ఐ.ఎస్.ఐ అధిపతి అమెరికా పర్యటన విజయవంతం, బాగుపడిన ఐ.ఎస్.ఐ, సి.ఐ.ఎ ల సంబంధాలు

90 మందికి పైగా సి.ఐ.ఎ గూఢచారులను పాకిస్ధాన్ ప్రభుత్వం దేశం నుండి వెళ్ళగొట్టడంతో పాక్, అమెరికాల మధ్య సంబంధాలు బెడిసి కొట్టిన సంగతి విదితమే. సి.ఐ.ఎ గూఢచారులను వెనక్కి పంపడంతో అమెరికా కూడా పాకిస్ధాన్ కి ఇవ్వవలసిన 800 మిలియన్ డాలర్ల సహయాన్ని నిలిపివేసింది. తమ గూఢచారులు పాకిస్ధాన్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికే అక్కడ ఉన్నారనీ, వారే లేకపోతే ఇక శిక్షణకి ఇచ్చే సొమ్ము ఇవ్వవలసిన అవసరం లేదనీ సి.ఐ.ఏ అధికారులు, సహాయం నిలిపివేస్తున్నట్లు చేసిన ప్రకటన…

ముంబైలో బాంబులు పేలాక పావు గంట వరకూ మొబైల్ ఫోన్లు పని చేయలేదు -మహారాష్ట్ర సి.ఎం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ మొబైల్ ఫోన్ నెటవర్క్ లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముంబైలో జులై 13 తేదీన టెర్రిరిస్టులు బాంబులు పేల్చాక తాను అధికారులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే కనీసం 15 నిమిషాల వరకూ తనకు వీలు కాలేదని ఆయన తెలిపాడు. “ఇది చాలా సీరియస్ విషయం. అధికారులతో మాట్లాడ్డానికి, ప్రభుత్వపరంగా సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి మేము మొబైల్ ఫోన్లపై ఆధారపడుతున్నాం. కీలక సమయంలో ఇలా మొబైళ్ళు జామ్ అయితే ఇక ఉపయోగం ఏముంది?” అని…

పార్లమెంటు విశ్వాస పరీక్షలో ‘ఓటుకు నోట్లు’ కేసు దర్యాప్తుపై సుప్రీం కోర్టు ఆగ్రహం

2008 సంవత్సరంలో పార్లమెంటు విశ్వాసం పొందడం కోసం యు.పి.ఎ – 1 ప్రభుత్వం డబ్బులిచ్చి ప్రతిపక్షాల ఓట్లు కొన్న కేసులో దర్యాప్తు కొనసాగుతున్న తీరు పట్ల సుప్రీం కోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు సంవత్సరాల నుండి కేసు విచారణలో పురోగతి లేకపోవడంతో ఢిల్లీ పోలీసుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసింది. “ఢిల్లీ పోలీసులు చేసిన దర్యాప్తు పట్ల మేము ఏ మాత్రం సంతోషంగా లేము. ఇటువంటి తీవ్రమైన నేరంతో కూడిన అంశంలో, నేరం…

అమెరికా అప్పు -కార్టూన్

అమెరికా 14.3 ట్రిలియన్ డాలర్లకంటే ఎక్కువ అప్పు చేయకూడదని పరిమితి ఉంది. మూడు దురాక్రమణ యుద్ధాల పుణ్యమాని అప్పు గరిష్ట పరిమితిని చేరుకుంది. అప్పులు చేసి ఆర్ధిక సంక్షోభంలో కుదేలైన బడా బడా వాల్ స్ట్రీట్ కంపెనీలకు అమెరికా ప్రభుత్వం బెయిలౌట్లు ఇచ్చింది. యుద్ధాలు మానేస్తే ఈ పరిస్ధితి వచ్చి ఉండకపోను. ఇప్పుడు అమెరికా తెచ్చిన కొన్ని అప్పులపై వడ్డీల చెల్లింపులకు, మరి కొన్ని అప్పుల పూర్తి చెల్లింపులకు గడువు ఆగష్టు 2 తేదీ గడువు. ఆ…

అమెరికా అప్పు రేటింగ్ తగ్గించడానికి సిద్ధంగా ఉన్న రేటింగ్ సంస్ధలు

ప్రపంచంలో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధను కలిగి ఉన్న అమెరికా సావరిన్ అప్పు రేటింగ్‌ను తగ్గించడానికి ప్రపంచంలోని టాప్ రేటింగ్ సంస్ధలు మూడూ సిద్ధంగా ఉన్నాయి. స్టాండర్డ్ & పూర్స్ (ఎస్ & పి), ఫిచ్, మూడీస్ లు ప్రపంచ రేటింగ్ సంస్ధల్లో మొదటి మూడు సంస్ధలుగా పేరు పొందిన రేటింగ్ సంస్ధలు. ఇవి ఆయా దేశాల సావరిన్ అప్పు బాండ్లకు రేటింగ్ లు ఇస్తాయి. ఇంకా వివిధ ద్రవ్య సంస్ధలు, బ్యాంకులు, ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకులు తదితర…

2000వ టెస్ట్ మ్యాచ్, 100వ మ్యాచ్, 100వ సెంచరీ

ఇండియా క్రికెట్ జట్టు త్వరలో జరపనున్న ఇంగ్లండ్ టూర్‌లో భాగంగా జులై 21 నుండి 25 వరకూ ఇండియా, ఇంగ్లండ్ ల క్రికెట్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కి అనేక విధాలుగా ప్రాముఖ్యత ఉంది. ఇది మొత్తం ప్రపంచ క్రికెట్ టెస్టు క్రికెట్ జట్టుల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ లలోనే 2000 వ టెస్ట్ మ్యాచ్. అంతే కాకుండా ఇండియా, ఇంగ్లండు దేశాల మధ్య జరగనున్న 100…

ఆఫ్ఘన్‌లో కొనసాగుతున్న ‘నాటో’ నరమేధం, పౌర నష్టంపై పచ్చి అబద్ధాలు, బుకాయింపులు

ఆఫ్ఘనిస్ధాన్‌లో అర్ధ రాత్రుళ్ళు గ్రామాలపై దాడి చేసి పౌరుల ఇళ్ళపై కాల్పులు జరిపి వారిని కాల్చి చంపడం కొనసాగుతోంది. టెర్రరిస్టు గ్రూపుల సమావేశం జరుగుతోందని చెప్పడం, పౌరుల ఇళ్ళపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడం, పౌరులను కాల్చి చంపి చనిపోయినవారు టెర్రరిస్టులను బుకాయించడం నాటో దళాలకు ముఖ్యంగా అమెరికా సైన్యానికి నిత్యకృత్యంగా మారింది. ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణను ప్రతి ఒక్క ఆఫ్ఘన్ దేశీయుడూ వ్యతిరేకిస్తున్నాడనీ, తమ దేశం నుండి అమెరికా సైనికులు తక్షణమే వెళ్ళిపోవాలని ప్రతీ ఆఫ్ఘన్ జాతీయుడు…

జూన్ నెలలో కూడా ద్రవ్యోల్బణం మరింత పై పైకి…

భారత దేశంలో నిత్యావసర సరుకులు, వినియోగ సరులులతో పాటు సమస్త వస్తువల ధరలు పెరగడం కొనసాగుతూనే ఉంది. విశ్రాంతి తీసుకోవడానికి ససేమిరా అంటున్నాయి. జూన్ నెలలో ద్రవ్యోల్బణం ఇంకా పెరగడంతో పాటు ఏప్రిల్ నెలలో కూడా గతంలో ప్రకటించిన అంకెను ప్రభుత్వం మరింతగా పైకి సవరించుకుంది. అంటే ఏప్రిల్ నెలలో ధరలు గతంలో భావించినదాని కంటే ఎక్కువగా పెరిగాయన్నమాట. జూన్ నెలలో (ప్రధాన) ద్రవ్యోల్బణం 9.44 శాతం నమోదయ్యింది. టోకు ధరల సూచి ప్రకారం లెక్కించే ప్రధాన…

ముంబైలో మళ్ళీ బాంబు పేలుళ్ళు, 21 మంది దుర్మరణం, 141 మందికి గాయాలు -అప్ డేట్

ముంబైలోని జన సమ్మర్దమైన ప్రాంతాల్లో బుధవారం సంభవించిన బాంబు పేలుళ్ళలో దుర్మరణం పాలైనవారి సంఖ్య 21 కి చేరుకోగా, 141 మంది గాయపడ్డారని తేలింది. పేలుళ్ళలో ఆత్మాహుతి బాంబుదాడిని కొట్టిపారేయలేమని పోలీసులు చెబుతున్నారు. గం.6:54ని.లకు దక్షిణ ముంబైలోని జావేరి బజార్లో పేలిన మొదటి బాంబు శక్తివంతమైనదని తెలుస్తోంది. గం.6:55ని.లకు రెండవ బాంబు సెంట్రల్ ముంబైలో దాదర్ సబర్బన్ రైల్వే స్టేషన్ సమీపంలోని కబూతర్‌ఖానా బస్ స్టాప్ వద్ద పేలిందనీ, గం.7:05ని.లకు మూడవ బాంబు దక్షిణ ముంబైలోని ఒపేరా…

7/11 (జులై 2011) ముంబై బాంబు పేలుళ్ళు -ది హిందూ ఫొటోలు

జులై 13, 2011 రోజు, భారత ప్రజల జీవితాల్లో మరొక దుర్దినంగా నమోదు కానున్నది. నేడు జరిగిన బాంబు పేలుళ్ళ దృశ్యాలను ఫోటో గ్రాఫర్ వివేక్ బెంద్రె కెమెరాలో బంధించగా ‘ది హిందూ’ పత్రిక తన వెబ్‌సైట్ లో ప్రచురించింది. ఫోటోలు చూడ్డానికి భయానకంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఏడు ఫొటోలు ఒపేరా హౌస్ వద్ద జరిగిన పేలుడు అనంతరం తీసినవి కాగా ఒకటి దాదర్ స్టేషన్ దగ్గరి దృశ్యాన్ని టీవి ఛానెల్ చూపుతోంది. పాకిస్ధాన్ ప్రభుత్వం…

ముంబైలో మళ్ళీ బాంబు పేలుళ్ళు, 13 మంది మరణం, 100 మందికి గాయాలు

అప్ డేట్ – 3: బుధవారం జరిగిన బాంబు పేలుళ్ళలో మరణించినవారి సంఖ్య 13 కు చేరుకుందని పోలీసులు చెప్పారని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.. మహా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 13 మంది చనిపోయారని ధృవీకరించాడు. ఐ.ఇ.డి (ఇంప్రూవైజ్‌డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) లతో పేలుళ్ళు జరిపారని పోలీసులు చెప్పారు. దాదర్ లో కారులో ఉంచిన బాంబు పేలిందని తెలుస్తోంది. గొడుగు కింద ఉంచిన మరొక బాంబుని నిర్వీర్యం చేశారు. అప్ డేట్ – 2: ఈరోజు…

అధిక ద్రవ్యోల్బణాన్ని అధిగమించి రికార్డు ఆర్ధిక వృద్ధి నమోదు చేసిన చైనా

అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ ధరలు, అధిక ధరలు అన్నింటినీ అధిగమిస్తూ చైనా అర్ధిక వ్యవస్ధ ఈ సంవత్సరం రెండో క్వార్టర్ లో 9.5 ఆర్ధిక వృద్ధిని నమోదు చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆర్ధికవేత్తలు, మార్కెట్ విశ్లేషకుల అంచనా 9.4 శాతం అంచనాని దాటి చైనా అర్ధిక వ్యవస్ధ వృద్ధి చెందటం గమనార్హం. చైనా ఆర్ధిక వృద్ధి నెమ్మదిస్తూన్నదన్న భయాలను ఈ దెబ్బతో చైనా పటాపంచలు చేసినట్లయింది. తాజా ఆర్ధిక వృద్ధి రేటుతో ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి…

‘గూగుల్,’ ‘స్కైప్’ సర్వీసులను పర్యవేక్షించే అవకాశం మా గూఢచాలకు ఇవ్వాలి -భారత ప్రభుత్వం

‘గూగుల్ ఇంక్,’ ‘స్కైప్ లిమిటెడ్’ లతో పాటు ఇతర ఇంటర్నెట్ సంస్ధలు, వినియోగదారులకు అందించే సేవలను పర్యవేక్షించే అవకాశం దేశ భద్రతా ఏజెన్సీలకు ఉండాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఆయా కంపెనీలు తాము అందజేసే సర్వీసుల ద్వారా మార్పిడి చేసే సమాచారాన్ని ముందుగానే చదివే అవకాశం భారత దేశ భధ్రతా బలగాలు, గూఢచార సంస్ధలకు ఉండాలనీ, భారత దేశ భద్రత రీత్యా అది అవసరమనీ సంబంధిత కేంద్ర మంత్రి బుధవారం, పరిశ్రమల సమావేశాల సందర్భంగా కోరాడు.…

అమెరికా అణు ప్లాంట్ల వద్ద ఇపుడున్న భద్రతా ఏర్పాట్లు సరిపోవు -టాస్క్ ఫోర్స్

జపాన్‌లొ మార్చిలో సంభవించిన భూకంపం సునామీల వలన ఫుకుషిమా అణు కర్మాగారం తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత అమెరికా ప్రభుత్వం తమ అణు కర్మాగారాల వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించాల్సిందిగా అణు నియంత్రణ కమిషన్‌ (న్యూక్లియర్ రెగ్యులేటరీ కమిషన్ – ఎన్.ఆర్.సి) ను ఆదేశించింది. ఎన్.ఆర్.సి అందుకోసం నిపుణులతో కూడిన టాస్క్ ఫోర్స్ ని నియమించింది. టాస్క్ ఫోర్స్ తయారు చేసిన నివేదికను అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్ధ సంపాదించగా ‘ది హిందూ’ పత్రిక అందులో కొన్ని అంశాలను…

ఎన్నికలలోపు ఇదే చివరి ‘మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ’ -ప్రధాని

మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ అనంతరం 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారాలు ముగిశాక ప్రధాని మన్మోహన్ ఎవరూ ఊహించని ప్రకటన చేశాడు. మంత్రివర్గ మార్పులు, చేర్పులు అనంతరం అసంతృప్తిపరులు, అసంతుష్టులు ఇంకా ఉండగానే ఆయన “ఇదే చివరి ‘మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ’” అని ప్రకటించి ఆహూతులను ఆశ్చర్యపరిచారు. తదుపరి పునర్వ్యవస్ధీకరణలో చోటు దక్కకపోతుందా అని ఆశిస్తున్నవారి ఆశలపై నీళ్ళు జల్లాడు. 2014 ఎన్నికలలోపు, అంటే ఇంకా మూడు సంవత్సరాల పదవీకాలం మిగిలి ఉండగానే చివరి మార్పులని ప్రకటించడం నిజంగానే ఆశ్చర్యకరమైన…