తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టు, ఫుకుషిమా అణు ప్రమాదం, కొన్ని సంగతులు

ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో యురేనియం నిల్వలున్న ప్రాంతంగా పేరు సంపాదించుకున్న తుమ్మలపల్లె గ్రామం కడప జిల్లా పులివెందుల మండలంలో ఉంది. ఇక్కడ 49,000 టన్నుల యురేనియం నిల్వలు ఉన్నాయని నిర్ధారించారని మాత్రమే నిన్నటి వరకూ లోకానికి తెలుసు. అయితే రాజస్ధాన్‌లో, దేశంలోని 25వ అణు విద్యుత్ రియాక్టర్ నిర్మాణానికి శంకుస్ధాపన కోసం విచ్చేసిన భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ, తుమ్మలపల్లెలో గతంలో నిర్ధారించినట్లుగా 49,000 టన్నులు కాకుండా దానికి మూడు రెట్లు, అంటే…

ప్రపంచంలో అతిపెద్ద యురేనియం నిల్వలున్న తుమ్మలపల్లె ఆంధ్రప్రదేశ్ కి వరమా? శాపమా?

ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్ధితి దాపురించింది. అణు బాంబులతో పాటు అణు విద్యుత్‌కి వినియోగించే యురేనియం నిల్వలు ఆంధ్రప్రదేశ్ లోని తుమ్మలపల్లెలో పుష్కలంగా ఉన్నాయని భారత అణు ఇంధన కమిషన్ ఛైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ తెలిపాడు. ప్రపంచంలో మరెక్కడా ఒకే చోట ఇంత అధిక స్ధాయిలో యురేనియం నిల్వలు ఉన్న ప్రాంతం లేదని ఆయన తెలిపాడు. ఇటీవల జరిపిన అధ్యయనాల ద్వారా తుమ్మలపల్లెలో35 కి.మీ పరిధిలో1.5 లక్షల టన్నుల యురేనియం ఖనిజ నిల్వలు ఉన్నాయని…

ప్రభుత్వ లోక్‌పాల్ డ్రాఫ్టు దేశ ప్రజల పైకి విసిరిన ఓ పెద్ద జోక్ -ప్రధానికి లేఖలో హజారే

ప్రభుత్వ లోక్ పాల్ డ్రాఫ్టు చాలా బలహీనమైనదనీ, తప్పించుకోవడానికి అవసరమైన అనేక రంధ్రాలు కలిగి ఉన్నదనీ కనుక తాము రూపొందించిన జన్ లోక్‌పాల్ డ్రాఫ్టును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నాడు. ప్రభుత్వం రూపిందించిన లోక్ పాల్ డ్రాఫ్టు భారత దేశ ప్రజల మీదికి విసిరిన ఒక పెద్ద జోక్ అని ఆయన అభివర్ణించారు. ప్రధానికి రాసిన లేఖలో అన్నా హజారే, ఆమరణ దీక్షకు దిగుతానన్న తన నిర్ణయాన్ని…

హ్యాకింగ్‌కి గురైన మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోక్ ఫోన్ -కార్టూన్

“నా ఫోన్‌ని హ్యాక్ చేశారా?! అసలే దుఃఖంలో ఉన్న ఈ ముసలోడికి అలా చేయడానికి మనసెలా ఒప్పింది!”   హత్యకు గురైన బాలిక ఫోన్‌ని హ్యాక్ చేసీ, న్యూయార్క్ లోని జంట టవర్లపై జరిగిన టెర్రరిస్టు దాడుల్లో చనిపోయిన వారి ఫోన్లను హ్యాక్ చేసీ, ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ యుద్ధాల్లో మరణించిన ఇంగ్లండ్ సైనికుల ఫోన్ లను హ్యాక్ చేసి… ఆ సమాచారాన్నే పెట్టుబడిగా “న్యూస్ ఆఫ్ ది వరల్డ్” పత్రికకు పేరు తెచ్చుకున్న రూపర్ట్ మర్డోక్ ఫోన్‌ని…

గుర్రాల వ్యాపారి హసన్ ఆలీ ఖాన్ విదేశీ బ్యాంకులకు తరలించింది రు.3600 కోట్లు -ఇ.డి

పూనే గుర్రాల వ్యాపారి ‘హసన్ ఆలీ ఖాన్’ 800 మిలియన్ డాలర్ల (రు.3600 కోట్లు) నల్లధనాన్ని విదేశీ బ్యాంకులకు తరలించాడని ఆర్ధిక నేరాల దర్యాప్తు సంస్ధ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, బోంబే హైకోర్టు కు సోమవారం తెలిపింది. అమెరికా, స్విట్జర్లాండ్, సింగపూర్ తదితర దేశాల్లోని బ్యాంకులకు ఈ డబ్బు తరలించినట్లుగా ఇ.డి కోర్టుకు తెలిపింది. ఈ విదేశీ బ్యాంకుల అధికారులతో హసన్ ఆలీ ఖాన్‌కు లోతైన సంబంధాలున్నాయని ఇ.డి తెలిపింది. సెషన్స్ కోర్టు హసన్ ఆలీ ఖాన్ కు…

25వ అణు విద్యుత్ కర్మాగారం నిర్మాణం ప్రారంభించిన ఇండియా

ఫుకుషిమా అణు ప్రమాదం, అణు విద్యుత్ కర్మాగారాల భద్రత పట్ల అనేక సమాధానాలు దొరకని ప్రశ్నలను అనేకం లేవనెత్తినప్పటికీ భారత దేశం కొత్త అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం నుండి వెనక్కి తగ్గడం లేదు. ఫుకుషిమా దైచి అణు కర్మాగారం వద్ద మూడు అణు రియాక్టర్లలోని విద్యుత్ ప్రసార వ్యవస్ధ దెబ్బతినడంతో కూలింగ్ వ్యవస్ధ నాశనమై ఇంధన కడ్డీలు వేడెక్కి కరిగిపోయి, పెద్ద ఎత్తున పేలుళ్ళు సంభవించిన సంగతి విదితమే. ఈ కర్మాగారం నుండి విడుదలవుతున్న రేడియేషన్‌ను…

రుమేనియా రైలునుండి 64 మిసైల్ వార్‌హెడ్స్ దొంగిలించిన దుండగులు

రుమేనియాకి చెందిన రైలులో రవాణా అవుతున్న మిసైళ్ళ వార్‌హెడ్స్ ను గుర్తు తెలియని దుండగులు దొంగిలించిన ఉదంతం సంచలన కలిగిస్తోంది. ఆదివారం, రుమేనియా నుండి బల్గేరియాకు రవాణా అవుతున్న మిసైళ్ళనుండి వార్ హెడ్స్ తొలగించి దొంగిలించినట్లుగా రుమేనియా ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాసిక్యూటర్లు, దొంగతనాన్ని విచారిస్తున్నట్లు తెలిపారు. ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేరియస్ మిలిటారు, దొంగిలించబడిన విడిభాగాలు వాటంతట అవే ప్రమాదకరం కావనీ మిసైల్ వ్యవస్ధతో కలిసి ఉంటేనే ప్రమాదకరమనీ తెలిపాడు. మిలట్రీ పరికరాలతో…

బ్రిటన్‌ని ఊపేస్తున్న ఫోన్ హ్యాకింగ్ స్కాండల్‌లో ప్రధాని కామెరూన్ సన్నిహితురాలు రెబెక్కా అరెస్టు

మీడియా రారాజుగా అభివర్ణించబడుతున్న స్టార్ ఛానెళ్ళ అధినేత రూపర్ట్ మర్డోక్‌కి చెందిన “న్యూస్ ఆఫ్ వరల్డ్” పత్రిక విలేఖరులు వివిధ నేరాలలో భాధితులైన వ్యక్తుల ఫోన్లను హ్యాకింగ్ చేసి అందులోని సమాచారాన్ని దొంగిలించి పత్రిక కధనాలకు వినియోగించారన్న ఆరోపణలతో బ్రిటన్ మీడియా ప్రపంచం అట్టుడుకుతోంది. మర్డోక్‌కి కుటుంబ స్నేహితురాలు, ప్రధాని కామెరూన్‌కు మీడియా అడ్వైజర్‌గా కూడా పేరుపొందిన, “న్యూస్ ఇంటర్నేషనల్” పత్రిక ఛీఫ్ ఎడిటర్ రెబెక్కా బ్రూక్స్‌ను పోలీసులు “ఫోన్ హ్యాకింగ్ కుంభకోణం” తో సంబంధం ఉందన్న…

సుప్రీం కోర్టు తలంటుతో కదిలిన ఢిల్లీ పోలీసులు, ‘నోటుకు ఓటు’ స్కామ్‌లో సంజీవ్ సక్సేనా అరెస్టు

ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు ఒకడుగు ముందుకేశారు. ‘నోటుకు ఓటు’ కుంభకోణం పరిశోధనలో రెండు సంవత్సరాలనుండి ఎటువంటి పురోగతి లేకపోవడంపై సుప్రీం కోర్టు రెండ్రోజుల క్రితం తీవ్ర స్ధాయిలో తలంటడంతో, తమ దర్యాప్తుకు శ్రీకారం చుట్టారు. ముగ్గురు బి.జె.పి ఎం.పిలు యు.పి.ఎ ప్రభుత్వ విశ్వాస పరీక్షలో అనుకూలంగా ఓటు వేయడానికి అమర్ సింగ్ అనుచరుడు సంజీవ్ సక్సేనా కోటి రూపాయలు ఇచ్చిన ఆరోపణపై సంజీవ్ సక్సేనాను అరెస్టు చేశారు. అయితే అసలు పాత్రధారుడు సంజీవ్ సక్సేనా కాదు. ఆయన…

కొత్తశాఖలో జైరాం రమేష్ మార్కు విధానాలు ప్రారంభం, గ్రామీణాభివృద్ధికి 90,000 కోట్లు

పర్యావరణ శాఖ మంత్రిగా పర్యావరణ నిబంధనలను గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నించి ఇతర మంత్రుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్న జైరాం రమేష్ తనకు అప్పజెప్పిన గ్రామిణాభివృద్ధి శాఖలో కూడ తన మార్కు విధానాలను ప్రారంభించాడు. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో (2012-17) గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించే పధకాలన్నింటికీ స్వస్తి చెప్పి, పూర్తిగా నిర్వహణ రాష్ట్రాలకే అప్పజెప్పాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా నిర్ణయించగా, దానికి జైరాం రమేష్ పక్కకు నెట్టి కేంద్ర…

ముంబై పేలుళ్ళ నిందితుల్లో ఒకరి ఊహా చిత్రం రెడీ -ఎ.టి.ఎస్

ముంబై వరుస పేలుళ్ళ నిందితుల్లో ఒకరి ఊహా చిత్రం సిద్ధం చేశామని “యాంటి టెర్రరిస్టు స్క్వాడ్” (ఎ.టి.ఎస్) తెలిపింది. ఊహాచిత్రాన్ని ప్రజలు చూడడానికి విడుదల చేయడం లేదని తెలిపింది. బహుశా నిందితులు అప్రమత్తం అవుతారన్న అనుమానంతో ఎ.టి.ఎస్ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. బాంబు పేలిన ఒక స్ధలంవద్ద ప్రత్యక్ష సాక్షి కధనంపై ఆధారపడి ఈ ఊహాచిత్రాన్ని గీయించినట్లుగా ఎ.టి.ఎస్ తెలిపింది. చిత్రాన్ని వివిధ దర్యాప్తు సంస్ధలకు అందజేశామని తెలిపింది. దర్యాప్తు సంస్ధలతో పాటు కొద్దిమంది ఎన్నుకున్న…

నల్ల డబ్బుపై సిట్ నియామకం సుప్రీం కోర్టు అతి -రివ్యూ పిటిషన్‌లో కేంద్రం

సుప్రీం కోర్టు అతిగా వ్వవహరిస్తోందని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. విదేశాల్లో దాచిన నల్లడబ్బును వెనక్కి తెప్పించడానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో “స్పెషల్ ఇన్‌వెస్టిగేషన్ టీం” ను నియమించడంలో సుప్రీం కోర్టు తన పరిధికి మించి వ్యవహరించిందని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. సిట్ నియామకంపై జారీ చేసిన ఉత్తర్వును సమీక్షించాలని తన పిటిషన్‌లో కోరింది. ఇది “న్యాయవ్యవస్ధ అతి” అని పిటిషన్ లో కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. రిటైర్డ్ సుప్రీం…

రికార్డు స్ధాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఇది చాలదంటున్న ప్రధాని

2010-11 సంవత్సరంలో గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్ధాయిలో ఆహార ధాన్యాలను ఇండియా ఉత్పత్తి చేసినట్లు భారత ప్రధాని శనివారం ప్రకటించాడు. ఎన్నడూ లేనంతగా 241 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను పండించినప్పటికీ, అధిక ధరలతో పాటు పెరుగుతున్న డిమాండ్ తట్టుకోవడానికీ ఇంకా అధిక ఉత్పత్తి సాధించవలసి ఉన్నదని ప్రధాని మన్మోహన్ తెలిపాడు. 2007 నుండి 2012 వరకూ ఉన్న11 వ పంచ వర్ష ప్రణాళికలో 4 శాతం వ్యవసాయ వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, వాస్తవంలో…

తమ రాజీనామాలను ఆమోదించాలని డిమాండ్ చేస్తూ స్పీకర్‌ను కలిసిన తెలంగాణ తెలుగు దేశం ఎం.ఎల్.ఎ లు

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత జులై 4 న చేసిన తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు దేశం ఎం.ఎల్.ఎ లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను శనివారం కలిసి విజ్ఞప్తి చేసారు. టి.డి.పి ఫోరం కన్వీనర్ ఇ.దయాకర రావు తెలుగుదేశం ఎం.ఎల్.ఎ ల బృందానికి నాయకత్వం వహించాడు. రాజీనామాలను ఆమోదించడానికి గానీ కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ధిష్ట హామీని పొందడం గానీ…

కంప్యూటర్లకు అందుబాటులోకి వచ్చిన కొత్త రూపాయి సింబల్

ఇకనుండి రూపాయి సింబల్‌ను డాలర్, పౌండ్, యూరో లాగా కంప్యూటర్ లో టైప్ చెయ్యవచ్చు. దీనికోసం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్ (టి.డి.ఐ.ఎల్) వెబ్ సైట్ (http://tdil-dc.in/) నుండి డౌన్ లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయవలసి ఉంటుంది. ఈ వెబ్ సైట్ ఎందువల్లనో ప్రస్తుతం లోడ్ కావడం లేదు.  ఆ తర్వాత కీ బోర్డులో ‘Alt Gr’ ను 4 తో కలిపి టైప్ చేసినట్లయితే రూపాయి సింబల్ కంప్యూటర్ స్క్రీన్ పై ప్రత్యక్షం అవుతుంది.…