నేను అన్నాను కాలేను -అరుంధతీ రాయ్ (అనువాద వ్యాసం) -1

(అరుంధతీ రాయ్ కి పరిచయం అవసరం లేదు. తన మొదటి పుస్తకం “ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్” తోనే బుకర్ ప్రైజ్ గెలుచుకున్న కేరళ వాసి. భారత రాజకీయ ముఖచిత్రాన్ని తన సంచలనాత్మక విశ్లేషణలతో, పదునైన విమర్శతో గేలి చేయగల సాహసి. తన భావాలను ముక్కుసూటిగా, భయం లేకుండా వెల్లడించగల అరుదైన భారతీయ మహిళ. ఈమె పది రోజుల క్రితం రాసిన ఈ వ్యాసాన్ని “ది హిందూ” పత్రిక ప్రచురించింది. అన్నా హజారే వెంట భారత…

కొత్త లిబియాను సృష్టించే తొందరలో నాటో సైన్యం -కార్టూన్

నాటో బలగాల నిర్విరామ వైమానిక దాడులు ముందుండి దారి చూపగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు తయారు చేసుకున్న కీలు బొమ్మల నాయకత్వంలోని లిబియా తిరుగుబాటు బలగాలు, సగర్వంగా ట్రిపోలిని వశం చేసుకున్నాయి. ట్రిపోలిలో అడుగు పెట్టడంతోనే ప్రతీకార చర్యలకు దిగాయి. గడ్డాఫీ మద్దతుదారులుగా భావిస్తున్న వారందరినీ ఊచకోత కోసే పని మొదలైంది. ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికాల ఉమ్మడి ప్రాయోజిత తిరుగుబాటు ఆద్యంతం నాటో సేనలు లిబియాపై మిసైళ్ల వర్షం కురిపించాయి. చివరి వారాల్లోనైతే తెంపు లేకుండా లిబియా…

ఏదో ఒకటి రూపొందించి ‘జన్ లోక్ పాల్’ బిల్లు అనండి, అంతా ఒప్పుకుంటారు -అద్వానీ

భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు ఎల్.కె.అద్వానీ జన్ లోక్ పాల్ కావాలంటున్న అన్నా బృందం, ఆయన ఇతర మద్దతుదారుల డిమాండ్ కు కొత్త భాష్యం చెప్పాడు. జన్ లోక్ పాల్ బిల్లు మాత్రమే అంగీకారయోగ్యం అంటున్న వారు చిన్నబుచ్చుకునేలా అద్వాని వ్యాఖ్యలు ఉన్నాయి. శుక్రవారం తన నివాసం వద్ద తనను కలిసిన ఐ.ఐ.టి విద్యార్ధులతో మాట్లాడుతూ అద్వానీ లోక్ పాల్ బిల్లు గురించి కొన్ని విషయాలు చర్చించాడు. జన్ లోక్ పాల్ బిల్లులో కొన్ని ప్రాధమికమైన…

మా మూడు డిమాండ్లు ఒప్పుకుంటే దీక్ష విరమిస్తా -ప్రధానికి అన్నా లేఖ

శుక్రవారం అన్నా హజారే ప్రధానికి మరొక లేఖ రాశాడు. తమ మూడు కీలక డిమాండ్లను అంగీకరిస్తే దీక్ష విరమిస్తానని ప్రకటించాడు. సివిల్ సర్వెంట్లు అంతా లోక్ పాల్ చట్టం పరిధిలోకి తేవాలి; అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ ‘సిటిజన్ చార్టర్’ ను ప్రదర్శించాలి; అన్ని రాష్ట్రాలూ లోకాయుక్త ను నియమించుకోవాలి. ఈ మూడు డిమాండ్ల తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించాలని అన్నా కోరాడు. డిమాండ్లు అంగీకరించడంతో సరిపెట్టకుండా ఆ మేరకు చట్టాన్ని ఆమోదిస్తేనే దీక్ష విరమిస్తానని అన్నా తెలిపాడు. “ఈ…

హజారే పరిస్ధితిని పరిశీలిస్తున్నాం -అమెరికా

అన్నా హాజారే, ఆయన నిరాహార దీక్ష పరిస్ధితులను పరిశీలిస్తున్నామని అమెరికా మరోమారు ప్రకటించింది. హజారేకు మద్దతుగా కొద్ది రోజుల క్రితం ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ హజారే దీక్షకు అమెరికా మద్దతు ఉందేమోనని అనుమానం వ్యక్తం చేసింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి ఇంతవరకూ ఇండియా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా కలగజేసుకున్నది లేదనీ, మొదటిసారిగా హజారే దీక్షను భారత ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిష్కరించాలని ప్రకటించడంతో హజారే దీక్ష, ఉద్యమానికి అమెరికా మద్దతు ఉన్నట్లు భావించవలసి వస్తున్నదనీ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.…

నేను అన్నాను కాను, పదేళ్ళనుండి దీక్షలో ఉన్న “ఇరోమ్ షర్మిలా”ను

ప్రభుత్వం అన్నా హజారే ఆరోగ్యం కోసం తపన పడుతోంది. కనీసం తపన పడుతున్నట్లు నటిస్తోంది. అన్నా హజారే ప్రాణాలు చాలా విలువైనవనీ, అవి దేశానికి చాలా అవసరమనీ, ఆయన సలహాలు ప్రభుత్వానికి అవసరమనీ కనుక ఆయన వెంటనే తన నిరాహార దీక్షను ఉపసంహరించుకోవాలని గురువారం పార్లమెంటులో ప్రధాని విజ్ఞప్తి చేశాడు. బుధవారం జరిగిన అఖిల పక్ష సమావేశం కూడా అన్నా హజారే దీక్ష విరమించాలని కోరింది. గురువారం లోక్ సభ లో ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకురాలు…

అరబ్ జాతి ఒకానొక కలని సాకారం చేసుకున్నవేళ… వీడియో, కార్టూన్

మొత్తం అరబ్ జాతికే రోమాంఛిత క్షణాలవి. ప్రతి అరబ్బుకీ ఒళ్ళు పులకరించి, గుండెలనిండా తాజా ఊపిరి నిండిపోయి, మనసంతా ఉద్విగ్నతతో అల్లుకుపోయిన క్షణాలవి. జన్మంతా రీప్లే వేసుకుంటూ చూసుకోగల దృశ్యమది. అటువంటి అద్భుతమైన ఘటనను ఈజిప్టు యువకులు సాధించారు. పాలస్తీనా ప్రజలు తమ ఇళ్ళు, గ్రామాలు కోల్పోయి, అరవై ఏళ్లనుండి ఇజ్రాయెల్, అమెరికాల జాత్యహంకార ముట్టడిలో  అన్ని ప్రజాస్వామిక హక్కులకు దూరమై రోజులు లెక్కబెట్టుకుంటూ గడుపుతున్నారు. తమ ఇంటి కోసం, తమ వీధికోసం, తమ గ్రామం కోసం,…

పౌరుల శవాల సాక్షిగా లిబియాలో “నాటో తిరుగుబాటు” పరిపూర్తి -కార్టూన్

నాటో బలగాలు నాయకత్వం వహించిన “లిబియా తిరుగుబాటు” పూర్తయ్యిందని అమెరికా ప్రకటించింది. ఇన్నాళ్లూ లిబియా ఆయిల్ వనరులపై అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లకు సంపూర్ణ ఆధిపత్యం ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చిన గడ్డాఫీ ప్రభుత్వాన్ని కూలిపోయినట్లుగా పత్రికలు ప్రకటించాయి. ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో ఇన్నాళ్ళూ నేరుగా కుట్రలకు పాల్పడి, ప్రభుత్వాధిపతుల ఇళ్లపై బాంబులు జారవిడిచి తమ అనుకూల ప్రభుత్వాలను నిలబెడుతూ వచ్చిన అమెరికా, యూరప్ దేశాలు లిబియాలో వినూత్న పద్ధతిని అవలంబించాయి. “తిరుగుబాటు” అని ప్రచారం చేసి అది…

చుక్కల్లో ఆహార ద్రవ్యోల్బణం

ఆహార ద్రవ్యోల్బణం చుక్కల్లో విహరిస్తోంది. రెండంకెల సంఖ్యను చేరువగా వెళుతోంది. అంటే దేశంలో ఆహార ధరలు కూడా చుక్కల్లో విహరిస్తున్నాయని అర్ధం. ఆహార భద్రత గురించి గుర్తొచ్చినప్పుడల్లా ఉపన్యాసాలు దంచే ప్రధాని మన్మోహన్ అది సాధించడానికి ఏ చర్యా తీసుకోడు. మంత్రులు, అధికారుల అవినీతి జన్ లోక్ పాల్ బిల్లువలన ఎక్కడ బయటపడుతుందోనన్న ఆందోళన తప్ప దేశంలో ప్రజానీకానికి తిండిని అందుబాటులో ఉంచాలన్న ధ్యాస లేదు. ఆగస్టు 13 తో ముగిసిన వారానికి ఆహార ద్రవ్యోల్బణం 9.8…

అన్నా దీక్ష చేసుకోదలిస్తే చేసుకోనివ్వండి, అది మా సమస్య కాదు -ప్రణబ్, ఖుర్షీద్

ఓ వైపు ప్రధాని మన్మోహన్ అన్నా హజారే ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీవ్రంగా కలవరపడుతున్నదని చెబుతుండగా మరో వైపు ప్రధాని సహచరులు అన్నా దీక్ష తమ సమస్య కాదు పొమ్మంటున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకూ ఒప్పందం కుదురుతుందన్న వార్తాలు షికార్లు చేయగా సాయంత్రం జరిగిన సమావేశంలో చర్చలు వాడిగా జరిగినట్లుగా పౌరసమాజ కార్యకర్తలు చెబుతున్నదాన్ని బట్టి అర్ధం అవుతోంది. ప్రభుత్వానికీ అన్నా బృందానికి మధ్య జరుగుతున్న చర్చలు మళ్ళీ మొదటికే వచ్చిన పరిస్ధితి కనపడుతోంది. మంత్రులు ప్రణబ్…

జగన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు

జగన్‌కీ ఆయనపై ఆశలు పెట్టుకున్న 29 మంది ఎం.ఎల్.ఎ లకు దింపుడు కళ్ళెం ఆశలు కూడా ఆవిరయినట్లు కనిపిస్తోంది. జగన్ అక్రమ ఆస్తులపై పూర్తి విచారణ చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన జగన్ అక్కడ కూడా దెబ్బ తిన్నాడు. ప్రాధమిక ఆధారాలున్నందునే హైకోర్టు పూర్తి విచారణకు ఆదేశించినందున ఈ స్ధితిలో తాము జోక్యం చేసుకోజాలమని సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది.”హైకోర్టు ఆదేశాలలో జోక్యం…

జన్ (రాజీవ్) లోక్ పాల్ బిల్లు -కార్టూన్

‘శంఖంలో పోస్తే కాని తీర్ధం కాద’ని సామెత! అది తెలుసుకున్నాడు కనకనే దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రతి పధకానికి ముందు రాజీవ్ అనో, ఇందిరా అనో తగిలించాడు. సోనియా, రాహుల్ లవరకూ అది సాగేదేమో, ఇంతలో ఆయన పరమపదించారు. ఆయన పుత్రుడికి నడమంత్రపు సిరితో కన్నూ మిన్నూ కానక భజన మానుకున్నాడు. ఫలితం చూస్తూనే ఉన్నాం. అవినీతి భరతం పట్టడానికి జన్ లోక్ పాల్ బిల్లుని తయారు చేసి ప్రభుత్వం ముందు పెట్టాడు, అన్నా హజారే. అది…

ప్రజలూ అవినీతిపరులేనట! -కార్టూన్

అవినీతిని రూపుమాపాలని ప్రజలు కోరుతుంటే అతితెలివిపరులు లంచం ఇవ్వడం మానేస్తే అవినీతి అదే తగ్గుతుందని బుద్ధుడి లెవల్లో బోధిస్తారు. తెలుగు ఛానెళ్లలో ఒక ప్రకటన వస్తోంది. “అవినీతి నిర్మూలన మననుండే ప్రారంభిద్దాం” అని. అందులో లంచం ఇస్తుండబట్టే, తీసుకునే వాళ్ళున్నారని చూపిస్తున్నారు. ఆర్.టి.ఒ ఆఫీసుకి గానీ, రిజిస్ట్రార్ ఆఫీసుకి గానీ లేదా ట్రెజరీ ఆఫీసుకి గానీ పనికి వెళ్ళి నేను లంచం ఇవ్వను అంటే పనవుతుందా? నానుండే అవినీతి నిర్మూలన ప్రారంభించాలి అని శపధం చేసి లంచం…

జపాన్ క్రెడిట్ రేటింగ్ తగ్గించిన మూడీస్, రాజకీయ అనిశ్చితే కారణం

క్రెడిట్ రేటింగ్ సంస్ధలు ఆర్ధిక పరిణామాలను అధారం చేసుకుని మాత్రమే రేటింగ్ ఇవ్వవలసి ఉండగా, రాజకీయ పరిస్ధితుల ఆధారంగా కూడా క్రెడిట్ రేటింగ్ ఇవ్వడం ప్రారంభించినట్లుంది. ఎడతెగని రాజకీయ సంక్షోభం రీత్యా జపాన్ క్రెడిట్ రేటింగ్ ను ఒక మెట్టు తగ్గించింది. జపాన్ లో గత ఐదు సంవత్సరాలలో ఐదుగురు ప్రధానులు పని చేశారు. ఇప్పటి ప్రధాని కూడా ఆగస్టు నెలాఖరుకు పదవు నుండి తప్పుకోబోతున్నాడు. భూకంపం, సునామీలకు సమర్ధవంతంగా, వేగంగా స్పందించడంలో విఫలమైనాడని అందరూ భావిస్తుండడంతో…

లిబియాలో గడ్డాఫీ ఉన్నాడా, పోయాడా? -కార్టూన్

నాటో బాంబుదాడులు తోడు రాగా లిబియా తిరుగుబాటుదారులు రాజధాని ట్రిపోలిలో ప్రవేశించారు. ట్రిపోలీ ప్రజలు ఆనందోత్సాహాలతో వారికి స్వాగతాలు పలికారని పశ్చిమ కార్పొరేట్ పత్రికలు బాకాలుదాయి. తిరుగుబాటుదారుల నాయకత్వ కమిటీ ‘ట్రాన్సిషనల్ నేషనల్ కౌన్సిల్’ గడ్డాఫీ ఇద్దరు కొడుకులనూ అరెస్టు చేశామని ప్రకటించింది. వారాల ప్రకటించిన గంటలలోపే గడ్డాఫీ కుమారుడు, ఎలైట్ ఫోర్స్ నాయకుడు సైఫ్ ఇస్లాం తిరిగి ట్రిపోలిలోనే ప్రత్యక్షమయ్యాడు, మద్దతుదారులకు విక్టరీ సిగ్నల్ చూపుతూ. ఇదేలా సాధ్యం? అరెస్టయినవాడు నవ్వుతూ, చేతులూపుతూ ఎలా ప్రత్యక్షమైనట్లు?…