం అంతా ప్రపంచ కేపిటల్ మార్కెట్లను వణికించిన యూరప్ అప్పు సంక్షోభం మళ్ళీ మరొకసారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గత మే, జూన్ నెలల్లో గ్రీసు సంక్షోభమే ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్లను ఆవరించింది. గ్రీసుకు రెండో బెయిలౌట్ ఇవ్వడానికి ఇ.యు ఒక ఒప్పందానికి రావడమూ, గ్రీసు తాజాగా సరికొత్త పొదుపు చర్యలను అమలు చేసే బిల్లును ఆమోదించడమూ విజయవంతంగా ముగియడంతో గ్రీసు తాత్కాలికంగా చర్చలనుండి పక్కకు తప్పుకుంది. తాజాగా మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్…

బిన్ లాడెన్ కుటుంబం అప్పగింతకు పాకిస్ధాన్ నిరాకరణ

ఒసామా బిన్ లాడెన్ భార్యలను, పిల్లలను తమ స్వస్ధాలకు పంపడానికి పాకిస్ధాన్ దాదాపుగా నిరాకరించింది. ఒసామా బిన్ లాడెన్ మరణానంతరం అతని భార్యలను, పిల్లలను పాక్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. లాడెన్ హత్యపై విచారణకు ప్రభుత్వం నియమించిన కమిషన్ అంగీకరిస్తే తప్ప ఆయన కుటుంబాన్ని ఇతర దేశాలకు అప్పగించబోమని పాక్ ప్రభుత్వ పానెల్ ప్రకటించింది. ముగ్గురు భార్యలు, 13 మంది పిల్లలతో కూడిన ఒసామా కుటుంబం ప్రస్తుతం పాకిస్ధాన్ ప్రభుత్వ రక్షణలో ఉన్నారు. మే 2…

రెండు రోజుల బంద్‌తో తెలంగాణలో స్తంభించిన సాధారణ జనజీవనం

తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ జె.ఎ.సి ఇచ్చిన 48 గంటల బంద్ విజయవంతమైందనే చెప్పాలి. రెండో రోజు వరసగా సాధారణ జన జీవనం స్తంబించిపోయింది. స్కూళ్ళు, కాలేజిలు, షాపులు, పెట్రోల్ పంపులు ఇంకా ఇతర వ్యాపార సంస్ధలన్నీ మూసివేశారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్తంభనకు గురయ్యాయి. రవాణా వ్యవస్ధ తెలంగాణలోని పది జిల్లాల్లోనూ ప్రతిష్టంభనకు గురయ్యింది. హైద్రాబాదులో కూడా బందు పూర్తిగా విజయవంతమైందని పత్రికా సంస్ధలు తెలిపాయి. ఎ.పి.ఎస్.ఆర్.టి.సి ముందు జాగ్రత్తతో వ్యవహరించి బస్సులను గ్యారేజిలకే పరిమితం చేశారు.…

జర్నలిస్టు హత్యలో ఐ.ఎస్.ఐ హస్తం లేదు -పాక్ ప్రభుత్వం

ఏసియా టైమ్స్ విలేఖరి సయ్యద్ సలీమ్ షహజాద్ హత్యలో పాక్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ హస్తం ఉందనడాన్ని పాకిస్ధాన్ ప్రభుత్వం తిరస్కరించింది. రహస్య గూఢచర్య సమాచారం విలేఖరి హత్యలో ఐ.ఎస్.ఐ ప్రత్యక్ష జోక్యం ఉందని నిరూపిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను పాక్ ఖండించింది. పాకిస్ధాన్ భద్రతా బలగాల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికే జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలో భాగమే ఈ కధనాలని ఆరోపించింది. ఐ.ఎస్.ఐ కి చెందిన సీనియర్ ఉన్నాధికారులు షహజాద్ హత్యకు పురమాయించారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక…

“సల్వా జుడుం” ఏర్పాటు చట్ట విరుద్ధం -చత్తిస్‌ఘడ్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు గడ్డి పెట్టిన సుప్రీం కోర్టు – 2

“(సల్వా జుడుం యొక్క) రాజ్యాంగబద్ధమైన సమ్మతిని కొలవడానికి ఆ బలగాల ప్రభావశీలత (effectiveness) ఒక్కటే కొలబద్ద కాజాలదు, కాగూడదు కూడా. ఛత్తీస్ ఘఢ్‌లో మావోయిస్టు/నగ్జలైట్ల కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎస్.పి.ఓ లు ప్రభావవంతంగా ఉన్నాదన్న అంశం తప్పుడు ప్రతిపాదన, కాకుంటే అనుమానాస్పదమైన ప్రతిపాదన. వాదన కోసం నిజంగానే ఎస్.పి.ఓలు మావోయిస్టులు/ నగ్జలైట్లకి వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉపయోగపడుతున్నారని అంగీకరించినా, తద్వారా వారివలన చేకూరుతున్నాయంటున్న అనుమానాస్పద లాభాలు, రాజ్యాంగంపై ఉండవలసిన పవిత్ర నమ్మకం, గౌరవాలను పెద్ద ఎత్తున కోల్పోవడానికీ, సామాజిక క్రమబద్ధత…

“సల్వా జుడుం” ఏర్పాటు చట్ట విరుద్ధం -చత్తిస్‌ఘడ్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు గడ్డి పెట్టిన సుప్రీం కోర్టు – 1

కేంద్ర ప్రభుత్వానికి, ఛత్తిస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గడ్డి పెట్టినంత పని చేసింది. ఛత్తిస్ ఘఢ్ లో మావోయిస్టులను ఎదుర్కోవడానికి గిరిజన తెగల్లోనే ఒక తెగకు శిక్షణ ఇచ్చి తుపాకులిచ్చి స్పెషల్ పోలీస్ ఆఫిసర్లుగా పేరుపెట్టి రిగిజనంపైకి వదిలింది. దీనివలన గిరిజన తెగల్లో తీవ్ర ఘర్షణలు తలెత్తి ఒక తెగపై మరొక తెగ దారుణంగా మారణ కాండకు తలపడడం మొదలైంది. గిరిజనులకూ, గిరిజనులకూ పెట్టి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వినోదం చూశాయి. ఈ పద్దతిని…

అమెరికా కంపెనీలు లాభాల్లో, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ నష్టాల్లో

2007-08 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ఫలితంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తీవ్రంగా దెబ్బతింది. 2009 వరకూ అమెరికాలోని కంపెనీలు కూడా తీవ్రమైన ఆర్ధిక కష్టాల్లో ఉన్నట్లు ప్రకటించాయి. లేమేన్ లాంటి ఫైనాన్సి దిగ్గజం నిట్ట నిలువునా కూలిపోవడంతో ప్రపంచం నిర్ఘాంతపోయింది. వాల్ స్ట్రీట్ లోని బహుళజాతి ద్రవ్య సంస్ధలైన ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకులన్నీ తోటి బ్యాంకులపై నమ్మకం కోల్పోయి ఒక్క సెంటు కూడా చేబదుళ్ళు, అప్పులు ఇవ్వడానికి నిరాకరించడంతో అప్పు దొరకడం గగనమైంది. “క్రెడిట్ క్రంచ్” గా పేర్కొన్న…

చైనా బ్యాంకుల్లో పేరుకుపోయిన తిరిగి రాని అప్పులు $0.5 ట్రిలియన్లు -మూడీస్ హెచ్చరిక

చైనా బ్యాంకుల్లో తిరిగి రాని అప్పులు పేరుకుపోయాయనీ, అవి అలానే కొనసాగితే చైనా బ్యాంకుల క్రెడిట్ రేటింగ్ తగ్గించాల్సి ఉంటుందని మూడీస్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ హెచ్చరించింది. 2008లో ఆర్ధిక సంక్షోభం సంభవించినపుడు, దాని బారిన పడకుండా ఉండడానికి చైనా పెద్ద ఎత్తున బెయిల్ ప్యాకేజీని అమలు చేసింది. బెయిలౌట్ ప్యాకేజితో పాటు దేశంలోపల విచ్చలవిడిగా అప్పులు మంజూరు చేసింది. ఉత్పత్తి కార్యక్రమాలకు బదులుగా వినియోగ సరుకులైన కార్లు, టి.విలు, ఫ్రిజ్ లు కొనుగోలు చేయడానికి అప్పులు…

స్ట్రాన్ కాన్ పై మరొక రేప్ కేసు, ఎనిమిదేళ్ళనాటి పాపం వెంటాడిన ఫలితం

ఐ.ఎం.ఎఫ్ మాజీ అధ్యక్షుడు డొమినిక్ స్ట్రాస్ కాన్ స్వదేశం ఫ్రాన్సులో మరొక రేప్ కేసు ఎదుర్కొంటున్నాడు. న్యూయార్క్ లోని ఒక లగ్జరీ హోటల్ మెయిడ్ పై అత్యాచారానికి ప్రయత్నించాడని ఆరోపణలు రావడంతో స్ట్రాస్ కాన్ ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. అయితే రేప్ నేరం ఆరోపించిన మహిళ తన వివరాల గురించి అబద్ధాలు చెప్పిందనీ, రేప్ ప్రయత్నం జరిగిన తర్వాత తాను చేసిన ఫోన్ కాల్స్ పై కూడా అబద్ధాలు చెప్పిందనీ…

మే నెలలో 111 శాతం పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

2011-12 ఆర్ధిక సంవత్సరంలో మే నెలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ) 111 శాతం పెరిగాయని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఒక్క మే నెలలోనే ఎఫ్.డి.ఐ లు 4.66 బిలియన్ డాలర్లు దేశంలోకి వచ్చాయని ప్రభుత్వం సంబరంగా ప్రకటించింది. ఇది గత ఆర్ధిక సంవత్సరంలో మే నెలలో వచ్చిన 2.21 బిలియన్ డాలర్ల ఎఫ్.డి.ఐ లతో పోలిస్తే 111 శాతం అధికమని ప్రభుత్వం తెలిపింది. అంతే కాక గత 11 సంవత్సరాల్లో రెండవ అతి పెద్ద మొత్తం…

కేంద్రానికి సుప్రీం కోర్టు ఝలక్, నల్లడబ్బు విచారణ పర్యవేక్షణకు ‘సిట్’ నియామకం

సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి గట్టి సవాలే విసిరింది. నల్ల డబ్బు వెలికి తీయడానికి కేంద్రం నియమించిన ‘హై లెవల్ కమిటీ’ (హెచ్.ఎల్.సి) పై పర్యవేక్షణకు “స్పెషల్ ఇన్‌వెష్టిగేషన్ టీం” (ఎస్.ఐ.టి – సిట్) ని ఏర్పాటు చేసింది. సుప్రీం నియమించిన సిట్ కు ఛైర్మన్‌గా రిటైరైన జస్టిస్ బి.పి.జీవన్ రెడ్డిని నియమించింది. డిప్యుటీ ఛైర్మన్ గా మరొక రిటైర్డ్ జస్టిస్ ఎం.బి.షా ను నియమించింది. ప్రభుత్వం నియమించిన హెచ్.ఎల్.సి ఇకనుండి సిట్ లో భాగంగా పనిచేస్తుంది.…

రాజీనామాలు చేసింది రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికి కాదు -కాంగ్రెస్ మంత్రులు

తాము రాజీనామా చేసింది రాజకీయ లేదా రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికో, కాంగ్రెస్ హైకమాండ్‌ను ధిక్కరించడానికో కాదనీ తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం పట్ల ఉన్న బలీయమైన ఆకాంక్షను కాంగ్రెస్ హైకమాండ్ కి తెలియజేయడానికేనని సీనియర్ మంత్రి జానారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. అనివార్య పరిస్ధితుల రీత్యానే తెలంగాణ ఎం.ఎల్.ఎ లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారని, తమ రాజీనామాలద్వారా తెలంగణ రాష్ట్ర సంక్షోభానికి పరిష్కారం కనుగునడానికి వారు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపాడు. డిసెంబరు 9, 2009 తేదీన…

13 ఏళ్ళ బాలుడిని కాల్చి చంపిన డిఫెన్సు కాంప్లెక్స్ సెక్యూరిటీ గార్డు

చెట్టు కాయను కోసుకు తిందామని మిలట్రీ కాంప్లెక్సులోకి గోడదూకి వెళ్ళీన 13 ఏళ్ళ బాలుడిని ఆ కాంప్లెక్సు సెక్యూరిటీ గార్డు తుపాకితో కాల్చి చంపాడు. ఆ సైనికుడు ముందూ వెనకా చూడకుండా విచక్షణా రహితంగా తుపాకికి పనిచెప్పి ఓ తల్లి గర్భశోకానికి కారణమయ్యాడు. రక్షణ బలగాలు నివసించే నివాస కాంప్లెక్స్ లోకి దిల్షాన్ అనే బాలుడు తన ఇద్దరు మిత్రులతో కలిసి గోడ దూకి ప్రవేశించాడు. చెట్టుకి కాసిన పండుని కోసుకు తిందామని చెట్టు ఎక్కుతుండగా సెక్యూరిటీ…