క్షీణించిన ఇండియా ఫ్యాక్టరీల ఉత్పత్తి సూచిక, గ్లోబల్ అనిశ్చితే కారణం

ముఖ్యమైన ఎగుమతి మార్కెట్ అయిన అమెరికా వినియోగదారుల కొనుగోలు శక్తి క్షీణిస్తుండం, అంతులేని యూరప్ రుణ సంక్షోభం తమ ప్రభావం చూపడంతో ఇండియా ఫ్యాక్టరీ ఉత్పత్తి ఆగస్టు నెలలో తీవ్రంగా పడిపోయినట్లుగా హెచ్.ఎస్.బి.సి మార్కిట్ సర్వే లో తేలింది. ఇండియా మాన్యుఫాక్చరింగ్ రంగంలోని ఉత్పత్తి తీరుతెన్నులను సూచించే హెచ్.ఎస్.బి.సి పి.ఎం.ఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) ఆగస్టు నెలలో 52.6 గా నమోదయ్యింది. మార్కెట్ విశ్లేషకులు 52.9 ఉండగలదని అంచనావేయగా దాని కంటే తక్కువ స్ధాయి 52.6 నమోదైనట్లుగా…

ఎట్టకేలకు స్వాతంత్ర్యం పొందిన లిబియా? -కార్టూన్

ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా దేశాల నాయకత్వంలో నాటో వాయు సేనలు లిబియా గగన తలంపై వీరవిహారం చేస్తూ లిబియా పౌరులను బాంబింగ్‌తో రక్షిస్తూ ముందు నడవగా ఇన్నాళ్లూ అమెరికాలో శి(ర)క్షణ పొందిన లిబియా స్వతంత్ర పిపాసులు లిబియా ప్రజల స్వేచ్ఛా వాయువుల కోసం తమ జీవితాల్ని ధారపోసి గడ్డాఫీ ప్రభుత్వంపై తిరుగుబాటును పరిపూర్తి కావించారు. అమెరికా, ఇటలీ, ఫ్రాన్సు, బ్రిటన్ ఆయిల్ కంపెనీలు నూతనంగా సంపాదించిన స్వేచ్ఛతో నూనె పొలాల్లోకి దుమికి ఆయిలోత్సాహంతో ఆనంద నృత్యం చేస్తున్నాయి.…

ధియేటర్ పేలుడు కేసులో హిందూ సంస్ధ సబ్యులకు 10 సం.ల జైలు శిక్ష

హిందూత్వ సంస్ధ ‘సనాతన్ సంస్ధ’ తో సంబంధాలున్నాయని భావిస్తున్న ఇద్దరు వ్యక్తులకు సినిమా ధియేటర్ లో బాంబులు పెట్టి పేల్చారన్న నేరానికి కోర్టు పది సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించింది. 2008లో జరిగిన మూడు ధియేటర్ల పేలుడు సంఘటనలలో రెండింటిలో నిందుతులు పాలు పంచుకున్నట్లుగా రుజువయ్యింది. పేలుళ్ళలో ఏడుగురు గాయపడ్డారు. నిందితులకు నేర చరిత్ర లేకపోవడం, మధ్య తరగతికి చెందినవారు కావడంతో తక్కువ శిక్షతొ సరిపెడుతున్నట్లు కోర్టు తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వ యాంటి టెర్రరిస్టు స్క్వాడ్…

బాబా రాందేవ్ పై విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన కేసు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) విభాగం బాబా రాందేవ్ పై గురువారం విదేశీ మారకద్రవ్య చట్ట ఉల్లంఘన కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఇ.డి అధికారులు గురువారం విలేఖరులకు సమాచారం అందించారు. బాబా రాందేవ్, ఆయాన్ ట్రస్టు అమెరికా, న్యూజీలాండ్, బ్రిటన్ ల నుండి అనధికారికంగా ఆర్ధిక సహాయం అందుకున్నాడని ఇ.డికి సాక్ష్యాలు దొరికాయని, దానితో కేసు నమోదు చేశామనీ అధికారులు చెబుతున్నారు. బాబా రాందేవ్, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొద్ది వారాల క్రితం ఆమరణ నిరాహర…

గత ఆరు క్వార్టర్‌లలో అతి తక్కువ నమోదైన భారత జిడిపి

2011-12 ఆర్ధిక సంవత్సరంలో మొదటి క్వార్టర్ లో (ఏప్రిల్, మే, జూన్ నెలలు) భారత దేశ జి.డి.పి నిరాశపరిచింది. గత ఆరు క్వార్టర్లలో, అంటే గత సంవత్సరం న్నర కాలంలో అత్యంత తక్కువగా 7.7 శాతం వృద్ధి రేటుని నమోదు చేసింది. అయితే ఆర్ధిక పరిశీలకులు, భారత జిడిపి మొదటి క్వార్టర్ లో ఇంతకంటే తక్కువగా ఉంటుందని అంచనా వేయడం గమనార్హం. కనుక మార్కెట్ అంచనాలను అధిగమించిందన్న సంతోషాన్ని ఈ అంకెలు మిగిలించాయి. గత మార్చి క్వార్టర్…

ఈ బ్లాగు ఎర్ర కళ్లద్దాలతో రాస్తున్నదా?

తెలుగు బ్లాగర్లలో మిత్రుడొకరు నాబ్లాగుని “అంతర్జాతీయ వార్తలను ఎర్రకళ్లద్దాలతో చూస్తూ వండి వార్చే బ్లాగని…” సర్టిఫికెట్ ఇచ్చారు. అలా రాస్తూనే ఒక వాస్తవం కూడా చెప్పుకొచ్చారు, ఎవరైనా తమ దృక్కోణంతోనే వార్తల్ని చూస్తారనీ, లేక చదివాకైనా తమ దృక్కోణాన్ని ఏర్పాటు చేసుకుంటారనీనూ. అదిలా ఉంది: మనకు నిత్యం అంతర్జాతీయ వార్తలను ఎర్ర కళ్ళద్దాలతో వీక్షించి వండి వార్చే బ్లాగొకటి ఉంది. అఫ్ కోర్స్, అదేం తప్పు కాదనుకోండి, ప్రతి ఒక్కరం ఒక వార్తని ఏదో ఒక దృక్కోణములోనుంచే…

పెను తుఫానునుండి కొద్దిలో తప్పించుకున్న న్యూయార్క్ నగరం -ఫోటోలు

పెను తుఫానుగా ప్రకటించిన ఐరీన్ న్యూయార్క్ ను తాకేసరికి తుపానుగా మారిపోవడంతో ‘పెను’ విధ్వంసం నుండి కొద్దిలో తప్పించుకుంది. అయినప్పటికీ మన హైద్రాబాద్ నగరం వర్షంలో తడిసినప్పటి దృశ్యాలు న్యూయార్క్ లో సైతం కనపడ్డాయి. “మెయిల్ ఆన్ లైన్” అందించిన ఈ ఫోటోలు:

దళితులు వినాయకుడి విగ్రహం పెట్టుకోవడానికి వీల్లేదట! మెదక్ జిల్లాలో దారుణం

వినాయక చవితి పండగని దళితులు జరుపుకోవడానికి వీల్లేదట! అందరిలాగానే తాము కూడా వినాయక చవితి విగ్రహం పెట్టుకుని పూజలు, పునస్కారాలు చేయడానికి వీల్లేదని మెదక్ జిల్లాలోని చిన్నశంకరం పేట మండలం, గజగట్ల పల్లి గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆగ్రహించి దళితులకు పాలు అందకుండా చేశారు గ్రామ పెద్దలు. 64 సంవత్సరాల స్వాతంత్ర్య పాలన దళితులకు ఒరగబెట్టినదేమిటో, అగ్రవర్ణాలకు నేర్పిన సంస్కారం ఏమిటో ఈ సంఘటన తెలియజేస్తున్నది. ఈ వార్తను ఆంధ్రజ్యోతి…

అమెరికా తూర్పు తీరానికి పెనుతుఫాను (ఇరేనే) తాకిడి -నాసా ఫోటో

అమెరికా తూర్పు తీరాన్ని ‘ఇరెనె’ పెను తుఫాను వణికిస్తొంది. అమెరికా ప్రభుత్వం ఈ పెను తుఫాను తాకిడిని తట్టుకోవడానికి అసాధారణ ఏర్పాట్లు చేసింది. తూర్పు తీరాన ఉన్న న్యూయార్క్ నగరాన్ని కూడా ఇది తాకింది. ఇరెనె ను నాసా కేంద్రం తన ఉపగ్రహం నుండి తీసిన ఫోటో, పెను తుఫాను స్వరూపాన్ని తెలియజెపుతుంది. ఫొటోను బిబిసి ప్రచురించింది. పెద్ద బొమ్మ కోసం ఫొటోపై క్లిక్ చేయండి   —

అన్నా డిమాండ్లను ప్రభుత్వం నిజంగానే నెరవేర్చిందా?

అన్నా హజారే పదమూడు రోజుల నిరాహార దీక్షను ఆదివారం ఉదయం విరమించాడు. తాను కోరినట్లుగా తమ మూడు డిమాండ్లను పార్లమెంటులో తీర్మానం రూపంలో వోటింగ్ ద్వారా అమోదం పొందితే దీక్ష విరమిస్తానని అన్నా హజారే ప్రభుత్వానికి షరతు విధించాడు. ఓటింగ్ ఉండదనీ కేవలం “సెన్స్ ఆఫ్ ది పార్లమెంట్” మాత్రమే చర్చల అనంతరం అన్నాకు తెలిపుతామని ప్రభుత్వం శనివారం మొదట చెప్పింది. అన్నా బృందం ఆ అంశంలో ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. సమావేశంలో ఓటింగ్ పెడతామని చెప్పి…

గ్లోబల్ రికవరీకి ప్రమాదం పొంచి ఉంది, వెంటనే చర్యలు తీసుకొండి -ఐ.ఎం.ఎఫ్

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ ఐ.ఎం.ఎఫ్ ప్రపంచ దేశాలను మరోసారి హెచ్చరించింది. మూడు సంవత్సరాల క్రితం ఏర్పడిన తీవ్ర ఆర్ధిక సంక్షోభం నుండి కుంటుతూ కోలుకుంటున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మరోసారి సంక్షోభంలో జారిపోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. వెంటనే చర్యలు తీసుకుంటే తప్ప దాన్ని అరికట్టలేమని ఐ.ఎం.ఎఫ్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్ట్రీన్ లాగార్డే తెలియజేసింది. “ఈ వేసవిలో జరిగిన పరిణమాలు, మనం ప్రమాదకరమైన కొత్త దశలో ఉన్నమాని సూచిస్తున్నాయి. బలహీనంగా ఉన్న ఆర్ధిక రికవరీ…

ఆదివారం తన నిరవధిక నిరాహార దీక్షను ముగించనున్న అన్నా హజారే

అన్నా అభిమానులకు శుభవార్త. ప్రభుత్వం అన్నా ప్రతిపాదించిన మూడు డిమాండ్లను పార్లమెంటులో ఓటింగ్ కి పెట్టడానికి అంగీకరిస్తున్నట్లు పౌర సమాజ ప్రతినిధులకు ప్రణబ్ ముఖర్జీ లేఖ రాయడంతో అన్నా బృందంలో ఆనందం వెల్లివిరిసింది. శనివారం ఈ మేరకు తమకు లేఖ అందినట్లుగా అన్నా బృందం విలేఖరులకి తెలిపింది. లోక్ పాల్ బిల్లుపై తమ డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని ఓటింగ్ కి ప్రవేశపెడుతున్నట్లు గా ప్రభుత్వం నుండి తమకు సమాచారం అందిందని టీమ్ అన్నా తెలిపింది. ఈ పరిణామం…

తిరుగుబాటు ముందువరకూ గడ్డాఫీ అమెరికాకి మిత్రుడే -వికీలీక్స్

ప్రస్తుతం లిబియా రాజధాని ట్రిపోలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల సైన్యాలతూ కూడిన నాటో దళాలు మౌమ్మర్ గడ్డాఫీ కోసం వేటాడుతున్నాయి. గడ్డాఫీ నమ్మకస్తులనుకున్నవారి ఇళ్లపై బడి గడ్డాఫీకోసం వెతుకులాట పేరుతో దారుణ విధ్వంసం సృష్టిస్తున్నాయి. ‘వేటాడి చంపవలసినవాడు’ గా అమెరికా ప్రకటించిన కల్నల మౌమ్మర్ గడ్డాఫీ నిజానికి తిరుగుబాటు పేరుతో అంతర్యుద్ధం ప్రారంభమయ్యే వరకూ అమెరికా కు అనుంగు మిత్రుడే. ఆ మేరకు రిపబ్లికన్ సెనేటర్లతో పాటు, బుష్ అధికార బృందంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా…

నేను అన్నాను కాలేను -అరుంధతీ రాయ్ (అనువాద వ్యాసం) -2

‘ప్రజలు’ అంటే జన్ లోక్ పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదించకుంటే చివరికంటా నిరాహార దీక్ష చేసి చనిపోతానని ఒక 74 ఏళ్ళ వ్యక్తి కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న దృశ్యాన్ని వీక్షించడానికి జమ కూడినవారు మాత్రమే. ఆకలిగొన్నవారికోసం చేపలు, రొట్టెలను యేసు క్రీస్తు అనేక రెట్లు పెంచిన పద్ధతిలో, టి.వి ఛానెళ్ళు తమ అద్భుత మాయాజాలంతో మిలియన్లకు పెంచగలిగన పదుల వేల మంది మాత్రమే ప్రజలు. “ఒక బిలియన్ మంది (వంద కోట్లు) ఒకే గొంతుకతో ‘ఇండియాయే…