బంగ్లాదేశ్‌కు రు.3375 కోట్ల రుణం మంజూరు చేసిన ఇండియా

ఓ వైపు బడ్జెట్ లోటు తగ్గించడానికి ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం తగుదునమ్మా అని తనకు మాలిన ధర్మాన్ని అనుసరిస్తోంది. భారత దేశంలో రోడ్లు, రైల్వేలు లాంటి మౌలిక రంగాల నిర్మాణం ఆధినిక సౌకర్యాలతో లేనందున సరఫరా నష్టాలు ఏర్పడి ధరలు పెరుగుతున్నాయనీ, దానితో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతున్నదనీ ప్రధాని మన్మోహన్, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా చెబుతున్నారు. ఆ పేరుతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాల కోసం నిధులు సంపాదించడానికి కేంద్ర ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండులను గత…

అక్రమ మైనింగ్‌పై సి.బి.ఐ కొరడా, గాలి జనార్ధన్, మరొకరి అరెస్టు

గాలి బ్రదర్స్‌లో నాయకత్వ పాత్రలో కనిపించే గాలి జనార్ధన రెడ్డి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓ.ఎం.సి) ఎం.డి బి.శ్రీనివాస రెడ్డిలను సి.బి.ఐ సోమవారం అరెస్టు చేసింది. సి.బి.ఐ డెప్యుటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ వి.వి.లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం బళ్ళారి చేరుకుని స్వయంగా గాలి జనార్ధన రెడ్డి, బి.శ్రీనివాస రెడ్డిలను అరెస్టు చేసి రోడ్డు మార్గంలో హైద్రాబాద్ కి తీసుకువచ్చారు. ఇద్దరిని అరెస్టు చేశామని సాయంత్రంలోగా సి.బి.ఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరుస్తామనీ సి.బి.ఐ ప్రతినిదులు తెలిపారు. గాలి జనార్ధన…

ముంబై దాడుల దోషి హేడ్లీ అప్పగింతకు ఇండియా సీరియస్‌గా లేదు -మాజీ భద్రతాధికారి

ముంబై దాడుల నిందితుడు హేడ్లీని అమెరికానుండి ‘నేరస్ధుల అప్పగింత ఒప్పందం’ కింద ఇండియాకి రప్పించడానికి, భారత ప్రభుత్వం అంత సీరియస్ గా లేదని అమెరికా రాయబారితో చెప్పిన విషయం వికీలీక్స్ వెల్లడించిన కేబుల్ ద్వారా బైటపడింది. లష్కర్ ఎ తొయిబా సభ్యుడు డేవిడ్ కోలమన్ హేడ్లీని ఇండియాకి రప్పించడానికి అమెరికాపై ఒత్తిడి చేసున్నట్లు పైకి కనిపించినప్పటికీ వాస్తవానికి ‘ఈ సమయంలో’ హేడ్లీని రప్పించడానికి భారత్ సిద్ధంగా లేదని భారత ప్రభుత్వ మాజీ భద్రతా సలహాదారు ఎం.కె.నారాయణన్ అమెరికా…

Q1 జిడిపి వృద్ధిలో చైనా, ఇండియాలను కిందికి తోసిన టర్కీ, అర్జెంటీనా

2011 క్యాలెండర్ సంవత్సరంలో మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో చైనా, ఇండియాలు జిడిపి వృద్ధికి సంబంధించి తమ స్ధానాలను కోల్పోయాయి. వాటి స్ధానాలను టర్కీ, అర్జెంటీనాలు ఆక్రమించాయి. ఇప్పటివరకూ చైనా, ఇండియాలో జిడిపి వృద్ధి రేటులో ప్రపంచంలో మొదటి రెండు స్ధానాల్లో కొనసాగుతున్నాయి. ఆర్ధిక సంక్షోభం తర్వాత ఇంతవరకూ అవి తమ స్ధానాలను కాపాడుకుంటూ వచ్చాయి. మొదటి క్వార్టర్ జిడిపి వృద్ధి రేటులో మొదటి ఐదు స్ధానాల్లో ఉన్న దేశాలను కింది పట్టికలో చూడవచ్చు.…

లిబియా ‘ఆయిల్ కేక్’ పంపకాలకు పశ్చిమ రాజ్యాలు సిద్ధం -కార్టూన్

లిబియా ఆయిల్ వనరుల్ని పంచుకోవడానికి పశ్చిమ రాజ్యాల ఆయిల్ కంపెనీలు ఇప్పుడు లిబియాలో చర్చల్లో మునిగితేలుతున్నాయి. తిరుగుబాటు ప్రారంభమైందని ప్రపంచానికి పూర్తిగా తెలియక ముందే తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించిన ఫ్రాన్సుకు పెద్ద భాగం లభించింది. 34 శాతం ఆయిల్, గ్యాస్ వనరుల్ని ఫ్రెంచి కంపెనీ టోటల్ కి అప్పగిస్తున్నట్లుగా లిబియా నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ ప్రకటించింది. ఇంకా అమెరికా (ఎక్సాన్ మొబిల్), ఇటలీ (ఇ.ఎన్.ఐ), రష్యా (గాజ్‌ప్రోమ్), బ్రిటన్ (బిపి), హాలండ్ (రాయల్ డచ్ షెల్), స్పెయిన్…

టర్కీ దేశస్ధుల హత్య – ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ కోర్టుకి వెళ్ళనున్న టర్కీ

గాజా ప్రజలకోసం అంతర్జాతీయ సహాయం తీసుకెళ్తున్న ఓడలపైన ఇజ్రాయెల్ రక్షణ బలగాలు దాడి చేసి తొమ్మింది మంది టర్కీ దేశస్ధులను చంపివేశాక టర్కీ ప్రభుత్వం ఇజ్రాయెల్ దేశంపై కారాలు మిరియాలు నూరుతోంది. పాలస్తీనీయులకు చెందిన గాజా ప్రాంతాన్ని సైన్యంతో చుట్టుముట్టి ఎటువంటి సరుకులూ అందకుండా కాపలా కాస్తుండడంపై ‘అంతర్జాతీయ న్యాయ స్ధానం’ ను ఆశ్రయించాలని టర్కీ ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ సహాయాన్ని పట్టుకెళ్తున్న ఓడల వరుసపైన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) బలగాలు, అంతర్జాతీయ జలాల్లో ఉండగానే…

‘టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం’ కోసం గడ్డాఫీతో అమెరికా, బ్రిటన్‌ల గూఢచారి సంబంధాలు

“టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం” పేరుతో అమెరికా ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లపై దురాక్రమణ దాడి చేసింది. లక్షల మందిని పొట్టన బెట్టుకుంది. ఇంకా అక్కడ సైన్యాన్ని కొనసాగిస్తూ రోజూ నరమేధం కొనసాగిస్తూనే ఉంది. ఓ వైపు ఆల్‌ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకోవడానికి ఆఫ్ఘనిస్ధాన్ లో నరమేధం సాగిస్తూనే మరోవైపు లిబియాలో అదే ఆల్‌ఖైదాతో జట్టుకట్టి ఆ దేశ అధ్యక్షుడు గడ్డాఫీను కూలదోసి తన తొత్తు ప్రభుత్వాన్ని కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది. మిగతా ప్రపంచం అంతా ఆల్‌ఖైదా,…

‘వికీలీక్స్’లో తెలంగాణ, అమెరికా రాయబారితో స్పీకర్ భేటి

తెలంగాణ ఉద్యమంపై, అసెంబ్లీ మాజీ డిప్యుటి స్పీకర్, ప్రస్తుత స్పీకర్ నాదెండ్ల మనోహర్ అమెరికా రాయబారితో అభిప్రాయాలు పంచుకున్న సంగతి వికీలీక్స్ బైటపెట్టింది. భారత దేశంలోని అమెరికా రాయబారి అమెరికా ప్రభుత్వానికి రాసిన కేబుల్ ఉత్తరంలో తెలంగాణ ఉద్యమం గురించి విశ్లేషణ రాశాడు. ఈ విశ్లేషణ లోని అంశాలు ఇప్పటికే తెలంగాణ అంశంపై జరుగుతున్న చర్చలలో నానుతున్నవే అయినప్పటికీ, స్పీకర్ ద్వారా అమెరికా రాయబారికి చేరడమే, తెలంగాణ వాదుల్లో వ్యతిరేకతను రగిలిస్తోంది. నాదెండ్ల వెలిబుచ్చిన అభిప్రాయాల్లో కొన్ని…

లిబియాలో నాటో ‘యుద్ధ నేరాలకు’ పాల్పడినమాట నిజం -వీడియో

గ్లోబల్ రీసర్చ్ సంస్ధ తన వెబ్‌సైట్ లో ఈ వీడియోను ప్రచురించింది. లిబియా ప్రజలకోసం నాటో బలగాలు వైమానిక దాడులు, బాంబు దాడులు చేశాయని పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు తెంపు లెకుండా అబద్ధాలు ప్రచారం చేశాయి. వారి బాంబుదాడుల్లో పౌరులు మరణించిన ఘటనలకు సమాధానం ఇవ్వకపోగా, యుద్ధంలో అనుబంధ నష్టం సహజమేనని అహంకార పూరితంగా బదులిచ్చారు. తద్వారా లిబియాపై తాము సాగిస్తున్నది యుద్ధమేనని అంగీకరించారు. కాని ఫ్రాన్సు, అమెరికా, బ్రిటన్ లు ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు…

గడ్డాఫీ అనంతర లిబియా కోసం పశ్చిమ దేశాల ‘బ్లూప్రింట్ లీకేజి’ నాటకం

“గడ్డాఫీ అనంతర లిబియా (ప్రజల) కోసం పశ్చిమ దేశాలు -ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా, ఇటలీ మొ.వి- ఒక ప్రణాళికను తయారు చేశాయి. ఈ ప్రణాళిక ప్రఖ్యాత లండన్ పత్రిక ‘ది టైమ్స్’ పత్రిక చేతికి చిక్కింది. ప్రణాళికలోని కొన్ని అంశాలను ఆ పత్రిక ప్రచురించింది. టైమ్స్ తో పాటు ‘ది ఆస్ట్రేలియన్’ పత్రిక కూడా ఆ వివరాలను ప్రచురించింది. ఈ బ్లూప్రింట్ తయారు చేయడంలో పశ్చిమ దేశాలు లిబియా తిరుగుబాటు ప్రభుత్వం ‘నేషనల్ ట్రాన్సిషన్ కౌన్సిల్’ (ఎన్.టి.సి)…

అన్నా బృందం నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు -స్వామి అగ్నివేష్

అన్నా బృందంతో కలిసి కొంతకాలం పాటు నడిచిన స్వామి అగ్నివేష్, ఆ బృందం సభ్యులు కొందరు తనకు వ్యతిరేకంగా కుట్రపన్నారని శుక్రవారం ఆరోపించాడు. తమ బృందం నుండి అగ్నివేష్‌ను తప్పించిన ‘టీమ్ అన్నా’ దీక్ష ముగిశాక అగ్నివేష్ మాట్లాడినదని చెబుతూ ఒక సి.డిని విడుదల చేశారు. అవతలి వ్యక్తితో అన్నా బృందానికి అంతకాలం అవకాశం ఇచ్చి ఉండాల్సింది కాదని చెబుతున్న ఈ సిడిలో కొంతభాగం మార్చారని ఆరోపించాడు. అగ్నివేశ్ ‘కపిల్‌జీ’ అని సంబోధించడాన్ని బట్టి అవతలి వ్యక్తిని…

లిబియా యుద్ధం: ఈ కార్యక్రమాన్ని ప్రాయోజితమొనర్చినవారు… … -కార్టూన్

“నిజం చెప్పులు తొడిగే లోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుంద”ని సామెత. రెండో ప్రపంచ యుద్ధంలో గోబేల్స్ సాగించిన దుష్ప్రచారం గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం. ఒక అబద్ధాన్ని పది సార్లు చెప్పి నిజంగా మార్చే కళ గోబెల్స్ రుజువు చేశాడని పాఠాలు తీస్తాం. కాని గోబెల్స్ వద్ద నేర్చుకున్న పాఠాల్ని పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలు, వాటి ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాపితంగా విస్తరించి ఉన్న కార్పొరేట్ పత్రికలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే గోబెల్స్‌కే పాఠాలు నేర్పేవిధంగా తయారయ్యారు.…

ఆగష్టులో ఒక్క ఉద్యోగమూ ఇవ్వని అమెరికా, ముసురుకుంటున్న డబుల్ డిప్ భయాలు

ఘనత వహించిన అమెరికా ఆర్ధిక వ్యవస్ధ ఆగష్టులో ఒక్క ఉద్యోగమూ కల్పించలేకపోయింది. ముప్ఫై కోట్ల జనాభాలో ముప్ఫై రోజుల్లో కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా నికరంగా ఉద్యోగం ఇవ్వలేకపోయింది. ప్రభుత్వానికి రక్షణ బాధ్యత, పాలన బాధ్యత తప్ప మిగిలినవి ఏవీ ఉండకూడదు. ఇతర అన్ని కార్యకలాపాలనూ మార్కెట్‌కే అప్పజెప్పాలని ప్రపంచానికి నిత్యం బోధలు చేసే కార్పొరేట్ అమెరికా ఉద్యోగాలు ఇవ్వకుండా లాభాలను మాత్రం బిలియన్ల కొద్దీ డాలర్లు ప్రకటిస్తోంది. ఉద్యోగాలివ్వని లాభాలవి. ఉద్యోగాలివ్వని వ్యాపారమది. ఉద్యోగాలివ్వని ఉత్పత్తి…

మూడో వంతు లిబియా ఆయిల్ ఫ్రాన్సు కైవశం, మిగిలింది బ్రిటన్, ఇటలీ, అమెరికాలకు?

ఫ్రాన్సు కష్టానికి ఫలితం దక్కుతోంది. లిబియాలో తిరుగుబాటు ప్రారంభమైన మరుసటిరోజే తూర్పు పట్టణం బెంఘాజీ కేంద్రంగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వాన్ని లిబియాకు అసలైన ప్రభుత్వంగా ఫ్రాన్సు మొట్టమొదటిసారిగా గుర్తించింది. అందుకు తగిన విధంగా లిబియా తిరుగుబాటు ప్రభుత్వం “నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్” (ఎన్.టి.సి) బదులు తీర్చుకుంటోంది. లిబియా ఆయిల్ వనరుల్లో మూడోవంతు భాగాన్ని ఫ్రాన్సు ఆయిల్ కంపెనీ టోటల్ కి అప్పజెప్పడానికి ఫ్రాన్సు లిబియాతో ఒప్పందం సంపాదించింది. ఫ్రెంచి డెయిలీ పత్రిక లిబరేషన్ ఈ మేరకు గురువారం…

ఇజ్రాయెల్ రాయబారిని బహిష్కరించిన టర్కీ

మధ్య ప్రాచ్యం (Middle East) లో గత రెండు మూడు సంవత్సరాలుగా వినూత్న కదలికలతో పత్రికల పతాక శీర్షికలను ఆక్రమించిన టర్కీ తాజాగా మరొక చర్య తీసుకుంది. ఇజ్రాయెల్ రాయబారిని టర్కీ నుండి బహిష్కరించింది. ఇకనుండి ఇజ్రాయెల్‌తో రెండవ స్ధాయి సెక్రటరీ స్ధాయిలోనే సంబంధాలు ఉంటాయని తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టిన పాలస్తీనా ప్రాంతం గాజాకు మానవతాసాయాన్ని టర్కీ నుండి తీసుకెళ్తున్న ఓడల కాన్వాయ్ పైన గత సంవత్సరం సైనికులతో అమానుషంగా దాడి చేసి తొమ్మిందిని చంపేసిన…